స‌మాజం, ప్ర‌జ‌లు, మైక్రో కంటైన్‌మెంట్ జోన్‌ల ఏర్పాటులో ముందుండాలి: ప్ర‌ధాన‌మంత్రి
వాక్సిన్ ఏమాత్రం వృధాకాని ద‌శ‌కు మ‌నం చేరుకోవాలి : ప్ర‌ధాన‌మంత్రి
టీకా ఉత్స‌వానికి వ్య‌క్తిగ‌త‌, సామాజిక‌, పాల‌నా స్థాయిలో ల‌క్ష్యాలు నిర్ణ‌యించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలి : ప్ర‌ధాన‌మంత్రి

నా ప్రియమైన దేశవాసులారా!

   జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా నేడు… అంటే- ఏప్రిల్ 11న మనం ‘టీకా ఉత్సవ్’ను ప్రారంభించుకుంటున్నాం. ఈ ‘టీకా ఉత్సవ్’ ఏప్రిల్ 14దాకా… అంటే- బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకల వరకూ కొనసాగుతుంది. ఒక విధంగా ఈ ఉత్సవం కరోనాపై మరో కీలక యుద్ధానికి శ్రీకారం. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతకే కాకుండా సామాజిక శుభ్రతకూ మనం ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగా మనం నాలుగు అంశాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి:

  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరికి టీకా వేయించాలి… అంటే- స్వయంగా వెళ్లి టీకా వేయించుకోలేని పెద్దలు, పెద్దగా చదువుకోని వారికి సాయం చేయాలి.
  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరిని ఆదరించాలి… అంటే- టీకా అందుబాటుకు సంబంధించిన సదుపాయాల గురించి తెలియనివారికి లేదా అందుకు అవకాశం లేనివారికి సాయం చేయాలి.
  • ప్రతి ఒక్కరూ – కనీసం ఒకరిని రక్షించాలి… అంటే- ‘‘నేను కచ్చితంగా మాస్కు ధరించి నన్ను నేను రక్షించుకోవవడంతోపాటు ఇతరుల ప్రాణాలకూ రక్షణ కల్పిస్తాను’’ అని ప్రతినబూనాలి.

   ఇక నాలుగో ముఖ్యమైన అంశం ఏమిటంటే- ఎవరికైనా కరోనా సోకినపుడు ఆ పరిసర ప్రదేశాల్లో ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన పక్షంలో ఆ వ్యక్తి కుటుంబసభ్యులు సంబంధిత ప్రాంతంలోని ఇతరులు కూడా ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటు చేసుకోవాలి.

   అధిక జనసాంద్రతగల భారత్ వంటి దేశంలోనైనా కరోనాపై పోరులో ‘సూక్ష్మ నియంత్రణ మండలం’ ఏర్పాటు ఒక కీలక తరణోపాయం. అలాగే ఏ ఒక్కరికి వ్యాధి నిర్ధారించబడినా అందరూ అప్రమత్తమై, మిగిలినవారంతా పరీక్ష చేయించుకునేలా శ్రద్ధ వహించాలి. అదే సమయంలో సామాజికంగానే కాకుండా పాలన యంత్రాంగం పరంగానూ అర్హులైన వారందరూ  టీకా వేయించుకునేలా కృషిచేయాలి. ఒక్క టీకా కూడా వ్యర్థం కారాదన్నది మన లక్ష్యం కావాలి. ఆ మేరకు అసలు టీకా వృథా అన్నమాటకే తావు లేకుండా జాగ్రత్త వహించాలి. ఈ కృషిలో భాగంగా దేశంలోని టీకా సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకునేలా చూడాలి. మన టీకా ఉత్పాదక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడానికి ఇదీ ఒక మార్గమే.

  • మన విజయం – ‘సూక్ష్మ నియంత్రణ మండలం’పై అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది.
  • మన విజయం – అనవసరంగా ఇళ్లనుంచి బయటకు వెళ్లకపోవడంలోనే ఉంటుంది.
  • మన విజయం – అర్హులైన వారందరికీ టీకా వేయించడంపైనే నిర్ణయించబడుతుంది.
  • మన విజయం – మనం మాస్క్ ధరించడం, ఇతర నిబంధనలను పాటించడంపైనా ఆధారపడి ఉంటుంది.

మిత్రులారా!

   ఈ నాలుగు రోజుల ‘టీకా ఉత్సవ్’లో వ్యక్తిగత, సామాజిక, పాలన యంత్రాంగం స్థాయులలో లక్ష్యాలను సాధించే దిశగా మనం అన్నివిధాలా కృషిచేయాలి. అప్రమత్తంగా ఉండటంతోపాటు ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడంతోపాటు ప్రజల భాగస్వామ్యంతో మనం మరోసారి కరోనాను నియంత్రించగలమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.

గుర్తుంచుకోండి – మందులు వాడటమే కాదు… విధివిధానాలకు కట్టుబాటు కూడా ముఖ్యం.

 

ధన్యవాదాలు!

మీ

నరేంద్ర మోదీ

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
On a war footing, India Inc to ramp up festive hiring; temporary recruitment expected to rise 8-25% from last year

Media Coverage

On a war footing, India Inc to ramp up festive hiring; temporary recruitment expected to rise 8-25% from last year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Yash Vir Singh on winning Bronze in Men’s Javelin at Commonwealth Games 2026
August 01, 2026

The Prime Minister, Shri Narendra Modi has congratulated Yash Vir Singh on winning the Bronze medal in the Men’s Javelin event at the Glasgow Commonwealth Games 2026.

The Prime Minister said that Yash Vir Singh produced an impressive throw, reflecting his zeal and dedication.

Shri Modi expressed confidence that his achievement would inspire many young athletes and wished him the very best for his future endeavours.

The Prime Minister wrote on X;

“Congratulations to Yash Vir Singh for winning the Bronze in the Men’s Javelin event! He produced an impressive throw, reflecting his zeal and dedication. His achievement will inspire many young athletes. All the best to him for the endeavours ahead.

#CWG2026”