Digital technology has emerged as a great enabler. It has paved the way for efficient service delivery and governance: PM Modi
We are using mobile power or M-power to empower our citizens: PM Narendra Modi
Through better targeting of subsidies, the JAM trinity has prevented leakages to the tune of nearly ten billion dollars so far: PM
Citizens of India are increasingly adopting cashless transactions; BHIM App is helping the movement towards a less cash and corruption free society: PM
Technology breaks silos; PRAGATI has put back on track infrastructure projects worth billions of dollars which were stuck in red-tape: PM
Cyber-space remains a key area for innovation. Our startups today are looking to provide solutions to everyday problems and improving lives: PM
Nations must take responsibility to ensure that the digital space does not become a playground for the dark forces of terrorism and radicalization: PM

శ్రేష్ఠులైన శ్రీ లంక ప్ర‌ధాని రానిల్ విక్ర‌మ సింఘే, 
భార‌త‌దేశం నుండి ఇంకా విదేశాల నుండి విచ్చేసిన మంత్రులు,
ఐటియు సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌,
ఇత‌ర గౌర‌వ‌నీయ ఉన్న‌తాధికారులు,
120 కి పైగా దేశాల ప్ర‌తినిధులు,
విద్యార్థులు,
మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా,

గ్లోబ‌ల్ కాన్ఫ‌రెన్స్ ఆన్ సైబ‌ర్ స్పేస్ కార్య‌క్ర‌మం కోసం మీ అందరినీ న్యూ ఢిల్లీ కి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇంట‌ర్ నెట్ మాధ్యమం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి ఈ కార్య‌క్ర‌మంలో భాగం పంచుకొంటున్న వారంద‌రికీ కూడా ఇదే నా స్వాగతం.

మిత్రులారా,

సైబ‌ర్ స్పేస్ గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌పంచాన్ని ఎలా మార్చివేసిందీ మనంద‌రికీ ఎరుకే. ఇక్క‌డ గుమికూడిన స‌మూహంలో సీనియ‌ర్ తరం వారు 70వ మ‌రియు 80వ ద‌శ‌కాల నాటి భారీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూట‌ర్ సిస్ట‌మ్ లను ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోగ‌ల‌రు. ఆనాటి నుండి ఎన్నో మార్పులు చోటు చేసుకొన్నాయి. ఇ-మెయిల్ మ‌రియు ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు 90వ ద‌శకంలో ఒక కొత్త విప్ల‌వాన్ని తీసుకువ‌చ్చాయి. అటు త‌రువాత సోష‌ల్ మీడియా రంగ ప్ర‌వేశం చేసింది; స‌మాచారాన్ని నిల్వ చేసేందుకు మ‌రియు కమ్యూనికేష‌న్ కోసం మొబైల్ ఫోన్ ఓ ముఖ్య‌మైన వాహ‌కం అయి కూర్చొంది. ఇంట‌ర్‌నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ల వంటివి ప్ర‌స్తుతం స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. మార్పు అనేది కొన‌సాగుతూ ఉంటుంద‌ని, బ‌హుశా ఇప్పుడు ఇది మ‌రింత వేగంగా చోటు చేసుకొంటుంద‌ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

డిజిట‌ల్ డ‌మేన్ లో తెర మీదకు వ‌చ్చిన ఈ శీఘ్ర ప‌రిణామాలు భార‌త‌దేశం లో సైతం గొప్ప ప‌రివ‌ర్త‌నకు అద్దం ప‌ట్టాయి. భార‌త‌దేశం లోని ఐటి ప్ర‌తిభావంతుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ల‌భించింది. భార‌తీయ ఐటి కంపెనీలు ప్ర‌పంచంలో తమకంటూ ఒక పేరును సంపాదించుకొన్నాయి.

