Initiates funds transfer into bank accounts of more than 10 lakh women
Lays foundation stone and dedicates to the nation Railway Projects worth more than Rs 2800 crore
Lays foundation stone for National Highway Projects worth more than Rs 1000 crore
Participates in Griha Pravesh celebrations of 26 lakh beneficiaries of PMAY
Launches Awaas+ 2024 App for survey of additional households
Launches Operational Guidelines of Pradhan Mantri Awas Yojana – Urban (PMAY-U) 2.0
“This state has reposed great faith in us and we will leave no stone unturned in fulfilling people’s aspirations”
“During the 100 days period of the NDA government at the Centre, big decisions have been taken for the empowerment of the poor, farmers, youth and women”
“Any country, any state progresses only when half of its population, that is our women power, has equal participation in its development”
“Pradhan Mantri Awas Yojana is a reflection of women empowerment in India”
“Sardar Patel united the country by showing extraordinary willpower”

   మహిళా సాధికారత లక్ష్యంగా ఒడిషా ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక ‘సుభద్ర’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ భువనేశ్వర్‌ నగరంలో శ్రీకారం చుట్టారు. ఇది రాష్ట్రంలో విశిష్ట, అత్యంత భారీ మహిళా ప్రాధాన్య పథకం కాగా, దీనికింద కోటి మందికిపైగా మహిళలకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇందులో భాగంగా 10 లక్షల మందికిపైగా మహిళల బ్యాంకు ఖాతాలకు నిధుల బదిలీని కూడా ప్రధాని ప్రారంభించారు. అనంతరం రూ.2800 కోట్లకుపైగా విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు జాతికి అంకితం చేశారు. అలాగే రూ.1000 కోట్లకుపైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 14 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ’ లబ్ధిదారులకు ‘ఆన్‌లైన్’ మార్గంలో తొలి విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. దేశంలోని 26 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ/పట్టణ’ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించి, వారి గృహప్రవేశ వేడుకలోనూ ఆయన మమేకమయ్యారు. ‘పిఎంఎవై-గ్రామీణ’ కింద అదనపు గృహవసతి కల్పనపై కుటుంబాల అధ్యయనం కోసం ‘ఆవాస్+ 2024’ పేరిట రూపొందించిన అనువర్తనాన్ని ప్రారంభించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ 2.0 (పిఎంఎవై-యు) అమలుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.

   ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- నేటి కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామినయ్యే అవకాశం ఇచ్చారంటూ ప్రజలకు తొలుత కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పూరీ జగన్నాథునికి, ప్ర‌జ‌ల‌కు సేవచేసే అవ‌కాశం ఆ దేవదేవుని ఆశీర్వాదంతోనే లభిస్తుందని భక్తిపూర్వకంగా ప్రకటించారు. ఇది గణేశ ఉత్సవాల కీలక సమయం కావడంతోపాటు అనంత చతుర్దశి, విశ్వకర్మ పూజ కూడా కలిసివచ్చిన పవిత్ర సందర్భమని ప్రధాని వ్యాఖ్యానించారు. భగవాన్ విశ్వకర్మ రూపంలో నైపుణ్యాన్ని, శ్రమశక్తిని పూజించే ఏకైక దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటేనని ప్రధాని అన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటి పవిత్ర పర్వదినాన ఒడిషా తల్లులు, సోదరీమణుల కోసం ‘సుభద్ర’ పథకాన్ని ప్రారంభించడం తనకు లభించిన మహదవకాశంగా అభివర్ణించారు.

 

   జగన్నాథ స్వామి వెలసిన ఈ నేలనుంచి దేశంలోని 30 లక్షల కుటుంబాలకు పక్కా గృహాలు  స్వాధీనం చేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 26 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 4 లక్షల మందికి ఇళ్ల తాళాలు అప్పగించామని ఆయన తెలిపారు. అదే సమయంలో ఇవాళ ఒడిషాలో రూ.వేలాది కోట్లకుపైగా విలువైన అనేక  అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహించడాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలతోపాటు దేశ పౌరులందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

   ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తాను, నేడు తొలిసారి రాష్ట్ర పర్యటనకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. ‘‘రెండు ఇంజన్ల’’ ప్రభుత్వం ఏర్పడితే ఒడిషా రాష్ట్రం ప్రగతి-శ్రేయస్సు దిశగా దూసుకెళ్లగలదని ఎన్నికల ప్రచార సభల్లో తాను ప్రకటించడాన్ని ప్రజలకు గుర్తుచేశారు. గ్రామీణులు, అట్టడుగువర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, యువకులు, మధ్యతరగతి ప్రజానీకంసహా సమాజంలోని అన్ని వర్గాల కలలూ ఇప్పుడు తప్పక నెరవేరగలవని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తామిచ్చిన వాగ్దానాలు త్వరితగతిన సాకారం అవుతున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇప్పటిదాకా నెరవేర్చిన హామీలను ఏకరవు పెడుతూ- ప్రజల సౌకర్యార్థం పూరీలోని శ్రీ  జగన్నాథ  ఆలయ నాలుగు ద్వారాలనూ తెరిచామన్నారు. అలాగే ఆలయ రత్న భాండాగారాన్ని తెరిపించామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సేవకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని, సమస్యల పరిష్కారం దిశగా వారి ముంగిటకు వస్తున్నదని హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమని ప్రశంసించారు.

