‘జల్ జీవన్ మిషన్’ను ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. కుళాయి కనెక్షన్లతో ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ద్వారా లక్షలాది కుటుంబాల్లో గొప్ప మార్పు చోటుచేసుకుందని ఆయన తెలిపారు.
2019లో ప్రారంభమైన జల్ జీవన్ మిషన్... పరిమితకాలంలోనే 15 కోట్ల కన్నా ఎక్కువ కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం.. ఆరోగ్యాన్నీ, సాధికారతనూ కల్పించడంతో పాటు కలల్ని నెరవేర్చుకునేలా ప్రజలకు తోడ్పాటును అందించింది.
ఈ పథకం గ్రామీణ భారతంలో ప్రజల జీవన స్థాయిని మెరుగుపరిచిందనీ, దీనితో పాటు ఆరోగ్య సంరక్షణను చాలా వరకు మెరుగుపరించిందనీ, ముఖ్యంగా భారత్ నారీశక్తి అయిన మహిళలకు ప్రయోజనం కలిగించిందనీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మైగవ్ఇండియా (MyGovIndia) పోస్టులకు శ్రీ మోదీ ప్రతిస్పందించారు:
‘‘మన జల్ జీవన్ మిషన్కు 6 సంవత్సరాలు పూర్తయిన (#6YearsOfJalJeevanMission) సందర్భాన్ని పండుగ చేసుకొంటున్నాం. ఇది మనిషి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంతో పాటు మానవ జీవనంలో మార్పును తీసుకురావడంపై కూడా దృష్టి కేంద్రీకరించిన పథకం. ఇది మెరుగైన ఆరోగ్యసంరక్షణను కూడా అందించింది. ముఖ్యంగా దీంతో నారీ శక్తికి చక్కని ప్రయోజనం కలిగింది.’’
‘‘దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ సాధించిన ఫలితాలను కళ్లకు కట్టే దృశ్యాలివిగో’’.
ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘జల్ జీవన్ మిషన్’ (#6YearsOfJalJeevanMission)”
We mark #6YearsOfJalJeevanMission, a scheme that focuses on dignity and transforming lives. It has also ensured better healthcare, especially for our Nari Shakti. https://t.co/N7jTHDyrLb
— Narendra Modi (@narendramodi) August 14, 2025
A glimpse of the lasting impact of Jal Jeevan Mission across India. #6YearsOfJalJeevanMission https://t.co/jd2BotNcuC
— Narendra Modi (@narendramodi) August 14, 2025