ఇవాళ డిజిట‌ల్ సాంకేతిక‌త ఒక గొప్ప కార్య సాధ‌కంగా అవ‌త‌రించింది. ఇది ప‌రిపాల‌న‌కు మ‌రియు సేవ‌ల అంద‌జేత‌కు రాచ మార్గాన్ని ఏర్ప‌ర‌చింది. విద్య‌ మొద‌లుకొని ఆరోగ్యం వ‌ర‌కు విస్త‌రించిన ప‌లు డ‌మేన్ ల‌లో దీటైన సేవ‌ల ల‌భ్య‌త‌కు ఇది బాటను వేసింది. అంతేకాదు, ఆర్థిక వ్య‌వ‌స్థ యొక్క మరియు వ్యాపారం యొక్క భ‌విత‌వ్యాన్ని రూపుదిద్ద‌డంలో ఇది స‌హాయ‌కారిగా కూడా ఉంది. ఇన్ని ర‌కాలుగా ఇది స‌మాజంలో త‌క్కువ సౌక‌ర్యాల‌ను అనుభ‌విస్తున్న వ‌ర్గాల వారికి మ‌రింత స‌మాన‌మైన‌ అవ‌కాశాల‌ను ప్ర‌సాదిస్తోంది. స్థూలంగా చూసిన‌ప్పుడు, ఇది ఒక సమతలమైన ప్ర‌పంచం ఆవిర్భావానికి దోహ‌దించింది. అది ఎటువంటి ప్ర‌పంచం అంటే, భార‌త‌దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల‌తో స‌మాన స్థాయిలో పోటీ ప‌డ‌గ‌లిగే ప్ర‌పంచం అన్న మాట‌.

మిత్రులారా,

సాంకేతిక‌త అనేది అడ్డుగోడ‌ల‌ను తునాతున‌క‌లు చేస్తుంది. ఇది ‘‘వసుధైవ కుటుంబ‌కమ్’’ (అంటే.. జ‌గ‌మంతా ఒక ప‌రివారం)- అని బోధించే భార‌తీయ త‌త్వ‌శాస్త్రాన్ని ప్రామాణికం చేస్తున్నట్లు మేం న‌మ్ముతున్నాం. ఈ భావ‌న‌ మా పురాత‌న, స‌మ్మిళిత సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తోంది. సాంకేతిక విజ్ఞానం ద్వారా మేం ఈ భావ‌న‌కు సార్ధ‌క‌త‌ను ఇవ్వ‌గలిగాం; అలాగే, ఉత్త‌మ ప్ర‌జాస్వామిక విలువ‌ల‌కు సైతం సార్ధ‌క‌త‌ను జోడించ‌గ‌లిగాం.

భార‌త‌దేశంలో మేం సాంకేతిక విజ్ఞానం యొక్క మాన‌వీయ పార్శ్వానికి పెద్ద పీట వేస్తాం. మరి అలాగే దీనిని మేం ‘జీవ‌న స‌ర‌ళ‌త’కు మెరుగులు దిద్ద‌డానికి కూడా వినియోగిస్తాం. భార‌త ప్ర‌భుత్వం డిజిట‌ల్ ఏక్సెస్ ద్వారా సాధికారిత అనే ల‌క్ష్యానికి నిబ‌ద్ధురాలైంది. ‘‘డిజిట‌ల్ ఇండియా’’ అనేది ప్ర‌పంచంలోనే అతి పెద్ద సాంకేతిక‌త ప్ర‌ధానమైనటువంటి ప‌రివ‌ర్త‌న కార్య‌క్ర‌మం. ఈ కార్య‌క్ర‌మం మా పౌరులు డిజిట‌ల్ సేవ‌ల‌ను అందుకొనేందుకు మార్గాన్ని సుగ‌మం చేస్తోంది. మేం మొబైల్ ప‌వ‌ర్ లేదా ఎమ్‌-ప‌వ‌ర్ ను మా పౌరుల సాధికారితకై వినియోగిస్తున్నాం.

