వివిధ దేశాలకు చెందిన ప్రముఖులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మీరు ఈ రంగానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించారు.  పౌర విమానయాన రంగంలో ఉన్న మేధావులు ప్రస్తుతం మన మధ్యలో ఉన్నారని నేను నమ్ముతున్నాను, ఇది మన సమష్టి నిబద్ధతను, ఆసియా పసిఫిక్ ప్రాంత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సంస్థ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, మా మంత్రి శ్రీ నాయుడు మార్గదర్శకత్వం, నాయకత్వంలో, 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక చెట్టు) తో 80,000 చెట్లను నాటే ఒక ప్రధాన కార్యక్రమం చేపట్టబడింది. అయితే, నేను మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మా దేశంలో ఒక వ్యక్తి 80 ఏళ్ళకు చేరుకున్నప్పుడు, దానిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వేడుకగా జరుపుకుంటారు. మన పూర్వీకుల ప్రకారం, 80 ఏళ్ళకు చేరుకోవడం అంటే వెయ్యి పౌర్ణమి చంద్రులను చూసే అవకాశం కలిగి ఉండటం. ఒకరకంగా చెప్పాలంటే మన సంస్థ కూడా వెయ్యి పౌర్ణమిలను ప్రత్యక్షంగా వీక్షించి, దగ్గరగా చూసిన అనుభవం కలిగింది. ఈ 80 సంవత్సరాల ప్రయాణం ఒక చిరస్మరణీయ ప్రయాణం, విజయవంతమైన ప్రయాణం, అభినందనలకు అర్హమైనది.

 

మిత్రులారా,

ప్రస్తుత వృద్ధి వెనుక పౌర విమానయానం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విమానయానం ఒకటి. ఈ రంగం ద్వారా మన ప్రజలను, సంస్కృతిని, శ్రేయస్సును అనుసంధానం చేస్తున్నాం. 4 బిలియన్ల జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి, తత్ఫలితంగా డిమాండ్ పెరగడం, ఇది ఈ రంగం అభివృద్ధికి గణనీయమైన చోదక శక్తి. ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించే, శాంతిని, శ్రేయస్సును బలోపేతం చేసే అవకాశాల నెట్ వర్క్ ను సృష్టించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. విమానయాన భవిష్యత్తును సురక్షితం చేయడం మన ఉమ్మడి నిబద్ధత. పౌర విమానయానానికి సంబంధించిన అవకాశాలపై మీరంతా తీవ్రంగా చర్చించారు. మీ కృషికి ధన్యవాదాలు, ఢిల్లీ డిక్లరేషన్ ఇప్పుడు మన ముందు ఉంది. ఈ ప్రకటన ప్రాంతీయ అనుసంధానం, ఆవిష్కరణ, విమానయాన రంగంలో స్థిరమైన వృద్ధికి మన నిబద్ధతను మరింత పెంచుతుంది. ప్రతి విషయంలోనూ వేగంగా చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకుంది. ఈ డిక్లరేషన్ ను అమలు చేసి సమష్టి శక్తితో కొత్త శిఖరాలకు చేరుకుంటాం. విమానయాన సంబంధాలను పెంపొందించడంలో ఆసియా పసిఫిక్ ప్రాంత సహకారం, మన మధ్య జ్ఞానం, నైపుణ్యం, వనరుల ను పంచుకోవడం మన బలాన్ని మరింత పెంచుతాయి. మౌలిక సదుపాయాల రంగంలో మరిన్ని పెట్టుబడులు అవసరం. ఇది సంబంధిత దేశాలన్నింటికీ సహజ ప్రాధాన్యతగా ఉండాలి. అయితే, మౌలిక సదుపాయాలు మాత్రమే సరిపోవు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ననీకరించిన సాంకేతిక పరిజ్ఞానం నిరంతర ప్రక్రియ అభివృద్ధికి కీలకం, ఇది మనకు అవసరమైన మరొక రకమైన పెట్టుబడి అని నేను నమ్ముతున్నాను. విమానయానాన్ని సామాన్య పౌరుల కు అందుబాటు లోకి తీసుకురావడం మా ధ్యేయం. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా, సరసమైనదిగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఈ డిక్లరేషన్ తో మన సమిష్టి ప్రయత్నాలు, మన సుదీర్ఘ అనుభవం మనకు ఎంతో ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను.