   కేంద్రంలో ‘ఎన్‌డిఎ’ కొత్త ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసుకున్న ఈ రోజుకు ఒక ప్రత్యేకత  ఏర్పడిందని ప్రధాని అన్నారు. తొలి వందరోజుల్లో దేశంలోని పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారత దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ప్రధాన నిర్ణయాలను వివరిస్తూ- పేదల కోసం 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, యువతరానికి రూ.2 లక్షల కోట్ల విలువైన ‘ప్రధానమంత్రి ప్యాకేజీ’లను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్యాకేజీ కింద ప్రైవేటు రంగంలో తొలి ఉద్యోగం పొందినవారికి ప్రభుత్వం మొదటి జీతం చెల్లిస్తుందని చెప్పారు. మరోవైపు వైద్య కళాశాలల్లో అదనంగా 75,000 సీట్లతోపాటు పక్కా రహదారులతో 25,000 గ్రామాల అనుసంధానానికి ఆమోదం తెలిపామన్నారు. అలాగే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపు దాదాపు రెట్టింపైందని చెప్పారు. సుమారు 60,000 గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టుతోపాటు ప్రభుత్వోద్యోగులకు కొత్త పెన్షన్ పథకం ప్రకటించామన్నారు. వృత్తి నిపుణులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఆదాయపు పన్ను తగ్గించామని తెలిపారు.

 

   దేశవ్యాప్తంగా 11 లక్షల మందికిపైగా మహిళలు ‘లక్షాధికారి సోదరీమణులు’గా మారడాన్ని గత 100 రోజుల్లో చూశామని ప్రధాని గుర్తుచేశారు. అలాగే నూనెగింజలు, ఉల్లి రైతుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మన రైతులను ప్రోత్సహించడంలో భాగంగా విదేశీ నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచామని తెలిపారు. ఎగుమతులకు ప్రోత్సాహం దిశగా బాస్మతి బియ్యంపై సుంకాన్ని తగ్గించామని, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పెంచామని చెప్పారు. ఈ నిర్ణయాల వల్ల కోట్లాది అన్నదాతలకు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ‘‘మొత్తంమీద గడచిన 100 రోజుల పాలనలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కల్పించే అనేక ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం’’ అని ప్రధాని మోదీ ఉద్వేగభరిత వివరణ ఇచ్చారు.

   జనాభాలో సగభాగమైన మహిళా శక్తికి సమాన భాగస్వామ్యం ఉంటేనే ఏ దేశమైనా, రాష్ట్రమైనా పురోగమించగలవని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఆ మేరకు మహిళల ప్రగతి, సాధికారతలపైనే ఒడిషా పురోగమనం ఆధారపడి ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఓ జానపద గాథను ఉటంకిస్తూ- పూరీ జగన్నాథునితో పాటు సుభద్రా దేవి కూడా ఇక్కడ పూజలందుకోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ నేపథ్యంలో  ‘‘సుభద్రా దేవికి ప్రతిరూపాలైన ఇక్కడి తల్లులు, సోదరీమణులు, కుమార్తెలందరికీ నమస్కరిస్తున్నాను’’ అన్నారు.

   రాష్ట్రంలో పాలన పగ్గాలు స్వీకరించిన బీజేపీ కొత్త ప్రభుత్వం తన తొలి నిర్ణయాల్లో భాగంగా ఒడిషాలోని తల్లులు, సోదరీమణులకు ‘సుభద్ర యోజన’ను బహూకరించడం హర్షణీయమని ప్రధాని అన్నారు. దీనికింద కోటి మందికిపైగా మహిళలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.50,000 వంతున నేరుగా జమ అవుతుందని శ్రీ మోదీ చెప్పారు. ఈ పథకాన్ని భారత రిజర్వు బ్యాంకు ‘డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టు’తో అనుసంధానించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు దేశంలోనే తొలి డిజిటల్ కరెన్సీ పథకంలో భాగమైనందుకు ఒడిషా మహిళలను అభినందించారు.

 

   రాష్ట్రంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు ‘సుభద్ర’ పథకం ప్రయోజనం అందేవిధంగా అనేక ప్రచార యాత్రలు నిర్వహించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. తద్వారా ఈ పథకం సంబంధిత  సమస్త సమాచారంపై వారికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వ ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంతో ఈ సేవలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం పెంచేదిశగా ప్రభుత్వం, అధికార యంత్రాంగం సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు చూపుతున్న చొరవను ప్రధాని అభినందించారు.

   ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘దేశంలో మహిళా సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక ప్రతీక’’ అని వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద మంజూరు చేసే గృహాలను కుటుంబంలోని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల కుటుంబాలు నేడు గృహప్రవేశం చేశాయని, 15 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆమోద పత్రాలు అందజేశామని ఆయన వివరించారు. కొత్త ప్రభుత్వం తొలి 100 రోజుల స్వల్ప వ్యవధిలోనే 10 లక్షల మందికిపైగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ అయినట్లు గుర్తుచేశారు. ‘‘ఈ పవిత్ర కార్యాన్ని ఇవాళ ఒడిషా నుంచి నిర్వర్తించాం. రాష్ట్రంలోని పేద కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో ఇందులో భాగమయ్యాయి’’ అని ప్రధాని మోదీ తెలిపారు. పక్కా ఇళ్లు పొందిన లక్షలాది కుటుంబాలకు నేడు కొత్త జీవితం ప్రారంభం అవుతోందన్నారు.

   దీనికిముందు రోజున ఓ గిరిజన కుటుంబం గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న తన అనుభవాన్ని ప్రధాని సభికులతో పంచుకున్నారు. ఆ సమయంలో వారి హృదయాల్లో పెల్లుబికిన సంతోషం, వారి ముఖాల్లో పూసిన చిరునవ్వులు, హావభావాల్లో ఎనలేని సంతృప్తిని తాను ఎన్నటికీ మరువలేనని పేర్కొన్నారు. ‘‘ఈ అనుభవం.. అనుభూతి నా జీవితాంతం అమూల్య సంపదగా మిగిలిపోతాయి. పేదలు, దళితులు, అణగారిన, గిరిజన వర్గాల జీవితంలో రూపాంతరీకరణే నా ఆనందానికి కారణం... ఇది మరింత కష్టపడి పనిచేసేలా నాకు ఉత్తేజమిస్తుంది’’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.

 

   అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదడానికి అవసరమైన వనరులన్నీ ఒడిషా సొంతమని శ్రీ మోదీ అన్నారు. యువతరం ప్రతిభ, మహిళా శక్తి, సహజ వనరులు, పరిశ్రమల స్థాపన అవకాశాలు, పర్యాటక రంగ ప్రగతికి పలు మార్గాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలోగల బీజేపీ ప్రభుత్వం ఒడిషాకు సదా అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలంతో పోలిస్తే నేడు కేంద్రం నుంచి మూడు రెట్లు అధిక నిధులు అందుతున్నాయని తెలిపారు. మునుపెన్నడూ వెలుగు చూడని పథకాల ఇప్పుడు అమలులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా- ఆయుష్మాన్ యోజనను ప్రస్తావిస్తూ- ఒడిషా పేదలకు ఇవాళ ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సదుపాయం లభిస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు దాటిన వృద్ధులకు వార్షికాదాయంతో నిమిత్తం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందని వెల్లడించారు. ‘‘ఇది లోక్‌సభ ఎన్నికల నాడు మోదీ ఇచ్చిన హామీ... ఇప్పుడు దాన్ని నెరవేర్చారు’’ అని వ్యాఖ్యానించారు.

   పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో ఒడిషాలోని దళితులు, అణగారిన వర్గాలు, గిరిజనులు ప్రధాన లబ్ధిదారులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, గిరిజన మూలాలైన అడవులు-భూమిపై హక్కుల పరిరక్షణ, యువతకు విద్య-ఉపాధి అవకాశాల కల్పన, ఒడిషా గిరిజన మహిళను దేశానికి రాష్ట్రపతిని చేయడం వంటివన్నీ ఈ ప్రభుత్వం తొలిసారి చేపట్టినవేనని ప్రధాని ఉద్ఘాటించారు.

   ఒడిషాలో అనేక గిరిజన ప్రాంతాలు, సమాజాలు తరతరాలుగా ప్రగతికి దూరమయ్యాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. గిరిజన తెగలలో అత్యంత వెనుకబడిన వారి సముద్ధరణ దిశగా ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి జన్మన్ యోజన’ గురించి ఆయన ప్రస్తావించారు. దీనికింద ఇప్పటిదాకా రాష్ట్రంలో 13 వెనుకబడిన తెగలను గుర్తించామని చెప్పారు. ఈ వర్గాలన్నింటికీ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పథకాల ప్రయోజనాలను చేరువ చేస్తున్నదని ప్రధాని మోదీ వివరించారు. ముఖ్యంగా కొడవలి కణ రక్తహీనత (సికిల్ సెల్) వ్యాధి నుంచి గిరిజన ప్రాంతాల విముక్తి కార్యక్రమం కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. దీనికింద గడచిన 3 నెలల్లో 13 లక్షల మందికిపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

 