ఒక వ్య‌క్తి తాలూకు విశిష్టమైన బ‌యోమెట్రిక్ గుర్తింపు అయిన‌టువంటి ‘ఆధార్’ ను గురించి మీలో చాలా మంది ఇప్ప‌టికే తెలుసుకొనివుండి ఉంటార‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ గుర్తింపును ఉప‌యోగించుకొని మా ప్ర‌జ‌ల‌ను చేంతాడు వ‌రుస‌ల బారి నుండి మ‌రియు భార‌మైన ప్ర‌క్రియ‌ల బారి నుండి విముక్తుల‌ను చేశాం. మూడు అంశాలున్నాయి: వాటిలో ఒక‌టోది, మా యొక్క జ‌న్- ధ‌న్ బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక సేవ‌ల‌ను అంద‌రికీ చేరువ చేయడం; రెండో అంశంగా ‘ఆధార్’ వేదిక‌ నిర్మాణం; మూడో అంశ‌ం మొబైల్ ఫోన్.. ఇవి అవినీతిని త‌గ్గించ‌డంలో ఎంత‌గానో సాయ‌ప‌డ్డాయి. ఈ మూడు అంశాల‌ను మేం జె.ఎ.ఎమ్ లేదా ‘జామ్’ త్ర‌యం అని పిలుచుకొంటున్నాం. స‌బ్సిడీలు వాటిని ఉద్దేశించిన వర్గాలకు మాత్రమే అందేటట్టు ‘జామ్’ త్రయం చూస్తూ, ఇంతవరకు దాదాపు 10 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయిలో లీకేజీల‌ను అడ్డుకొంది.

డిజిట‌ల్ టెక్నాల‌జీ అనేది ‘‘సుల‌భ‌మైన రీతిలో జీవించ‌డాన్ని’’ సానుకూలపరచడంలో ఎంతటి ఘనమైన సమన్వయకర్తగా ఉందో కొన్ని ఉదాహ‌ర‌ణల ద్వారా మీకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తాను.

ఇవాళ ఒక వ్యవసాయదారు భూసార పరీక్ష ఫలితాలను తెలుసుకొనేందుకు, నిపుణుడి స‌ల‌హా తీసుకొనేందుకు, త‌న పంట‌కు మంచి ధ‌ర‌ను పొందేందుకు.. ఇలా ప‌లు ర‌కాల సేవ‌ల‌ను కేవలం ఒక బటన్ ను నొక్కినంత మాత్రాననే అందుకోగలుగుతాడు. అంటే, ఈ విధంగా డిజిట‌ల్ టెక్నాల‌జీ వ్య‌వ‌సాయ‌ సంబంధ ఆదాయం పెర‌గ‌డానికి త‌న వంతు పాటు ప‌డుతోందన్న మాట.

ఒక చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త ప్ర‌భుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (Government e-Marketplace) లో త‌న పేరును న‌మోదు చేసుకోవ‌డం, త‌ద్వారా వ‌స్తువుల‌ను స్ప‌ర్ధాత్మ‌క బిడ్ ద్వారా ప్ర‌భుత్వానికి స‌ర‌ఫ‌రా చేయ‌డం సాధ్యమే. అత‌డు త‌న వ్యాపారాన్ని విస్త‌రించిన కొద్దీ, ప్ర‌భుత్వ సేక‌ర‌ణ ధ‌ర‌ను త‌గ్గించేందుకు కూడా కృషి చేస్తున్నాడ‌న్న మాటే. ఇది సామ‌ర్ధ్యాన్ని పెంపొందింప జేయ‌డంతో పాటు, ప్ర‌జా ధ‌నానికి మ‌రింత అధిక విలువ‌ జతపడటానికి దోహదిస్తుంది.

పింఛ‌న్ దారులు ఇక‌ మీదట వారు జీవించి ఉన్న‌ట్లుగా రుజువు చేసుకోవ‌డం కోసం ఒక బ్యాంకు అధికారి ఎదుట హాజ‌రు కానక్కర లేదు. ఇవాళ, ఒక పెన్ష‌న‌ర్ క‌నీస స్థాయి భౌతిక ప్ర‌య‌త్నం ద్వారా అంటే ఆధార్ బ‌యోమెట్రిక్ ప్లాట్ ఫార్మ్ ను వినియోగించుకోవడం ద్వారా ఈ విధ‌మైన రుజువును సమకూర్చేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

ఐటి శ్రామికుల‌లో మ‌హిళ‌లు చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఉన్నారు. డిజిట‌ల్ టెక్నాల‌జీ మ‌హిళ‌ల ఆధ్వ‌ర్యంలో అనేక నూత‌న సంస్థ‌లు నిర్వ‌హించబ‌డ‌డానికి బాట వేసింది. ఈ ర‌కంగా ఐటి రంగం మ‌హిళ‌లు, పురుషులు అనే తేడా లేకుండా పౌరుల సాధికారితకు త‌న వంతు తోడ్పాటును అందించింది.

