భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన రంగాల్లో సంస్కృత భాషకు చాలా కాలం నుంచీ ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ భాష దూరదర్శన్లో ‘సుప్రభాతం’ కార్యక్రమంలో ప్రతి రోజూ చోటు చేసుకొంటోందని ఆయన తెలిపారు.
నిత్యం ఉదయంపూట, ఈ కార్యక్రమంలో ఒక సంస్కృత సుభాషితాన్ని (జ్ఞాన బోధను) చెబుతున్నారు.. దీనిలో విలువల్నీ సంస్కృతినీ కలబోసి అందిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘దూరదర్శనస్య సుప్రభాతమ్ కార్యక్రమే ప్రతిదినం సంస్కృతస్య ఏకం సుభాషితం అపి భవతి. ఏతస్మిన్ సంస్కారాత: సంస్కృతిపర్యంతమ్ అన్యాన్య-విషయాణాం సమావేశ: క్రియతే. ఏతద్ అస్తి అద్యతనం సుభాషితమ్’’ అని పేర్కొన్నారు.
दूरदर्शनस्य सुप्रभातम् कार्यक्रमे प्रतिदिनं संस्कृतस्य एकं सुभाषितम् अपि भवति। एतस्मिन् संस्कारतः संस्कृतिपर्यन्तम् अन्यान्य-विषयाणां समावेशः क्रियते। एतद् अस्ति अद्यतनं सुभाषितम्.... pic.twitter.com/2eCJXApTSS
— Narendra Modi (@narendramodi) December 9, 2025


