రాష్ట్రాభివృద్ధికి విమానయానం, స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్లు, అనుసంధానత రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు: పీఎం
గిరిజన వర్గాల సంక్షేమానికి అల్లూరి సీతారామరాజు జీవితాన్ని అంకితం చేసిన ఈ నేలపైనే.. ఆంధ్రప్రదేశ్‌లో నేడు ప్రారంభమైన నూతన విమానాశ్రయం: పీఎం
ఆంధ్ర, ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేదికగా ఈ విమానాశ్రయం... ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రారంభ వేదిక: పీఎం
ప్రతిభావంతులైన మన యువత సామర్థ్యం నుంచి ఆంధ్రప్రదేశ్, దేశం గరిష్ఠ ప్రయోజనాన్ని పొందటం అత్యవసరం.. ఇందుకోసం మేం సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ సాంకేతికత ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారిస్తూ విశాఖపట్నంలో నూతన సెమీకండక్టర్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేయటం కీలక ముందడుగు: పీఎం
బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తున్న దేశం.. ఈ ప్రాంతం మొత్తాన్ని తీరప్రాంత ఆర్థిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత ఓడరేవుల ఆధునీకరణ.. మూలపేట, రామాయపట్నంలో కొత్త ఓడరేవుల నిర్మాణం: పీఎం

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాలను చేపట్టారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఈ రోజుకున్న విశేష ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. ఇంతటి పవిత్రమైన మాసంలో ఉత్తరాంధ్ర పుణ్యభూమిని సందర్శించటం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ కూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవార్లకు భక్తితో ప్రణామాలు సమర్పించారు. "ఈ చరిత్రాత్మక సందర్భానికి సాక్షిగా నిలిచేందుకు ఇవాళ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిపై ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ... విమానాశ్రయ మౌలిక సదుపాయాలు, రోడ్డు రవాణా అనుసంధానం, ఇంధన భద్రత వంటి బహుళ రంగాల కార్యక్రమాలు, రాష్ట్రం సాధిస్తున్న వేగవంతమైన పురోగతికి అద్దం పడుతున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. "ఈ అభివృద్ధి పనులు అద్భుతమైన వేగంతో పురోగమిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీక" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని అపూర్వమైన ఘట్టంగా అభివర్ణిస్తూ.. ఒకవైపు మౌలిక వసతుల కీలక ప్రాజెక్టులతో పాటు, మరోవైపు సంప్రదాయ థింసా నృత్యం ద్వారా సాధించిన అద్భుతమైన సాంస్కృతిక ప్రపంచ రికార్డుతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "కొత్త చరిత్ర సృష్టించటం, అనేక రంగాల్లో నూతన రికార్డులను నెలకొల్పటం కోసమే నేటి కార్యక్రమం" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

పదమూడు వేలకు పైగా గిరిజన సోదరీమణులు, కుమార్తెలు ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభను కొనియాడుతూ.. వారి అసాధారణ ప్రతిభను, క్రమశిక్షణను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ ఉత్సాహభరితమైన ప్రదర్శన దేశ గొప్ప వైవిధ్యాన్ని, సంరక్షించిన స్వదేశీ వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించిందని పేర్కొన్నారు. "ఇక్కడ ప్రదర్శించిన గిరిజన సంస్కృతి వైభవం నిజంగా అద్భుతమైన, మరువలేని దృశ్యం" అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

అల్లూరి సీతారామరాజు వీరోచిత వారసత్వానికి, గిరిజనుల సంక్షేమం కోసం ఆయన చూపిన అంకితభావానికి నివాళిగా ఈ గడ్డపైనే నూతనంగా ప్రారంభించిన విమానాశ్రయాన్ని ప్రాంతీయ వృద్ధికి కీలకమైన మార్గంగా, యువత ఉజ్వల భవిష్యత్తుకు శక్తివంతమైన కేంద్రంగా ప్రధానమంత్రి అభివర్ణించారు. "ఆంధ్ర, ఉత్తరాంధ్రల వృద్ధికి రన్‌వేగా సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం... ఆంధ్ర యువత మెరుగైన భవిష్యత్తుకు అత్యున్నత ప్రారంభ కేంద్రం" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