 

మిత్రులారా,

ఈ రోజు మీ అందరితో నా అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను.. నేడు ప్రపంచంలోని అత్యున్నత పౌర విమానయాన వ్యవస్థల్లో భారత్ బలమైన స్తంభంగా మారింది. మన పౌర విమానయాన రంగంలో అపూర్వమైన వృద్ధి నమోదైంది. కేవలం ఒక దశాబ్దంలో భారత్ గణనీయమైన మార్పును చూపించింది. ఇన్నేళ్లలో భారత్ ఏవియేషన్ ఎక్స్ క్లూజివ్ దేశం నుంచి ఏవియేషన్ ఇన్ క్లూజివ్ దేశంగా రూపాంతరం చెందింది. ఎందుకంటే ఒకప్పుడు దేశంలో విమాన ప్రయాణం కొద్ది మందికి మాత్రమే పరిమితం.. కొన్ని ప్రధాన నగరాలు మాత్రమే మంచి విమాన కనెక్టివిటీని కలిగి ఉన్నాయి, కొంతమంది పెద్దలు నిరంతరం విమాన ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. బడుగు, మధ్యతరగతి ప్రజలు అప్పుడప్పుడూ, అవసరానికి మించి మాత్రమే ప్రయాణించేవారు, కానీ అది వారి జీవితంలో ఒక సాధారణ భాగం కాదు. అయితే నేడు భారత్ లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల పౌరులు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టాం, విధానపరమైన మార్పులు చేశాం, వ్యవస్థలను అభివృద్ధి చేశాం. దేశంలో విమానయానాన్ని సమ్మిళితం చేసిన ఉడాన్ పథకాన్ని మీరు అధ్యయనం చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ పథకం భారతదేశంలోని చిన్న నగరాలు,దిగువ మధ్యతరగతి వ్యక్తులకు విమాన ప్రయాణాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద, ఇప్పటివరకు 14 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించారు, వీరిలో లక్షలాది మంది మొదటిసారి లోపలి నుండి విమానాన్ని చూశారు. ఉడాన్ పథకం సృష్టించిన డిమాండ్ అనేక చిన్న నగరాల్లో కొత్త విమానాశ్రయాలు, వందలాది కొత్త మార్గాల ఏర్పాటుకు దారితీసింది. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, నాయుడు గారు చెప్పినట్లు, గత పదేళ్లలో భారతదేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయింది. ఇతర రంగాల్లోనూ వేగంగా పురోగతి సాధిస్తున్నాం. ఓ వైపు చిన్న నగరాల్లో విమానాశ్రయాలను నిర్మిస్తూనే మరోవైపు పెద్ద నగరాల విమానాశ్రయాలను మరింత ఆధునీకరించే దిశగా వేగంగా కృషి చేస్తున్నాం.

 

