తన అధికారిక కార్యాక్రమాలు, సమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకం- నమామి గంగే.
సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్ ’ పోస్టులో మోదీ ఇలా పేర్కొన్నారు.
‘గత కొన్ని రోజులుగా నేను వివిధ కార్యక్రమాలలో స్వీకరించిన బహుమతుల కోసం ఆన్ లైన్ వేలం జరుగుతోంది. ఈ వేలంలో మన సంస్కృతి, సృజనాత్మకతను ప్రతిబింబించే ఆసక్తికరమైన కళాఖండాలు ఉన్నాయి. వేలం ద్వారా వచ్చిన ఆదాయం నమామి గంగే కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ వేలంలో తప్పకుండా పాల్గొనండి.’’
Over the past few days, the online auction for the various gifts I have received during my different programmes has been underway. The auction includes very interesting works which illustrate the culture and creativity of India. The proceeds from the auction will go towards… pic.twitter.com/ONOq88XOXZ
— Narendra Modi (@narendramodi) September 24, 2025


