India will give a befitting reply to the perpetrators of the Pulwama terror attack: PM Modi
Defence corridor in Bundelkhand will be a boon for the region: PM Modi
Guided by the mantra of 'Sabka Saath, Sabka Vikas', we are moving ahead on the path of development: PM Modi in Jhansi

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఝాన్సీ నగరాన్ని సందర్శించారు. నగరంలో రక్షణ కారిడార్కు శంకుస్థాపన చేయడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో

ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా “మన ‘పొరుగు దేశం’ కుయుక్తులకు, కుట్రలకు దేశ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ భారత్ వెన్నంటే ఉన్నాయి, పూర్తి మద్దతు పలుకుతున్నాయి. ఈ మేరకు పుల్వామా విషాదంపై అందిన అనేక సందేశాల్లో సంతాపమేగాక తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దేశాధినేతలందరూ సంసిద్ధంగా ఉన్నారు” అని పేర్కొన్నారు. మన వీరసైనికులు తమ జీవితాలను దేశం కోసం ధారపోశారని, వారి త్యాగం వృథాపోదని

ప్రధానమంత్రి చెప్పారు. పుల్వామా దాడి కారకులను కచ్చితంగా శిక్షించి తీరుతామని వాగ్దానం చేశారు. “ఇది నవ భారతమని మన పొరుగుదేశం మరచిపోయింది. పాకిస్థాన్ ప్రస్తుతం భిక్షాపాత్ర పట్టుకుని ప్రపంచాన్ని సాయం కోసం అడుక్కుంటోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఝాన్సీలో రక్షణ కారిడార్కు శంకుస్థాపన చేసిన ఆయన, ఝాన్సీ-ఆగ్రా మధ్య ఏర్పాటు కానున్న ఈ కారిడార్ వల్ల ఈ ప్రాంతంలోని అనేకమంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనేక స్వదేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడతాయన్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలోని కార్మికశక్తికి నైపుణ్య శిక్షణను అందిస్తాయని చెప్పారు. ఉపాధి కోసం ఈ ప్రాంతం నుంచి యువతీయువకులు మరో చోటకు వెళ్లాల్సిన దుస్థితి ఇక ఉండదని, వారంతా స్వస్థలంలో ఉద్యోగాలు పొందగలగటమే ఈ కారిడార్ ప్రాముఖ్యమని వివరించారు. రక్షణ ఉత్పత్తుల విషయంలో భారతదేశం

స్వావలంబన సాధించేందుకు కూడా ఈ కారిడార్ తోడ్పడుతుందని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

బుందేల్ఖండ్లోని గ్రామీణ ప్రాంతాలకు పైప్లైన్లద్వారా మంచినీరు సరఫరా చేసే ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కరవుపీడిత ప్రాంతానికి ఇది కేవలం పైప్లైన్ మాత్రమే కాదని లైఫ్లైన్

(జీవనరేఖ) కూడా కాగలదని ఆయన చెప్పారు. మన తల్లులు, అక్కచెల్లెళ్లకు బిందెడు నీటికోసం బండెడు దూరం నడవాల్సిన దుస్థితి తప్పుతుందన్నారు. ఇకపై ప్రతి ఇంటికీ కొళాయి కనెక్షన్ద్వారా మంచినీరు

సరఫరా అవుతుందని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా ‘అమృత్’ (AMRUT) పథకం కింద ఝాన్సీ

నగరానికి తాగునీరు సరఫరా పథకం రెండో దశకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇది రూ.600 కోట్లతో రూపొందుతున్నదని, దీనిద్వారా బెట్వా నది నుంచి ఝాన్సీతోపాటు పరిసర ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తారని వివరించారు. దీంతోపాటు 425 కిలోమీటర్ల పొడవైన ఝాన్సీ-మాణిక్పూర్, భీమ్సేన్-ఖైరార్ రైలు మార్గాలను రెండు లైన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో ఝాన్సీ నగరంలో రైలు పెట్టెల సుందరీకరణ కర్మాగారం నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఝాన్సీ-ఖైరార్ సెక్షన్లో విద్యుదీకరణ పూర్తయిన 297 కిలోమీటర్ల రైలుమార్గాన్నిప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులన్నిటివల్ల పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందని, మొత్తంమీద బుందేల్ఖండ్ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఇవన్నీ తోడ్పడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గుజరాత్లోని కచ్ ప్రాంతం కూడా బుందేల్ఖండ్ వంటిదేనని, కచ్ తరహాలోనే ఈ ప్రాంతం కూడా ప్రగతి పథంలో పయనించగలదని ఈ

సందర్భంగా మాట్లాడుతూ- ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్కు నిరంతర విద్యుత్ సరఫరాకు ఉద్దేశించిన పశ్చిమ-ఉత్తరప్రాంత విద్యుత్ ప్రసార

వ్యవస్థ బలోపేత ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీనివల్ల ఈ ప్రాంత విద్యుత్ అవసరాలు తీరే అవకాశాలు మెరుగవుతాయి. ఇవాళ ప్రారంభమైన ప్రాజెక్టులలో పహరీ డ్యామ్ ఆధునికీకరణ ప్రాజెక్టుకూ విశేష ప్రాధాన్యముంది. ప్రస్తుతం డ్యామ్ నుంచి నీటి లీకేజీని అరికట్టి రైతులకు నీటి సరఫరాను

మెరుగుపరచేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- “ప్రధానమంత్రి రైతు గౌరవ నిధి పథకం” కింద దేశంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసేందుకు రూ.7.5 లక్షల కోట్ల మేర బడ్జెట్లో కేటాయించినట్లు వెల్లడించారు. ఇదేవిధంగా ఇప్పటివరకూ రాయితీలు, ఉపకారవేతనాలు వంటివాటిని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడంద్వారా లీకేజీలను అరికట్టడంవల్ల రూ.లక్ష కోట్లదాకా ఆదా అయినట్లు వివరించారు.

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year

Media Coverage

One of the world’s first canal-top solar projects placed a 750-meter solar array above an Indian irrigation canal, generating clean power while saving an estimated 9 million liters of water each year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam underlining the importance of dedication and determined effort in accomplishing every goal
July 17, 2026
Prime Minister expresses happiness on the launch of India's first hydrogen train

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam underlining the importance of dedication and determined effort in accomplishing every goal:

"प्रभूतं कार्यमल्पं वा यन्नरः कर्तुमिच्छति।

सर्वारम्भेण तत् कार्यं सिंहादेकं प्रचक्षते।।"

The Prime Minister also said that the dream of India receiving its first hydrogen train has become a reality, marking a significant milestone in the nation's efforts to build a clean, green and future-ready transport system. He congratulated everyone associated with this remarkable achievement.

The Prime Minister posted on X:

आज भारत को पहली हाइड्रोजन ट्रेन मिलने का सपना साकार होने जा रहा है। यह आत्मनिर्भर भारत और सतत विकास की दिशा में एक बहुत बड़ा दिन है। मैं इससे जुड़े सभी लोगों को बहुत बधाई देता हूं।

प्रभूतं कार्यमल्पं वा यन्नरः कर्तुमिच्छति।

सर्वारम्भेण तत् कार्यं सिंहादेकं प्रचक्षते।।