భవిష్యత్తులో దేశం ఎయిర్ కనెక్టివిటీ పరంగా ప్రపంచంలోని అత్యంత అనుసంధానించబడిన ప్రాంతాలలో ఒకటిగా అవతరిస్తుంది.. ఈ విషయం మన విమానయాన సంస్థలకు కూడా తెలుసు. అందుకే మన భారతీయ విమానయాన సంస్థలు 1,200 కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్ ఇచ్చాయి. పౌర విమానయానాభివృద్ధి విమానాలు, విమానాశ్రయాలకే పరిమితం కాలేదు. విమానయాన రంగం కూడా భారత్ లో ఉద్యోగాల కల్పనను వేగవంతం చేస్తోంది. నైపుణ్యం కలిగిన పైలట్లు, క్రూ మెంబర్లు, ఇంజనీర్లు,   ఇలాంటి అనేక ఉద్యోగాలను సృష్టిస్తున్నారు. నిర్వహణ(మెయింటెనెన్స్), మరమ్మత్తు (రిపేర్), పర్యవేక్షణ (ఓవర్హాల్) (ఎంఆర్వో) సేవలను బలోపేతం చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల సృష్టికి దారితీస్తోంది. 4 బిలియన్ డాలర్ల ఎమ్మార్వో పరిశ్రమతో ఈ దశాబ్దం చివరి నాటికి ప్రముఖ ఏవియేషన్ హబ్ (విమానయాన కేంద్రం) గా ఎదగాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఎమ్మార్వో పాలసీలను కూడా రూపొందించాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో విమాన కనెక్టివిటీ భారత్ లోని వందలాది కొత్త నగరాలను వృద్ధి కేంద్రాలుగా మారుస్తుంది.

 

మల్టీపోర్ట్ వంటి ఆవిష్కరణల గురించి మీ అందరికీ తెలుసు. నగరాల్లో ప్రయాణ సౌలభ్యాన్ని పెంచే విమాన రవాణా నమూనా ఇది. అధునాతన ఎయిర్ మొబిలిటీ కోసం భారత్ ను సిద్ధం చేస్తున్నాం. ఎయిర్ ట్యాక్సీలు సాకారం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మా నిబద్ధత, జి 20 శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి సంబంధించి ఉందని మీరు గమనించి ఉండవచ్చు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనే మా లక్ష్యానికి మా విమానయాన రంగం ఎంతో మద్దతు ఇస్తోంది. ప్రపంచ సగటు కేవలం 5 శాతంతో పోలిస్తే భారత్ లో పైలట్లలో దాదాపు 15 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ రంగాన్ని మరింత మహిళా స్నేహపూర్వకంగా మార్చడానికి అవసరమైన సలహాలను కూడా భారత్ అమలు చేసింది, ఇందులో మహిళల కోసం రిటర్న్-టు-వర్క్ విధానాలు, ప్రత్యేక నాయకత్వం, మార్గదర్శక కార్యక్రమాలు ఉన్నాయి.

 

గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో భారత్ చాలా ప్రతిష్టాత్మకమైన డ్రోన్ ప్రాజెక్టును ప్రారంభించింది. గ్రామగ్రామాన 'డ్రోన్ దీదీ' అభియాన్ ద్వారా శిక్షణ పొందిన డ్రోన్ పైలట్లను తయారు చేశాం. భారతదేశ విమానయాన రంగం కొత్త, ప్రత్యేక లక్షణం డిజి యాత్ర చొరవ, ఇది సజావుగా, అంతరాయం లేని విమాన ప్రయాణానికి డిజిటల్ పరిష్కారం. ఇందులో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా విమానాశ్రయాలలోని వివిధ చెక్ పాయింట్ల నుండి ప్రయాణీకులకు ఉపశమనం లభిస్తుంది, సమయం ఆదా అవుతుంది. డిజి యాత్ర సమర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, ఇది ప్రయాణం భవిష్యత్తు గురించి ఒక సంగ్రహావలోకనం కూడా. మన ప్రాంతానికి ఘనమైన చరిత్ర, సంప్రదాయాలు, భిన్నత్వం ఉన్నాయి. ప్రాచీన సాంస్కృతిక వారసత్వం, గొప్ప సంప్రదాయాల్లో మనం సంపన్నులం. మన సంస్కృతి, సంప్రదాయాలు వేల సంవత్సరాల నాటివి. ఈ కారణాల వల్ల ప్రపంచం మనవైపు ఆకర్షితులవుతుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో కూడా మనం ఒకరికొకరు సహాయపడాలి. అనేక దేశాలలో బుద్ధ భగవానుని ఆరాధిస్తారు. భారతదేశం ఒక బౌద్ధ సర్క్యూట్ ను అభివృద్ధి చేసింది. కుషినగర్ లో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. ఆసియా అంతటా ఉన్న బౌద్ధ పుణ్యక్షేత్రాలను అనుసంధానించే ప్రచారాన్ని మనం చేపడితే, సంబంధిత దేశాలలో విమానయాన రంగానికి, సాధారణంగా ప్రయాణీకులకు ఒక విజయవంతమైన నమూనాను సృష్టించవచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఒకే రకమైన సమగ్ర నమూనాను మనం అభివృద్ధి చేస్తే, సంబంధిత దేశాలన్నింటికీ గణనీయమైన ప్రయోజనాలకు హామీ ఇస్తుంది. అంతర్జాతీయ బౌద్ధ సర్క్యూట్ ను అభివృద్ధి చేస్తే అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆసియా పసిఫిక్ దేశాలు మరో రంగంలో కూడా సహకారాన్ని పెంపొందించుకోవచ్చు.

 

ఆసియా పసిఫిక్ ప్రాంతం ఇప్పుడు వ్యాపార కేంద్రంగా కూడా మారుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎగ్జిక్యూటివ్ లు లేదా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తున్నారు. సహజంగానే కొందరు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంతో తరచూ ప్రయాణాలు పెరిగాయి. ఈ నిపుణులు తరచుగా ఏ సాధారణ మార్గాలను ఉపయోగిస్తారు? వారి అవసరాలను మెరుగ్గా తీర్చడానికి, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి సమగ్ర విధానంతో ఈ మార్గాలను మార్చగలమా? ఈ ప్రాంత అభివృద్ధి హామీ ఇవ్వబడినందున, వృత్తి నిపుణుల సౌలభ్యం పని పురోగతిని వేగవంతం చేస్తుంది కాబట్టి మీరు ఈ దిశలో కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ, చికాగో కన్వెన్షన్ 18వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దేశీయ, సమ్మిళిత విమానయాన రంగానికి మన నిబద్ధతను మనం పునరుద్ఘాటించాలి. సైబర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ విషయంలో మీ ఆందోళనల గురించి కూడా నాకు తెలుసు. సాంకేతిక పరిజ్ఞానం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, పరిష్కారాలు కూడా సాంకేతిక పరిజ్ఞానం నుండి వస్తాయి. మనం అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి, సాంకేతిక పరిజ్ఞానం, సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవాలి, తద్వారా ఈ వ్యవస్థలను సురక్షితంగా ఉంచాలి. ఐకమత్యంతో, భాగస్వామ్య లక్ష్యంతో ముందుకు సాగాలన్న మన సంకల్పాన్ని ఈ ఢిల్లీ సదస్సు బలపరుస్తుంది. ఆకాశం అందరికీ అందుబాటులో ఉండే, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎగరాలనే కల నెరవేరేలా భవిష్యత్తు కోసం మనం కృషి చేయాలి. మరోసారి, నేను అతిథులందరికీ స్వాగతం పలుకుతున్నాను, ఈ ముఖ్యమైన శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీ అందరికీ నా శుభాకాంక్షలు.

 

ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India

Media Coverage

With HPV vaccine rollout, AIIMS oncologist says it’s the beginning of the end for cervical cancer in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Jammu and Kashmir team on their first-ever Ranji Trophy victory
February 28, 2026

The Prime Minister has congratulated the Jammu and Kashmir team for their first-ever Ranji Trophy win.

The Prime Minister stated that this historic triumph reflects the remarkable grit, discipline, and passion of the team. Highlighting that it is a proud moment for the people of Jammu and Kashmir, he noted that the victory underscores the growing sporting passion and talent in the region.

The Prime Minister expressed hope that this feat will inspire many young athletes to dream big and play more.

The Prime Minister shared on X post;

"Congratulations to the Jammu and Kashmir team for their first ever Ranji Trophy win! This historic triumph reflects remarkable grit, discipline and passion of the team. It is a proud moment for the people of Jammu and Kashmir and it highlights the growing sporting passion and talent there. May this feat inspire many young athletes to dream big and play more."