క్రమ సంఖ్య

 

ఒప్పందం

 

శ్రీలంక ప్రతినిధి

 

భారత ప్రతినిధి

 

1

 

ఇరుదేశాల మధ్య విద్యుత్ సరఫరాకు సంబంధించి హెచ్‌వీడీసీ ఇంటర్‌కనెక్షన్ ఏర్పాటు కోసం భారత, శ్రీలంక ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం

 

ప్రొఫెసర్ కే.టి.ఎం. ఉదయంగ హేమపాల, కార్యదర్శి, ఇంధన మంత్రిత్వ శాఖ

 

శ్రీ విక్రమ్ మిస్రీ,

 

విదేశాంగ కార్యదర్శి

 

2

 

డిజిటల్ పరివర్తన‌ విషయంలో పూర్తి జనాభాకు ఉపయోగించుకునే విధంగా విజయవంతమైన డిజిటల్ పరిష్కారాలను పంచుకునేందుకు సహకారంపై భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ప్రభుత్వానికి చెందిన డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం.

 

శ్రీ వరుణ శ్రీ ధనపాల, తాత్కాలిక కార్యదర్శి, డిజిటల్ ఎకానమీ మంత్రిత్వ శాఖ 

 

శ్రీ విక్రమ్ మిస్రీ,

 

విదేశాంగ కార్యదర్శి

 

3

 

ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసే విషయంలో సహకారం కోసం భారత్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం.

 

ప్రొఫెసర్ కే.టి.ఎం. ఉదయంగ హేమపాల, కార్యదర్శి, ఇంధన మంత్రిత్వ శాఖ

 

శ్రీ విక్రమ్ మిస్రీ,

 

విదేశాంగ కార్యదర్శి

 

4

 

రక్షణ సహకారానికి సంబంధించి భారత్, శ్రీలంక ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం.

 

ఎయిర్ వైస్ మార్షల్ సంపత్ తుయకొంత (విశ్రాంత), కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖ

 

శ్రీ విక్రమ్ మిస్రీ,

 

విదేశాంగ కార్యదర్శి

 

5

 

శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌కు బహుళ రంగాల నిధుల సాయంపై అవగాహన ఒప్పందం.

 

శ్రీ కే.ఎం.ఎం సిరివర్దన, కార్యదర్శి.. ఆర్థిక, ప్రణాళిక, ఆర్థికాభివృద్ధి మంత్రిత్వ శాఖ

 

శ్రీ సంతోష్ ఝా, శ్రీలంకలో భారత హైకమిషనర్

 

6

 

ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ… శ్రీలంక ఆరోగ్య, మాస్ మీడియా మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం.

 

డాక్టర్ అనిల్ జాసింగే, కార్యదర్శి, ఆరోగ్యం, మాస్ మీడియా మంత్రిత్వ శాఖ

 

శ్రీ సంతోష్ ఝా, శ్రీలంకలో భారత హైకమిషనర్

 

7

 

ఫార్మాకోపీయల్ సహకారంపై భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన , ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్, శ్రీలంక ప్రభుత్వ నేషనల్ మెడిసిన్స్ రెగ్యులేటరీ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం.

 

డాక్టర్ అనిల్ జాసింగే, కార్యదర్శి, ఆరోగ్యం, మాస్ మీడియా మంత్రిత్వ శాఖ

 

శ్రీ సంతోష్ ఝా, శ్రీలంకలో భారత హైకమిషనర్

 

 

 

 

 

 

 

క్రమ సంఖ్య

 

ప్రాజెక్టులు

 

1

 

ఆధునీకరించిన మహో-ఒమంతై రైల్వే మార్గం ప్రారంభోత్సవం.

 

2

 

మహో-అనురాధపుర రైల్వే మార్గంలో సిగ్నలింగ్ వ్యవస్థ పనులకు శంకుస్థాపన

 

3

 

సంపూర్ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ కార్యక్రమం (వర్చువల్ పద్ధతిలో)

 

4

 

దంబుల్లాలో నియంత్రిత ఉష్ణోగ్రతలతో కూడిన గోదాం ప్రారంభోత్సవం (వర్చువల్ పద్ధతిలో)

 

5

 

శ్రీలంకవ్యాప్తంగా ఉన్న 5000 మతపరమైన సంస్థలకు సౌర విద్యుత్‌ రూఫ్ టాప్ వ్యవస్థల సరఫరా (వర్చువల్ పద్ధతిలో).

 

 

 

 

ప్రకటనలు:

 

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఏటా 700 మంది శ్రీలంక వాసులకు సమగ్ర సామర్థ్య పెంపు కార్యక్రమాన్ని భారత్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ట్రింకోమలీలోని తిరుకోనేశ్వరం ఆలయం, నువారా ఎలియాలోని సీతా ఎలియా ఆలయం, అనురాధపురలోని పవిత్ర నగర భవన సముదాయ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భారత నిధులను అందిస్తుంది. 2025 అంతర్జాతీయ వేసక్ దినోత్సవం సందర్భంగా శ్రీలంకలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన, అలాగే రుణ

పునర్నిర్మాణం విషయంలో సవరణ ఒప్పందాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలను పూర్తి చేయనున్నట్లు కూడా తెలిపారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties

Media Coverage

'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 04 ఆగష్టు 2026
August 04, 2026

From Auto PLI to Ramsar Sites: How India is Winning on Every Front Under PM Modi