ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నమీబియా అధ్యక్షురాలు గౌరవ నెటుంబో నాండి-ఎన్డైత్వా ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే.

ఈ పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి.. ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకూ, భారత్-నమీబియా చారిత్రాత్మక, శాశ్వత సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు ఈ అత్యున్నత పురస్కారం అందించిన ఆ దేశ అధ్యక్షురాలు నాండి-ఎన్డైత్వాకు, నమీబియా ప్రజలకూ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రధానమంత్రికి ఈ పురస్కారం ప్రదానం చేయడం భారత్-నమీబియా ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రత్యేక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇరు దేశాల యువతకూ ఇది ప్రేరణనిస్తుంది.



