ఆవిష్కరణ, చలనశీలత, స్థిరత్వం వేదికగా ఉమ్మడి అభివృద్ధి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ 2024 అక్టోబర్ 25న న్యూఢిల్లీలో ఏడో విడత భారత్-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) కు సహాధ్యక్షత వహించారు.భారత వైపు నుంచి రక్షణ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, కార్మిక, ఉపాధి, శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రులు, జర్మనీ వైపు నుంచి ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ కార్యాచరణ, విదేశీ వ్యవహారాలు, కార్మిక, సామాజిక వ్యవహారాలు, విద్య, పరిశోధన శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకా జర్మనీ వైపు నుంచి ఆర్థిక, పర్యావరణం, ప్రకృతి సంరక్షణ, అణు భద్రత, వినియోగదారుల రక్షణ, ఆర్థిక సహకారం,అభివృద్ధి శాఖల పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీలు, అలాగే ఇరు దేశాల నుంచి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. 


2. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌ను ఆయన మూడోసారి భారత్ పర్యటన సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతించారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలోనూ, మరింత లోతుగా పరిపుష్టం చేయడంలోనూ ఇరు దేశాల ప్రభుత్వ, పరిశ్రమ, పౌర సమాజం, విద్యా రంగాలలో ద్వైపాక్షిక సంబంధాల వేగాన్ని ఇరువురు నాయకులు ప్రశంసించారు. 

3. జర్మనీ, భారత్, మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం మధ్య ఆర్థిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఏడో ఐజీసీకి సమాంతరంగా జర్మన్ వాణిజ్యానికి సంబంధించి న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ జర్మన్ వాణిజ్య సదస్సు (ఎపికె) ప్రాముఖ్యతను ఇరువురు నేతలు వివరించారు. 2024 సదస్సును భారతదేశంలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం, ఇండో-పసిఫిక్, అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ రాజకీయ ప్రభావాన్ని స్పష్టంగా సూచిస్తోంది.

4. ‘ఆవిష్కరణ, చలనశీలత, సుస్థిరతతో కలిసి ఎదగడం’ అనే నినాదంతో ఏడో ఐజీసీ సాంకేతికత, ఆవిష్కరణ, కార్మిక శక్తి, ప్రతిభ, వలస, చలనశీలత వాతావరణ చర్యలు, హరిత, స్థిరమైన అభివృద్ధితో పాటు ఆర్థిక, రక్షణ, వ్యూహాత్మక సహకారంపై ప్రధానంగా దృష్టి సారించింది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అభివృద్ధి సహకారం, సంస్కృతి, విద్య, సుస్థిర చలనశీలత, సుస్థిర వనరుల నిర్వహణ, జీవవైవిధ్యం, వాతావరణ సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణ మొదలైనవి బహుముఖ భాగస్వామ్యానికి కీలక చోదకాలుగా ఉంటాయని ఇరు పక్షాలు అంగీకరిస్తున్నాయి.

5. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఆవిష్కరణలో భారత-జర్మన్ సహకారానికి మూలస్థంభంగా నిలిచిన ప్రభుత్వ స్థాయి ఒప్పందానికి ప్రస్తుత 2024 సంవత్సరంతో 50 ఏళ్లు పూర్తవుతాయి.  ఈ నేపథ్యంలో, ఏడో ఇండో-జర్మన్ కన్సల్టేషన్స్ భారత-జర్మనీ మధ్య సన్నిహిత సంబంధాలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని అందించడంతో పాటు, సహకారంలోని ముఖ్యమైన స్తంభంగా సాంకేతికత, ఆవిష్కరణల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. 

6. ఆరో ఇండో-జర్మన్ కన్సల్టేషన్స్ (ఐజిసి) సమయంలో, ఇరు ప్రభుత్వాలు హరిత, సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యాన్ని (జిఎస్డిపి) ప్రకటించాయి. ఇది ఈ రంగంలో ద్వైపాక్షిక కార్యక్రమాలు, సంయుక్త ప్రణాళికలకు ఒక గొడుగులా పని చేసింది. తదనంతరం, ఇరుపక్షాలూ 2022 డిసెంబరులో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం (ఎంఎంపిఎ) పై సంతకం చేశాయి. ఫిబ్రవరి 2023 లో "ఇన్నోవేషన్, టెక్నాలజీలో సహకారాన్ని పెంపొందించడానికి భారత్-జర్మనీ విజన్" కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఆరో ఐజిసి ఫలితాలను, ఆ తరువాత ఇరు పక్షాలు కుదుర్చుకున్న వివిధ ఒప్పందాల ఫలితాలను గుర్తు చేస్తూ, రెండు ప్రభుత్వాలు "ఇండియా-జర్మనీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ భాగస్వామ్య రోడ్ మ్యాప్" ను ప్రారంభించాయి. "ఇండో-జర్మన్ గ్రీన్ హైడ్రోజన్ రోడ్ మ్యాప్"ను ప్రవేశపెట్టాయి. గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ పెంపును ప్రోత్సహించడం, శాంతి, భద్రత, స్థిరత్వం కోసం కలిసి ఎదగడం దీని లక్ష్యం.

7. భవిష్యత్ కోసం ఒప్పందాన్ని గుర్తిస్తూ.. ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, అంతర్జాతీయ శాంతి, భద్రత, నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమంతో సహా భాగస్వామ్య విలువలు, సూత్రాలను నిలబెట్టడానికి తమ బలమైన నిబద్ధతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా, ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా శాంతి, సుస్థిరతలకు మద్దతు ఇవ్వడానికి, పరిరక్షించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత, శాశ్వతేతర సభ్యత్వ విభాగాల విస్తరణతో సహా బహుళపక్ష వ్యవస్థను బలోపేతం చేయడానికి, సంస్కరించడానికి రెండు ప్రభుత్వాలు తమ నిబద్ధతను స్పష్టం చేశాయి. నిర్ణీత గడువులోగా ఐజిఎన్ లో పాఠ్య ఆధారిత (టెక్స్ట్ బేస్డ్) చర్చలు జరపాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.


8. ప్రాంతీయ, ప్రపంచ సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పడుతున్న ఇబ్బందులు సంస్కరణల తక్షణ అవసరాన్ని బలంగా గుర్తు చేస్తాయని భారత్, జర్మనీ అంగీకరించాయి. 'గ్రూప్ ఆఫ్ ఫోర్ (జీ4)' లో సభ్యులుగా భారత్, జర్మనీలు 21వ శతాబ్దపు వాస్తవాలను ప్రతిబింబించే సమర్థమంతమైన, ప్రభావవంతమైన, పారదర్శకమైన భద్రతా మండలి కోసం తమ పిలుపును పునరుద్ఘాటించాయి.

9. ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం, దాని భయంకరమైన, విషాదకరమైన మానవతా పరిణామాలపై నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడంతో సహా ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతి అవసరాన్ని వారు పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆహార,ఇంధన భద్రతకు సంబంధించి ఉక్రెయిన్ లో యుద్ధం ప్రతికూల ప్రభావాలను ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ప్రభావాన్ని కూడా వారు గుర్తించారు. ఈ యుద్ధ సందర్భంలో, అణ్వాయుధాల వాడకం లేదా వాడతామనే బెదిరింపు ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయాన్ని వారు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ దేశం కూడా మరే ఇతర దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం లేదా రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగం లేదా బెదిరింపుల నుంచి దూరంగా ఉండాలని పునరుద్ఘాటించారు.

10. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతను సాధించేందుకు ఇరువురు నేతలు ఆసక్తి కనబరిచారు. అక్టోబర్ 7, 2023 నాటి హమస్ ఉగ్రవాద దాడులను వారు నిర్ద్వంద్వంగా ఖండించారు. గాజాలో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలు కోల్పోవడం, మానవతా సంక్షోభం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. హమస్ చెరలో ఉన్న బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని, తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని, గాజా అంతటా మానవతా సహాయాన్ని తక్షణమే మెరుగుపర్చాలని, మానవతా సహాయాన్ని నిరంతరం కొనసాగేలా చూడాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఘర్షణ తీవ్రతరం కాకుండా, విస్తరించకుండా నిరోధించాల్సిన అవసరాన్ని నేతలు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రాంతీయ దేశాలన్నీ బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పౌరుల ప్రాణాలను పరిరక్షించడం, పౌరులకు సురక్షితమైన, సకాలంలో, స్థిరమైన ఉపశమనాన్ని అందించేలా చూడాలని తక్షణ అవసరాన్ని స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని కోరాయి. లెబనాన్ లో శరవేగంగా క్షీణిస్తున్న పరిస్థితిపై కూడా నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే శత్రుత్వాన్ని నిలిపివేయాలని పిలుపునిచ్చారు. గాజా, లెబనాన్ లో సంఘర్షణకు దౌత్య మార్గాల ద్వారా మాత్రమే పరిష్కారం సాధ్యమనీ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1701 బ్లూ లైన్ వెంబడి దౌత్య పరిష్కారం దిశగా మార్గాన్ని వివరించింది. ఇజ్రాయెల్ చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని సార్వభౌమాధికార, ఆచరణీయ స్వతంత్ర పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుకు, సురక్షితమైన, పరస్పరం గుర్తించిన  సరిహద్దులలో నివసించేందుకు, ఇజ్రాయెల్ తో కలసి గౌరవం, శాంతితో సఖ్యతగా నివసించేందుకు దారి తీసే విధంగా రెండు దేశాల మధ్య చర్చల ద్వారా పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు ఇద్దరు నేతలు పేర్కొన్నారు. 

11. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా, బహుళ ధృవ ప్రపంచంలో భద్రత, శ్రేయస్సు సుస్థిర అభివృద్ధి కోసం భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయు) ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉన్నాయని నాయకులు తెలిపారు. భారత్- ఈయు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వారు స్పష్టం చేశారు. ఇది ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వాణిజ్యం, విశ్వసనీయ సాంకేతిక పరిజ్ఞానం, భద్రత వంటి కీలక రంగాల్లో సన్నిహిత సంబంధాలకు వినూత్న వేదికగా ఉపయోగపడే భారత్-ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ కు నేతలు తమ బలమైన మద్దతును తెలియజేశారు. భారత్, జర్మనీ, ఈయూ సభ్యులుగా ఉన్న ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ తో పాటు ఈయూ ఇనిషియేటివ్ గ్లోబల్ గేట్ వే సహా కీలక అనుసంధాన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ద్వైపాక్షికంగా, ఈయూ స్థాయిలో ప్రయత్నాలను సమన్వయం చేయడానికి వారు అంగీకరించారు.

12. యూరోపియన్ యూనియన్, భారత్ ల మధ్య సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల రక్షణ ఒప్పందం, భౌగోళిక సూచికల ఒప్పందాల కీలక ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, సంప్రదింపులను త్వరగా ముగించాలని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. 

13. ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని అన్ని రూపాల్లో, వ్యక్తీకరణల్లో ఇరువురు నేతలు నిర్ద్వంద్వంగా ఖండించారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని ఇరు పక్షాలు అంగీకరించాయి.  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) 1267 ఆంక్షల కమిటీ నిషేధించిన గ్రూపులతో సహా అన్ని ఉగ్రవాద గ్రూపులపై సమష్టి చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాద స్థావరాలు, మౌలిక సదుపాయాలను నిర్మూలించడంతో పాటు ఉగ్రవాద వ్యవస్థలు, వాటికి నిధుల సరఫరా మార్గాలను భగ్నం చేసేందుకు అన్ని దేశాలూ కృషి చేయాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి.

14. ఉగ్రవాద అవసరాల కోసం మానవ రహిత విమాన వ్యవస్థల ఏర్పాటు, ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు వర్చువల్ ఆస్తులను ఉపయోగించడం, ఉగ్రవాద భావజాల వ్యాప్తి కోసం సమాచార, కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే పోకడల పట్ల ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 2022 లో భారతదేశంలో యుఎన్ సీటీసీ సమావేశాల నిర్వహణ సందర్భంగా ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త, ఆవిర్భావ టెక్నాలజీల వాడకాన్ని ఎదుర్కోవడంపై ఆమోదించిన ఢిల్లీ డిక్లరేషన్ ను వారు స్వాగతించారు.

15. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఈ విషయంలో ప్రపంచ సహకారవ్యవస్థను బలోపేతం చేయడానికి భాగస్వామ్య నిబద్ధతను ప్రకటిస్తూ, మనీలాండరింగ్ నిరోధంపై అంతర్జాతీయ ప్రమాణాలను నిలబెట్టాలని, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్)తో సహా అన్ని దేశాలు ఉగ్రవాదానికి దన్నుగా ఉన్న ఆర్థిక సహాయ మార్గాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవడం, ఉగ్రవాద నిరోధక ప్రయత్నాల సమన్వయం కోసం సంబంధిత మార్గాలను బలోపేతం చేయడానికి ఉగ్రవాద నిరోధక సంయుక్త వర్కింగ్ గ్రూప్ తో క్రమం తప్పకుండా సంప్రదింపులు నిర్వహించడానికి ఇరు పక్షాలూ తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఉగ్రవాద గ్రూపులు, వ్యక్తులపై ఆంక్షలు, హోదాలు, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదుల ఇంటర్నెట్ వాడకం, సీమాంతర ఉగ్రవాదుల కదలికల గురించిన సమాచార మార్పిడికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయి.

16. ఉగ్రవాదానికి సంబంధించిన నేరాలతో సహా నేరగాళ్లను నిరోధించడానికి, అణచివేయడానికి, దర్యాప్తు చేయడానికి, నేరగాళ్లను విచారించడానికి సన్నిహిత భాగస్వామ్యం కోసం భారత్, జర్మనీ నేర విషయాల్లో పరస్పర న్యాయ సహాయ ఒప్పందాన్ని (ఎంఎల్ఎటి) ఖరారు చేశాయి. ఇరు దేశాల మధ్య భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత్-జర్మనీ ఎంఎల్ఏటీ ఒక ముఖ్యమైన మలుపు అని, ఇది సమాచారం, ఆధారాలను పంచుకోవడం, పరస్పర సామర్థ్యాన్ని పెంపొందించడం, రెండు దేశాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి వీలు కల్పిస్తుందని ఇరువురు నాయకులు అంగీకరించారు.

17. భద్రతా సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంలో పరస్పర ఆసక్తి కలిగిన వ్యూహాత్మక భాగస్వాములుగా, వర్గీకృత సమాచారాన్ని మార్చుకోవడం, భద్రపరచుకోవడంపై రెండు పక్షాలు ఒప్పందాన్ని ముగించాయి, తద్వారా భారత్, జర్మన్ సంస్థల మధ్య సహాయసహకారాలకు చట్టపరమైన యంత్రాంగాన్ని సృష్టించాయి. వర్గీకృత సమాచారాన్ని ఎలా నిర్వహించాలి, రక్షించాలి, ప్రసారం చేయాలన్న కోణంలో మార్గదర్శకతను అందించాయి. 

18. ప్రపంచవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో మరింత ప్రశంసనీయ విదేశాంగ విధాన దృక్పథాల కోసం ఇరు ప్రభుత్వాలు ఆయా విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా (డబ్ల్యుఎఎన్ఎ ) పై భారత్-జర్మనీ చర్చల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇది ఆఫ్రికా, తూర్పు ఆసియాపై దీర్ఘకాలిక యంత్రాంగాలకు అదనంగా పని చేస్తుంది. విధాన ప్రణాళిక, సైబర్ సెక్యూరిటీ, సైబర్ సమస్యలు, ఐక్యరాజ్యసమితి సహా పరస్పర ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడంపై ఇరు ప్రభుత్వాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.


 

19. మేధో వర్గాలు, విదేశాంగ,  భద్రతా విధాన నిపుణులతో సహా ఒకరి దృక్పథాలను మరొకరు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన రెండు ప్రభుత్వాలు, భారత కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసిడబ్ల్యుఎ), రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ ఐఎస్), ఎంఇఎ, జర్మన్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ అండ్ ఏరియా స్టడీస్ (జి ఐ జి ఎ), జర్మన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ అఫైర్స్ (ఎస్ డబ్ల్యుపి), జర్మన్ ఫెడరల్ ఫారిన్ ఆఫీస్ భారత్-జర్మనీ ట్రాక్ 1.5 చర్చల ఉపయోగాన్ని ప్రముఖంగా పేర్కొన్నాయి. ఈ చర్చల రూపంలో తదుపరి సమావేశం నవంబర్ 2024 లో నిర్వహించాలని నిర్ణయించారు. తూర్పు ఆసియాపై ట్రాక్ 1.5 చర్చలను ప్రారంభించడాన్ని కూడా రెండు ప్రభుత్వాలు అభినందించాయి. ఈ మార్పిడి ఇరు పక్షాలను తమ ప్రకృతిని మెరుగ్గా సమన్వయపరచటానికి సహాయపడుతుందని అంగీకరించారు. ఈ వేగాన్ని కొనసాగించడానికి, ట్రాక్ 1.5 చర్చల విధానాల తదుపరి ఎడిషన్ ను వీలైనంత త్వరగా నిర్వహించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

20. అంతర్జాతీయ చట్టం, సార్వభౌమత్వానికి పరస్పర గౌరవం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, సమర్థవంతమైన ప్రాంతీయ సంస్థల ఆధారంగా నిర్మించిన స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, శాంతియుత, సంపన్న ఇండో-పసిఫిక్ ను ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయి. ఆసియాన్ ఐక్యత, కేంద్రీకరణకు తమ అచంచల మద్దతును ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమ (ఐపిఒఐ) సామర్థ్య-నిర్మాణ పునాదిలో జర్మనీ నాయకత్వాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. వాతావరణ సంబంధిత నష్టం, విధ్వంసానికి వ్యతిరేకంగా పసిఫిక్ ద్వీప దేశాల సామర్ధ్యాన్ని బలోపేతం చేయడానికి 2022 లో అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమం కింద ఆలోచనల కోసం పోటీ నిర్వహించడం, తద్వారా 20 మిలియన్ యూరోల వరకు బహుమతులు ఇవ్వడాన్ని స్వాగతించింది.

