ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సెనేట్ అధ్యక్షులు వాడే మార్క్, దిగువ సభ స్పీకర్ జగదేవ్ సింగ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన.. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. భారతదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక కీలక కార్యక్రమంగా నిలిచిపోతుంది.

ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశమైన భారత్ తరఫున సభలో ఉన్న ప్రతినిధులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అత్యున్నత జాతీయ గౌరవాన్ని తనకు అందించినందుకు ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని వివరిస్తూ దేశాన్ని ప్రజాస్వామ్య మాతగా పేర్కొన్నారు. దేశ సంస్కృతి, జీవనంలో ప్రజాస్వామ్యం అంతర్భాగంగా ఉందని అన్నారు. భారతదేశ వైవిధ్యం సుసంపన్నంగా మారేందుకు, అన్ని ఆలోచనలు సహజీవనం చేస్తూ కొనసాగేలా ఇది ఉపయోగపడిందని వివరించారు. అంతేకాకుండా పార్లమెంటరీ ప్రక్రియలు, బహిరంగ చర్చలను పెంపొందించాయని అన్నారు.

ప్రజాస్వామ్యంతో విజయవంతంగా సాగిస్తోన్న ప్రయాణం పట్ల ఆ దేశానికి అభినందనలు తెలియజేశారు. స్వేచ్ఛా మార్గంలో ఆ దేశ ప్రజలతో సంఘీభావంగా నిలబడటం భారత్కు దక్కిన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఆధునిక దేశాలుగా ఇరు దేశాల మధ్య లోతుగా పాతుకుపోయిన బంధాలు మరింత బలపడుతున్నాయని ఆయన ప్రధానంగా చెప్పారు. భారతదేశం బహుమతిగా ఇచ్చిన స్పీకర్ కుర్చీలో ఇవి ప్రతిబింబిస్తున్నాయన్న ఆయన.. ద్వైపాక్షిక పార్లమెంటరీ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి పిలుపునిచ్చారు. సభలో మహిళల భాగస్వామ్యం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన భారత పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో చిట్టచివరి స్థాయిలో నాయకత్వం వహిస్తున్న మహిళా నాయకుల గురించి కూడా ఆయన వివరించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలకు ప్రాతనిధ్యం వహిస్తోన్న1.5 మిలియన్ల మహిళల గురించి ప్రస్తావించారు.

మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రధానమంత్రి వివరించారు. శాంతిని కోరుకునే వారికి తీవ్ర ముప్పుగా మారిన ఉగ్రవాదంపై పోరాటాన్ని బలోపేతం చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి పరిపాలనలో సంస్కరణలు తీసుకురావాలని, గ్లోబల్ సౌత్కు ప్రాధాన్యత అందాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశం, కరీబియన్ సమాజం (క్యారీకోమ్) మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ట్రినిడాడ్లో భారతీయుల రాకకు 180 సంవత్సరాలు నిండిన సందర్భంగా జరుగుతున్న వేడుకలను గుర్తు చేసిన ఆయన.. రెండు దేశాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటి సంబంధాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇవి మరింతగా వృద్ధి చెందుతూనే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
I am deeply honoured to stand before you, the elected representatives of a proud democracy and a friendly nation: PM @narendramodi during his address to the Joint Assembly of the Parliament of Trinidad & Tobago pic.twitter.com/WTbZhXFgju
— PMO India (@PMOIndia) July 4, 2025
For India, democracy is a way of life. pic.twitter.com/YrGCrMfuWC
— PMO India (@PMOIndia) July 4, 2025
India and Trinidad & Tobago share a relationship rooted in centuries-old bonds. pic.twitter.com/kfXx7Oyte5
— PMO India (@PMOIndia) July 4, 2025
We are strengthening the hands of women to build a modern India. pic.twitter.com/CfDJYTcwlD
— PMO India (@PMOIndia) July 4, 2025
We see our development as a responsibility towards others.
— PMO India (@PMOIndia) July 4, 2025
And, our priority will always be the Global South: PM @narendramodi pic.twitter.com/VshwwT5wcX
The Global South is rising. They wish to see a new and fairer world order. pic.twitter.com/B3Z7vsi2AP
— PMO India (@PMOIndia) July 4, 2025
MAHASAGAR - India's guiding vision for the Global South. pic.twitter.com/jgEyUvKjBm
— PMO India (@PMOIndia) July 4, 2025


