"సూరత్ నగర వైభవానికి కొత్త వజ్రం జోడి అయింది"
“సూరత్ డైమండ్ బోర్స్ భారతీయ డిజైన్లు, డిజైనర్లు, మెటీరియల్స్, కాన్సెప్ట్‌ల సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఈ భవనం కొత్త భారతదేశ సామర్థ్యాలు, తీర్మానాలకు చిహ్నం"
"ఈరోజు, సూరత్ లక్షలాది యువతకు కలల నగరం"
సూరత్ ప్రజలకు మోదీ హామీ చాలా కాలంగా తెలుసు
"సూరత్ నిర్ణయం తీసుకుంటే, రత్నాలు-నగల ఎగుమతిలో మన వాటా రెండంకెలకు చేరవచ్చు"
“సూరత్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలతో నిరంతరం కనెక్ట్ అవుతోంది. ప్రపంచంలోని అతి కొద్ది నగరాలకే ఇంత అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంది”
“సూరత్ ముందుకు సాగితే, గుజరాత్ ముందుకు సాగుతుంది. గుజరాత్ ముందుకు సాగితే దేశం ముందుకు సాగుతుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లోని సూరత్‌లో ఈరోజు సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు, ప్రధాన మంత్రి పంచతత్వ గార్డెన్‌ను కూడా సందర్శించారు, సూరత్ డైమండ్ బోర్స్, స్పైన్-4 గ్రీన్ బిల్డింగ్‌ను వీక్షించారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేశారు. అంతకుముందు, సూరత్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.

సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, సూరత్ నగర వైభవానికి కొత్త వజ్రం జోడి అయిందని వ్యాఖ్యానించారు. "ఇది సాధారణ వజ్రం కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనది", సూరత్ డైమండ్ బోర్స్ ప్రకాశం ప్రపంచంలోని అతిపెద్ద కట్టడాలను కప్పివేస్తోందని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. శ్రీ వల్లభ్‌భాయ్ లఖానీ, శ్రీ లాల్జీభాయ్ పటేల్ వినయపూర్వకత, ఇంత పెద్ద మిషన్ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరినీ తీసుకువెళ్లిన స్ఫూర్తిని ఆయన కీర్తించారు, ఈ సందర్భంగా సూరత్ డైమండ్ బోర్స్ మొత్తం బృందాన్ని ఆయన అభినందించారు. "ప్రపంచంలో డైమండ్ బోర్స్ గురించి చర్చలు జరుగుతున్నప్పుడు సూరత్ డైమండ్ బోర్స్ ఇప్పుడు భారతదేశం గర్వంతో తెరపైకి వస్తుంది" అని ఆయన నొక్కిచెప్పారు.  “సూర‌త్ డైమండ్ బోర్స్ భార‌తీయ డిజైన్‌లు, రూపకర్తలు, మెటీరియల్స్,  కాన్సెప్ట్‌ల సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఈ భవనం కొత్త భారతదేశం యొక్క సామర్థ్యాలు మరియు తీర్మానాలకు చిహ్నం" అని నరేంద్ర మోదీ  అన్నారు. సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా మొత్తం వజ్రాల పరిశ్రమకు, సూరత్, గుజరాత్, భారతదేశ ప్రజలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  ఉదయం సూరత్ డైమండ్ బోర్స్‌లో తన నడకను గుర్తుచేసుకుంటూ, ప్రధాన మంత్రి వాస్తుశిల్పాన్ని హైలైట్ చేశారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తలకు  ఒక ఉదాహరణగా మారగల గ్రీన్ బిల్డింగ్ గురించి ప్రస్తావించారు, భవనం మొత్తం, వాస్తుశిల్పం నేర్చుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆర్కిటెక్చర్ మరియు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యార్థులు, పంచతత్వ గార్డెన్ ల్యాండ్‌స్కేపింగ్‌లో పాఠం కోసం ఉదాహరణగా ఉపయోగించవచ్చు

 

సూరత్‌కు మరో రెండు బహుమతుల ఉన్నాయని అంటూ, సూరత్‌లో కొత్త విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవం, సూరత్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా హోదాను పెంచడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చినందుకు సభ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసింది. సూరత్ దుబాయ్ ఫ్లైట్ ప్రారంభం, హాంకాంగ్‌కు త్వరలో ప్రారంభం కానున్న ఫ్లైట్ గురించి ఆయన తెలియజేశారు. "సూరత్‌తో, గుజరాత్ ఇప్పుడు మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలను కలిగి ఉంది" అని ఆయన చెప్పారు.

