ప్రముఖ జానపద కళాకారుడు పద్మశ్రీ రాంసహాయ్ పాండే మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘సుప్రసిద్ధ జానపద కళాకారుడు పద్మశ్రీ రాంసహాయ్ పాండే జీ కన్నుమూశారని తెలిసి చాలా ఎంతో బాధ కలిగింది. ఆయన తన అద్భుత కళ, శ్రద్ధ, కృషిలతో బుందేల్ఖండ్ జానపద నృత్యం రాయీకి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టారు. ఆయన నిష్క్రమణ దేశ కళా జగతికి తీరని లోటు. ఈ విచార ఘడియలో ఆయన సన్నిహితులకు, అభిమానులకు మనోనిబ్బరాన్ని ఆ దైవం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.’’
सुप्रसिद्ध लोक कलाकार पद्मश्री रामसहाय पांडे जी के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने अपनी अद्भुत कला, लगन और परिश्रम से बुंदेलखंड के लोकनृत्य राई को अंतर्राष्ट्रीय ख्याति दिलाई। उनका जाना देश के कला जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में ईश्वर उनके परिजनों और… pic.twitter.com/YgCMVIUaOG
— Narendra Modi (@narendramodi) April 9, 2025


