పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను దేశ పౌరులు మరింత పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా మార్చేందుకు క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నవారిని అభినందించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి తన ఆలోచనలను ఎక్స్లో పంచుకున్నారు:
‘‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం #WorldEnvironmentDay సందర్భంగా మన గ్రహాన్ని రక్షించుకోవడానికి, మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి చేపడుతున్న ప్రయత్నాలను తీవ్రతరం చేయాల్సి ఉంది. పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా మార్చేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారిని అభినందిస్తున్నాను’’.
This #WorldEnvironmentDay, let’s deepen our efforts towards protecting our planet and overcoming the challenges we face. I also compliment all those working at the grassroots to make our environment greener and better. pic.twitter.com/E7mWAFZ73V
— Narendra Modi (@narendramodi) June 5, 2025


