Quoteప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంపు వంతెన అయిన చీనాబ్ వంతెనను, భారతదేశపు మొట్టమొదటి తీగల రైలు వంతెన అయిన అంజి వంతెనను ప్రారంభించిన ప్రధాని
Quoteజమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ప్రారంభించిన భారీ మౌలిక ప్రాజెక్టులు ఒక మలుపుః ప్రధాన మంత్రి
Quote'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు' అంతా ఒక్కటేనంటూ మేం ఎల్లప్పుడూ భారత మాతను స్మరించుకునేవాళ్ళం. ఇప్పుడు మన రైల్వే నెట్వర్క్ లోనూ అది వాస్తరూపం దాల్చింది: పీఎం
Quoteఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లైన్ ప్రాజెక్ట్ కొత్త, సాధికారత కలిగిన జమ్మూ కాశ్మీర్ కు చిహ్నం... భారత్ బలాన్ని ఇది మరింత పెంచుతుంది: పీఎం
Quoteచీనాబ్, అంజి వంతెనలు జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రవేశ ద్వారాలుగా సేవలు అందిస్తాయి:పీఎం
Quoteజమ్మూ కాశ్మీర్ భారతదేశానికి తలమానికం: ప్రధాన మంత్రి
Quoteఉగ్రవాదానికి భారత్ తలొగ్గదు, దానికి తగిన సమాధానం ఇవ్వడానికి జమ్మూ కాశ్మీర్ యువత ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు: పీఎం
Quoteఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్థాన్ కు తన అవమానకరమైన ఓటమి గుర్తొస్తుంది: ప్రధాన మంత్రి

ॐ माता वैष्णो देवी दे चरने च मत्था टेकना जय माता दी,

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారూ, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారూ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వినీ వైష్ణవ్ గారూ జితేంద్ర సింగ్ గారూ వి. సోమన్న గారూ, ఉప ముఖ్యమంత్రి సురేంద్ర కుమార్ గారూ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునిల్ గారూ, నా పార్లమెంటు సహచరుడు జుగల్ కిషోర్ గారూ, ఇతర ప్రజా ప్రతినిధులూ, ప్రియమైన సోదరీసోదరులరా... వీరుడైన జోరావర్ సింగ్ నడయాడిన గడ్డ ఇది. ఈ నేలకు ప్రణమిల్లుతున్నాను.

మిత్రులారా,

భారత ఐక్యత, సంకల్ప శక్తిని చాటే భారీ వేడుక నేటి కార్యక్రమం. మాతా వైష్ణో దేవి ఆశీస్సులతో కాశ్మీర్ లోయ నేడు భారత రైల్వే వ్యవస్థతో అనుసంధానమైంది. ‘కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు’ అంటూ ఎప్పటినుంచో మనం భరతమాత గురించి చెప్తూ వస్తున్నాం. రైల్వే వ్యవస్థలోనూ అదిప్పుడు సాకారమైంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా- ఈ రైల్వే లైన్ ప్రాజెక్టులు కేవలం పేర్లు మాత్రమే కావు. జమ్మూ కాశ్మీర్ నవోత్తేజాన్ని చాటే అస్తిత్వాలివి. నవీన భారత శక్తి ప్రకటనలివి. కొద్దిసేపటి కిందటే చీనాబ్ వంతెన, అంజి వంతెనలను ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. ఈరోజే జమ్మూ కాశ్మీర్‌కు రెండు కొత్త వందే భారత్ రైళ్లు వచ్చాయి. జమ్మూలో కొత్త వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశాం. రూ. 46 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో నూతనోత్తేజాన్ని నింపుతాయి. ఓ కొత్త అభివృద్ధి శకంలోకి అడుగిడుతున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ హాజీ నేలకు ప్రణమిల్లుతున్నాను.