కొత్త విమానాశ్రయానికి దిగ్గజ స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెట్టాలనే ప్రభుత్వ అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తూ... ఆ విమానాశ్రయం గుండా వెళ్లే ప్రయాణికులందరిలోనూ ఈ గొప్ప నివాళి దేశభక్తి భావాన్ని నింపుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. "ఈ విమానాశ్రయం గుండా ప్రయాణించే ఏ పౌరుడైనా శ్రీ అల్లూరి సీతారామరాజు పేరు నుంచి ప్రజా, జాతీయ సేవ చేసేందుకు స్ఫూర్తిని పొందుతారు" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పన్నెండేళ్లలో పౌర విమానయాన రంగంలో వచ్చిన అద్భుతమైన మార్పులను గౌరవ ప్రధానమంత్రి వివరిస్తూ.. 2014 నాటికి కేవలం 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 166కి పెరిగిందని తెలిపారు. చిన్న నగరాల్లోని సాధారణ ప్రజలు కూడా విమాన ప్రయాణాలు చేసేలా విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. "ఒకప్పుడు పెద్ద నగరాలకే పరిమితమైన విమాన ప్రయాణం... నేడు చిన్న నగరాల్లోని సామాన్యులు కూడా సౌకర్యవంతంగా ప్రయాణించే స్థాయికి చేరింది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

ఉడాన్‌ పథకం విమానయాన రంగాన్ని పూర్తిగా మార్చివేసిందని ప్రశంసిస్తూ... పేద కుటుంబాలు కూడా విమాన ప్రయాణ కలలను సాకారం చేసుకోవటానికి ఈ పథకం విజయవంతంగా దోహదపడిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో దీని రెండో దశను ఇటీవల ప్రారంభించినట్లు వివరించారు. "ఈ పథకం అత్యంత పేదవారికి కూడా జీవితకాల కలలను సాకారం చేసుకోవటంలో సహాయపడింది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

విమానయాన రంగంలో మరో కీలక ఘట్టాన్ని తెలియజేస్తూ... ఇటీవల కాశీలో 'స్పోక్ ఎయిర్‌పోర్టు' మోడల్ ప్రారంభం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. దీన్ని అమృత్‌సర్‌కు విజయవంతంగా విస్తరించటం ద్వారా పంజాబ్‌లోని ఈ నగరాన్ని ఇరవై ఐదుకు పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలతో అనుసంధానించాం. "ఆంధ్ర నేలపై ఉన్న నేను... ఈ విజయానికి గాను పంజాబ్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

 ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాయకత్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి అజెండాను మునుపెన్నడూ లేనంత రెట్టింపు వేగంతో అమలు చేస్తున్నారని తెలిపారు. “వికసిత్ భారత్ సాధనకు అత్యుత్తమ అభివద్ధి చోదక శక్తిగా మారే అపారమైన సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లప్పుడూ ఉంటుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సుముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ వేగంగా బలోపేతం చేయడానికి జాతీయ వ్యూహాన్ని వివరిస్తూ, విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న ప్రాచీన రేవుల ఆధునీకరణ, మూలపేట, రామాయపట్నంలలో కొత్త నౌకా వాణిజ్య కేంద్రాల నిర్మాణంతో మొత్తం తీరప్రాంతాన్ని ఒక సమగ్ర ఆర్థిక కారిడార్‌గా మార్చే ప్రతిష్ఠాత్మక దార్శనికతను ప్రధాని వివరించారు. ‘‘ఈ ప్రాంతమంతటినీ అభివృద్ధి చెందుతున్న తీరప్రాంత ఆర్థిక కారిడార్‌గా సమగ్రంగా తీర్చిదిద్దడమే మా వ్యూహాత్మక లక్ష్యం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

 ఓడరేవుల విస్తరణతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల వ్యవస్థను వేగంగా నిర్మిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రాంతీయ పురోగతికి విశాఖపట్నం-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రధాన రహదారులు ప్రధాన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని చెప్పారు. ‘‘ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు ఈ మొత్తం భౌగోళిక ప్రాంతానికి అపూర్వమైన వేగాన్ని అందిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు.

 దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో ఈ ప్రాంతాన్ని అనుసంధానించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి వివరించారు. ప్రస్తుతం సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. వీటిలో పూర్తి నెట్‌వర్క్ విద్యుదీకరణ, డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఉన్నాయన్నారు. ‘‘ఈ ప్రాంతం దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రాలతో సులభంగా అనుసంధానమయ్యేలా మేం చురుగ్గా పనిచేస్తున్నాం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు..

 ఈ బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానంలో పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తున్ననట్లు ప్రధాని తెలిపారు. రైలు, ఓడరేవులు, విమానయాన మౌలిక వసతులను ఏకం చేయడం ద్వారా లాజిస్టిక్స్ మెరుగవుతాయని, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, వ్యాపార సౌలభ్యం సులభతరం అవుతుందని తెలిపారు. ‘‘ఈ ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ పూర్తిగా సిద్ధమైతే, ఇది పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని అందిస్తుంది. రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది, వ్యాపారం చేసే సౌలభ్యం మరింత తేలికవుతుంది’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

భవిష్యత్తు ఆలోచనలతో కూడిన నూతన ఆవిష్కరణల్లో రాష్ట్రానికి ఉన్న చరిత్రను ప్రశంసించిన ప్రధాని.. సాఫ్ట్‌వేర్, సాంకేతిక రంగాలలో స్థానిక యువత ప్రపంచస్థాయిలో సాధిస్తున్న ఆధిపత్యాన్ని కొనియాడారు. ఈ అపారమైన ప్రతిభను ప్రాంతీయ అభివృద్ధికి నేరుగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

 ఈ యువ ప్రతిభను దేశంలోనే నిలుపుకోవాల్సిన, వినియోగించుకోవాల్సిన సంపూర్ణ అవసరాన్ని గుర్తుచేస్తూ.. భవిష్యత్తు సాంకేతిక పరిశ్రమల వైపు ప్రధానమంత్రి దృష్టి సారించారు. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ కేంద్రానికి శంకుస్థాపన చేయడం ఆ దిశగా వేసిన చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ‘‘నైపుణ్యం కలిగిన మన యువత సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి సెమీకండక్టర్ల వంటి భవిష్యత్తు సాంకేతిక పరిశ్రమలపైనే మేముం ప్రధానంగా దృష్టి పెట్టాము’’ అని శ్రీ మోదీ తెలిపారు.

 ఒక అద్భుతమైన పారిశ్రామిక మార్పును దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్ నైపుణ్యంతో పాటు రాష్ట్రం ఒక బలమైన తయారీ కేందంగా మారుతుందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. దీనివల్ల భవిష్యత్తు ఉద్యోగావకాశాల కోసం ఒక కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ‘‘ఈ వ్యూహాత్మక పరిణామం రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తు ఉద్యోగాలను, సాంకేతిక పరిశ్రమలకు నూతన వాతావరణాన్ని విజయవంతంగా సృష్టిస్తుంది’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తుచేశారు.

ప్రపంచ ఆర్థిక వృద్ధి కేంద్రాల వెనుక ఉన్న సంక్లిష్టమైన విధానాన్ని వివరిస్తూ… ముఖ్యమంత్రి చేస్తున్న నిరంతర కృషి ఫలితంగా సమగ్రమైన మౌలిక వసతులు, అనుకూల వాతావరణ వ్యవస్థ రాష్ట్రంలో వేగంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ‘‘రాత్రింబవళ్లు పడుతున్న ఈ కష్టం ఫలితంగానే అనేక పెద్ద అంతర్జాతీయ కంపెనీలు ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాలను విస్తరించడంలో భాగంగా కృత్రిమ మేధ, డేటా సెంటర్లలో జరుగుతున్న పరిణామాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. గూగుల్ ప్రకటించిన భారీ 15 బిలియన్ డాలర్ల క్యాంపస్ పెట్టుబడిని ఉదాహరణగా చూపిస్తూ, ఇది స్థానిక యువతకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ‘‘ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ అపారమైన అవకాశాల కోసం చూస్తున్నాయి. ఇది రాష్ట్ర, దేశ యువతకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని తెలిపారు.

డిజిటల్ సాంకేతికతకు మించి రాష్ట్ర పారిశ్రామిక రంగం విస్తరిస్తుందన్నారు. నక్కపల్లిలో భారీ నూతన ఫార్మా పార్కు‌కు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సత్ఫలితాల మద్దతును ప్రధాని ప్రస్తావించారు. దీని ద్వారా రాష్ట్రం దేశంలోనే అగ్రగామి ఫార్మా కేంద్రంగా ఎదుగుతుందని చెప్పారు. ‘‘ఈ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశంలోనే అతిపెద్ద ఫార్మా కేంద్రాల్లో ఒకటిగా వేగంగా అభివృద్ధి చెందుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

పునరుత్పాదక ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం ఒక్కటే అయిదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిజం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ‘‘ఇటువంటి ప్రతి అపారమైన అవకాశాన్ని నిజం చేయడానికి మన ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తూనే ఉంటుంది’’ అని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.

