ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఘనుడైన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ సమక్షంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఫిబ్రవరి 10 న భారతదేశం, యుఎఇలు ఐదు ప్రభుత్వం -ప్రభుత్వం మధ్య ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరు దేశాలు ఇంధనాలు, రైల్వేలు, మానవ వనరులు మరియు ఆర్థిక సేవలకు సంబంధించిన ఒప్ప్నదాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నాయి.


ఆఫ్షోర్ లోయర్ జాకమ్ రాయితీలో 10% పాల్గొనే ఆసక్తిని పొందటానికి భారతీయ కన్సార్టియం (ఓవిఎల్, బిపిఆర్ఎల్ & ఐఓసిఎల్) మరియుఅడ్నోక్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. 2018 నుండి 2057 వరకు 40 సంవత్సరాల పాటు ఈ రాయితీలు జరుగుతాయి, మిగిలిన వాటిలో 60%అడ్నోక్ దగ్గరే ఉండనుండగా మిగిలిన 30% ఇతర అంతర్జాతీయ చమురు కంపెనీలకు ఇవ్వబడుతుంది. యూఏఈ యొక్క అప్స్ట్రీమ్ ఆయిల్ సెక్టార్లో ఇది మొదటి భారతీయ పెట్టుబడి, సంప్రదాయ కొనుగోలుదారు-విక్రేత సంబంధాన్ని సుదీర్ఘకాలం పెట్టుబడిదారుల సంబంధానికి మార్చింది.

యూఏఈలో భారత కార్మికుల కాంట్రాక్టు ఉద్యోగుల సహకార పరిపాలనను సంస్థ ఏర్పాటు చేయటానికి మానవ వనరుల రంగంలో, భారత ప్రభుత్వము మరియు యుఎఈ ప్రభుత్వముతో సహకరించటానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న అక్రమ రవాణా, దుర్వినియోగాలను అంతమొందించడానికి, సహకార కార్యక్రమాల కోసం విద్య, కాంట్రాక్టు కార్మికులకు అవగాహన కల్పించడానికి కార్మికులకు సంబంధించిన ఇ-ప్లాట్ఫారమ్లను సమీకృతం చేయడానికి ఇరుపక్షాలు కలిసి పని చేస్తాయి.  

రైల్వే రంగంలో సాంకేతిక సహకారం కోసం కూడా రైల్వే మంత్రిత్వ శాఖ, భారతదేశం మరియు ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ - లాండ్ &మారిటైమ్ యుఎఈల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రత్యేకించి రైల్వేలు సహకారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులు, నాలెడ్జ్ పంచుకోవడం, జాయింట్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ యొక్క అభివృద్ధిని, సహకార యంత్రాంగంను సంస్థాపించటానికి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడటానికి ఈ ఒప్పందం ప్రయత్నిస్తుంది.

ఆర్ధిక రంగంలో ద్వైపాక్షిక సహకారం మరింత పెంచేందుకుబొంబాయి స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ) మరియు అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ (ఎడిక్స్) మధ్య ఒక ఒప్పందము కుదిరింది. ఇది ఆర్థిక సేవల పరిశ్రమలో రెండు దేశాల మధ్య సహకారాన్ని మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమాచార మార్పిడినిపుణుల మార్పిడి మరియు రెండు దేశాల పరస్పర ప్రయోజనం కోసం శిక్షణను ఈ ఎంఓయు కల్పిస్తుంది. రెండు దేశాల నుండి పెట్టుబడిదారులచే ఆర్ధిక మార్కెట్లలో పెట్టుబడులను సులభతరం చేస్తుంది. జమ్మూలో ఒక సమ్మేళనం కూడా గిడ్డంగులు మరియు ప్రత్యేకమైన నిల్వ పరిష్కారాలను కలిగి ఉన్న బహుళ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ మరియు హబ్ను స్థాపించడానికి జమ్మూ మరియు కాశ్మీర్ మరియు డిపి వరల్డ్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward

Media Coverage

India’s GDP To Grow 7% In FY26: Crisil Revises Growth Forecast Upward
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16 డిసెంబర్ 2025
December 16, 2025

Global Respect and Self-Reliant Strides: The Modi Effect in Jordan and Beyond