మిత్రులారా,

రైలు ప్రయాణం గురించి కలలు కంటూనే జమ్మూ కాశ్మీర్‌లో అనేక తరాలు గడిచిపోయాయి. నిన్న నేను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు చేసిన ఓ ప్రకటన చూశాను. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఆయన 7-8 తరగతి చదువుతున్నప్పటి నుంచి ఎదురుచూస్తున్నారట. లక్షలాది జమ్మూ కాశ్మీర్ ప్రజల కల నేడు నిజమైంది. మేము చేయాల్సిన మంచి పనులు ఇంకెన్నో ఉన్నాయన్నది కూడా నిజం.

మిత్రులారా,

మా ప్రభుత్వ అదృష్టమేమిటంటే- ఈ ప్రాజెక్టు మా హయాంలో వేగం పుంజుకుంది. మేమే దీన్ని పూర్తి చేశాం. మధ్యలో కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ, మేం దృఢంగా నిలిచాం.
 

|

మిత్రులారా,

ప్రయాణాలలో ఇబ్బందులు, వాతావరణ సమస్యలు, పర్వతాల నుంచి నిరంతరం రాళ్ళు పడటం... ఇలా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, ఆ సవాలునే సవాలు చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మనగలిగేలా నేడు జమ్మూ కాశ్మీర్‌లో నిర్మిస్తున్న అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దీనికి ఉదాహరణ. సోన్‌మార్గ్ సొరంగం కొన్ని నెలల కిందటే మొదలైంది. ఇంతకుముందే చీనాబ్, అంజి వంతెన ద్వారా నేను మీ ముందుకొచ్చాను. ఈ వంతెనపై నడుస్తున్న వేళ దేశ దృఢ సంకల్పం నా ఆలోచనల్లో మెదిలింది. మన ఇంజినీర్లు, కార్మికుల నైపుణ్యం, ధైర్యం ఇందులో కనిపించింది. చీనాబ్ వంతెన ప్రపంచం అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. ప్రజలు ఐఫిల్ టవర్ చూసేందుకు పారిస్‌ వెళ్తారు. ఈ వంతెన ఐఫిల్ టవర్ కన్నా ఎత్తైనది. ఇకపై ప్రజలు చీనాబ్ వంతెన గుండా కాశ్మీర్‌ను చూసేందుకు వెళ్తారు. అంతేకాదు, ఈ వంతెన కూడా ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది. అందరూ సెల్ఫీ పాయింట్ కి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటారు. మన అంజి వంతెన కూడా ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ. ఇది దేశంలో తొలి తీగల రైల్వే వంతెన. ఈ రెండు వంతెనలూ కేవలం ఇటుక, సిమెంట్, ఉక్కు, ఇనుముతోనే నిర్మించినవి కావు.. పిర్‌పంజాల్ అనే దుర్గమ పర్వతాలపై భారత శక్తికి సజీవ చిహ్నంగా నిలిచిన ఉదాహరణలవి. భారత ఉజ్జ్వల భవిష్యత్ గర్జన ఇది. అభివృద్ధి చెందిన భారత్ అనే మన స్వప్నం ఎంత పెద్దదో.. మన ధైర్యం, సామర్థ్యం కూడా అంతే ఉన్నతమైనవని ఇది నిరూపిస్తుంది. మన సదుద్దేశం, విస్తృతమైన కృషి మరో అత్యంత ముఖ్యమైన విషయం.

మిత్రులారా,

చీనాబ్, అంజి వంతెలు రెండూ జమ్మూ, కాశ్మీర్ ఇరు ప్రాంతాలకూ సంక్షేమ సాధనాలుగా నిలుస్తాయి. ఇవి పర్యాటకాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి. జమ్మూ, కాశ్మీర్ మధ్య రైలు అనుసంధానం రెండు ప్రాంతాల వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇది ఇక్కడి పరిశ్రమలకూ ఊతమిస్తుంది. ఇప్పుడు కాశ్మీర్ యాపిల్స్ దేశంలోని పెద్ద మార్కెట్లకు తక్కువ ఖర్చుతోనే సకాలంలో చేరుకుంటాయి. డ్రై ఫ్రూట్స్ అయినా, పష్మినా శాలువాలయినా.. ఇక్కడి హస్తకళలు ఇకపై దేశంలోని ఏ ప్రాంతానికైనా సులభంగా చేరుకోగలవు. దీని వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం కూడా సులభతరమవుతుంది.