అన్ని రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వేగాన్ని వివరిస్తూ, గత మూడు పర్యటనల్లోనే రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ‘‘ఇటీవల ప్రారంభించిన ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా ప్రతి రంగంలోనూ జరుగుతున్న అద్భుతమైన పనుల వేగాన్ని మీరు సులభంగా అంచనా వేయవచ్చు’’ అని శ్రీ మోదీ చెప్పారు.

ఈ విస్తృత వృద్ధి ప్రణాళికలో భాగంగా ఉత్తరాది జిల్లాలకు సాధికారత కల్పించడంపై అమిత సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని.. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం(వీఈఆర్‌) ఆసియాలోనే అత్యంత ప్రముఖ ఆర్థిక కేంద్రంగా వ్యూహాత్మకంగా ఎలా రూపుదిద్దుకుంటుందో వివరించారు. ఈ ప్రతి కొత్త సదుపాయం ఏకీకృత లక్ష్య సాధనకు తోడ్పడుతుందన్నారు. ‘‘విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం ఆసియాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆర్థిక కేంద్రంగా మారాలన్నదే మా అంతిమ లక్ష్యం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

పెట్టుబడులను నేరుగా ఉద్యోగావకాశాలుగా మార్చే ప్రభుత్వ ఆర్థిక విధానాన్ని ప్రధానమంత్రి వివరించారు. పెరిగిన ప్రభుత్వ, ప్రైవేటు నిధులు తయారీ రంగాన్ని ముందుకు నడిపిస్తుందని చెప్పారు. ఇది ఎగుమతులను పెంచి, కుటుంబ ఆదాయాలను, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని, సరిగ్గా ఇదే ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోందని తెలిపారు. ‘‘ఉద్యోగావకాశాలు పెరిగినప్పుడు, ప్రజల ఆదాయం పెరుగుతుంది, కుటుంబాల రోజువారీ జీవనం మెరుగుపడుతుంది’’ అని పేర్కొన్నారు.

ఈ ప్రాంతపు ఉజ్వల భవిష్యత్తుపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ కార్యక్రమంలో ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధనకు బలమైన పునాదులుగా నిలుస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Saratchandra Chattopadhyay on his 150th birth anniversary
September 15, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to renowned Bengali writer Saratchandra Chattopadhyay on his 150th birth anniversary. Remembering the eminent writer, Shri Modi highlighted the enduring significance of his literary works, which have been translated into every Indian language and several foreign languages. He noted that Saratchandra Chattopadhyay’s writings provide an accurate and sensitive portrayal of 19th-century India, particularly Bengali society in rural areas.

The Prime Minister posted on X:

Homage to noted Bengali writer, the versatile Saratchandra Chattopadhyay on his 150th birth anniversary.

His works, translated into every Indian language and several foreign languages, are remembered for their accurate depiction of 19th century India, especially Bengali society in rural areas. Equally noteworthy was his commitment to social reform, women’s rights and nationalism.

I call upon more youngsters to read his writings in the times to come.

প্রখ্যাত বাঙালি লেখক, বহুমুখী প্রতিভার অধিকারী শরৎচন্দ্র চট্টোপাধ্যায়ের ১৫০তম জন্মবার্ষিকীতে জানাই বিনম্র শ্রদ্ধাঞ্জলি।

ভারতের সমস্ত ভাষায় এবং একাধিক আন্তর্জাতিক ভাষায় অনূদিত তাঁর সাহিত্যকর্মগুলি উনিশ শতকের ভারত, বিশেষ করে গ্রামীণ অঞ্চলের বাঙালি সমাজকে সঠিকভাবে চিত্রিত করার জন্য স্মরণীয় হয়ে রয়েছে। সামাজিক সংস্কার, নারী অধিকার এবং জাতীয়তাবাদের প্রতি তাঁর দায়বদ্ধতাও সমানভাবে স্মরণীয়।

আগামী দিনের তরুণ-তরুণীকে আমি আরও বেশি করে তাঁর রচনা পড়ার জন্য আহ্বান জানাচ্ছি।