బ్యాంకాక్ లో ఏర్పాటైన బిమ్స్ టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు.

ప్రజాస్వామ్యబద్ధమైన, సుస్థిర, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రెండు దేశాల సంబంధాల విషయమై భారతదేశం ప్రజల-కేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తోందని, రెండు దేశాల మధ్య సహకారం ప్రజలకు గట్టి ప్రయోజనాలను సమకూర్చిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆచరణ సాధ్యమయ్యే మేర బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని భారత్ భావిస్తోందని ప్రధాని చెప్పారు.  

 

వాతావరణాన్ని కలుషితం చేసే ప్రకటనలు చేయకపోవడమే ఉత్తమమని ప్రధాని సూచించారు. సరిహద్దుల వద్ద భద్రతను, అనుకూల పరిస్థితులను కాపాడేందుకు అక్రమ చొరబాట్లను - ముఖ్యంగా రాత్రి సమయాల్లో- నిరోధించాలని, ఇందుకు గానూ సంబంధిత చట్టాలను తప్పకుండా అమలు చేయాలని శ్రీ మోదీ సూచించారు.  ఇరుదేశాల సంబంధాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు తగిన ద్వైపాక్షిక వ్యవస్థలు సమావేశమై కార్యాచరణను ప్రారంభించవచ్చని అన్నారు.

బంగ్లాదేశ్ లో  హిందువులు, ఇతర మైనారిటీల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, వారి పట్ల అకృత్యాలకు పాల్పడ్డవారిని విచారించడం సహా ప్రభుత్వం తగు చర్యల తీసుకుని మైనారిటీల భద్రతకు భరోసా కల్పించగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు.
 

బిమ్స్ టెక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో అభినందనలు తెలియజేసిన శ్రీ మోదీ, బంగ్లాదేశ్ నేతృత్వంలో కూటమి లక్ష్యమైన ప్రాంతీయ సహకారం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ సమగ్రత పెంపొందించేందుకు బిమ్స్ టెక్ పరిధిలోనే కాక, ద్వైపాక్షిక చర్చలు, సహకారాలను ముమ్మరం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు.  

సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న పరస్పర ప్రయోజనకర సంబంధాలను కొనసాగించే దిశగా ఉమ్మడి ఆసక్తి గల అన్ని అంశాల గురించి చర్చలు కొనసాగగలవని, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోగలమన్న ఆశాభావాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Boost for India! IMF raises GDP growth forecast to 6.5% for FY27 despite Middle East conflict; lower US tariffs to benefit economy

Media Coverage

Boost for India! IMF raises GDP growth forecast to 6.5% for FY27 despite Middle East conflict; lower US tariffs to benefit economy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people of Himachal Pradesh on Himachal Diwas
April 15, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended greetings to the people of Himachal Pradesh on the occasion of Himachal Diwas.

The Prime Minister said that this sacred Devbhoomi has a special identity due to its rich traditions, unique cultural heritage and the diligence, sense of duty and humility of its people.

On this auspicious occasion, the Prime Minister wished for a bright future for all families of the state.

The Prime Minister wrote on X;

“समस्त हिमाचलवासियों को हिमाचल दिवस की हार्दिक शुभकामनाएं। यह पावन देवभूमि अपनी समृद्ध परंपराओं, अनुपम सांस्कृतिक धरोहर और यहां के लोगों की कर्मठता, कर्तव्यनिष्ठा और विनम्रता के कारण विशेष पहचान रखती है। इस पुनीत अवसर पर मैं प्रदेश के सभी परिवारजनों के उज्ज्वल भविष्य की कामना करता हूं।”