మిత్రులారా,

వార్తాపత్రికలో సంగల్డాన్‌కు చెందిన ఓ విద్యార్థి వ్యాఖ్యను నేను చదివాను. ఇప్పటి వరకు తమ ఊర్లో ఊరినుంచి బయటకు వెళ్లినవారు మాత్రమే రైలును చూశారట. ఆ గ్రామంలో చాలా మంది వీడియోలో మాత్రమే రైలును చూశారు. వారి కళ్లెదుట నిజంగా ఓ రైలు పరుగులు పెడుతోందని వారు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. రైళ్ల రాకపోకల సమయాలనూ చాలా మంది గుర్తు చేసుకుంటున్నట్టు నేను చదివాను. మరో బిడ్డ చాలా మంచి విషయం చెప్పింది – ఇకపై దారులు తెరిచే ఉంటాయా, మూతపడతాయా అన్నది వాతావరణమే నిర్ణయించదు. ఈ కొత్త రైలు సర్వీసు ప్రతి రుతువులోనూ ప్రజలకు సేవలందిస్తుంది.

మిత్రులారా,

జమ్మూ కాశ్మీర్ భరతమాతకు కిరీటం. అందమైన రత్నాలెన్నో ఈ కిరీటాన్ని అలంకరించాయి. ఇవే జమ్మూకాశ్మీర్ బలం. ఇక్కడి ప్రాచీన సంస్కృతి, ఇక్కడి సంప్రదాయాలు, ఇక్కడి ఆధ్యాత్మిక చేతన, ప్రకృతి సౌందర్యం, ఇక్కడి మూలికా ప్రపంచం, పూలూ పండ్లు సమృద్ధి, ఇక్కడి యువతలోనూ మీలోనూ ఉన్న ప్రతిభ... కిరీటంలో రత్నంలా ప్రకాశిస్తాయి.
 

|

మిత్రులారా,

నేను దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌ను సందర్శిస్తున్న విషయం మీకు బాగా తెలుసు. లోపలి ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉండే అవకాశం నాకు లభించింది. ఇక్కడి స్థిరమమైన సామర్థ్యాన్ని నేను చూశాను, ఆస్వాదించాను. అందుకే నేను జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నాను.

మిత్రులారా,

భారతదేశ విద్య, సంస్కృతికి జమ్మూ కాశ్మీర్ గర్వకారణం. నేడు మన జమ్మూ కాశ్మీర్ ప్రపంచంలోని అతిపెద్ద విజ్ఞాన కేంద్రాలలో ఒకటిగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఇందులో జమ్మూ కాశ్మీర్ భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, ఎన్ఐటీ వంటి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. జమ్మూ, శ్రీనగర్‌లలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో పరిశోధన కూడా విస్తరిస్తోంది.

మిత్రులారా,

చదువులతో పాటు వైద్యంలోనూ అపూర్వమైన కృషి ఇక్కడ జరుగుతోంది. కొన్నేళ్లలో రెండు రాష్ట్ర స్థాయి క్యాన్సర్ సంస్థలను స్థాపించాం. గత అయిదేళ్లలో ఇక్కడ ఏడు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించాం. ఒక వైద్య కళాశాల ప్రారంభిస్తే, రోగులు మాత్రమే కాకుండా ఆ ప్రాంత యువత కూడా చాలా ప్రయోజనం పొందుతారని మీకు తెలుసు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 500 నుంచి 1300కు పెరిగింది. ఇప్పుడు రియాసి జిల్లాలో కూడా కొత్త వైద్య కళాశాల ప్రారంభం కాబోతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. శ్రీ మాతా వైష్ణో దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్- ఇది ఆధునిక ఆసుపత్రి మాత్రమే కాదు, మన దాతృత్వ సంస్కృతికీ ఉదాహరణ. దేశం నలుమూలల నుంచి మాతా వైష్ణోదేవి దర్శనానికి వచ్చిన ప్రజలే ఈ వైద్య కళాశాల నిర్మాణ వ్యయాన్ని సమకూర్చారు. ఈ పవిత్ర కార్యంపట్ల శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు, దాని చైర్మన్ మనోజ్ గారికి నా శుభాకాంక్షలు. ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని కూడా 300 పడకల నుంచి 500 పడకలకు పెంచుతున్నారు. కత్రాలోని మాతా వైష్ణో దేవి దర్శనానికి వచ్చే ప్రజలకూ ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