భార‌త‌దేశం లోని పౌరులు న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను జ‌ర‌ప‌డం పెరుగుతోంది. ఇందుకోసం మేం ‘భార‌త్ ఇంట‌ర్ ఫేస్ ఫ‌ర్ మ‌నీ’ లేదా బిహెచ్ఐఎమ్ యాప్ (Bharat Interface for Money – or BHIM App) ను రూపొందించాం. త‌క్కువ స్థాయి న‌గ‌దుతో కూడిన మ‌రియు అవినీతి ర‌హిత స‌మాజం దిశ‌గా పురోగ‌మించేందుకు ఈ యాప్ తోడ్ప‌డుతోంది.

పాల‌న‌ను మెరుగుప‌ర‌చ‌డంలో సాంకేతిక విజ్ఞానం యొక్క శ‌క్తిని ఈ ఉదాహ‌ర‌ణ‌లు చాటి చెబుతున్నాయి.

మిత్రులారా,

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని స‌మ‌న్వ‌య ప‌ర‌చ‌డం కోసం మేం డిజిట‌ల్ డ‌మేన్ ను ఉప‌యోగించుకొంటున్నాం. 2014 మే నెల‌లో మేం పాల‌న ప‌గ్గాల‌ను స్వీక‌రించిన‌ప్పుడు, చాలా మంది- మ‌రీ ముఖ్యంగా యువ‌త‌రం- వారి ఆలోచ‌న‌ల‌ను పంచుకొని, దేశం కోసం ప‌ని చేయాల‌న్న అభిమ‌తాన్ని వ్య‌క్తం చేశారు. ల‌క్ష‌లాది భార‌తీయుల మ‌స్తిష్కంలో జ‌నించిన ఆలోచ‌న‌లు భార‌త‌దేశాన్ని నూత‌న శిఖ‌రాల‌కు చేర్చ‌డంలో ఎంత‌గానో స‌హ‌క‌రించ‌గ‌ల‌వ‌న్నది మ దృఢ విశ్వ‌ాసం.

ఈ కార‌ణంగా మైగ‌వ్ (MyGov) పేరుతో పౌరుల ప్ర‌మేయం ఉండేట‌టువంటి ఒక పోర్ట‌ల్ ను మేం తీసుకువ‌చ్చాం. ఈ వేదిక పౌరుల‌కు ముఖ్య‌మైన అంశాల‌పై వారి వారి ఆలోచ‌న‌ల‌ను, అభిప్రాయాల‌ను వెల్ల‌డి చేసేందుకు వీలు క‌ల్పిస్తుంది. ఎన్నో కీల‌క‌మైన విధాన సంబంధ అంశాల‌పై మాకు వేల సంఖ్య‌లో విలువైన సూచ‌న‌లు అందాయి. ఈ రోజు వివిధ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల అధికార చిహ్నాల ఆకృతులు ‘మైగ‌వ్’ లో ప్ర‌క‌టించిన పోటీలకు స్పందనగాను మ‌రియు ప్ర‌జ‌ల నుండి వ‌చ్చినటువంటి స‌ల‌హాల ప‌ర్య‌వ‌సాన‌మే. నిజానికి ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం యొక్క ఆధికారిక యాప్ కూడా ‘మైగ‌వ్’ లో నిర్వ‌హించిన ఒక పోటీకి యువ‌త‌రం నుండి వెల్లువెత్తిన సూక్ష్మ బుద్ధి గ‌ల స‌మాధానాల నుండి రూపుదిద్దుకొన్న‌దే. సాంకేతిక విజ్ఞానం అనేది ప్ర‌జాస్వామ్యాన్ని ఎలా బ‌లోపేతం చేయ‌గ‌లుగుతుంది అన్న దానికి మైగ‌వ్ ఒక ప్ర‌ధాన‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.

