పరమ పవిత్రులు పోప్ లియో XIV కు భారతదేశ ప్రజల పక్షాన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక అభినందనలతోపాటు శుభాకాంక్షలను తెలిపారు. కేథలిక్ చర్చికి పోప్ అందిస్తున్న నాయకత్వాన్ని శ్రీ మోదీ హర్షించారు. ప్రపంచంలో శాంతినీ, సద్భావననూ, సంఘీభావాన్నీ, సేవనూ వ్యాప్తి చేయడంలో కేథలిక్ చర్చికి విస్తృత ప్రాధాన్యం ఉందని ప్రధాని అన్నారు.
ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో :
‘‘పరమ పవిత్రులు పోప్ లియో XIV కు భారతదేశ ప్రజల తరఫున నేను హృదయపూర్వక అభినందనలతోపాటు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. శాంతి, సద్భావన, సంఘీభావం, సేవ.. ఈ ఆదర్శాలను ముందుకు తీసుకుపోవడంలో కేథలిక్ చర్చి ప్రాధాన్యాన్ని సంతరించుకొన్న వేళ, నాయకత్వ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఉమ్మడి విలువలను పెంపొందింప చేయడానికి హోలీ సీ తో తరచుగా సంభాషించడంతోపాటు అనుబంధాన్ని బలపరచుకోవడానికి భారత్ సదా కట్టుబడి ఉంటుంది.
@Pontifex’’ అని పేర్కొన్నారు.
I convey sincere felicitations and best wishes from the people of India to His Holiness Pope Leo XIV. His leadership of the Catholic Church comes at a moment of profound significance in advancing the ideals of peace, harmony, solidarity and service. India remains committed to…
— Narendra Modi (@narendramodi) May 9, 2025