   ‘‘సంప్రదాయ నైపుణ్యాల పరిరక్షణపై భారత్ నేడు మునుపెన్నడూ లేనిరీతిలో దృష్టి సారిస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో వందల-వేల ఏళ్లుగా కమ్మరి, కుమ్మరి, స్వర్ణకార, శిల్పకళ వంటి వృత్తుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుడు విశ్వకర్మ జయంతి నాడు వారి సంక్షేమం కోసం రూ.13వేల కోట్లతో ‘విశ్వకర్మ యోజన’ను ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటిదాకా 20 లక్షల మంది నమోదు చేసుకుని, నైపుణ్య శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అటుపైన వారికి ఆధునిక ఉపకరణాల కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రూ.వేలలో హామీరహిత రుణాలు లభిస్తాయన్నారు. పేదలకు ఆరోగ్యంతోపాటు సామాజిక-ఆర్థిక భద్రతలకు హామీ ఇవ్వడం వంటివి వికసిత భారతదేశానికి నిజమైన బలమని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

   అపార ఖనిజ నిక్షేపాలు, సహజ సంపదతో విలసిల్లే సుదీర్ఘ ఒడిషా తీరప్రాంత ప్రాముఖ్యాన్ని ప్రస్తావిస్తూ- రాష్ట్రాన్ని బలోపేతం చేసేదిశగా ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘రాబోయే ఐదేళ్లలో ఒడిషాలోని రహదారులు-రైల్వేల అనుసంధానాన్ని కొత్త శిఖరాలకు చేర్చాల్సిన బాధ్యత మనమీద ఉంది’’ అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన రైలు-రోడ్డు సంబంధిత ప్రాజెక్టుల గురించి శ్రీ మోదీ వివరించారు. ఈ మేరకు లాంజీగఢ్ రోడ్-అంబోదలా-డోయికలు రైలు మార్గం, లక్ష్మీపూర్ రోడ్-సింగారం-తిక్రీ రైలు మార్గం, ఢెంకణాల్-సదాశివపూర్-హిందోల్ రోడ్ రైలు మార్గాలను జాతికి అంకితం చేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. అలాగే జైపూర్-నవరంగ్‌పూర్ కొత్త రైలు మార్గానికి శంకుస్థాపన చేశామన్నారు. అలాగే పారాదీప్ రేవునుంచి అనుసంధానం మెరుగు దిశగా నేటినుంచి పని ప్రారంభమైందని తెలిపారు. ఒడిషాలో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రాష్ట్ర యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని శ్రీ మోదీ తెలిపారు. పూరి-కోణార్క్ రైలు మార్గంతోపాటు అత్యాధునిక ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ పనులు కూడా త్వరలో మొదలవుతాయిన తెలిపారు. ఈ విధంగా ఆధునిక మౌలిక సదుపాయాలు ఒడిషాకు అపార అవకాశాలను చేరువ చేస్తాయన్నారు.

   దేశం ఇవాళ ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ నిర్వహించుకుంటున్నదని ప్రధాని పేర్కొన్నారు. ఆనాటి అత్యంత కల్లోల పరిస్థితుల నడుమ భారత వ్యతిరేక ఛాందస శక్తుల నిరోధం ద్వారా హైదరాబాద్‌ విముక్తిలో సర్దార్ పటేల్ అసాధారణ సంకల్ప బలం ప్రదర్శించారని గుర్తుచేశారు. దేశాన్ని ఏకీకృతం చేయడంలో ఆ మహనీయుడి కృషిని కొనియాడుతూ- ‘‘హైదరాబాద్ విమోచన దినోత్సవమంటే కేవలం ఒక తేదీ కాదు... దేశ సమగ్రతకు, మాతృభూమిపై మన కర్తవ్యానికీ స్ఫూర్తి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 

   దేశాన్ని వెనక్కి నెట్టే సవాళ్లను ప్రస్తావిస్తూ- స్వాతంత్ర్య పోరాటంలో గణేశ ఉత్సవాల ప్రాముఖ్యాన్ని ప్రధాని వివరించారు. జాతీయ స్ఫూర్తిని రగిలించే ఉపకరణంగా, వలస పాలకుల విభజించి పాలించే వ్యూహాలపై పోరులో ఆయుధంగా లోకమాన్య తిలక్ ఈ వేడుకలను బహిరంగంగా నిర్వహించారని గుర్తుచేశారు. ‘‘గణేశ ఉత్సవం ఐక్యతకు ప్రతీకగా, వివక్ష-కులతత్వానికి అతీతంగా మారుతోంది’’ అన్నారు. ఈ ఉత్సవాల సమయంలో యావత్ సమాజంలో ఐక్యత ఇనుమడిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

   కులమతాల ప్రాతిపదికన సమాజాన్ని విచ్ఛిన్నం చేయజూసే శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు. గణేశ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనడంపై కొన్ని వర్గాలు విద్వేషం వెళ్లగక్కడం, కర్ణాటకలో గణేశ విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం వంటివి దురదృష్టకర సంఘటనలుగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి విద్వేషపూరిత ధోరణులు, సమాజాన్ని కలుషితం చేసే మనస్తత్వం దేశానికి అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఇటువంటి శక్తులను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు.

 

   చివరగా- ఒడిషాతోపాటు దేశాన్ని విజయవంతంగా సరికొత్త శిఖరాగ్రాలకు చేర్చడంలో అనేక భారీ మైలురాళ్లను అధిగమించగలమని ప్రధాని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తదనుగుణంగా భవిష్యత్ ప్రగతి పయనంలో వేగం ఇనుమడిస్తుందని హామీ ఇస్తూ ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో ఒడిషా గవర్నర్ శ్రీ రఘువర్ దాస్, ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాంఝీ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుభద్ర’ పథకం కింద 21-60 ఏళ్ల మధ్య వయస్కులైన అర్హతగల లబ్ధిదారులకు 2024-25 నుంచి 2028-29 మధ్య ఐదేళ్లలో రూ.50,000/- అందుతాయి. ఈ మేరకు ఏటా రూ.10,000 వంతున రెండు సమాన వాయిదాల్లో వారి డిబిటి-ఆధారిత బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. ఈ నిధుల పంపిణీలో భాగంగా ప్ర‌ధానమంత్రి తొలివిడతగా 10 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాలకు సొమ్ము బదిలీని ప్రారంభించారు.

 

   ప్ర‌ధానమంత్రి భువనేశ్వర్‌లో రూ.2800 కోట్లకుపైగా విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని జాతికి అంకితం చేశారు. అలాగే రూ.1000 కోట్లకుపైగా విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటిద్వారా ఒడిషాలో రైల్వే మౌలిక సదుపాయాలు, అనుసంధానం మెరుగుపడటమే కాకుండా ప్రాంతీయ వృద్ధికి బాటలు పడతాయి.

 

   ఈ కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 14 రాష్ట్రాల పరిధిలోని ‘పిఎంఎవై-జి’ కింద సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులకు తొలివిడత ఆర్థిక సహాయాన్ని ప్రధాని విడుదల చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగాగల 26 లక్షల మంది ‘పిఎంఎవై-గ్రామీణ/పట్టణ’ లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకలో భాగంగా వారికి ఇళ్ల తాళాలను అందజేశారు. మరోవైపు ‘పిఎంఎవై-జి’ కింద అదనపు గృహవసతి కల్పన దిశగా కుటుంబాలపై అధ్యయనం కోసం ‘ఆవాస్ + 2024’ అనువర్తనాన్ని ప్రారంభించారు. అలాగే ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ 2.0’ అమలుకు మార్గదర్శకాలను విడుదల చేశారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India

Media Coverage

With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The HPV vaccination campaign, launched from Ajmer, marks a significant step towards empowering the nation’s Nari Shakti: PM Modi in Rajasthan
February 28, 2026
Our government is committed to all-round development: PM
Today, I had the privilege of launching the nationwide HPV vaccination campaign from Ajmer, inaugurating and laying foundation stones for multiple projects and distributing appointment letters to the youth: PM
The HPV vaccination campaign has commenced from Ajmer, this campaign is a significant step towards empowering the Nari Shakti of the country: PM
The double-engine government is moving forward by taking both Rajasthan’s heritage and development together: PM
The campaign to link rivers started by our government will significantly benefit Rajasthan: PM
There is no shortage of sunlight in Rajasthan, this very sunshine is becoming a source of savings and income for the common man: PM
A very significant role is being played by the PM Surya Ghar Free Electricity Scheme, this scheme has the power to change Rajasthan's destiny: PM

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय।

तीर्थराज पुष्कर और माता सावित्री की इस पावन भूमि पर, आज मुझे आप सबके बीच आने का, आपके आशीर्वाद प्राप्त करने का अवसर मिला है। इस मंच से मैं सुरसुरा के तेजाजी धाम को, पृथ्वीराज की भूमि अजमेर को प्रणाम करता हूं।

मेरे साथ बोलिए –

तीर्थराज पुष्कर की जय।

तीर्थराज पुष्कर की जय।

वीर तेजाजी महाराज की जय।

वीर तेजाजी महाराज की जय।

भगवान देव नारायण की जय।

भगवान देव नारायण की जय।

वरूण अवतार भगवान झूलेलाल जी की जय।

भगवान झूलेलाल जी की जय।

मंच पर विराजमान राजस्थान के राज्यपाल हरिभाउ बागडे जी, राज्य के लोकप्रिय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी, पूर्व मुख्यमंत्री बहन वसुंधरा जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी भगीरथ चौधरी जी, उपमुख्यमंत्री प्रेमचंद भैरवा जी, दिया कुमारी जी, संसद में मेरे साथी, भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौर जी, उपस्थित अन्य मंत्रिगण, अन्य महानुभाव और राजस्थान के मेरे प्यारे भाई और बहनों। मैं पूज्य संतों का बहुत आभारी हूं, कि हमें आशीर्वाद देने के लिए इतनी बड़ी संख्या में पूज्य संतगण यहां मौजूद हैं।

