శ్రీసంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్, శ్రీ సంత్తుకారామ్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ ల కీలక సెక్శన్ ల ను నాలుగు దోవ లు కలిగి ఉండేవిగా నిర్మించే పనుల కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
పంఢర్పుర్ కు రాకపోకల ను పెంచడం కోసం ఉద్దేశించిన అనేక రహదారి పథకాల ను కూడా ప్రధానమంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు
‘‘ఈ యాత్ర ప్రపంచం లో కెల్లా అతిప్రాచీనమైనటువంటి ప్రజా యాత్రల లో ఒకటి గా ఉంది; దీనిని పెద్ద సంఖ్య లోప్రజలు యాత్ర గా తరలి వెళ్లే కార్యక్రమం గా పరిగణించడం జరుగుతున్నది; ఇది భారతదేశంయొక్క శాశ్వత జ్ఞానాని కి ఒక ప్రతీక గా ఉంది; ఆ శాశ్వత జ్ఞానం మన ధర్మాన్నిబందీ ని చేయదు గాని అంతకన్నా విముక్తం చేస్తుంది’’
‘‘భగవాన్విఠలుని దర్బారు లోకి ప్రతి ఒక్కరు ఎలాంటి వివక్ష లేకుండా ప్రవేశించవచ్చును. సబ్ కా సాథ్-సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్ లోసైతం ఇదే భావన ఉంది’’
‘‘వేరు వేరు ప్రాంతాల లో ఎప్పటికప్పుడుమహానుభావులు జన్మిస్తూ, దేశాని కి దిశ ను చూపుతున్నారు’’
‘ ‘పంఢరీ కి వారీ’ సమానఅవకాశాల కు ఒక సంకేతం గా ఉంది. వార్ కరీ ఉద్యమం అనేది విచక్షణ నుచూపడాన్ని అమంగళకరం గా ఎంచుతుంది;
‘‘భగవాన్విఠలుని దర్బారు లోకి ప్రతి ఒక్కరు ఎలాంటి వివక్ష లేకుండా ప్రవేశించవచ్చును. సబ్ కా సాథ్-సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్ లోసైతం ఇదే భావన ఉంది’’
‘‘ఈ యాత్ర ప్రపంచం లో కెల్లా అతిప్రాచీనమైనటువంటి ప్రజా యాత్రల లో ఒకటి గా ఉంది; దీనిని పెద్ద సంఖ్య లోప్రజలు యాత్ర గా తరలి వెళ్లే కార్యక్రమం గా పరిగణించడం జరుగుతున్నది; ఇది భారతదేశంయొక్క శాశ్వత జ్ఞానాని కి ఒక ప్రతీక గా ఉంది; ఆ శాశ్వత జ్ఞానం మన ధర్మాన్నిబందీ ని చేయదు గాని అంతకన్నా విముక్తం చేస్తుంది’’

వివిధ జాతీయ రహదారులు మరియు రహదారి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటు ఇంకా కొన్ని పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. ఈ కార్యక్రమం లో రహదారి రవాణా, రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి తో పాటు మహారాష్ట్ర గవర్నరు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి లు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రోజు న ఇక్కడ ‘‘ శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ కు, శ్రీ సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ కు శంకుస్థాపన చేయడమైందన్నారు. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ నిర్మాణాన్ని అయిదు దశల లో, సంత్ తుకారామ్ మహారాజ్ పాల్ ఖీమార్గ్ నిర్మాణాన్ని మూడు దశల లో పూర్తి చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. పథకాలు ఆయా ప్రాంతాల లో మెరుగైన రాకపోకల కు తోడ్పడుతాయని ఆయన చెప్తూ, పథకాల కై భగవాన్ విఠల్ తో పాటు సాధువుల, భక్తుల ఆశీర్వాదాలు కావాలి అని కోరుకొంటూ వారికి నమస్కరించారు. చరిత్ర ఒడుదొడుకుల కు లోనైనప్పటికీ కూడాను భగవాన్ విఠలుని పట్ల విశ్వాసం అచంచలం గా ఉంటూ వచ్చింది, మరి ‘‘ రోజు కు కూడాను ఈ యాత్ర ప్రపంచం లో అతి ప్రాచీనమైనటువంటి ప్రజా యాత్రల లో ఒకటి గా ఉంది, అంతేకాక దీని ని పెద్ద సంఖ్య లో ప్రజలంతా కలిసికట్టు గా తరలివెళ్లేటటువంటి ఒక ప్రజా ఉద్యమం గా పరిగణిస్తున్నారు. దారులు వేరు వేరు కావచ్చు, పద్ధతులు, అభిప్రాయాలు విభిన్నం గా ఉంటే ఉండవచ్చు కానీ మనం లక్ష్యం ఒకటే అని యాత్ర మనకు బోధిస్తోంది. ఆఖరు కు అన్ని పంథ్ లు ‘భాగవత్ పంథ్’ లే అవుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు, ఇది భారతదేశం యొక్క శాశ్వత జ్ఞానాని కి ప్రతీకగా ఉంది, శాశ్వత జ్ఞానం మన ధర్మాన్ని బంధించదు, అది విముక్తం చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

