డీ జ్ఞానసుందరం మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తమిళ సంస్కృతికి, సాహిత్యానికి శ్రీ డీ జ్ఞానసుందరం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ప్రధానమంత్రి అన్నారు. ఆయన రచనలు, అంకితభావం సమాజంలో సాంస్కృతిక స్పృహను సుసంపన్నం చేశాయి. పాఠకులకు, పండితులకు ఆయన రచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
2024 జనవరిలో శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో ఆయనతో జరిగిన సంభాషణను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. కంబ రామాయణంపై ఆయనకున్న అవగాహన విలక్షణమైనదని కొనియాడారు.
ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రధానమంత్రి సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ పోస్టు:
‘‘శ్రీ డీ జ్ఞానసుందరం మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తమిళ సంస్కృతికి, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. తన రచనలు, అంకితభావం ద్వారా సమాజంలో సాంస్కృతిక స్పృహను సుసంపన్నం చేశారు. పాఠకులు, పండితులకు ఆయన రచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
2024 జనవరిలో తిరుచురాపల్లిలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయనతో సంభాషించాను. కంబ రామాయణంపై ఆయనకున్న అవగాహన అసామాన్యమైనది.
ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’
Deeply pained by the passing of Thiru D. Gnanasundaram Ji. His contribution to Tamil culture and literature will always be remembered. Through his writings and lifelong dedication, he enriched the cultural consciousness of society. His works will continue to inspire generations… pic.twitter.com/VzITJnssGM
— Narendra Modi (@narendramodi) January 26, 2026
திரு டி. ஞானசுந்தரம் அவர்களின் மறைவு மிகுந்த வேதனையளிக்கிறது. தமிழ்க் கலாச்சாரத்திற்கும் இலக்கியத்திற்கும் அவரின் பங்களிப்பு என்றென்றும் நினைவுகூரப்படும். தனது எழுத்துக்கள் மூலம் வாழ்நாளை அர்ப்பணித்து சமூகத்தின் கலாச்சார உணர்வை அவர் வளப்படுத்தினார். அவரது படைப்புகள்… pic.twitter.com/DTgVIOZV4D
— Narendra Modi (@narendramodi) January 26, 2026