साथियों,

अजमेर आस्था और शौर्य की धरती है। यहां तीर्थ भी है और क्रांतिवीरों के पदचिन्ह भी हैं। अभी कल ही मैं इजराइल की यात्रा को पूरा करके भारत लौटा हूं। राजस्थान के सपूत मेजर दलपत सिंह के शौर्य को इजराइल के लोग आज भी गौरव से याद करते हैं। मुझे भी इजराइल की संसद में, मेजर दलपत सिंह जी के शौर्य को नमन करने का सौभाग्य मिला। राजस्थान के वीर बाकुरों की, इजराइल के हाइफा शहर को आजाद कराने में जो भूमिका थी, मुझे उसका गौरवगान करने का अवसर मिला है।

साथियों,

कुछ समय पहले ही, राजस्थान में भाजपा की डबल इंजर सरकार को दो साल पूरे हुए हैं, मुझे संतोष है कि आज राजस्थान विकास के नए पथ पर अग्रसर है। विकास के जिन वायदों के साथ भाजपा सरकार आपकी सेवा में आई थी, उन्हें तेजी के साथ पूरा कर रही है। और आज का दिन, विकास के इसी अभियान को तेज करने का दिवस है। थोड़ी देर पहले यहां राजस्थान के विकास से जुड़ी करबी 17 हजार करोड़ रूपयों की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। सड़क, बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, हर क्षेत्र में नई शक्ति जुड़ रही है। ये सारे प्रोजेक्टस राजस्थान की जनता की सुविधा बढ़ाएंगे और राजस्थान के युवाओं के लिए, रोजगार के भी अवसर पैदा करेंगे।

साथियों,

भाजपा की डबल इंजर सरकार लगातार युवा शक्ति को सशक्त कर रही है। दो साल पहले तक राजस्थान से भर्तियों में भ्रष्टाचार और पेपर लीक की ही खबरें चमकती रहती थीं, आती रहती थीं। अब राजस्थान में पेपर लीक पर लगाम लगी है, दोषियों पर सख्त कार्रवाई हो रही है। आज यहां इसी मंच से राजस्थान के 21 हजार से अधिक युवाओं को नियुक्ति पत्र भी सौंपे गए हैं। ये बहुत बड़ा बदलाव आया है। मैं इस बदलाव के लिए, नई नौकरियों के लिए, विकास के सभी कामों के लिए, राजस्थान के आप सभी लोगों को बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आज वीरांगनाओं की इस धरती से, मुझे देशभर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है। यहां अजमेर से HPV वैक्सीनेशन अभियान शुरू हुआ है। ये अभियान, देश की नारीशक्ति को सशक्त करने की दिशा में अहम कदम है।

साथियों,

हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है, तो घर बिखर सा जाता है। अगर मां स्वस्थ है, तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है। इसी भाव से, भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई हैं।

साथियों,

हमने 2014 से पहले का वो दौर देखा है, जिसमें शौचालय के अभाव में बहनों-बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था। बच्चियां स्कूल छोड़ देती थीं, क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सेनिटरी पैड्स नहीं ले पाती थीं। पहले जो सत्ता में रहे, उनके लिए ये छोटी बातें थीं। इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों-बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए, हमने इनका मिशन मोड पर समाधान किया।

साथियों,

गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई, मां को पोषक आहार मिले, इसके लिए पांच हज़ार रुपए बहनों के खाते में जमा करने की योजना शुरु की। मां धुएं में खांसती रहती थी, लेकिन उफ्फ तक नहीं करती थी। हमने कहा ये नहीं चलेगा। और इसलिए उज्जवला गैस योजना बनाई गई। ये सब इसलिए संभव हुआ, क्योंकि भाजपा सरकार, सत्ता भाव से नहीं, संवेदनशीलता के साथ काम करती है।

साथियों,

21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। आज का समय राजस्थान के विकास के लिए बड़ा महत्वपूर्ण है। भाजपा की डबल इंजन सरकार, राजस्थान की विरासत और विकास, दोनों को साथ लेकर चल रही है। हम सब जानते हैं, अच्छी सड़क, अच्छी रेल और हवाई सुविधा सिर्फ सफर आसान नहीं करती, वो पूरे इलाके की किस्मत बदल देती है। जब गांव-गांव तक अच्छी सड़क पहुँचती है, तो किसान अपनी फसल सही दाम पर बेच पाता है। व्यापारी आसानी से अपना सामान बाहर भेज पाते हैं। और हमारा अजमेर-पुष्कर तो, उसकी पर्यटन की ताकत कौन नहीं जानता। अच्छी कनेक्टिविटी का पर्यटन पर सबसे अच्छा असर पड़ता है। जब सफर आसान होता है, तो ज्यादा लोग घूमने आते हैं।

