PM to address Swachhagrahis in Champaran tomorrow

బిహార్ లో చంపారణ్ సత్యాగ్రహం యొక్క శతాబ్ది సమారోహం ముగింపు ఉత్సవాలను రేపు దేశ ప్రజలు జరుపుకోనుండగా వారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా పాలుపంచుకోబోతున్నారు.

ఈ సందర్భంగా మోతీహారీ లో 20 వేల మంది స్వచ్ఛత రాయబారులు లేదా ‘‘స్వచ్ఛాగ్రహుల’’ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు. స్వచ్ఛాగ్రహులు కాల్బలం వంటి వారు; వీరు పల్లెల స్థాయిలో కమ్యూనిటీ అప్రోచెస్ టు శానిటేశన్ (సిఎఎస్) ను అమలుపరచేందుకు స్ఫూర్తిమూర్తులుగా వ్యవహరిస్తారన్న మాట. దేశంలో మల మూత్రాదుల విసర్జన కు తావు ఉండనటువంటి బహిరంగ ప్రదేశాలను ఏర్పరచాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా పురోగమించడంలో ఈ స్వచ్ఛాగ్రహులు కీలకమైన చోదక శక్తుల పాత్రను పోషిస్తున్నారు.

నీలి మందు సేద్యాన్ని చేపట్టక తప్పని స్థితి ఎదురైన రైతుల హక్కుల కోసం బ్రిటిషు వారికి వ్యతిరేకంగా మహాత్మ గాంధీ చంపారణ్ సత్యాగ్రహాన్ని 1917 ఏప్రిల్ 10 వ తేదీ నాడు ఆరంభించింది మొదలు ఇప్పటికి ఒక శతాబ్దానికి పైగానే కాలం గడచిపోయింది. 2018 ఏప్రిల్ 10వ తేదీని- చంపారణ్ సత్యాగ్రహం యొక్క శతాబ్ది సమారోహం ముగింపు ఉత్సవాలకు గుర్తుగా- పాటించనున్నారు. దీనిని ‘‘సత్యాగ్రహ్ సే స్వచ్ఛాగ్రహ్’’ ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా జరుపుకోబోతున్నారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పలు అభివృద్ధి పథకాలను కూడా ఆవిష్కరించనున్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India car sales to hit 4.7 million in FY26 despite bumps

Media Coverage

India car sales to hit 4.7 million in FY26 despite bumps
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 మార్చి 2026
March 16, 2026

Thoughtful Strength: Balancing Security, Growth, and Autonomy Under PM Modi's Leadership