We have set the aim to eradicate TB from India by 2025, says PM Modi
Today I'm confident that in the duration of 1 year we'll be able to achieve 90% immunisation: PM Modi at End TB Summit
Whether the mission of getting relief from TB is in India or in any country, frontline TB practitioners & workers have a large role: PM
Several ministers from all states & concerned officers are present in the event, indicate how we, as Team India, are determined to eradicate TB from India: PM at End TB Summit

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ‘‘ఎండ్ టిబి’’ శిఖ‌ర స‌మ్మేళ‌నం ప్రారంభ స‌ద‌స్సులో ప్ర‌సంగించారు.

క్ష‌యవ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించడంలో ది ఢిల్లీ ఎండ్ టిబి స‌మిట్ ఒక మైలురాయి వంటి కార్య‌క్ర‌మం కాగ‌ల‌ద‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఈ వ్యాధిని అంతమొందించే దిశ‌గా వేసే ప్ర‌తి అడుగూ పేద‌ల జీవితాల‌ను మెరుగుప‌ర‌చడంతో కూడాను ముడి పడి ఉంటుంది అని ఆయ‌న అన్నారు.

క్ష‌యవ్యాధిని 2030వ సంవ‌త్స‌రం కల్లా నిర్మూలించాలని ప్ర‌పంచం ల‌క్ష్యంగా పెట్టుకొందని, అయితే భార‌త‌దేశం మాత్రం 2025వ సంవ‌త్స‌రానికే ఈ ల‌క్ష్యాన్ని సాధించాల‌ని నిర్దేశించుకొంద‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. ఈ ల‌క్ష్యాన్ని సాధించేందుకు ప్ర‌భుత్వం సమగ్ర కృషిని చేపట్టినట్లు ఆయ‌న చెప్పారు. ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలకు కీల‌క‌మైన పాత్ర‌ ఉంద‌ని, మరి ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవ‌ల‌సిందిగా కోరుతూ ముఖ్య‌మంత్రులు అంద‌రికీ స్వ‌యంగా తాను లేఖ రాసినట్లు ఆయ‌న వెల్లడించారు.

క్ష‌యవ్యాధిని పార‌దోలే పనిలో ముందు వ‌రుస‌లో ఉండే టిబి వైద్యులు మ‌రియు కార్య‌క‌ర్త‌లు ఒక కీల‌క‌మైన పాత్ర‌ను పోషించాలని ప్ర‌ధాన మంత్రి స్పష్టంచేశారు. ఈ వ్యాధిని అధిగమించిన రోగులు ఇత‌రుల‌కు ప్రేర‌ణ‌గా కూడా నిలుస్తార‌ని ఆయ‌న అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆశించిన ల‌క్ష్యాల దిశ‌గా ప‌య‌నించ‌డంలో ఎంత వేగంగా వెళుతోందీ చాటి చెప్పేందుకు ప్ర‌ధాన మంత్రి ‘స్వ‌చ్ఛ్ భార‌త్’ మ‌రియు ‘మిష‌న్ ఇంద్ర‌ధ‌నుష్’ ల‌ను ఉదాహ‌ర‌ణ‌లుగా ప్రస్తావించారు.

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 07 ఆగష్టు 2026
August 07, 2026

Viksit Bharat Accelerating: 4x Data Centres, Record EV Sales, Ethanol Validation & Northeast Connectivity Under PM Modi’s Watch