మిత్రులారా,

కేంద్రంలో బీజేపీ - ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈ 11 ఏళ్లనూ పేదల సంక్షేమానికే అంకితం చేశాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల మంది పేదల ఇంటి కలను సాకారం చేశాం. ఉజ్వల యోజనతో 10 కోట్ల వంటిళ్లలో నుంచి పొగను పోగొట్టాం. మన అక్కాచెల్లెళ్లు, మన బిడ్డలకు ఇదెంతో ఉపయోగకరం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 50 కోట్ల మంది పేదలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స సదుపాయాన్ని అందించాం. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రతి ఒక్కరికీ తగినంత ఆహారాన్ని అందించింది. జన్‌ధన్ యోజన ద్వారా 50 కోట్లకు పైగా పేద ప్రజలకు మొదటిసారిగా బ్యాంకు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. చీకటిలో నివసిస్తున్న 2.5 కోట్ల కుటుంబాలకు సౌభాగ్య యోజన ద్వారా విద్యుత్ సౌకర్యం లభించింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్ల టాయిలెట్లను నిర్మించడం ద్వారా ప్రజలకు బహిరంగ విసర్జన నుంచి విముక్తి కలిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 12 కోట్ల కొత్త ఇళ్లకు కుళాయి నీరు అందింది. ఇది మహిళలకు ఎంతో సౌలభ్యాన్ని అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 10 కోట్ల మంది చిన్న రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం లభించింది.
 

|

మిత్రులారా,

ప్రభుత్వం చేసిన ఇలాంటి అనేక ప్రయత్నాల ఫలితంగా గత 11 ఏళ్లలో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికంతో పోరాడి దాన్ని జయించారు. వారంతా మన సోదరీ సోదరులే. వారు పేదరికాన్ని అధిగమించారు. ఇప్పుడు వారు కొత్త మధ్యతరగతిలో భాగమయ్యారు. సామాజిక నిపుణులుగా చెప్పుకొనే వారు, గతంలోనూ భవిష్యత్తులోనూ రాజకీయాలే ప్రధానంగా ఉన్నవారు, దళితుల పేరిట రాజకీయ లాభాలు ఆర్జిస్తున్న వారు ఇంతకుముందే నేను ప్రస్తావించిన పథకాలను ఓసారి పరిశీలించండి. ఈ సౌకర్యాలను పొందిన వ్యక్తులెవరో, స్వాతంత్ర్యానంతరం 77 ఏళ్లపాటు ఈ ప్రాథమిక సౌకర్యాలను కోల్పోయిన వ్యక్తులెవరో తెలుస్తుంది. వీళ్ళు నా దళిత సోదరీ సోదరులు, గిరిజన సోదరీ సోదరులు, వెనుకబడిన వర్గాల సోదరీ సోదరులు, పర్వతాలలో నివసించే వాళ్ళు, అడవులలో జీవించే వాళ్ళు, జీవితం మొత్తం మురికివాడల్లోనే గడిపిన వాళ్ళు.. ఈ కుటుంబాల కోసమే మోదీ 11 ఏళ్లు వెచ్చించాడు. పేదలకు, కొత్త మధ్యతరగతికి జవసత్వాలందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఒక ర్యాంకు ఒక పింఛను, రూ. 12 లక్షల వరకు జీతాన్ని పన్ను రహితం చేయడం, ఇల్లు కొనడానికి ఆర్థిక సాయం, తక్కువ ధరలకే విమాన ప్రయాణానికి చేయూత... ప్రభుత్వం అన్ని విధాలుగా పేదలు, మధ్యతరగతి ప్రజలతో భుజం భుజం కలిపి నడుస్తోంది.