మీకు మ‌రొక ఉదాహ‌ర‌ణను గురించి చెబుతాను. నా ప‌ద‌వీ స్వీకారానంత‌రం ముఖ్య‌మైన ప్ర‌భుత్వ ప‌థ‌కాలు మ‌రియు కార్య‌క్ర‌మాలు ప్ర‌భుత్వం ప‌నితీరులో అన‌వ‌స‌రపు అడ్డుగోడ‌ల కారణంగాను మ‌రియు శ్ర‌ద్ధ లోపించినటువంటి నిర్ణ‌యాల వ‌ల్లనూ పురోగమించలేకపోతున్నాయ‌న్న సంగ‌తిని గ్ర‌హించాను. దీనితో సైబ‌ర్ స్పేస్ ప్రాతిప‌దిక‌గా ప‌నిచేసే ఒక వేదిక‌ను మేం రూపొందించాం. దీనికి ప్రొ-యాక్టివ్ గ‌వర్నెన్స్ ఫ‌ర్ టైమ్ లీ ఇంప్లిమెంటేష‌న్ లేదా ప్ర‌గ‌తి (PRAGATI) అని పేరు పెట్టాము. ఈ ‘ప్ర‌గ‌తి’ అనే మాట‌కు హిందీ భాషలో పురోగ‌తి అనే అర్థం వస్తుంది.

ప్ర‌తి నెల ఆఖ‌రి బుధ‌వారం నాడు నేను కేంద్ర ప్రభుత్వం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల లోని ఉన్న‌తాధికారుల‌తో ‘ప్ర‌గ‌తి’ స‌మావేశం పేరిట భేటీ అవుతున్నాను. సాంకేతిక విజ్ఞానం ప్ర‌తిబంధ‌కాల‌ను ఛేదిస్తుంది. మేం మా కార్యాల‌యాల‌లోనే కూర్చొని సైబ‌ర్ వ‌ర‌ల్డ్ స‌హ‌కారంతో ముఖ్య‌మైన పాల‌న సంబంధ స‌మ‌స్య‌ల‌ను గురించి చ‌ర్చించి, వాటిని ప‌రిష్క‌రిస్తున్నాం. ‘ప్ర‌గ‌తి’ స‌మావేశాలు దేశ ప్ర‌జ‌ల విశాల హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకాభిప్రాయం ద్వారా త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి అండ‌గా నిలచాయ‌ని మీకు తెలియ‌జేయ‌డం నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కాల‌యాప‌న‌కు లోనైన కోట్లాది డాల‌ర్ల విలువైన అవ‌స్థాప‌న ప్రాజెక్టుల‌ను గురించి ‘ప్ర‌గ‌తి’ ఆరాలు తీసి, వాటిని గాడిన‌ పెట్ట‌గ‌లిగింది.

స్వ‌యంగా నేను కూడా Narendra Modi Mobile App ద్వారా ఎంతో కొంత ప్ర‌య‌త్నం చేశాను. ఈ యాప్ దేశ ప్ర‌జ‌ల‌తో నా అనుసంధానాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగుప‌రుస్తోంది. ఈ యాప్ లో నాకు అందే సూచ‌న‌లు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటున్నాయి.

ఇవాళ, ఉమంగ్ (UMANG) మొబైల్ యాప్ ను మేం ప్రారంభించాము. ఇది 100కు పైగా పౌర ప్ర‌ధానమైనటువంటి సేవ‌ల‌ను అంద‌జేయ‌గ‌లుగుతుంది. బ్యాక్- ఎండ్ లో, ఈ విధ‌మైన సేవ‌ల‌ను కేంద్ర ప్రభుత్వం మ‌రియు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ లోని అనేక వేరు వేరు విభాగాలు అంద‌జేస్తాయి. ఈ స‌మీకృత వైఖ‌రి ఈ విభాగాల ప‌నితీరుకు ‘పియ‌ర్ పెర్‌ఫార్మెన్స్ ప్రెజర్‌’ అనే ఒక ఆటోమేటిక్ లేయర్ ను జోడించగలుగుతుంది.

