అష్టాంగ మార్గాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

బుద్ధ పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుని ప్రబోధాల సాకారంపై అచంచల నిబద్ధతను స్పష్టం చేస్తూ- ఆయన ఆలోచనలు సమాజ సౌఖ్యం, ఐక్యతా స్ఫూర్తిని ఇనుమడింపజేయాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. శాంతి, కరుణ, సద్భావన మార్గంలో జీవనానికి స్ఫూర్తినిచ్చే ఈ పావన సందర్భంలో బుద్ధభగవానుడు ప్రబోధించిన జీవన విలువలను అనుసరించే దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పం పూనాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకుంటూ- గౌతమ బుద్ధుని ప్రబోధం మేరకు అంతర్గతంగా... బహిర్గతంగా శాశ్వత ఉనికి లేదనే సత్యాన్ని గ్రహించి ప్రతి వ్యక్తీ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలన్నారు. సమ్యక్ దృష్టి.. సంకల్పం.. కర్మలను పాటిస్తే దుఃఖ విముక్తులై శాశ్వత శాంతిని పొందగలరని పేర్కొన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన వరుస సందేశాల్లో:

“బుద్ధ పూర్ణిమ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. బుద్ధ భగవానుని ప్రబోధాల సాకారంపై మన నిబద్ధత అచంచలం. ఆయన ఆలోచనలు సమాజ సౌఖ్యం, ఐక్యతా స్ఫూర్తిని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.

... శాంతి, కరుణ, సద్భావన మార్గానుసరణలో మనకెంతో స్ఫూర్తినిచ్చే ఈ పవిత్ర సందర్భంలో, బుద్ధ భగవానుని జీవన విలువలను పాటించే దిశగా మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం.”

“నాన్తర్బహిశ్చ లోకేషు త్వాత్మానం దృష్టవాన్ క్వాచిత్ ।

అష్టాంగికేన్ మార్గం పరమం శాంతిమయౌ॥"

అంటే- గౌతమ బుద్ధుని ప్రబోధం మేరకు... అంతర్గతంగా... బహిర్గతంగా శాశ్వత ఉనికి లేదనే సత్యాన్ని గ్రహించి ప్రతి వ్యక్తీ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. సమ్యక్ దృష్టి.. సంకల్పం.. కర్మలను పాటిస్తే దుఃఖ విముక్తులై శాశ్వత శాంతి పొందగలరు” అని ప్రధానమంత్రి వివరించారు.

"सभी देशवासियों को बुद्ध पूर्णिमा की असीम शुभकामनाएं। शांति, करुणा और सद्भावना के मार्ग पर चलने की प्रेरणा देने वाले इस पावन अवसर पर आइए, भगवान बुद्ध के जीवन मूल्यों को अपनाने का संकल्प दोहराएं।

नान्तर्बहिश्च लोकेषु त्वात्मानं दृष्टवान् क्वचित्।
आष्टाङ्गिकेन मार्गेण परमां शान्तिमाययौ॥"

According to Gautama Buddha, when a person understands that there is no permanent self-existing entity either within or outside and follows the Eightfold Path-right view, right intention and right conduct-then they become free from suffering and attain supreme peace.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Kavach commissioned on 2,569 km as Railways expands safety rollout

Media Coverage

Kavach commissioned on 2,569 km as Railways expands safety rollout
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister reviews flood situation in Arunachal Pradesh and Nagaland with MPs from the two states
July 30, 2026

The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Arunachal Pradesh and Nagaland and discussed the situation in the two states in the wake of the floods.

Shri Modi said that the Central Government will continue working with the respective state Governments to address the challenges arising from the floods.

The Prime Minister prayed for everyone’s well-being and safety.

In a post on X, Shri Modi said;

“Had a meeting with MPs from Arunachal Pradesh and Nagaland. We talked about the situation in these states in the wake of floods there. The Central Government will keep working with the respective state Governments to address the challenges. Praying for everyone’s wellbeing and safety.”