और साथियों,

जब पर्यटक आते हैं तो स्वाभाविक है होटल चलते हैं, ढाबे चलते हैं, कचौड़ी और दाल बाटी ज्यादा बिकती है, यहां राजस्थान के कारीगरों का बनाया सामान बिकता है, टैक्सी चलती है, गाइड को काम मिलता है। यानी एक पर्यटक कई परिवारों की रोज़ी-रोटी बन जाता है। इसी सोच के साथ हमारी सरकार, राजस्थान में आधुनिक कनेक्टिविटी पर बहुत बल दे रही है।

साथियों,

जैसे-जैसे राजस्थान में कनेक्टिविटी का विस्तार हो रहा है, वैसे-वैसे यहां निवेश के लिए भी अवसर लगातार बढ़ते जा रहे हैं। दिल्ली-मुंबई इंडस्ट्रियल कॉरिडोर के इर्द-गिर्द उद्योगों के लिए एक बहुत ही शानदार इंफ्रास्ट्रक्चर बनाया जा रहा है। यानी राजस्थान को अवसरों की भूमि बनाने के लिए, डबल इंजन सरकार हर संभव, अनेक विध काम कर रही है।

साथियों,

राजस्थान की माताएं अपने बच्चों को पालने में ही, राष्ट्र भक्ति का संस्कार देती हैं। राजस्थान की ये धरा जानती है कि देश का सम्मान क्या होता है, और इसीलिए आज राजस्थान की इस धरा पर, मैं आप लोगों से एक और बात कहने आया हूं।

साथियों,

हाल में ही, दिल्ली में, दुनिया का सबसे बड़ा AI सम्मेलन हुआ, Artificial Intelligence इसमें दुनिया के अनेक देशों के प्रधानमंत्री, अनेक देशों के राष्ट्रपति, अनेक देशों के मंत्रि, उस कार्यक्रम में आए थे। दुनिया की बड़ी-बड़ी कंपनियां, उन कंपनियों के कर्ता-धर्ता वो भी एक छत के नीचे इकट्ठे हुए थे। सबने भारत की खुले मन से प्रशंसा की। मैं जरा राजस्थान के मेरे भाई-बहनों से पूछना चाहता हूं। जब दुनिया के इतने सारे लोग, भारत की प्रशंसा करते हैं, ये सुनकर के आपको गर्व होता है की नहीं होता है? आपको गर्व होता है कि नहीं होता है? आपको अभिमान होता है कि नहीं होता है? आपका माथा ऊंचा हुआ या नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ?

साथियों,

आपको गर्व हुआ, लेकिन हताशा निराशा में डूबी, लगातार पराजय के कारण थक चुकी कांग्रेस ने क्या किया, ये आपने देखा है। दुनियाभर के मेहमानों के सामने, कांग्रेस ने देश को बदनाम करने की कोशिश की। इन्होंने विदेशी मेहमानों के सामने देश को बेइज्जत करने के लिए पूरा ड्रामा किया।

साथियों,

कांग्रेस, पूरे देश में ल्रगातार हार रही है, और गुस्से में वो इसका बदला, वो भारत को बदनाम करके ले रही है। कभी कांग्रेस, INC यानी इंडियन नेशनल कांग्रेस थी, लेकिन अब INC नहीं बची है, इंडियन नेशनल कांग्रेस नहीं बची है, आज वो INC के बजाय MMC, MMC बन गई है। MMC यानी मुस्लिम लीगी माओवादी कांग्रेस हो चुकी है।

राजस्थान के मेरे वीरों,

इतिहास गवाह है, मुस्लिम लीग भारत से नफरत करती थी, और इसलिए मुस्लिम लीग ने देश बांट दिया। आज कांग्रेस भी वही कर रही है। माओवादी भी, भारत की समृद्धि, हमारे संविधान और हमारे सफल लोकतंत्र से नफरत करते हैं, ये घात लगाकर हमला करते हैं, कांग्रेस भी घात लगाकर, देश को बदनाम करने के लिए कहीं भी घुस जाती है। कांग्रेस के ऐसे कुकर्मों को देश कभी माफ नहीं करेगा।

साथियों,

देश को बदनाम करना, देश की सेनाओं को कमजोर करना, ये कांग्रेस की पुरानी आदत रही है। आप याद कीजिए, यही कांग्रेस है, जिसने हमारी सेना के जवानों को हथियारों और वर्दी तक के लिए तरसा कर रखा था। ये वही कांग्रेस है, जिसने सालों तक हमारे सैनिक परिवारों को वन रैंक वन पेंशन से वंचित रखा था। ये वही कांग्रेस है, जिसके जमाने में विदेशों से होने वाले रक्षा सौदों में बड़े-बड़े घोटाले होते थे।