మిత్రులారా,

మేం మా యొక్క అనుభ‌వాల‌ను మ‌రియు విజ‌య గాథ‌ల‌ను ప్ర‌పంచ స‌ముదాయంతో పంచుకోవ‌డానికి ఆనందిస్తున్నాం. మ‌రో వైపు భార‌త‌దేశం డిజిట‌ల్ టెక్నాల‌జీని ఉప‌యోగించుకొని విద్య మ‌రియు ఆరోగ్యం రంగాల‌లో కొత్త కొత్త ప‌రిష్కారాల‌ను మ‌రియు సాధించ‌ద‌గిన‌ న‌మూనాల‌ను అన్వేషించాల‌ని భార‌త‌దేశం ఆతృత‌తో ఉంది. దివ్యాంగ జనుల కోసం ఉప‌యోగ‌ప‌డే ఒక సాధ‌నంగా సైబ‌ర్ స్పేస్ ను వినియోగించుకోవాల‌ని మేం కోరుకొంటున్నాం. ఇటీవ‌ల 36 గంట‌ల పాటు సాగిన హ్యాక‌థ‌న్ లో క‌ళాశాల విద్యార్థులు పాలుపంచుకొని సుదీర్ఘ కాలంగా అటక మీదే ఉండిపోయిన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను సూచించారు; ఆ పరిష్కార మార్గాలను ఆయా మంత్రిత్వ శాఖ‌ల దృష్టికి తీసుకువెళ్ళ‌డం జ‌రిగింది. ప్ర‌పంచ దేశాల అనుభ‌వాల నుండి మ‌రియు ఉత్త‌మ‌మైన అభ్యాసాల నుండి పాఠాలు నేర్చుకోవాల‌ని మేం ఎదురుచూస్తున్నాం. మ‌నమంతా క‌లసి ఎదిగిన‌ప్పుడే, వృద్ధి చోటు చేసుకోగలదని మా విశ్వాసం.

న‌వ‌క‌ల్ప‌న‌కు సైబ‌ర్ స్పేస్ ఒక కీల‌క‌మైన క్షేత్రంగా ఉంటుంది. మా దేశంలోని స్టార్ట్-అప్ లు ఇవాళ సామాన్య ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను అందించాల‌ని ప్ర‌యత్నిస్తున్నాయి. ప్ర‌జ‌ల జీవితాల‌లో మెరుగుద‌ల తీసుకురావాల‌ని అవి చూస్తున్నాయి. భార‌త‌దేశ స్టార్ట్-అప్ ల రాశికి ఉన్న అనంత శక్తిసామర్థ్యాలను ప్ర‌పంచ పెట్టుబ‌డి స‌ముదాయం గుర్తించి ముంద‌డుగు వేస్తుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది. ఈ రంగంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌ల‌సిందిగాను, మ‌రియు భార‌త స్టార్ట్-అప్ ల విజ‌య గాథ‌లో భాగం పంచుకోవ‌ల‌సిందిగాను మిమ్మ‌ల్ని నేను ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా,

ఇంట‌ర్ నెట్ అనేది స్వాభావికంగా స‌మ్మిళిత‌మైన మాధ్య‌మం. అంతేగాని ఇది స్వీయ‌మైన‌ది కాదు. ఇది ల‌భ్య‌త‌ను సమంగా అందజేస్తుంది; సమానావ‌కాశాల‌నూ ఇవ్వజూపుతుంది. ఇవాళ ఫేస్ బుక్‌, ట్విట‌ర్‌, ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ల‌ను వాడుతున్న వారే లోకం పోక‌డ‌ను తీర్చిదిద్దుతున్నారు. సైబ‌ర్ స్పేస్ ను అందరికీ భాగం ఉండేట‌ట్లుగా సామాజిక మాధ్య‌మాల వేదిక‌లు త‌యారు చేస్తున్నాయి. స్టుడియోల నుండి నిపుణులు మ‌న‌కు అందించే వార్త‌లకు సోష‌ల్ మీడియా లోని అనుభూతులు పూర‌కంగా ఉంటున్నాయి. ఈ ప‌రివ‌ర్త‌న సైబ‌ర్ వ‌ర‌ల్డ్ చలవే. యువ‌తీయువ‌కులు వారి సృజ‌నాత్మ‌క‌త‌ను, శ‌క్తియుక్తుల‌ను చాటి చెప్ప‌డానికి- అది ఒక అంత‌ర్ దృష్టితో కూడిన బ్లాగ్ కావ‌చ్చు, ఒక వీనుల‌విందైన సంగీత ఆలాప‌న కావ‌చ్చు, కళాకృతి కావ‌చ్చు, లేదా ఒక రంగ‌స్థ‌లం కావ‌చ్చు.. వీటికి ఆకాశమే హద్దు- ఆద‌ర్శ‌ప్రాయ‌ వేదిక‌గా ఇంట‌ర్ నెట్ త‌యారైంది.