భగవాన్ విఠలుని దర్బారు ప్రతి ఒక్కరి కోసం సమానమైన విధం గా తెరచి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మరి నేను ఎప్పుడైతే సబ్ కా సాథ్- సబ్ కా వికాస్-సబ్ కా విశ్వాస్ అని అంటానో, అలా అన్నప్పుడు దాని వెనుక ఉండే భావన కూడా ఇదే అని ఆయన చెప్పారు. ఇదే భావన దేశాన్ని అభివృద్ధి పరచడానికి మనల ను ప్రేరితుల ను చేస్తుంది, అందరి ని కలుపుకొని పోతూ అందరి అభివృద్ధి లక్ష్య సాధన కై స్ఫూర్తి ని అందిస్తుంది అని ఆయన అన్నారు.

భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సమృద్ధి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, పంఢర్ పుర్ కు సేవ చేయడం అంటే అది ఆ శ్రీ నారాయణ హరి కి చేసే సేవే అవుతుందన్నారు. ఈ నేల భగవానుడు భక్తజనం కోసం ఈ నాటికి కూడాను ప్రత్యక్షం గా కొలువుదీరి ఉన్నటువంటి నేల అని ఆయన అన్నారు. ఈ జగత్తు ఆవిర్భవించక ముందు నుంచి పంఢర్ పుర్ ఉనికి లో ఉంది అని సంత్ నామ్ దేవ్ జీ మహారాజ్ పేర్కొన్న ప్రదేశం ఇది అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం యొక్క విశిష్టత ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, దేశాని కి దిశ ను చూపడం కోసం ఎప్పటికప్పుడు వేరు వేరు ప్రాంతాల లో మహనీయులు ఆవిర్భవిస్తూ వచ్చారన్నారు. దక్షిణ దేశం లో శ్రీయుతులు మధ్వాచార్య, నిమ్బార్కాచార్య, వల్లభాచార్య, రామానుజాచార్య ల వంటి వారు, పశ్చిమాన శ్రీయుతులు నర్ సీ మెహతా, ధీరో భగత్, భోజా భగత్, ప్రీతమ్ లు, ఇంకా మీరా బాయి ల వంటి వారు జన్మించారు అని ఆయన అన్నారు. ఉత్తర భారతదేశం లో శ్రీయుతులు రామానంద, కబీర్ దాస్, గోస్వామి తులసీదాస్, సూర్ దాస్, గురు నానక్ దేవ్, సంత్ రై దాస్ లు వచ్చారన్నారు. దేశ తూర్పు ప్రాంతం లో చైతన్య మహాప్రభు, ఇంకా శంకర్ దేవ్ ల వంటి సాధువుల దార్శనికత దేశాన్ని సంపన్నం చేసిందన్నారు.

వార్ కరీ ఉద్యమాని కి ఉన్న సామాజిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, పురుషుల తో పాటు మహిళ లు అడుగులో అడుగు వేస్తూ సమధికోత్సాహం తో పాలుపంచుకోవడం అనేది వార్ కరీ ఉద్యమం తాలూకు మరొక ప్రత్యేకత అన్నారు. ఇది దేశం లో స్త్రీశక్తి కి అద్దం పడుతోందన్నారు. ‘పంఢరీ కీ వారీ’ అనేది సమాన అవకాశాల కు ఒక చిహ్నం గా ఉంది అని ఆయన అన్నారు. వార్ కరీ ఉద్యమం భేద భావన ను అమంగళకరమైందిగా చూస్తుంది, మరి ఇదే ఈ ఉద్యమం తాలూకు విశిష్ట ధర్మ సూత్రం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు.

వార్ కరీ లో పాలుపంచుకొనే సోదరీమణులు మరియు సోదరుల విషయం లో ప్రధాన మంత్రి వారి ఆశీర్వాదాల రూపం లో మూడు విషయాల ను గురించి అపేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కి తన పట్ల ఉన్న అపార స్నేహం ఉండింది అని ఆయన అన్నారు. పాల్ ఖీ మార్గ్ లో మొక్కల ను నాటవలసింది గా భక్తుల ను ఆయన కోరారు. ఈ నడక దారి పొడవు ని తాగునీటి కి తగిన ఏర్పాటుల ను చేయాలని, ఈ మార్గాల లో చాలా చోట్ల తాగునీటి కడవల ను అందుబాటు లో ఉంచాలని ఆయన అభ్యర్థించారు. రాబోయే కాలం లో భారతదేశం లో అత్యంత స్వచ్ఛమైనటువంటి తీర్థయాత్ర స్థలాల లో ఒక తీర్థయాత్రస్థలం గా పంఢర్ పుర్ ను చూడాలని ఉందని ఆయన అభిలషించారు. ప్రజల భాగస్వామ్యం తో ఈ కార్యాన్ని సాధించవచ్చు, ఎప్పుడైతే స్థానికులు స్వచ్ఛత ఉద్యమం తాలూకు పగ్గాల ను వారి చేతుల లోకి తీసుకొంటారో అప్పుడు మనం ఈ కల ను పండించుకోగలుగుతాం అని ఆయన అన్నారు.

