చిరకాల అనుభవం కలిగినటువంటి గుజరాతీ ఫోటో జర్నలిస్టు శ్రీ జవేరీలాల్ మెహతా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఫోటో జర్నలిజం రంగం లో ఆయన దీర్ఘకాలం పాటు మరియు చక్కనైన వృత్తి లో అందించినటువంటి తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు -
‘‘గుజరాత్ యొక్క ప్రసిద్ధ ఫోటో జర్నలిస్టు శ్రీ జవేరీలాల్ మెహతా యొక్క కన్నుమూత వార్త విని తీవ్ర దు:ఖం కలిగింది. పత్రికా ప్రపంచం లో దీర్ఘ వృత్తి జీవనాన్ని సాగించినటువంటి కాలం లో ఫోటో జర్నలిజం రంగం లో ఆయన అందించిన తోడ్పాటు ను ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఆత్మ కు శాంతి ని ప్రసాదించవలసింది గా ఆ ఈశ్వరుడి ని ప్రార్థించడం తో పాటు గా శోక మగ్నులు అయిన ఆయన యొక్క కుటుంబాని కి ఇదే నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను..
ఓమ్ శాంతి.’’
ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
— Narendra Modi (@narendramodi) November 27, 2023
અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
ૐ શાંતિ...!! pic.twitter.com/F1HvhfG5u8