సూరత్ నగరంతో తన వ్యక్తిగత సంబంధాలు, నేర్చుకున్న అనుభవాలను వెలుగులోకి తెస్తూ, సబ్‌కా సాథ్ సబ్‌కా ప్రయాస్ స్ఫూర్తిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేయబడిన పత్తి సాటిలేనిదని శ్రీ మోదీ పేర్కొన్నారు. బ్రిటీష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు సూరత్ వైభవం వారిని ఆకర్షించిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల తయారీ కేంద్రంగా సూరత్‌ ఉందని, సూరత్‌ ఓడరేవు 84 దేశాలకు చెందిన ఓడల జెండాలను ఎగురవేస్తుందని గుర్తుచేశారు. "ఇప్పుడు, ఆ సంఖ్య 125 కి పెరుగుతుంది" అని ఆయన చెప్పారు. నగరం ఎదుర్కొంటున్న కష్టాలను వెలుగులోకి తెస్తూ, ప్రధాన మంత్రి తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలు, వరదలను ప్రస్తావించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల్లో సూరత్ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. అతను సూరత్  అద్భుతమైన స్ట్రీట్ ఫుడ్, పరిశుభ్రత, నైపుణ్యాభివృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించారు. అంతకుముందు సూర్యనగరంగా పిలువబడే సూరత్, దాని ప్రజల కృషి, అంకితభావంతో డైమండ్ సిటీ, సిల్క్ సిటీ మరియు బ్రిడ్జ్ సిటీగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. "నేడు, సూరత్ లక్షలాది యువతకు కలల నగరం" అని ఆయన ఉద్వేగభరితంగా చెప్పారు. ఐటీ రంగంలో సూరత్ పురోగతిని కూడా ఆయన గుర్తు చేశారు. సూరత్ వంటి ఆధునిక నగరానికి డైమండ్ బోర్స్ రూపంలో ఇంత అద్భుతమైన భవనాన్ని పొందడం చారిత్రాత్మకమని అన్నారు.

 

మోదీ హామీ గురించి సూరత్ ప్రజలకు చాలా కాలంగా తెలుసు’’ అని ప్రధాని అన్నారు. సూరత్ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీకి డైమండ్ బోర్స్ ఉదాహరణ అని ఆయన అన్నారు. వజ్రాల వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులతో మరియు 2014లో ఢిల్లీలో జరిగిన వరల్డ్ డైమండ్ కాన్ఫరెన్స్‌లో వజ్రాల పరిశ్రమ కోసం ప్రత్యేక నోటిఫైడ్ జోన్‌లను ప్రకటించిన ప్రధాన మంత్రి, ఈ ప్రయాణం సూరత్ రూపంలో పెద్ద వజ్రాల కేంద్రానికి దారితీసిందని అన్నారు. డైమండ్ బోర్స్, ఒకే గొడుగు క్రింద వజ్రాల వ్యాపారం  అనేక అంశాలను సాధ్యం చేస్తుంది. "కళాకారులు, పనివాడు,  వ్యాపారవేత్త కోసం, అందరికీ, సూరత్ డైమండ్ బోర్స్ ఒక స్టాప్ షాప్‌గా మారింది" అని ఆయన చెప్పారు. బోర్స్‌లో అంతర్జాతీయ బ్యాంకింగ్, సురక్షితమైన వాల్ట్‌లు మరియు జువెలరీ మాల్ వంటి సౌకర్యాలు 1.5 లక్షల కొత్త ఉద్యోగాలకు అవకాశం ఇచ్చాయని ఆయన తెలియజేశారు.

సూరత్  సామర్థ్యాలపై మరింత దృష్టి సారిస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుందని ప్రధాని ప్రస్తావించారు. ఇప్పుడు మూడో ఇన్నింగ్స్‌లో భారత్‌ ప్రపంచంలోని టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాబోయే 25 సంవత్సరాలకు రోడ్‌మ్యాప్‌ను కలిగి ఉంది, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మరియు 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలపై పని చేస్తుందని ఆయన తెలిపారు.

 

