స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ ద్వారా మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ విజయం గురించి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రశంసనీయమన్నారు. ఈ రకమైన సామూహిక ఉద్యమాలు మహిళా సాధికారత ప్రయత్నాలకు మరింత ఊతమిస్తాయనీ, నారీ శక్తి జీవితాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
"ఇది చాలా ప్రశంసనీయం! ఇటువంటి సామూహిక ఉద్యమాలు మా మహిళా సాధికార ప్రయత్నాలకు ఊతమిస్తాయి... మన నారీ శక్తి జీవితాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతాయి."
This is very commendable! Such mass movements add impetus to our women empowerment efforts and have a transformative impact on the lives of our Nari Shakti. https://t.co/Hb2rSSOIXv
— Narendra Modi (@narendramodi) November 1, 2025


