ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బ‌న్ సాగ‌ర్ కాలువ ప‌థ‌కాన్ని ఈ రోజు మిర్జాపుర్ లో దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఈ ప‌థ‌కం ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని ఆ ప్రాంతం లో నీటిపారుద‌ల కు గొప్ప ద‌న్నుగా నిల‌వ‌డ‌ంతో పాటు మిర్జాపుర్ మ‌రియు అల‌హాబాద్ జిల్లాల రైతుల‌కు ఎంత‌గానో లాభ‌దాయ‌కంగా ఉండబోతోంది.

|

శ్రీ న‌రేంద్ర మోదీ మిర్జాపుర్ వైద్య క‌ళాశాల కు పునాదిరాయి ని వేశారు. ఆయన రాష్ట్రం లో 100 జ‌న్ ఔష‌ధి కేంద్రాల‌ను ప్రారంభించారు. మిర్జాపుర్ మ‌రియు వారాణ‌సీ ల మ‌ధ్య సంధానానికి దోహదం చేసే ఒక సేతువు ను గంగా నది మీద నిర్మించగా, చునార్ లోని బాలూ ఘాట్ వ‌ద్ద ఆ సేతువును ఆయన దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

|

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, మిర్జాపుర్ ప్రాంతంలో గొప్ప అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. క్రితం సారి ఒక సోలర్ ప్లాంటు ను ప్రారంభించడం కోసం ఫ్రాన్స్ అధ్య‌క్షులు శ్రీ మేక్రాన్ తో క‌ల‌సి తాను మిర్జాపుర్ ను సంద‌ర్శించిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు కు తెచ్చుకున్నారు.

గ‌డ‌చిన రెండు రోజుల‌ లోను తాను ప్రారంభించిన/ శంకుస్థాప‌న చేసిన వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

|

బ‌న్ సాగ‌ర్ ప‌థ‌కం తొలుత దాదాపు నాలుగు ద‌శాబ్దాల కింద‌ట నిర్మించాలని సంకల్పించార‌ని, 1978వ సంవ‌త్స‌రం లో దీనికి శంకుస్థాప‌న జరిగిందని, అయితే ఈ ప్రాజెక్టు నిష్కార‌ణంగా జాప్యానికి లోనైంద‌ని ఆయ‌న వివ‌రించారు. 2014వ సంవ‌త్స‌రం అనంత‌రం ఈ ప్రాజెక్టు ను ప్ర‌ధాన మంత్రి కృషి సించాయీ యోజ‌న లో భాగంగా స్వీక‌రించిన‌ట్లు, మ‌రి అలాగే దీనిని పూర్తి చేయ‌డానికి స‌క‌ల ప్ర‌య‌త్నాలు జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి చెబుతూ, ఇటీవల ఖ‌రీఫ్ పంట‌ల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను పెంచిన విష‌యాన్ని కూడా పేర్కొన్నారు.

|

జ‌న్ ఔష‌ధి కేంద్రాల‌తో సహా పేద‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను స‌మ‌కూర్చేందుకు తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి ఆయ‌న చెప్పుకొచ్చారు. స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ వ్యాధి నివార‌ణ‌ కు కూడా దీటు గా ప‌ని చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ఆరోగ్య హామీ ప‌థ‌కమైన ‘ఆయుష్మాన్ భార‌త్’ ను త్వ‌రలో ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం యొక్క ఇత‌ర సామాజిక సంక్షేమ ప‌థ‌కాల‌ను గురించి కూడా ఆయ‌న వివరించారు.

Click here to read full text speech

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Israel-Iran conflict: India launches ‘Operation Sindhu’to evacuate citizens from war-hit Iran; 110 Indian students return via Armenia

Media Coverage

Israel-Iran conflict: India launches ‘Operation Sindhu’to evacuate citizens from war-hit Iran; 110 Indian students return via Armenia
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 జూన్ 2025
June 18, 2025

Citizens Appreciate PM Modi’s Reforms Driving Economic Surge