ఎగుమతులను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, దేశంలోని వజ్రాల పరిశ్రమ పెద్ద పాత్ర పోషించనుందని ప్రధాని అన్నారు. దేశ ఎగుమతులను పెంచడంలో సూరత్ పాత్రను పెంచే మార్గాలను అన్వేషించాలని పరిశ్రమలోని ప్రముఖులను ఆయన కోరారు. వజ్రాభరణాల ఎగుమతులు, సిల్వర్ కట్ డైమండ్స్ మరియు ల్యాబ్-గ్రోన్ డైమండ్స్‌లో భారతదేశం అగ్రస్థానంలో ఉందని పేర్కొంటూ, మొత్తం ప్రపంచ రత్నాలు-నగల ఎగుమతుల్లో భారతదేశం వాటా కేవలం 3.5 శాతం మాత్రమేనని ఆయన సూచించారు. “సూరత్ నిర్ణయం తీసుకుంటే, రత్నాలు-నగల ఎగుమతిలో మన వాటా రెండంకెల స్థాయికి చేరుకోగలదు”, ఈ రంగానికి ప్రభుత్వ మద్దతును పునరుద్ఘాటిస్తూ ప్రధాన మంత్రి అన్నారు. ఎగుమతి ప్రోత్సాహం కోసం ఈ రంగాన్ని ఫోకస్ ఏరియాగా ప్రకటించడం, పేటెంట్ డిజైన్‌ను ప్రోత్సహించడం, ఎగుమతి ఉత్పత్తుల వైవిధ్యం, మెరుగైన సాంకేతికత కోసం సహకారం,  ల్యాబ్‌లో పెరిగిన లేదా గ్రీన్ డైమండ్‌ల ప్రచారం మరియు బడ్జెట్‌లో ఆకుపచ్చ వజ్రాలకు ప్రత్యేక కేటాయింపులు వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. భారతదేశం పట్ల సానుకూల ప్రపంచ దృక్పథం, 'మేక్ ఇన్ ఇండియా' బ్రాండ్ పెరుగుతున్న స్థాయి నుండి ఈ రంగం ప్రయోజనం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

నగరంలో ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ప్రజల సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం సూరత్ సామర్థ్యాన్ని పెంచుతోందని ప్రధాని అన్నారు. సూరత్ కనెక్టివిటీ గురించి మాట్లాడుతూ , శ్రీ మోదీ సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు సేవలు, హజీరా పోర్ట్, డీప్ వాటర్ ఎల్‌ఎన్‌జి టెర్మినల్, మల్టీ కార్గో పోర్ట్‌తో సహా సూరత్ ఓడరేవులను ప్రస్తావించారు. “సూరత్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలతో నిరంతరం కనెక్ట్ అవుతోంది. ప్రపంచంలోని అతి కొద్ది నగరాలకే ఇంత అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంది” అన్నారాయన. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌తో సూరత్‌కు ఉన్న కనెక్టివిటీని, ఉత్తర, తూర్పు భారతదేశానికి సూరత్ నుండి రైలు కనెక్టివిటీని బలోపేతం చేసే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో కొనసాగుతున్న పనిని కూడా ఆయన ప్రస్తావించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే కూడా సూరత్ వ్యాపారానికి కొత్త అవకాశాలను అందించబోతోంది. నగరం ఆధునిక కనెక్టివిటీని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరినీ ప్రధాని కోరారు. “సూరత్ ముందుకు సాగితే, గుజరాత్ ముందుకు సాగుతుంది. గుజరాత్ ముందుకు సాగితే దేశం ముందుకు సాగుతుంది. ప్రసంగాన్ని ముగిస్తూ,  ప్రధాన మంత్రి, వచ్చే నెలలో జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్‌కు తన శుభాకాంక్షలను కూడా తెలియజేశారు.

 

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ మన్సుఖ్ మాండవ్య, శ్రీ పురుషోత్తం రూపాలా,  కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్, పార్లమెంటు సభ్యురాలు, శ్రీ సి ఆర్ పాటిల్, సూరత్ డైమండ్ బోర్స్ చైర్మన్ , ధర్మానందన్, డైమండ్ పరిశ్రమల నుండి శ్రీ వల్లభాయ్ లఖానీ, శ్రీ లాల్జీభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం 

సూరత్ డైమండ్ బోర్స్ అంతర్జాతీయ వజ్రాలు, నగల వ్యాపారం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం అవుతుంది. ఇది కఠినమైన,  మెరుగుపెట్టిన వజ్రాలు అలాగే ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉంటుంది. దిగుమతి - ఎగుమతి కోసం అత్యాధునిక 'కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్'ని బోర్స్ కలిగి ఉంటుంది; రిటైల్ జ్యువెలరీ వ్యాపారం కోసం ఒక జ్యువెలరీ మాల్, అంతర్జాతీయ బ్యాంకింగ్, సేఫ్ వాల్ట్‌ల కోసం సౌకర్యం ఇందులో ఉన్నాయి. 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets

Media Coverage

PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Indian contingent on winning 19 medals at 22nd Asian U20 Athletics Championships
June 01, 2026

The Prime Minister, Shri Narendra Modi today congratulated the Indian contingent for its outstanding performance at the 22nd Asian U20 Athletics Championships.

The Prime Minister congratulated the Indian contingent on winning 19 medals, including 10 Gold medals, at the Championships.

The Prime Minister said that the achievement reflects the determination and excellence of India’s young athletes.

He expressed hope that these accomplishments would inspire many more young Indians to pursue sports in the years to come.

The Prime Minister wrote on X;

“Congratulations to the Indian contingent at the 22nd Asian U20 Athletics Championships for winning 19 medals, including 10 Golds. This outstanding performance reflects the determination and excellence of India’s young athletes. May these achievements inspire many more young Indians to pursue sports in the years to come.”