साथियों,

बीते 11 वर्षों में भारत की सेना ने हर मोर्चे पर आतंकियों पर, देश के दुश्मनों पर करारा प्रहार किया। हमारी सेना, हर मिशन, हर मोर्चे में विजयी रही। सर्जिकल स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक, वीरता का लोहा मनवाया, लेकिन कांग्रेस के नेताओं ने इसमें भी दुश्मनों के झूठ को ही आगे बढ़ाया। देश के लिए जो भी शुभ है, जो भी अच्छा है, जो भी देशवासियों का भला करने वाला है, कांग्रेस उस सबका विरोध करती है। इसलिए, देश आज कांग्रेस को सबक सिखा रहा है।

साथियों,

राजस्थान में तो आपने कांग्रेस के कुशासन को करीब से अनुभव किया है। यहां जितने दिन कांग्रेस की सरकार रही, वो भ्रष्टाचार करने और आपसी लड़ाई-झगड़े में ही उलझी रही। कांग्रेस ने हमारे किसानों को भी हमेशा धोखा दिया है। आप याद कीजिए, कांग्रेस ने दशकों तक सिंचाई की परियोजनाओं को कैसे लटकाए रखा। इसका राजस्थान के किसानों को बहुत अधिक नुकसान हुआ है। ERCP परियोजना को कांग्रेस की सरकारों ने केवल फाइलों और घोषणाओं में उलझाकर रखा। हमारी सरकार ने आते ही इस स्कीम को फाइलों से निकालकर धरातल पर उतारने का प्रयास किया है।

साथियों,

हमारी सरकार ने नदियों को जोड़ने का जो अभियान शुरु किया है, उसका बहुत अधिक फायदा राजस्थान को मिलना तय है। संशोधित पार्वती-कालीसिंध-चंबल लिंक परियोजना हो, यमुना-राजस्थान लिंक प्रोजेक्ट हो, डबल इंजन सरकार ऐसी अनेक सिंचाई परियोजनाओं का लाभ किसानों तक पहुंचाने के लिए प्रतिबद्ध है। आज भी झालावाड़, बारां, कोटा और बूंदी जिले के लिए पानी की अनेक परियोजनाओं पर काम शुरु हुआ है। हमारा प्रयास है, कि राजस्थान में भूजल का स्तर भी ऊपर उठे।

साथियों,

भाजपा सरकार, राजस्थान के सामर्थ्य को समझते हुए, योजनाएं बना रही है, उन्हें लागू कर रही है। मुझे खुशी है कि राजस्थान अब, सूरज की ताकत से समृद्धि कमाने वाली धरती बन गया है। हम सब जानते हैं, हमारे राजस्थान में धूप की कोई कमी नहीं। अब यही धूप, सामान्य मानवी के घर की बचत और कमाई का साधन बन रही है। और इसमें बहुत बड़ी भूमिका है, प्रधानमंत्री सूर्यघर मुफ्त बिजली योजना की। इस योजना में राजस्थान का भाग्य बदलने की ताकत है। इस योजना में भाजपा सरकार लोगों को अपनी छत पर सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए की सहायता देती है। सरकार सीधे आपके बैंक खाते में पैसे भेजती है। आजादी के बाज सब बजट, सब योजनाएं देख लीजिए, जिसमें मध्यम वर्ग को सबसे ज्यादा लाभ होने वाला है, ऐेसी योजना कभी नजर नहीं आएगी, आज इन परिवारों को सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए सीधा सरकार देती है। सबसे अधिक लाभ मध्यम वर्ग के लोग ले रहे हैं। और जिससे घर पर एक छोटा सा बिजली घर तैयार हो जाता है। दिन में सूरज की रोशनी से बिजली बनती है, घर में वही बिजली काम आती है और जो ज्यादा बिजली बनती है, वो बिजली ग्रिड में जाती है। और जिस घर में बिजली बनी होती है, उसे भी इसका लाभ मिलता है।

साथियों,

आज राजस्थान में सवा लाख से अधिक परिवार इस योजना से जुड़ चुके हैं। और इस योजना की वजह से, कई घरों का बिजली बिल लगभग जीरो आ रहा है। यानी खर्च कम हुआ है, बचत ज़्यादा हुई है।

साथियों,

विकसित राजस्थान से विकसित भारत के मंत्र पर हम लगातार काम कर रहे हैं। आज जिन योजनाओं पर काम शुरू हुआ है, वो विकसित राजस्थान की नींव को और अधिक मजबूत करेंगे। जब राजस्थान विकसित होगा, तो यहां के हर परिवार का जीवन समृद्ध होगा। आप सभी को एक बार फिर, विकास परियोजनाओं के लिए बहुत-बहुत शुभकामनाएं। मेरे साथ बोलिये-

भारत माता की जय!

भारत माता की जय!

वंदे मातरम के 150 साल देश मना रहा है। मेरे साथ बोलिये-

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

बहुत-बहुत धन्यवाद।