2025-26 వరకు మరో మూడేళ్లపాటు రూ.29,610.25 కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఐ డీ ఎఫ్) కింద అమలు చేయనున్న పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఏ హెచ్ ఐ డీ ఎఫ్) కొనసాగింపునకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం పాల ప్రాసెసింగ్ మరియు పాల ఉత్పత్తుల వైవిధ్యీకరణ, మాంసం ప్రాసెసింగ్ మరియు ఉత్పత్తుల వైవిధ్యం, పశుగ్రాసం ప్లాంట్, జాతుల అభివృద్ధి క్షేత్రం, జంతు వ్యర్థాల నుండి సంపద నిర్వహణ (వ్యర్థాల నిర్వహణ) మరియు పశు వ్యాక్సిన్ మరియు ఔషధ ఉత్పత్తి సౌకర్యాల కోసం పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.

 

షెడ్యూల్డ్ బ్యాంక్ మరియు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీ డీ సీ), నాబార్డ్ మరియు ఎన్ డీ డీ బీ నుండి 90% వరకు రుణం కోసం రెండు సంవత్సరాల మారటోరియంతో సహా 8 సంవత్సరాల పాటు 3% వడ్డీ రాయితీని భారత ప్రభుత్వం అందిస్తుంది. ఎంటిటీలు, వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు, ఎఫ్ పీ ఓ, ఎం ఎస్ ఎం ఈ, సెక్షన్ 8 కంపెనీలు ఈ పథకానికి అర్హులు. డెయిరీ సహకార సంఘాలు కూడా డెయిరీ ప్లాంట్ల ఆధునీకరణ, బలోపేతం కోసం ప్రయోజనాలను పొందుతాయి.

 

రూ.750 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ నుండి తీసుకున్న రుణం లో 25% వరకు ఎం ఎస్ ఎం ఈ మరియు డెయిరీ కోఆపరేటివ్‌లకు భారత ప్రభుత్వం రుణ హామీని కూడా అందిస్తుంది.

 

 ఏ హెచ్ ఐ డీ ఎఫ్ ఇప్పటివరకు 141.04 ఎల్ ఎల్ పి డి (రోజుకు లక్ష లీటర్లు) పాల ప్రాసెసింగ్ సామర్థ్యం, ​​79.24 లక్షల మెట్రిక్ టన్నుల దాణా ప్రాసెసింగ్ సామర్థ్యం మరియు 9.06 లక్షల మెట్రిక్ టన్ను మాంసం ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఈ పథకం సరఫరా వ్యవస్థ పై సానుకూల ప్రభావాన్ని సృష్టించింది. ఈ పథకం పాడి, మాంసం మరియు పశుగ్రాస రంగంలో ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని 2-4% పెంచగలిగింది.

 

పశుసంవర్థక రంగం పెట్టుబడిదారులకు పశుసంవర్ధక రంగంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది, విలువ జోడింపు, కోల్డ్ చైన్ మరియు డైరీ, మాంసం, పశుగ్రాస యూనిట్ల సమీకృత యూనిట్ల నుండి సాంకేతిక సహాయంతో పశువులు మరియు పౌల్ట్రీ ఫాంలు, జంతు వ్యర్థాల నుండి సంపద నిర్వహణ మరియు వెటర్నరీ డ్రగ్స్/వ్యాక్సిన్ యూనిట్ల ఏర్పాటువరకు ఈ రంగం లాభదాయకంగా మారుతుంది.

 

సాంకేతిక సహాయంతో జాతి అభివృద్ధి క్షేత్రాలు, పశువుల ఔషధాలు మరియు వ్యాక్సిన్ యూనిట్ల బలోపేతం, జంతు వ్యర్థాల నుండి సంపద నిర్వహణ వంటి కొత్త కార్యకలాపాలను చేర్చిన తర్వాత, ఈ పథకం పశుసంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి భారీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.

 

ఈ పథకం వ్యవస్థాపకత అభివృద్ధి ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 35 లక్షల మందికి ఉపాధి కల్పనకు  మరియు పశుసంపద రంగంలో సంపద సృష్టిని లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటివరకు, ఏ హెచ్ ఐ డీ ఎఫ్ ప్రత్యక్షంగా/పరోక్షంగా దాదాపు 15 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ప్రైవేట్ రంగ పెట్టుబడులను తీసుకురావడం ద్వారా పశుసంవర్ధక రంగం లో, ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపు లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం పశువుల ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడం  మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు  దోహదపడడం వంటి వాటి ద్వారా ప్రధాన మంత్రి లక్ష్యాన్ని సాధించడానికి ఏ హెచ్ ఐ డీ ఎఫ్ ఒక మార్గంగా రూపొందుతోంది. అర్హత కలిగిన లబ్ధిదారులచే ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపు మౌలిక సదుపాయాలపై ఇటువంటి పెట్టుబడులు ఈ ప్రాసెస్ చేయబడిన మరియు విలువ-ఆధారిత వస్తువుల ఎగుమతిని ప్రోత్సహిస్తాయి. అందువల్ల ఏ హెచ్ ఐ డీ ఎఫ్  ప్రోత్సాహకం ద్వారా పెట్టుబడి పెట్టడం వలన ప్రైవేట్ పెట్టుబడి 7 రెట్లు ప్రయోజనం పొందడమే కాకుండా ఇన్‌పుట్‌లపై ఎక్కువ పెట్టుబడి పెట్టేలా రైతులను ప్రోత్సహిస్తుంది, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report

Media Coverage

India's food services market to reach USD 150 billion by FY31, online share to rise to 18%: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 జూలై 2026
July 10, 2026

Building Viksit Bharat: PM Modi Accelerating India's Growth at Home and Across the World