21. అభివృద్ధి ఎజెండాను జి 20 లో కేంద్ర స్థాయికి తీసుకువచ్చిన భారత్ జి 20 ప్రెసిడెన్సీని జర్మనీ అభినందించింది. జర్మన్ జి-20 ప్రెసిడెన్సీలో కాంపాక్ట్ విత్ ఆఫ్రికా (సిడబ్ల్యుఎ) పై ఒక వేదికను ప్రారంభించడం నుండి భారతదేశం అధ్యక్షత వహించినపుడు ఆఫ్రికన్ యూనియన్ ను జి-20 లో శాశ్వత సభ్యదేశంగా చేర్చడం వరకు, గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించడానికి జి-20 చాలా దూరం వచ్చిందని ఇరువురు నాయకులు అంగీకరించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ పాలనా సంస్కరణల కోసం బ్రెజిల్ జి-20 ప్రెసిడెన్సీ నిర్దేశించిన ప్రాధాన్యతలకు భారత్, జర్మనీ తమ మద్దతును తెలిపాయి. 

22. రెండు దేశాల మ‌ధ్య రక్షణ సంబంధాల‌ విస్తృతిలో ఉమ్మ‌డి లక్ష్యానికి అనుగుణంగా- సార్వ‌త్రిక అనుమ‌తులు లేదా లైసెన్సుల వంటి విధానాల‌పై సానుకూల నియంత్రణాత్మ‌క‌ నిర్ణయాలతో ఎగుమ‌తి అనుమ‌తులను వేగిర‌ప‌ర‌చ‌డంలో జ‌ర్మనీ తీసుకున్న చొర‌వపై భార‌త ప్ర‌భుత్వం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. భారత్‌ వ్యూహాత్మక ఎగుమతులపై తోడ్పాటుకు ఉభ‌య పక్షాలు కట్టుబ‌డిన నేప‌థ్యంలో సంబంధిత రక్షణ పరిశ్రమల మధ్య సంయుక్త ఆవిష్క‌ర‌ణ‌-ఉత్పత్తి స‌హా ఉమ్మడి పరిశోధనలను ప్రోత్సహించాల‌ని నిర్ణ‌యించాయి. భారత్‌-జర్మనీల మధ్య రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య బలోపేతం దిశ‌గా అక్టోబర్ 24న న్యూఢిల్లీలో ర‌క్ష‌ణ రంగ రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించడాన్ని రెండు ప్రభుత్వాలు ప్రశంసించాయి.

23. సైనిక దళాల స్థాయిలో క్రమబద్ధ పర్యటనలు, పరస్పర సంప్రదింపుల పెంపు సహా వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించే ఉన్నత స్థాయి రక్షణ కమిటీ సమావేశంపై ఉభయ పక్షాలూ ఆసక్తి చూపుతున్నాయి. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణరంగ సహకార విస్తృతిని కీలక పునాదిగా మలచాలన్నది దీని లక్ష్యం. అలాగే శాంతి పరిరక్షణపై దళాలకు శిక్షణ కోసం న్యూఢిల్లీలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరరక్షణ కేంద్రం, జర్మనీలోని హామెల్‌బర్గ్‌లోగల బుందేస్వియర్ ఐక్యరాజ్యసమితి శిక్షణ కేంద్రం మధ్య సహకారం ఖరారుకు భారత్-జర్మనీ నిర్ణయించాయి. దీంతోపాటు 2025లో బెర్లిన్ నగరంలో నిర్వహించనున్న మంత్రుల స్థాయి శాంతి పరిరక్షణ సమావేశంపైనా ఆసక్తితో ఉన్నాయి.

24. ఇండో-పసిఫిక్ భద్రత-శ్రేయస్సుతోపాటు అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారంలో ఆ ప్రాంతానికిగల ప్రాధాన్యంపై ఉభయ పక్షాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై తమ ప్రభుత్వ విధాన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండో-పసిఫిక్ దేశాలతో సంబంధాల విస్తృతికి జర్మనీ సిద్ధంగా ఉంది. అలాగే ‘‘సముద్ర చట్టాలపై 1982 నాటి ఐక్యరాజ్య సమితి తీర్మానం’’ మేరకు ఇండో-పసిఫిక్ సహా సముద్ర కార్యకలాపాలు సాగే అన్ని మార్గాల్లో నిర్నిరోధ ప్రయాణ స్వేచ్ఛకుగల ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలూ స్పష్టం చేశాయి. రక్షణ-భద్రత సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే దిశ‌గా ర‌వాణాలో పరస్పర స‌హ‌కారం, రెండు దేశాల సాయుధ దళాల మధ్య ఆదాన‌ప్ర‌దానంతోపాటు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ర‌వాణా స‌దుపాయాల మద్దతుకు ప్రాతిప‌దిక‌ను ఏర్ప‌రుస్తూ అవగాహ‌న ఒప్పందం ఖ‌రారుకు ఉభ‌య ప్ర‌భుత్వాలు సంయుక్తంగా ఆస‌క్తి వ్య‌క్తం చేశాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంతో సహకార విస్తృతి లక్ష్యంగా భార‌త్‌లోని గురుగ్రామ్‌లోగ‌ల‌ ‘‘హిందూ మహా సముద్ర ప్రాంత సమాచార-గణాంక క్రోడీకరణ కేంద్రం (ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్-ఇండియన్ ఓషన్ రీజియన్)లో ఒక శాశ్వత అనుసంధాన అధికారిని నియమించాలని జర్మనీ నిర్ణయించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నౌకల రాకపోకల పర్యవేక్షణతోపాటు ఈ ప్రాంతంతో సన్నిహిత సహకారం మెరుగుకు ఈ అధికారి కృషి చేస్తారు.

25. రక్షణ-భద్రత సహకార రంగంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంతో జర్మనీ సంబంధాల విస్తరణను ఉభయపక్షాలూ స్వాగతించాయి. ఇందులో భాగంగా 2024 ఆగస్టులో ‘తరంగ శక్తి’ పేరిట నావికాదళ కసరత్తు సందర్భంగా భారత్-జర్మనీ వైమానిక దళాల మధ్య సహకారం విజయవంతమైందని ప్రశంసించాయి. అలాగే గోవాలో యుద్ధ నౌకల మజిలీ, జర్మనీ ఫిరంగి యుద్ధనౌక (ఫ్రిగేట్) ‘‘బాడెన్-వుర్టెమ్‌బెర్గ్’’, ఆయుధ సరఫరా నౌక ‘‘ఫ్రాంక్‌ఫర్ట్ ఆమ్ మెయిన్’’ సహా భారత నావికాదళ యుద్ధనౌకల సంయుక్త కసరత్తును కొనియాడాయి. అంతేకాకుండా 2024 జూలైలో భారత నావికాదళ యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ తబర్’ హాంబర్గ్‌లో మజిలీ చేయడంపై జర్మనీ హర్షం ప్రకటించింది.

26. రక్షణ-భద్రత సంబంధిత వివిధ అంశాల్లో ద్వైపాక్షికంగానే కాకుండా ఐరోపా సమాఖ్య విధివిధానాల పరిధిలో ఇతర భాగస్వాములతో సంయుక్త ఆవిష్కరణ-ఉత్పత్తితోపాటు ఉమ్మడి పరిశోధన కార్యకలాపాల ద్వారానూ ద్వైపాక్షిక ఆదానప్రదానాల విస్తృతికి రెండు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ మేరకు రక్షణరంగ పరిశ్రమల స్థాయిలో సాంకేతిక సహకారం, తయారీ-సంయుక్త ఉత్పత్తి, రక్షణ వేదికలు-పరికరాల సంయుక్త ఆవిష్కరణలపై నిశితంగా దృష్టి సారిస్తూ సహకార విస్తృతికి ఉభయ పక్షాలూ తోడ్పాటునిస్తాయి. మరోవైపు ‘ఒసిసిఎఆర్’ (ఆర్గనైజేషన్ ఫర్ జాయింట్ ఆర్మమెంట్ కో-ఆపరేషన్) పరిధిలోని ‘యూరోడ్రోన్ ప్రోగ్రామ్‌’లో పరిశీలక సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థనపై జర్మనీ హర్షం వ్యక్తం చేసింది.

కీలక-వినూత్న సాంకేతికతలు.. శాస్త్రవిజ్ఞానం-ఆవిష్కరణలలో భాగస్వామ్యం

27. రెండు దేశాల మధ్య శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకారం 50 ఏళ్లపాటు విజయవంతంగా కొనసాగడంపై దేశాధినేతలిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ఇది మరింత విస్తరించేలా ‘భారత్-జర్మనీ ఆవిష్కరణ-సాంకేతిక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక’కు శ్రీకారం చుట్టడం ద్వారా మద్దతిస్తామని పునరుద్ఘాటించారు. ఈ దిశగా రెండు దేశాల్లోని ప్రభుత్వ-ప్రైవేట్ రంగ పరిశ్రమలకు, పరిశోధన సంస్థలకు ఈ ప్రణాళిక మార్గనిర్దేశం చేస్తుంది. దీనికి అనుగుణంగా పునరుత్పాదక ఇంధనం, అంకుర సంస్థలు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ (ఎఐ), క్వాంటం టెక్నాలజీ, వాతావరణ ముప్పు-సుస్థిర వనరుల నిర్వహణ సహా వాతావరణ మార్పు ప్రభావాలతో సర్దుబాటు, పర్యావరణ హిత వ్యవసాయం రెండింటిలోనూ సహకారం విస్తరిస్తుంది. మరోవైపు అంతరిక్షం-అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్ ప్రగతి, శ్రేయస్సుకే కాకుండా సహకారం విస్తరణలోనూ కీలక-ఆశావహ రంగం కాగలదని దేశాధినేతలిద్దరూ అంగీకారానికి వచ్చారు.

28. విద్య-పరిశోధన రంగాల్లో రెండు దేశాల మధ్య ఆదానప్రదానాలతోపాటు జర్మనీలో విద్యాభ్యాసం చేసే భారతీయుల సంఖ్య పెరుగుతుండటంపై దేశాధినేతలు సంతృప్తి వెలిబుచ్చారు. అలాగే పారిశ్రామిక-విద్యా రంగాల్లో ద్వైపాక్షికంగా వ్యూహాత్మక పరిశోధన-ఆవిష్కరణ భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో భారత్-జర్మనీ శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన కేంద్రం (ఐజిఎస్‌టిసి) కీలక పాత్ర పోషించడాన్ని వారిద్దరూ అభినందించారు. ఈ దిశగా ‘ఐజిఎస్‌టిసి’ ఇటీవలి కార్యక్రమాలతోపాటు అత్యాధునిక మూల పదార్థ (అడ్వాన్స్డ్ మెటీరియల్స్) రంగంలో 2+2 ప్రాజెక్టులకు మద్దతునిచ్చే ‘సంయుక్త ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన’పై సంతకాలు చేయడాన్ని వారు హర్షించారు. ‘ఐజిఎస్‌టిసి’ ప్రాధాన్యం రీత్యా సాంకేతికత పురోగమనం, తయారీ రంగాల్లో ఉమ్మడి విలువలతో కూడిన, ఆవిష్కరణ చోదిత కొత్త భాగస్వామ్యాల విస్తరణ, రూపకల్పనపై వారిద్దరూ ఆసక్తి వ్యక్తం చేశారు.

29. రెండు దేశాల మ‌ధ్య ‘అంతర్జాతీయ పరిశోధన-శిక్షణ బృందం’ (ఐఆర్‌టిజి) పేరిట తొలి ప్రాథ‌మిక ప‌రిశోధ‌న స‌ముదాయ న‌మూనా ప్రారంభానికి అధినేత‌లిద్ద‌రూ అంగీక‌రించారు. దీన్ని భార‌త ప్ర‌భుత్వ శాస్త్ర-సాంకేతిక విభాగం (డిఎస్‌టి), జ‌ర్మ‌న్ రిసెర్చ్ ఫౌండేష‌న్ (డిఎఫ్‌జి) సంయుక్తంగా ఏర్పాటు చేస్తాయి. ఇందులో భాగంగా ‘‘ఫోటోల్యూమినిసెన్స్ ఇన్ సూప్రామోలిక్యులర్ మాట్రిసెస్‌’’ అంశంపై పరిశోధనలో తిరువనంతపురంలోని ఐఐఎస్ఇఆర్ నుంచి, జ‌ర్మ‌నీలోని వర్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంపిక చేసిన తొలి బృందం పాలుపంచుకుంటుంది. శాస్త్రవిజ్ఞాన-ఆవిష్కరణ రంగాలకు బలమైన పునాది దిశగా ‘భారత్-జర్మనీ ఆవిష్కరణ-చేయూత ఆదానప్రదాన కార్యక్రమం’ ప్రారంభించేందుకు వారు ఆసక్తి చూపారు. రెండు దేశాల్లోని విద్య-ప‌రిశోధ‌న సంస్థ‌ల‌లో శాస్త్రీయ ఆవిష్కరణలు, చేయూత వాతావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల సృష్టి దిశ‌గా స‌మ‌ష్టి నైపుణ్యం-సామర్థ్యం పెంపులో ఇది తోడ్ప‌డుతుంది.

30. జర్మనీలోని ‘‘ఫెసిలిటీ ఫర్ యాంటీ-ప్రోటాన్ అండ్ అయాన్ రీసెర్చ్ (ఎఫ్ఎఐఆర్), డ్యుయిష్ ఎలెక్ట్రోనెన్ సింక్రోట్రాన్ (డిఇఎస్‌వై)’’ వంటి భారీ సంస్థల కార్యకలాపాల్లో భారత్ పాలుపంచుకోవడాన్ని ప్రశంసిస్తూ రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలకు ఇది నిదర్శనమని వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఎఫ్ఎఐఆర్’ విస్తరణ దిశగా నిధుల పరంగానే కాకుండా ఇతరత్రా కార్యక్రమాలను సకాలంలో పూర్తిచేయడంపై నిబద్ధత ప్రకటించారు. దీంతోపాటు సింక్రోట్రాన్ రేడియేషన్ ఫెసిలిటీ ‘పెట్రా-III’, ‘డిఇఎస్‌వై’లోని ‘ఫ్రీ-ఎలక్ట్రాన్ లేజర్’ ప్రయోగశాల ‘ఫ్లాష్‌’ కార్యకలాపాల్లో సహకారం కొనసాగింపుపైనా వారిద్దరూ అంగీకారం తెలిపారు.

31. ఉన్నత విద్యారంగంలో భాగస్వామ్యాలు స్థిరంగా పెరుగుతుండటంపై రెండు ప్రభుత్వాలూ హర్షం వ్యక్తం చేశాయి. ద్వంద్వ-సంయుక్త డిగ్రీ కోర్సుల అభ్యాసానికి, విశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యా సంస్థల మధ్య సహకారాత్మక విద్యా-పరిశోధక-ఆదానప్రదాన కార్యకలాపాల విస్తృతికి ఈ భాగస్వామ్యాలు తోడ్పడుతున్నాయి. ముఖ్యంగా ‘వాతావరణ మార్పులు-జల భద్రత’పై భారత-జర్మనీ తొలి సంయుక్త మాస్టర్స్ డిగ్రీ కోర్సుకు శ్రీకారం చుట్టడాన్ని ప్రశంసిస్తూ, దీనికి పూర్తి చేయూతనిస్తామని ఉభయ పక్షాలూ ప్రకటించాయి. డ్రెస్డెన్‌లోని సాంకేతిక విశ్వవిద్యాలయం (టియు), ‘ఆర్‌డ‌బ్ల్యుటిహెచ్’ ఆచెన్ విశ్వవిద్యాలయం, ఐఐటి-మద్రాస్ (ఐఐటిఎం) సంయుక్తంగా నిర్వహించే ఈ కోర్సుకు జర్మనీ విద్యారంగ ఆదానప్రదాన సేవా సంస్థ (డిఎఎడి) నిధులు సమకూరుస్తుంది. దీంతోపాటు బోధన, పరిశోధన, ఆవిష్కరణ, వ్యవస్థాపన అంశాల్లో ద్వైపాక్షిక సహకార విస్తరణ లక్ష్యంగా ‘అంతర-ప్రాంగణం’ (ట్రాన్స్‌క్యాంపస్) ఏర్పాటుపై డ్రెస్డెన్‌లోని ‘టియు’, ‘ఐఐటిఎం’ల మధ్య త్వరలో ఒప్పందం ఖరారు కానుంది. మరోవైపు భారత్-జర్మనీ విశ్వవిద్యాలయాల మధ్య సహకార ప్రాజెక్టులకు సంయుక్తంగా నిధులు సమకూర్చడంపై ఐఐటి-ఖరగ్‌పూర్, ‘డిఎఎడి’ల మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని రెండు ప్రభుత్వాలూ స్వాగతించాయి. అలాగే రెండు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య సహకారానికి ప్రాధాన్యంతో ‘స్పార్క్’ (స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రిసెర్చ్ కొలాబరేషన్) కింద ‘‘జర్మన్ ఇండియన్ అకడమిక్ నెట్‌వర్క్ ఫర్ టుమారో’’ (జెయింట్) పేరిట శాశ్వత వ్యవస్థ ఏర్పాటుకు ఉభయ పక్షాలు గట్టి మద్దతు ప్రకటించాయి.

32. భార‌త్‌-జ‌ర్మ‌నీల మ‌ధ్య డిజిటల్-సాంకేతిక భాగస్వామ్యం బలోపేతం ల‌క్ష్యంగా సార్వ‌జ‌నీన డిజిటల్ మౌలిక స‌దుపాయాల (డిపిఐ) నైపుణ్యం, అనుభ‌వాల ఆదాన‌ప్ర‌దానానికి రెండు ప్రభుత్వాలూ అంగీకరించాయి, ఇందులో భాగంగా ‘డిపిఐ’లో భారత్‌ నైపుణ్యాన్ని జ‌ర్మ‌నీ వాడుకోవ‌డంతోపాటు రెండు దేశాల్లో ఆవిష్క‌ర‌ణ‌, డిజిట‌ల్ రూపాంత‌రీక‌ర‌ణకు సార‌థ్యం వ‌హించ‌డంలో భారత ‘ఐటి’ పరిశ్రమ సామ‌ర్థ్యం వినియోగానికి మార్గాన్వేష‌ణ చేస్తారు. అలాగే ‘‘ఇంటర్నెట్ గవర్నెన్స్, టెక్ రెగ్యులేషన్స్, డిజిటల్ ట్రాన్స్‌ ఫర్మేషన్ ఆఫ్ ఎకానమీ, ఎమర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ’’ వంటి అంశాల్లో ఆదానప్రదానాలకు కీలక వేదికగా 2023-24కుగాను ‘ఇండో-జర్మన్ డిజిటల్ డైలాగ్’ (ఐజిడిడి) రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ఉభయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి.

33. ఆవిష్కరణ హిత, సమతుల, సార్వజనీన, మానవాళి కేంద్రక, నష్టభయ ఆధారిత కృత్రిమ మేధ విధానాల అవసరాన్ని గుర్తిస్తూ సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో ఆ సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి కృషి చేయాలని ఉభయ పక్షాలూ అంగీకరించాయి. రైతులకు తోడ్పాటు ద్వారా వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడంతోపాటు ఉత్పాదకత, వాతావరణ పునరుత్థానం, కర్బన సంగ్రహణం, సుస్థిరత పెంపులోనూ ‘ఇమేజ్ డిటెక్షన్’ ‘ఎఐ’ వంటి డిజిటల్ పరిజ్ఞానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మేరకు డిజిటల్ వ్యవసాయ వృద్ధి సౌలభ్యం దిశగా రెండు దేశాలూ జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ ఆధునికీకరణ దిశగా ప్రస్తుత సహకారం, ఆవిష్కరణలు, ఆదానప్రదానాలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘డిజిటల్ వ్యవసాయం, ఎఐ, ఐఒటి’ రంగాల్లో సహకార విస్తరణపై అంగీకారానికి వచ్చాయి.

34. కీలక-అత్యాధునిక సాంకేతికతలు, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారానికిగల వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని రెండు ప్రభుత్వాలూ గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఆవిష్కరణ-సాంకేతిక భాగస్వామ్య భవిష్యత్ ప్రణాళిక నిర్దేశిస్తున్న ద్వైపాక్షిక సహకార ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించాయి. తదనుగుణంగా ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి, కీలక-అత్యాధునిక సాంకేతిక రంగాల్లో సహకారంపై దృష్టి సారించాలని నిర్ణయించాయి. ఆ మేరకు పరస్పర విశ్వాసం, గౌరవం, ఉమ్మ‌డి విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను ప్రతిబింబించే పార‌ద‌ర్శ‌క‌, సార్వ‌జ‌నీన‌, సురక్షిత సాంకేతిక వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌లో సమ‌ష్టి నిబద్ధతను ఉభ‌య ప్ర‌భుత్వాలు గుర్తించాయి. ఈ దిశగా కీలక సాంకేతిక పరిజ్ఞానాల్లో రెండు దేశాల్లోని పారిశ్రామిక, విద్యా రంగాల మధ్య సన్నిహిత సంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాయి. తద్వారా రెండు దేశాలకూ నిర్దిష్ట రంగాల్లో ఫలితాధారిత, పరస్పర ప్రయోజనకర సాంకేతిక సహకారం సిద్ధిస్తుంది.

35. విపత్తుల ఉప‌శ‌మ‌నం, సునామీ హెచ్చరికలు, తీరప్రాంత ముప్పులు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విపత్తు న‌ష్టాల తగ్గింపు, సముద్ర-ధ్రువ-జీవ-జీవ‌భౌగోళిక ర‌సాయ‌న‌-జీవ‌భౌతిక-భూగర్భ శాస్త్ర రంగాల్లో పరిశోధనలు వగైరాల‌లో సహకార విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా అవ‌గాహ‌న ఒప్పందాలు కుద‌ర‌డంపై ఉభ‌య ప్ర‌భుత్వాలూ హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. ఈ ఒప్పందాలపై రెండు దేశాల్లోని సంబంధిత సంస్థలు- ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’, ‘హెల్మ్‌హోల్ట్జ్-జెంట్రమ్ పోట్స్‌డ్యామ్-డ్యుచెస్ జియోఫోర్స్చుంగ్స్‌జెంట్రమ్’, ‘నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్’, ‘ఆల్ఫ్రెడ్‌వెజెనర్-ఇనిస్టిట్యూట్’, ‘హెల్మ్‌హోల్ట్జ్-జెంట్రమ్ ఫర్ పోలార్-అండ్ మీరెస్‌ఫోర్షంగ్‌’ సంతకాలు చేశాయి.

36. భారత అణుశక్తి విభాగం (డిఇఎ) పరిధిలోని ‘టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్’ పర్యవేక్షణలోగల ‘నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్’ (ఎన్‌సిబిఎస్‌) ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్’ (ఐసిటిఎస్‌) సంస్థలు జీవ-భౌతిక-గణిత శాస్త్ర రంగాల్లో జర్మనీలోని ‘మాక్స్-ప్లాంక్-గెషెల్ చాఫ్ట్’ సంస్థతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడంపై ఉభయ ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో ఈ మూడు సంస్థల మధ్య విద్యార్థులు, పరిశోధన సిబ్బంది సహా శాస్త్రవేత్తల పరస్పర పర్యటనలకు సౌలభ్యం కలుగుతుంది.

37. ‘ఓష‌న్‌శాట్‌-3, రిశాట్‌-1ఎ’ ఉపగ్రహాల నుంచి స‌మాచార స్వీకర‌ణ‌, క్రోడీక‌ర‌ణ కోసం జర్మనీలోని న్యూస్ట్రెలిట్జ్‌లోగ‌ల‌ అంతర్జాతీయ గ్రౌండ్ స్టేషన్ ఉన్న‌తీక‌ర‌ణ‌కు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ‘జిఎఎఫ్‌ఎజి’ మధ్య సంయుక్త సహకారాన్ని దేశాధినేత‌లిద్ద‌రూ ప్రశంసించారు.

సుస్థిర-హరిత భవిష్యత్ కోసం భాగస్వామ్యం

38. నికర శూన్య ఉద్గార లక్ష్యాల సాధనలో హరిత, సుస్థిర, వాతావరణ ముప్పు  పునరుత్థాన, సమ్మిళిత ప్రగతికిగల ప్రాధాన్యాన్ని ఉభయ పక్షాలు అంగీకరించాయి. దీనికి అనుగుణంగా వాతావరణ మార్పు కార్యాచరణ, సుస్థిర ప్రగతి దిశగా ద్వైపాక్షిక, త్రైపాక్షిక,  బహుపాక్షిక సహకారం గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వాలు రెండూ నిర్దేశించుకున్నాయి. అలాగే ‘ఇండో-జర్మన్ గ్రీన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్’ (జిఎస్‌డిపి) కింద ఇప్పటిదాకా సాధించిన పురోగమనాన్ని ఉభయ పక్షాలూ సమీక్షించాయి. పారిస్ ఒప్పందంతోపాటు నిర్దేశిత సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి)  సాధనను ఈ భాగస్వామ్యం వేగిరపరుస్తుంది. ఈ నేపథ్యంలో ‘కాప్29’ సందర్భంగా ప్రతిష్ఠాత్మక ఒప్పందాల దిశగా- ప్రత్యేకించి సరికొత్త సమష్టి పరిమాణాత్మక లక్ష్యం (ఎన్‌సిక్యుజి) దిశగా సంయుక్త కృషి అవసరాన్ని రెండు పక్షాలూ స్పష్టం చేశాయి. రెండు దేశాల్లోని జాతీయ స్థితిగతులు నేపథ్యంగా తొలి ప్రపంచ కార్యాచరణ సహా ‘కాప్28’ నాటి ఒప్పందాలపై సానుకూల స్పందనకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

39. ‘జిఎస్‌డిపి’ లక్ష్యాలపై మంత్రుల స్థాయి సమావేశం సందర్భంగా ప్రపంచ కార్యాచరణ పురోగమనాన్ని ఉభయ పక్షాలూ అభినందించాయి. ‘జిఎస్‌డిపి’ అమలుకు తోడ్పాటులో భాగంగా ప్రస్తుత కార్యాచరణ బృందాలు, ఇతర ద్వైపాక్షిక వ్యవస్థలు, కార్యక్రమాల్లో క్రమం తప్పని చర్చల నిర్వహణకు తమ కట్టుబాటును పునరుద్ఘాటించాయి. పారిస్ ఒప్పంద లక్ష్యాలు, ‘ఎస్‌డిజి’ సాధనలో భాగంగా ‘జిఎస్‌డిపి’ లక్ష్యాల పురోగతిపై సమీక్షకు నిర్ణయించాయి. ఈ మేరకు భారత్, జర్మనీ ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల పరిధి కింద మంత్రుల స్థాయిలో తదుపరి సమావేశం నిర్వహిస్తారు. వాతావరణ మార్పు సవాళ్లపై సన్నిహిత సహకారం ఆవశ్యకతను రెండు పక్షాలూ స్పష్టం చేశాయి. తదనుగుణంగా త్వరలోనే భారత్-జర్మనీ వాతావరణ కార్యాచరణ బృందం సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి.

40. ‘జిఎస్‌డిపి’ పరిధిలో... ఉభయ పక్షాల పరంగా...

ఎ. భారత్-జర్మనీ హరిత ఉదజని భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం. హరిత ఉదజని ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి దిశగా భారత్ ఆకాంక్షలకు మద్దతివ్వడంలోనూ ఇది తోడ్పడుతుంది. అలాగే హరిత ఉదజనిని రెండు దేశాల్లోనూ సత్వరం సుస్థిర ఇంధన వనరుగా పరిగణించేందుకూ దోహదం చేస్తుంది.

బి. ‘జిఎస్‌డిపి’ డ్యాష్‌బోర్డ్‌ ప్రారంభం... ఇది అందరికీ అందుబాటులోగల ఆన్‌లైన్ వేదిక. ఈ అంశంలో జర్మనీ, భారత్ మధ్య సహకార విస్తృతిని ఇది ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే కీలక ఆవిష్కరణలపై సంగ్రహావలోకనంతోపాటు సహకార విస్తృతి అనుభవాన్ని వివరిస్తుంది. ‘జిఎస్‌డిపి’ లక్ష్యాల సాధన దిశగా ప్రపంచ కార్యాచరణలో సమష్టి పురోగమనంపై సమీక్ష సౌలభ్యం కల్పిస్తుంది. అలాగే ప్రపంచ సవాళ్లకు వినూత్న పరిష్కారాలపై సంబంధిత భాగస్వాములకు కీలక సమాచారమిస్తుంది.

సి. సమ్మిళిత సామాజిక-ఆర్థిక ప్రగతిలో హరిత, సుస్థిర పట్టణీకరణ ప్రాధాన్యాన్ని, 2019లో మొదలైన హరిత పట్టణ రవాణా భాగస్వామ్యంతో లభించిన సత్ఫలితాలను ఉభయ పక్షాలూ గుర్తించాయి. దీనికి అనుగుణంగా భార‌త్‌లో సుస్థిర పట్టణ రవాణాకు ప్రోత్సాహంపై ఉమ్మడి దృక్కోణానికి అనుగుణంగా ఈ భాగస్వామ్య పునరుద్ధరణ, మరింత పెంపు దిశగా సంయుక్త ప్రకటనపై సంతకం చేశాయి.

డి. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) విజయాలను ఎంతగానో కొనియాడటంతోపాటు దాని భవిష్యత్ కార్యాచరణ దృక్కోణాన్ని దేశాధినేతలిద్దరూ ప్రశంసించారు. అంతేకాకుండా ఈ కూటమికి తమ సహకారం మరింత విస్తృతం చేయడానికి అంగీకరించారు.

ఇ. రియో సదస్సు తీర్మానాలు, ‘ఎస్‌డిజి’ల అమలుకు మద్దతుగా అటవీ క్షీణతను అరికట్టడంతోపాటు తాజా అటవీకరణ ద్వారా అడవుల విస్తీర్ణం పెంచడంలో సహకారాన్ని వారిద్దరూ ప్రశంసించారు.

 

41. ఇండో-జర్మన్ ఎనర్జీ ఫోరమ్ (ఐజీఈఎఫ్), తన కార్యకలాపాల ద్వారా జర్మనీ, భారత్ మధ్య సాధారణ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో, ప్రపంచ వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడంలో ఫోరమ్ పాత్రను ఇరు దేశాల నేతలు ప్రశంసించారు.

42.  జర్మనీ భాగస్వామ్య దేశంగా గాంధీనగర్ లో సెప్టెంబర్ లో జరిగిన '4వ గ్లోబల్ రీ-ఇన్వెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ల మీట్', ఎక్స్‌పో ద్వారా  పునరుత్పాదక ఇంధన రంగంలో కీలక వాటాదారులను ఏకతాటిపైకి తీసుకురావడంలో నిర్వహించిన పాత్రను ఇరు దేశాలు ప్రత్యేకంగా ప్రస్తావించాయి. ఈ రీఇన్వెస్ట్ సందర్బంగా ‘ఇండియా-జర్మనీ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ వరల్డ్‌వైడ్’ ప్రారంభమైన విషయాన్ని రెండు ప్రభుత్వాలు గుర్తు చేసుకున్నాయి. ఇది పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను వేగంగా గమనించడానికీ, వ్యాపార సహకారాన్ని పెంపొందించడానికి, ప్రపంచ సరఫరా వ్యవస్థ విస్తరించడానికి కీలకంగా నిలిచింది. గ్రీన్ ఫైనాన్సింగ్, టెక్నాలజీ, వ్యాపార అవకాశాల ఆదానప్రదానాల ద్వారా ఈ వేదిక భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ పునరుత్పాదక శక్తి విస్తరణను వేగవంతం చేస్తుంది.

43.  రెండు ప్రభుత్వాలు 'జీవ వైవిధ్యంపై జాయింట్ వర్కింగ్ గ్రూప్' ద్వారా సహకారాన్ని బలోపేతం చేయాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. ప్రపంచ జీవ వైవిధ్య విధాన లక్ష్యాలను అమలు చేయడానికి చేసే ప్రయత్నంలో సీబీడీ, సీఓపీ-16 కీలకమైన ఘట్టాన్ని  సూచిస్తుందని అభిప్రాయపడ్డాయి.

44.  వ్యర్థాల నిర్వహణ, సంప్రదాయానికి భిన్నమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన ఉమ్మడి కార్యాచరణ బృందం నిర్వహించిన చర్చలు, ఫలితాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇది రెండు దేశాల మధ్య అనుభవాలు, సాంకేతికతల పరస్పర మార్పిడిని వేగవంతం చేయడం ద్వారా అవకాశాలను పెంపొందించింది. ఈ పరిధిలో సహకారాన్ని మరింతగా పెంచుకునే అవకాశాన్ని అన్వేషించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇందుకు  ఉదాహరణ, సోలార్ వ్యర్ధాల రీసైక్లింగ్‌పై భవిష్యత్తు కార్యక్రమాలను కేంద్రీకరించడం. సముద్ర వాతావరణంలోకి వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్‌లు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు, విధానాలను ప్రభావంతంగా, సమర్థవంతంగా అమలు చేయడంలో ఇండో-జర్మన్ పర్యావరణ సహకారాన్ని వారు ప్రశంసించారు. ప్లాస్టిక్ కాలుష్యంపై చట్టబద్ధమైన గ్లోబల్ ఒప్పందాన్ని అమలు చేయడానికి, సన్నిహితంగా సహకరించుకోవడానికి భారతదేశం, జర్మనీ దేశాలు అంగీకరించాయి.

45.  త్రిముఖ అభివృద్ధి సహకారం (టీడీసీ) కింద సాధించిన పురోగతిని ఇరువురు నాయకులు ప్రశంసించారు. ఇది ఆఫ్రికా, ఆసియా దాటి వాతావరణ లక్ష్యాల సాధనకు మద్దతు ఇవ్వడానికి వారి ప్రాధాన్యతల ప్రకారం తృతీయ దేశాలలో స్థిరమైన, ఆచరణీయ, సమ్మిళిత ప్రాజెక్టులను అందించడానికి పరస్పర బలాలు, అనుభవాలను వినియోగిస్తుంది. కామెరూన్, ఘనా, మలావి లో పైలట్ ప్రాజెక్టులు అందించిన ప్రోత్సాహకర ఫలితాలతో పాటు, బెనిన్, పెరూతో కొనసాగుతున్న కార్యక్రమాలలో సాధించిన పురోగతిని ఇరుపక్షాలు స్వాగతించాయి. పైన పేర్కొన్న కార్యక్రమాల విజయవంతమైన అమలును దృష్టిలో ఉంచుకుని, 2024లో కామెరూన్ (వ్యవసాయం), మలావి (మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు), ఘనా (ఉద్యానవనాలు)తో పైలట్ ప్రాజెక్టుల సంఖ్యను పెంచడానికి రెండు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఇంకా, రెండు వైపులా మూడు చిరుధాన్యాలకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టుల ప్రారంభాన్ని స్వాగతించారు: అవి ఇథియోపియాతో రెండు, మడగాస్కర్‌తో ఒకటి. అదనంగా, భాగస్వాములను చేరుకోవడానికి, వారి ఉమ్మడి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఎంచుకుని, అమలు చేయడానికి రెండు పక్షాలు సంస్థాగత యంత్రాంగాన్ని ప్రారంభించాయి. దీని కోసం రెండు ప్రభుత్వాలు ఉమ్మడి సారధ్య సంఘం, ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేశాయి.

46. లింగ సమానత్వానికి ప్రాముఖ్యత ఉందని, మహిళలు, బాలికల సాధికారత కోసం పెట్టుబడి పెట్టడం 2030 ఎజెండాను అమలు చేయడంలో గుణకార ప్రభావాన్ని చూపుతుందని నాయకులు పునరుద్ఘాటించారు. ఈ విషయంలో జర్మనీ స్త్రీవాద విదేశాంగ, అభివృద్ధి విధానాలను ప్రస్తావించారు. ప్రపంచ సవాళ్లను గమనంలోకి తీసుకుని, వాటిని పరిష్కరించడానికీ, నిర్ణయాధికారులుగా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడానికీ, మహిళల పూర్తి, సమాన, ప్రభావవంతమైన, అర్ధవంతమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. హరిత, సుస్థిర అభివృద్ధిలో మహిళల కీలక పాత్రను ప్రోత్సహించడంలో ఇండో-జర్మన్ సహకారాన్ని బలోపేతం చేయాలనే కోరికను ఇరుపక్షాలు వ్యక్తం చేసాయి.