మిత్రులారా,

‘‘మ‌న్నికైన అభివృద్ధి కోసం భ‌ద్ర‌మైన మ‌రియు స‌మ్మిళిత‌మైన సైబ‌ర్ స్పేస్’’.. ఇదీ ఈ స‌మావేశం యొక్క ఇతివృత్తం. మాన‌వాళికి చెందిన ఈ కీల‌క‌మైన ఆస్తిని కాపాడుకోవ‌ల‌సిన ప్రాముఖ్య‌త‌ను ఇది విడ‌మ‌ర‌చి చెబుతోంది. సైబ‌ర్ సెక్యూరిటీ అంశాన్ని విశ్వాసంతో, సంక‌ల్పంతో స‌మీపించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ప్ర‌పంచ స‌ముదాయానికి ఎంతైనా ఉంది. సైబ‌ర్ స్పేస్ టెక్నాల‌జీలు మ‌న ప్ర‌జ‌ల‌కు అధికారమిచ్చేవిగా ఉండి తీరాలి.

దాపరికం లేని మ‌రియు అంద‌రికీ అందుబాటులో ఉండే ఇంట‌ర్ నెట్ కోసం సాగే అన్వేష‌ణ త‌ర‌చుగా దాడికి దారితీయ‌వ‌చ్చు. వెబ్‌సైట్ ల హ్యాకింగ్ మరియు వికృతీక‌ర‌ణ ఉదంతాలు మంచుకొండ కు కొన వంటివి మాత్ర‌మే. అవి సైబ‌ర్ ఎటాక్స్ ఒక ప్ర‌బల‌మైన బెద‌రింపు అనే సంగతిని సూచిస్తున్నాయి. మ‌న స‌మాజంలోని దుర్భ‌ల వ‌ర్గాలు సైబ‌ర్ క్రిమిన‌ల్స్ యొక్క దురాగ‌తాలకు బ‌లి కాకుండా మ‌నం జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. సైబ‌ర్ సెక్యూరిటీ స‌మ‌స్య‌ల ప‌ట్ల అప్ర‌మ‌త్త‌త అనేది ఒక జీవన విధానంగా మారాలి.

సైబ‌ర్ థ్రెట్స్ కు ఎదురొడ్డ‌డానికి స‌ర్వ స‌మ‌ర్థులైన, ద‌క్ష‌త క‌లిగిన నిపుణులకు శిక్ష‌ణ‌ను ఇవ్వ‌డం అనేది మ‌నం శ్ర‌ద్ధ వ‌హించవ‌ల‌సిన ప్ర‌ధాన రంగాల‌లో ఒక రంగం. సైబ‌ర్ ఎటాక్స్‌ ప‌ట్ల క‌నురెప్ప వాల్చ‌కుండా ఉండే వారే సైబ‌ర్ వారియ‌ర్లు. ‘‘హ్యాకింగ్’’ అనే మాట ఉత్తేజ‌క‌ర‌మైన‌, ఆఖ‌రికి సందేహ పూరిత‌మైన ఒక ఉన్న‌త స్వ‌రాన్ని సంతరించుకొని ఉంటే ఉండ‌వ‌చ్చు. మ‌నం సైబ‌ర్ ప్రొటెక్ష‌న్ ను యువ‌త‌కు ఒక ఆక‌ర్ష‌ణీయ‌మైన మ‌రియు లాభ‌దాయ‌క‌మైన వృత్తి మార్గంగా తీర్చిదిద్ద‌వ‌ల‌సివుంది.

సాపేక్షంగా చూసిన‌ప్పుడు, డిజిట‌ల్ క్షేత్రం ఉగ్ర‌వాదం మ‌రియు స‌మూల సంస్క‌ర‌ణ‌వాదం అనే అంధ‌కార శ‌క్తుల ఆట మైదానంగా మార‌కుండా చూసే బాధ్య‌త‌ను ప్ర‌భుత్వాలు కూడా భుజాన వేసుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్న బెద‌రింపుల చిత్ర ప‌టాన్ని చెరిపివేయ‌డానికి భ‌ద్ర‌త సంస్థ‌లు స‌మాచారాన్ని త‌మ‌లో తాము పంచుకొంటూ ఉండటంతో పాటు ఆ స‌మాచారాన్ని స‌మ‌న్వ‌యప‌ర‌చుకోవ‌డం కూడా అత్య‌ంత అవ‌సరం.