వార్ కరీల లో చాలా మంది రైతు సముదాయాని కి చెందిన వారే అయి ఉంటారు. ఈ ‘భూమి పుత్రులు’ భారతదేశం సాంప్రదాయాన్ని, సంస్కృతి ని చైతన్యవంతం గా ఉంచారని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒక నిజమైన ‘అన్నదాత’ సంఘాన్ని జోడిస్తాడు. మరి అతడు సమాజాని కి ప్రాణం పోస్తాడు.. సమాజం కోసం జీవిస్తాడు. మీతోనే సమాజం ప్రగతి చెందుతుంది, మరి మీరే సమాజం ప్రగతి కి ప్రతిబింబం కూడా’’ అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ ఖీ మార్గ్ లోని దివే ఘాట్ మొదలుకొని మొహోల్ వరకు ఉన్నటువంటి సుమారు 221 కిలో మీటర్ల భాగాన్ని, సంత్ తుకారాం మహారాజ్ పాల్ ఖీ మార్గ్ లోని ఫతస్ మొదలుకొని టోందలే-బోందలే వరకు ఉన్నటువంటి దాదాపు 130 కిలో మీటర్ల పొడవైన భాగాన్ని నాలుగు దోవ లు కలిగి ఉండే విధం గా నిర్మించడం జరుగుతుంది. ఈ రెండు మార్గాల కు ఇరు పక్కల ‘పాల్ ఖీ’ కోసమే ప్రత్యేకించినటువంటి నడక దారులు ఉంటాయి. వాటి అంచనా వ్యయం వరస గా 6,690 కోట్ల రూపాయలకు పైచిలుకు గాను మరియు దాదాపు గా 4,400 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

పంఢర్ పుర్ నుంచి రాక పోకల ను పెంచడం కోసం వివిధ జాతీయ రహదారుల లో 223 కి.మీ. కి పైగా నిర్మాణం పూర్తి అయినటువంటి మరియు ఉన్నతీకరించినటువంటి గల రహదారి పథకాల ను ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ పథకాల అంచనా వ్యయం 1,180 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ప్రాజెక్టుల లో మ్హస్వాద్-పీలివ్-పంఢర్ పుర్ (ఎన్‌ హెచ్‌-548ఇ), కుర్దువాడీ-పంఢర్ పుర్ (ఎన్‌ హెచ్‌-965సి); పంఢర్ పుర్- సంగోలా (ఎన్‌ హెచ్‌-965సి); ఎన్ హెచ్ 561 ఎ లోని తెమ్భుర్ నీ-పంఢర్ పుర్ సెక్శన్ తో పాటు ఎన్‌ హెచ్‌-561ఎ లోని పంఢర్ పుర్- మంగళ్ వేధా-ఉమాదీ సెక్శన్‌ లు కూడా ఉన్నాయి.

 

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India records highest-ever startup surge with 55,200 recognised in FY26

Media Coverage

India records highest-ever startup surge with 55,200 recognised in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of prolific writer, thinker and public intellectual, Shri Balbir Punj
April 19, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the demise of prolific writer, thinker and public intellectual Shri Balbir Punj.

Shri Modi said that Shri Balbir Punj Ji was a prolific writer, thinker and public intellectual who made a rich contribution to the world of media. His writings were widely read and reflected his strong passion towards national regeneration. He noted that Shri Punj’s Parliamentary interventions were rich in facts and theory.

The Prime Minister wrote on X;

“Shri Balbir Punj Ji was a prolific writer, thinker and public intellectual. He made a rich contribution to the world of media. His writings were widely read, reflecting his strong passion towards national regeneration. His Parliamentary interventions were rich in facts and theory.

Shri Balbir Punj Ji worked tirelessly to strengthen the BJP, especially among students, professionals, scholars and intellectuals. He was in-charge of various states, including Gujarat. Fondly remember our interactions from those times. Pained by his passing. Condolences to his family and friends. Om Shanti.”

“बलबीर पुंज जी एक प्रसिद्ध लेखक होने के साथ-साथ प्रखर विचारक और सम्मानित बुद्धिजीवी थे। मीडिया के क्षेत्र में उनका योगदान बहुत सराहनीय रहा है। लोग उनकी लेखनी के कायल थे, जिससे राष्ट्र निर्माण के प्रति उनकी गहरी प्रतिबद्धता परिलक्षित होती थी । उनके संसदीय भाषणों में तथ्यों और मानवीय मूल्यों का भरपूर समावेश रहता था।

बलबीर पुंज जी ने भाजपा को सशक्त बनाने के लिए अथक प्रयास किए। विद्यार्थियों, पेशेवरों, विद्वतजनों और बुद्धिजीवियों को उन्होंने पार्टी से जोड़ने में उल्लेखनीय भूमिका निभाई। वे गुजरात सहित कई राज्यों के प्रभारी रहे। उस दौर में उनसे हुए संवाद मेरे लिए अविस्मरणीय रहेंगे। उनके निधन से अत्यंत दुख हुआ है। शोक की इस घड़ी में उनके परिजनों और मित्रों के प्रति मेरी हार्दिक संवेदनाएं। ओम शांति!”