47. దీనితో పాటు జీఎస్డీపీ విధాన చట్రం పరిథిలో ఆర్థిక, సాంకేతిక సహకారం కోసం ప్రస్తుతం ఉన్న కార్యక్రమాలు, కొత్త ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పటికే సాధించిన కీలక విజయాలనూ ఇరుపక్షాలు స్వాగతించాయి:

ఏ) 2024 సెప్టెంబర్ లో భారత్- జర్మనీ ప్రభుత్వాల మధ్య అభివృద్ధి సహకారంపై చర్చల సమయంలో అంగీకరించిన విధంగా జీఎస్డీపీ అన్ని ప్రధాన రంగాల్లో ఒక బిలియన్ యూరోల పైగా కొత్త ప్రతిపాదనలు ఉండగా, 2022లో జీఎస్డీపీ ప్రారంభం నుండి దాదాపు 3.2 బిలియన్ల యూరోల ప్రతిపాదనలు జోడించారు;
బి) ఇండో-జర్మన్ పునరుత్పాద ఇంధన భాగస్వామ్యం కింద, ఇంధన పరివర్తన దిశగా వినూత్న సౌరశక్తి, హరిత ఉదజని, ఇతర పునరుత్పాదకాలు, గ్రిడ్ అనుసంధానం, స్టోరేజ్, పునరుత్పాద ఇంధన రంగంలో పెట్టుబడులకు ఇరుదేశాలు పరస్పర సహకారంపై దృష్టి సారించాయి. విశ్వసించదగ్గ, నిరంతరాయ పునరుత్పాదక ఇంధన సరఫరా పరిష్కారాల ఆవశ్యకతను కూడా ఇరుపక్షాలు గుర్తించాయి. 
సి) "వ్యవసాయ జీవావరణ, సహజ వనరుల సుస్థిర నిర్వహణ"లో సహకారం వల్ల ఆదాయంలో వృద్ధి, ఆహార భద్రత,  వాతావరణ ప్రతిఘటన, భూసారం, జీవవైవిధ్యం, అటవీ విస్తరణ వ్యవస్థలు, నీటి భద్రతను పెంపొందించడం ద్వారా భారతదేశంలో సున్నితమైన గ్రామీణ జనాభా, చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

డి) స్థిరమైన పట్టణాభివృద్ధిపై తమ విజయవంతమైన సహకారాన్ని కొనసాగించాలనే ఉద్దేశాన్ని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. 


48. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరంగా గొప్ప పనితీరును ప్రదర్శించడాన్ని ఇరువురు నేతలూ ప్రశంసించారు. వాణిజ్యం, పెట్టుబడి ప్రవాహాలను మరింత బలోపేతం చేయడానికి భారతదేశం, జర్మనీ దేశాలలో ఔత్సాహికులను ప్రోత్సహించారు. రెండు దేశాల మధ్య ఇరు మార్గాలలో బలమైన పెట్టుబడులు, ప్రపంచ సరఫరా వ్యవస్థలలోకి విస్తరించడంలో ఆ పెట్టుబడుల సానుకూల ప్రభావాలను కూడా నాయకులు గుర్తించారు. ఈ సందర్భంలో, జర్మనీకి చెందిన అత్యున్నత స్థాయి బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌ల భాగస్వామ్యంతో జర్మన్ వాణిజ్య ద్వైవార్షిక ప్రధాన ఫోరమ్- ఏపికే 2024, జర్మన్ వ్యాపారాలకు భారతదేశంలో అందుబాటులో ఉన్న అపారమైన అవకాశాలను ప్రదర్శించడానికి కీలకమైన వేదిక అని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

49. భారత్‌లో జర్మన్ వ్యాపారాలు, జర్మనీలో భారతీయ వ్యాపారాల దీర్ఘకాల కొనసాగింపును ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత పెంచే దిశగా కృషి చేసేందుకు అంగీకరించాయి. ఈ సందర్భంలో, భారతదేశం, జర్మనీకి చెందిన వ్యాపార, పరిశ్రమల ప్రముఖులను నిమగ్నం చేయడానికి ఉన్నత స్థాయి వేదికగా పనిచేసే ఇండియా-జర్మనీ సీఈఓ ఫోరమ్ సమావేశాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి. వాణిజ్యం, పెట్టుబడి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఇండో-జర్మన్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం సాధించిన విజయాలను కూడా వారు ప్రముఖంగా ప్రస్తావించారు. దాని కార్యకలాపాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్టు పునరుద్ఘాటించారు.

50. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు)/మిట్టెల్‌స్టాండ్(జర్మనీలో చిన్న పరిశ్రమలు)  ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ద్వైపాక్షిక పెట్టుబడులలో వృద్ధిని, జర్మన్ మిట్టెల్‌స్టాండ్ ఎంటర్‌ప్రైజెస్‌కు మద్దతు ఇచ్చే 'మేక్ ఇన్ ఇండియా మిట్టెల్‌స్టాండ్' ప్రోగ్రామ్ విజయాన్ని ఇరుపక్షాలు గుర్తించాయి.  ఇది జర్మన్ మిట్టెల్‌స్టాండ్ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడంలో,  వ్యాపారం చేయడంలో మద్దతు ఇస్తుంది. ఇదే తరహాలో, రెండు ప్రభుత్వాలు కూడా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో అంకుర సంస్థలు పోషించే కీలక పాత్రను గుర్తించాయి. భారతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని అంకుర సంస్థల ఏర్పాటును విజయవంతంగా సులభతరం చేసినందుకు జర్మన్ యాక్సిలరేటర్ (జీఏ)ని ప్రశంసించాయి. భారతదేశంలో తన కార్యక్రమాలను విస్తరించే ప్రణాళికలను స్వాగతించాయి. జర్మనీలో విపణిని భారతీయ అంకురాలకు చేరువ చేసే కార్యక్రమం రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఇరుపక్షాలు పేర్కొన్నాయి.


 

లేబర్ మార్కెట్లుమొబిలిటీప్రజల మధ్య సంబంధాల బలోపేతం:

51. సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే ప్రైవేట్ రంగంలోని ఆసక్తిదారుల మధ్య సహకారంతో నైపుణ్యం కలిగిన వారి వలసలపై ద్వైపాక్షిక సహకారం బహుళ రంగాల్లో విస్తరిస్తోంది. దీనితో 'మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం' (ఎంఎంపిఏ) నిబంధనలను పూర్తిగా అమలు చేయడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయి. ఎంఎంపిఏలో వివరించిన ఈ అంశాలకు అనుగుణంగా, న్యాయమైన, చట్టపరమైన కార్మిక వలసలను ప్రోత్సహించడానికి ఇరుపక్షాలు అంకితభావంతో ఉన్నాయి. న్యాయమైన రిక్రూట్‌మెంట్ పద్ధతులు, పారదర్శక వీసా ప్రక్రియలు, కార్మికుల హక్కుల పరిరక్షణతో సహా వలస కార్మికులను గౌరవ మర్యాదలతో చూసేలా అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా ఈ విధానం మార్గనిర్దేశం చేశారు. ఈ సూత్రాలపై దృష్టి సారించడం ద్వారా, దోపిడీకి అవకాశం లేకుండా, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, అన్ని పార్టీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా నైపుణ్యం కలిగిన కార్మికులకు మార్గాన్ని సుగమం చేయడం ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

52. ఎంఎంపిఏ ఆధారంగా, సంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పెంపొందించడానికి ఉపాధి, కార్మిక రంగంలో ఇరుపక్షాలు జాయింట్ 'డిక్లరేషన్ అఫ్ ఇంటెంట్'- జేడీఐ ని ఖరారు చేసాయి. 2023లో భారత జీ20 అధ్యక్షతన చేసిన ప్రకటన, అంతర్జాతీయ సూచన వర్గీకరణపై సాధ్యాసాధ్యాల అధ్యయనానికి మద్దతు ఇస్తుందని జర్మనీ తెలిపింది. వృత్తిపరమైన వ్యాధులు, పునరావాసం, వైకల్యం ఉన్న కార్మికుల వొకేషనల్ ట్రైనింగ్ వంటి అంశాలలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఇరువురు నేతలు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసి), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ (డీజీఈ), జర్మన్ సోషల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డీజీయువీ) మధ్య జరిగే  ఒప్పందం ఇది. 

53. జర్మనీలోని బ్లూ కార్డ్ హోల్డర్లలో నాలుగింట ఒక వంతు భారతీయ నిపుణులు ఉన్నారని, ఇప్పుడు జర్మనీలోని అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే ఎక్కువ ఉన్నారని ఇరువురు నేతలు పేర్కొన్నారు. దీనికి సంబంధించి, జర్మనీలో ప్రతిభ  నైపుణ్యాల అవసరాలు - భారతదేశంలోని యువకులు, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన వ్యక్తుల విస్తారమైన నిక్షేపం, ఈ రెంటి మధ్య ఉన్న పరిపూరకాలను వారు గుర్తించారు. వారు జర్మన్ లేబర్ మార్కెట్‌కు గొప్ప ఆస్తిగా ఉంటారని భావిస్తున్నారు. ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ జాతీయ, రాష్ట్ర స్థాయిలలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, ఇండియా (ఎన్ఎస్డీసీ), ఇతర సారూప్య ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రస్తుత వినిమయాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశం నుండి నైపుణ్యం కలిగిన వలసదారులను ప్రోత్సహించడానికి జర్మన్ ప్రభుత్వం కొత్త జాతీయ స్థాయి వ్యూహాన్ని ప్రారంభించడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.

54. నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణపై అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సమీకరించడం, మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యంగా గ్రీన్ స్కిల్స్ లో భారత్, జర్మనీ బలాన్ని పెంచుతుంది. కార్మికుల అంతర్జాతీయ చలనశీలతను సులభతరం చేసే అంశాలను చేర్చేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

55. మాధ్యమిక పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కేంద్రాలతో సహా భారతదేశంలో జర్మన్ భాష బోధనను విస్తరించాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశం, జర్మనీలో భాషా ఉపాధ్యాయుల శిక్షణతో సహా భారతదేశం, జర్మనీలో పరస్పర భాషల బోధనను మరింత ప్రోత్సహించడానికి భారతీయ, జర్మన్ రాష్ట్రాలు, సంస్కృతి కేంద్రాలు, విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారు. భారతదేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ సర్టిఫికేట్‌ పొందేందుకు వీలుగా జర్మన్ ఉపాధ్యాయుల అధికారిక శిక్షణ, తదుపరి విద్య కోసం ఒక ఫార్మాట్ ను అభివృద్ధి చేయడానికి డీఏఏడీ, గోథే ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ప్రయత్నాలను ఇరుపక్షాలు స్వాగతించాయి.

56. ఆర్థిక వృద్ధికి అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల సహకారాన్ని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి, "జర్మనీతో వ్యాపారంలో భాగస్వామ్యం" కార్యక్రమం కింద సాధించిన ఫలితాలు సంతృప్తిగా ఉన్నాయని గుర్తించి, భారతదేశం నుండి కార్పొరేట్ అధికారులు, జూనియర్ అధికారులకు అధునాతన శిక్షణపై జేడీఐ ని పునరుద్ధరించారు.

57. 'మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందం' (ఎంఎంపిఏ)తో, అక్రమ వలసలను అంశంపై కూడా దృష్టి పెట్టాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ ప్రయోజనం కోసం, ఎంఎంపిఏ అమల్లోకి వచ్చినప్పటి నుండి రెండు వైపులా 'వెనక్కి తిరిగి పంపే' ఏర్పాటుకు ఒక సహకార విధానాన్ని రూపొందించాయి. ఇరు దేశాలు ఇప్పటివరకు సాధించిన పురోగతిని స్వాగతించాయి. తగిన విధానపరమైన ఏర్పాట్ల ద్వారా సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడం, క్రమబద్ధీకరించడం ముఖ్యమని స్పష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చాయి.

58. ఇరు దేశాలు, తమ జాతీయుల మధ్య పెరుగుతున్న సంబంధాలను నేతలు స్వాగతించారు. పెరుగుతున్న ఈ సంబంధాల నుండి విస్తృతంగా ఉత్పన్నమయ్యే కాన్సులర్ సమస్యలపై తరచు సంప్రదింపులు, చర్చల ఆవశ్యకతను ఇరు దేశాలు గుర్తించాయి. వివిధ కాన్సులర్, వీసా సమస్యలతో పాటు, సంబంధిత భూభాగాల్లో నివసిస్తున్న అవతలి వైపు జాతీయులను ప్రభావితం చేసే ఇతర సమస్యలపై ద్వైపాక్షిక చర్చల కోసం తగిన విధానాన్ని త్వరగా రూపొందించుకోవాలని వారు ఒక అంగీకారానికి వచ్చారు.

59. సాంస్కృతిక రాయబారులుగా, నూతన ఆవిష్కరణలు, ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించే ఉత్ప్రేరకాలుగా తమ యువత పాత్రను ఇరు దేశాలు గుర్తించాయి. ఈ సందర్భంలో, ఇద్దరు నేతలు యువత సహకారం ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఇరుపక్షాల మధ్య యూత్ ఎక్స్చేంజి, ప్రతినిధి బృందాల కోసం ఫోరమ్ ఏర్పాటు ప్రతిపాదనను గుర్తించారు. పరస్పర ప్రాతిపదికన విద్యార్థుల పర్యటనలను సులభతరం చేయడానికి ఇరుపక్షాలు కూడా అంగీకరించాయి.

60. ఇరు దేశాలు సాంస్కృతిక రంగంలో జరుగుతున్న గణనీయమైన కృషి పట్ల సంతృప్తి వ్యక్తం చేసాయి. 'ప్రష్యన్ హెరిటేజ్ ఫౌండేషన్', 'నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, ఇండియా' వంటి భారతీయ, జర్మన్ జాతీయ మ్యూజియంల మధ్య సహకారంపై అవగాహన ఒప్పందాన్ని విస్తరించే ప్రయత్నాలను ఇద్దరు దేశాధినేతలు స్వాగతించారు.

61. జీ20 న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ (2023)కి అనుగుణంగా, సాంస్కృతి వారసత్వానికి చెందిన వస్తువుల వెనక్కి ఇచ్చివేయడం, రక్షణ, జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలలో సాంస్కృతిక ఆస్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటానికి సంబంధించి సన్నిహితంగా సహకరించాలనే ఉద్దేశాన్ని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. సంబంధిత దేశానికి చెందిన వస్తువులను తిరిగి వెనక్కి చేర్చే అంశాలపై నిరంతర సంప్రదింపులు, చర్యల కోసం పిలుపునిచ్చారు.

62. జర్మనీలోని విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యా పీఠాల ఏర్పాటు వంటి కార్యక్రమాల ద్వారా గణనీయమైన సాంస్కృతిక, విద్యాపరమైన  వినిమయ కార్యక్రమాలను రెండు ప్రభుత్వాలు కూడా ప్రశంసించాయి.
63. ఏడో ఐజీసీ లో జరిగిన చర్చల పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండో-జర్మన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు, మరింతగా పెంచేందుకు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ సాదరంగా ఇచ్చిన ఆతిథ్యానికి ఛాన్సలర్ స్కోల్జ్ ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ఐజీసీకి ఆతిథ్యం ఇవ్వడానికి జర్మనీ ఎదురుచూస్తోందని అన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Regional languages take precedence in Lok Sabha addresses

Media Coverage

Regional languages take precedence in Lok Sabha addresses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Cabinet approves three new corridors as part of Delhi Metro’s Phase V (A) Project
December 24, 2025

The Union Cabinet chaired by the Prime Minister, Shri Narendra Modi has approved three new corridors - 1. R.K Ashram Marg to Indraprastha (9.913 Kms), 2. Aerocity to IGD Airport T-1 (2.263 kms) 3. Tughlakabad to Kalindi Kunj (3.9 kms) as part of Delhi Metro’s Phase – V(A) project consisting of 16.076 kms which will further enhance connectivity within the national capital. Total project cost of Delhi Metro’s Phase – V(A) project is Rs.12014.91 crore, which will be sourced from Government of India, Government of Delhi, and international funding agencies.

The Central Vista corridor will provide connectivity to all the Kartavya Bhawans thereby providing door step connectivity to the office goers and visitors in this area. With this connectivity around 60,000 office goers and 2 lakh visitors will get benefitted on daily basis. These corridors will further reduce pollution and usage of fossil fuels enhancing ease of living.

Details:

The RK Ashram Marg – Indraprastha section will be an extension of the Botanical Garden-R.K. Ashram Marg corridor. It will provide Metro connectivity to the Central Vista area, which is currently under redevelopment. The Aerocity – IGD Airport Terminal 1 and Tughlakabad – Kalindi Kunj sections will be an extension of the Aerocity-Tughlakabad corridor and will boost connectivity of the airport with the southern parts of the national capital in areas such as Tughlakabad, Saket, Kalindi Kunj etc. These extensions will comprise of 13 stations. Out of these 10 stations will be underground and 03 stations will be elevated.

After completion, the corridor-1 namely R.K Ashram Marg to Indraprastha (9.913 Kms), will improve the connectivity of West, North and old Delhi with Central Delhi and the other two corridors namely Aerocity to IGD Airport T-1 (2.263 kms) and Tughlakabad to Kalindi Kunj (3.9 kms) corridors will connect south Delhi with the domestic Airport Terminal-1 via Saket, Chattarpur etc which will tremendously boost connectivity within National Capital.

These metro extensions of the Phase – V (A) project will expand the reach of Delhi Metro network in Central Delhi and Domestic Airport thereby further boosting the economy. These extensions of the Magenta Line and Golden Line will reduce congestion on the roads; thus, will help in reducing the pollution caused by motor vehicles.

The stations, which shall come up on the RK Ashram Marg - Indraprastha section are: R.K Ashram Marg, Shivaji Stadium, Central Secretariat, Kartavya Bhawan, India Gate, War Memorial - High Court, Baroda House, Bharat Mandapam, and Indraprastha.

The stations on the Tughlakabad – Kalindi Kunj section will be Sarita Vihar Depot, Madanpur Khadar, and Kalindi Kunj, while the Aerocity station will be connected further with the IGD T-1 station.

Construction of Phase-IV consisting of 111 km and 83 stations are underway, and as of today, about 80.43% of civil construction of Phase-IV (3 Priority) corridors has been completed. The Phase-IV (3 Priority) corridors are likely to be completed in stages by December 2026.

Today, the Delhi Metro caters to an average of 65 lakh passenger journeys per day. The maximum passenger journey recorded so far is 81.87 lakh on August 08, 2025. Delhi Metro has become the lifeline of the city by setting the epitome of excellence in the core parameters of MRTS, i.e. punctuality, reliability, and safety.

A total of 12 metro lines of about 395 km with 289 stations are being operated by DMRC in Delhi and NCR at present. Today, Delhi Metro has the largest Metro network in India and is also one of the largest Metros in the world.