మ‌నం ఒక‌వైపు గోప్య‌త‌ మ‌రియు స్ప‌ష్ట‌త‌లకు, మ‌రో వైపు జాతీయ భ‌ద్ర‌త కు మ‌ధ్య స‌రి అయినటువంటి తూకాన్ని సాధించ‌గలమనే నేను భావిస్తున్నాను. మ‌న‌మందరం క‌లిస్తే, ఒక‌ ప‌క్క ప్ర‌పంచ వ్యవస్థలు మరియు దాప‌రికం లేని వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య, మ‌రియు మ‌రో పక్క దేశాల‌ వారీ న్యాయ స‌మ్మ‌త నిబంధ‌న‌ల‌కు మ‌ధ్య ఉన్నటువంటి వ్య‌త్యాసాల‌ను అధిగ‌మించ‌డం సాధ్యపడే విషయమే.

మిత్రులారా,

పెల్లుబుకుతున్న డిజిట‌ల్ సాంకేతిక ధోర‌ణులు మ‌న భ‌విష్య‌త్తును ఏ విధంగా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌వు అన్న‌ దానిపైన మ‌నం ఇప్పుడే ఒక అంచ‌నాకు రాలేం. పార‌ద‌ర్శ‌క‌త్వానికి, గోప్య‌త‌కు, విశ్వాసానికి, ఇంకా భ‌ద్ర‌త‌కు సంబంధించిన ముఖ్య‌మైన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను రాబ‌ట్టాల్సివుంది. డిజిట‌ల్ సాంకేతిక విజ్ఞానం మాన‌వాళిని సాధికారప‌ర‌చ‌డానికి తోడ్ప‌డేట‌టువంటిదే. అది ఆ విధంగానే ఉండేలా మ‌నం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఈ కార్య‌క్ర‌మంలో సంబంధిత వ‌ర్గాల‌ వారు పెద్ద సంఖ్య‌లో పాలుపంచుకోవ‌డం ఈ వేదిక ద‌క్కించుకొన్న ప్ర‌పంచ స్థాయి ఆమోదానికి ఒక నిద‌ర్శ‌నం. వివిధ దేశాలు, ప‌రిశ్ర‌మ మేధావి లోకం, పౌర స‌మాజం.. ఇవ‌న్నీ క‌లిసిక‌ట్టుగా ఒక సంఘ‌టితమైన, సాముదాయికమైన చ‌ట్రాన్ని నిర్మించే దిశ‌గా కృషి చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. ఈ ప‌ని చేసిన‌ప్పుడు, జీవన నాణ్య‌త‌కు మెరుగులు దిద్దేట‌టువంటి ఒక భ‌ద్ర‌మైన సైబ‌ర్ స్పేస్ త‌ప్ప‌క రూపు దాల్చ‌గ‌లుగుతుంది.

మిత్రులారా,

ఈ స‌మావేశం బ‌హుశా సభికుల హాజ‌రు ప‌రంగా చూసిన‌ప్పుడు ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మాల‌లో కెల్లా అతి పెద్ద‌ది కావ‌చ్చు. పూర్వ‌రంగం లోని అన్ని అంశాలతో పాటు లాజిస్టిక్స్ ను డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించిన‌ట్లు నా దృష్టికి తీసుకువ‌చ్చారు. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసిన ప్ర‌తినిధులు దీనిని ఒక సాఫీగా సాగేట‌టువంటి మ‌రియు అంత‌రాయాల‌కు తావులేనిటువంటి అనుభూతిని పొందుతార‌ని నేను ఆశిస్తున్నాను.

మీ చ‌ర్చోప‌చ‌ర్చ‌లు నిర్మాణాత్మ‌కంగా సాగి ఫ‌ల‌ప్ర‌ద‌మైన ఫ‌లితాలను అందిస్తాయ‌ని ఆశిస్తూ, నేను నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను. మ‌రొక్క‌మారు మీకు నేను స్వాగ‌తం ప‌లుకుతూ, ఈ స‌మావేశం జ‌య‌ప్ర‌దం కావాల‌ని అభిల‌షిస్తున్నాను.

మీ కంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
This is the New India that leaves no stone unturned for development: PM Modi
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!