ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కు (పీ ఎం జన్మన్ ) 9 లైన్ మంత్రిత్వ శాఖల ద్వారా 11 ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టడానికి మొత్తం రూ.24,104 కోట్లు (కేంద్ర వాటా:రూ.15,336 కోట్లు మరియు రాష్ట్ర వాటా: రూ.8,768 కోట్లు)నిధుల మంజూరును ఆమోదించింది. ఖుంతి నుండి జంజాతీయ గౌరవ్ దివస్ నాడు ప్రధాన మంత్రి అభియాన్‌ను ప్రకటించారు.

 

బడ్జెట్ ప్రసంగం 2023-24లో ప్రకటించినట్లుగా, “ముఖ్యంగా బడుగు గిరిజన సమూహాల (పీ వీ టీ జీలు) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి పీ వీ టీ జీ అభివృద్ధి మిషన్ ప్రారంభించబడుతుంది. ఇది పీ వీ టీ జీ గృహాలు మరియు నివాసాలను సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు మరియు పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం మరియు పోషకాహారానికి మెరుగైన ప్రాప్యత, రహదారి మరియు టెలికాం అనుసంధానత మరియు సుస్థిరమైన జీవనోపాధి అవకాశాల వంటి ప్రాథమిక సౌకర్యాలతో సంతృప్తీకరణ చెందేల కృషి చేస్తుంది. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక కింద రాబోయే మూడేళ్లలో మిషన్‌ను అమలు చేయడానికి రూ.15,000 కోట్లు అందుబాటులో ఉంచబడతాయి.

 

భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 10.45 కోట్ల మంది ఎస్ టీ జనాభా ఉంది, వీటిలో 18 రాష్ట్రాలు మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్న 75 కమ్యూనిటీలు ప్రత్యేకించి దీన గిరిజన సమూహాలుగా (పీ వీ టీ జీలు) వర్గీకరించబడ్డాయి. ఈ పీ వీ టీ జీలు సామాజిక, ఆర్థిక మరియు విద్యా రంగాలలో దుర్బలత్వాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి.

 

పీ ఎం - జన్మన్ (కేంద్ర రంగం మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలతో కూడినది) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా 9 మంత్రిత్వ శాఖల ద్వారా 11 ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తుంది:

స.నెం..

కార్యాచరణ

లబ్ధిదారుల సంఖ్య / లక్ష్యాలు

ఖర్చు నిబంధనలు

1

పక్కా గృహాల మంజూరు

4.90 లక్షలు

రూ. 2.39 లక్షలు/ఇల్లు

2

అనుసంధాన రోడ్లు

8000 కి.మీ

 రూ. 1.00 కోట్లు/కి.మీ

3ఏ 

కుళాయి నీటి సరఫరా/

మిషన్ కింద 4.90 లక్షల హెచ్‌హెచ్‌లతో సహా అన్ని పివిటిజి ఆవాసాలు నిర్మించబడతాయి

నిబంధనల ప్రకారం

3బీ 

కమ్యూనిటీ నీటి సరఫరా

20 హెచ్‌హెచ్‌ల కంటే తక్కువ జనాభా కలిగిన 2500 గ్రామాలు/ ఆవాసాలు

వాస్తవ ధర ప్రకారం వచ్చింది

4

ఔషధ ఖర్చుతో మొబైల్ మెడికల్ యూనిట్లు

1000 (10/జిల్లా)

 

రూ. 33.88.00 లక్షలు/ఎం ఎం యూ 

5ఏ 

హాస్టళ్ల నిర్మాణం

500

రూ. 2.75 కోట్లు/హాస్టల్

5బీ 

వృత్తి విద్య & నైపుణ్యం

60 ఆకాంక్ష పీ వీ టీ జీలు బ్లాక్‌లు

రూ. 50 లక్షలు/బ్లాక్

6

అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం

2500

రూ. 12 లక్షలు/ ఏ డబ్ల్యూ సి 

7

మల్టీపర్పస్ సెంటర్ల  నిర్మాణం

1000

ప్రతి ఎం పీ సి లో ఏ ఎన్ ఎం మరియు అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.60 లక్షలు/ఎం పీ సి కేటాయింపు

8ఏ 

హెచ్‌హెచ్‌ల శక్తివంతం (లాస్ట్ మైల్ కనెక్టివిటీ)

57000 హెచ్‌హెచ్‌లు 

రూ. 22,500/హెచ్‌హెచ్‌

8బీ 

0.3 కే డబ్ల్యూ సోలార్ ఆఫ్-గ్రిడ్ వ్యవస్థను అందించడం

100000 హెచ్‌హెచ్‌లు

రూ. 50,000/హెచ్‌హెచ్‌ లేదా వాస్తవ ధర ప్రకారం

9

వీధులు & ఎం పీ సిలలో సోలార్ లైటింగ్

1500 యూనిట్లు

రూ. 1,00,000/యూనిట్

10

వీ డీ కే ల ఏర్పాటు

500

రూ. 15 లక్షలు/వీ డీ కే

11

మొబైల్ టవర్ల ఏర్పాటు

3000 గ్రామాలు

నిబంధనల ప్రకారం ఖర్చు

 

పైన పేర్కొన్న జోక్యాలు కాకుండా, ఇతర మంత్రిత్వ శాఖల క్రింది జోక్యం మిషన్‌లో భాగంగా ఉంటుంది:

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆయుష్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది మరియు మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా పివిటిజి నివాసాలకు ఆయుష్ సౌకర్యాలను విస్తరిస్తుంది. 

 

నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఈ కమ్యూనిటీలకు తగిన నైపుణ్యాల ప్రకారం పివిటిజి ఆవాసాలు, మల్టీపర్పస్ కేంద్రాలు మరియు హాస్టళ్లలో నైపుణ్యం మరియు వృత్తిపరమైన శిక్షణను సులభతరం చేస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament

Media Coverage

MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology