లుధియానా లో గ్యాస్ లీక్ అయిన కారణం గా జరిగిన దుర్ఘటన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కోసం మరియు గాయపడ్డ వారి కోసం పరిహారాన్ని ఇవ్వనున్నట్లు కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,
‘‘గ్యాస్ లీక్ అయిన కారణం గా లుధియానా లో జరిగిన విషాదం పట్ల ప్రధాన మంత్రి శ్రీ @narendramodi దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ, ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని వారి దగ్గరి సంబంధికుల కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదే దుర్ఘటన లో గాయపడ్డ ప్రతి ఒక్కరి కి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది.’’ అని తెలిపింది.
Expressing grief on the tragedy in Ludhiana due to a gas leak, PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) May 1, 2023