మిత్రులారా,

పేదరికం నుంచి బయటపడేలా చేయూతనివ్వడంతోపాటు నిజాయితీగా జీవిస్తూ, దేశం కోసం ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి కోసం, వారి సామర్థ్యాన్ని కూడా పెంచేలా స్వాతంత్రయానంతరం మొదటిసారిగా ఇంత కృషి జరిగింది. మేమీ ప్రయత్నం చేశాం.  

 

Release ID: 2134533 PART-02 VETTED-BSR 

 

 మిత్రులారా,

మన యువతకు కొత్త ఉపాధి అవకాశాలు నిరంతరం మెరుగవుతున్నాయి. దీనికి ఒక ముఖ్యమైన మార్గం పర్యాటకం. పర్యాటకం ఉపాధిని అందిస్తుంది, పర్యాటకం ప్రజలను కలుపుతుంది. కానీ దురదృష్టవశాత్తూ, మన పొరుగు దేశం మానవాళికి, సామరస్యానికి, పర్యాటకానికి వ్యతిరేకం.. పేదల జీవనోపాధికి కూడా వ్యతిరేకం. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దాడి దీనికి ఒక ఉదాహరణ. పహల్గామ్‌లో మానవత్వం, కశ్మీరియత్ రెండింటిపైనా పాకిస్తాన్ దాడి చేసింది. భారత్‌లో అల్లర్లు సృష్టించడమే వారి ఉద్దేశం. కాశ్మీర్‌లోని కష్టపడి పనిచేసే ప్రజల సంపాదనను ఆపడమే వారి ఉద్దేశం. అందుకే పాకిస్తాన్ పర్యాటకులపై దాడి చేసింది. గత 4-5 సంవత్సరాలుగా నిరంతర అభివృద్ధి చెదుతున్న పర్యాటకంతో ప్రతి యేటా రికార్డు సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పేదల కుటుంబాలను పోషించే పర్యాటకాన్ని పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. కొందరు గుర్రపు స్వారీ చేసేవారు, కొందరు పోర్టర్లు, కొందరు గైడ్‌లు, కొందరు గెస్ట్‌హౌస్ యజమానులు, కొందరు షాప్-ధాబా యజమానులు, వారందరి ఉపాధిని నాశనం చేయడమే పాకిస్తాన్ కుట్ర. ఉగ్రవాదులను సవాలు చేసిన యువకుడు ఆదిల్ కూడా పహల్గామ్‌లో కూలీ పని చేయడానికి వెళ్ళాడు, అతను తన కుటుంబ పోషణ కోసం ఆ పని చేస్తున్నాడు. ఉగ్రవాదులు ఆదిల్‌ను కూడా అన్యాయంగా చంపేశారు.

మిత్రులారా,

పాకిస్తాన్ కుట్రకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ ప్రజలు నిలబడిన తీరు, ఈసారి జమ్మూ కశ్మీర్ ప్రజలు చూపించిన పరాక్రమం ద్వారా, పాకిస్తాన్‌కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచంలోని ఉగ్రవాదానికి బలమైన సందేశం ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ యువత ఇప్పుడు ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. లోయలోని పాఠశాలలను తగలబెట్టిన ఉగ్రవాదం ఇది. పాఠశాలలు.. భవనాలను మాత్రమే కాదు, రెండు తరాల భవిష్యత్తును తగలబెట్టింది. ఆసుపత్రులు నాశనమయ్యాయి. ఇది అనేక తరాలను నాశనం చేసింది. ఇక్కడి ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకోవచ్చు, ఇక్కడ ఎన్నికలూ నిర్వహించవచ్చు, అయితే ఉగ్రవాదం కారణంగా అది పెద్ద సవాలుగా మారింది.

 

|

మిత్రులారా,

ఏళ్ల తరబడి ఉగ్రవాదాన్ని భరించిన క్రమంలో, జమ్మూ కశ్మీర్ చాలా విధ్వంసాలను చూసింది. జమ్మూ కశ్మీర్ ప్రజలు కలలు కనడం మానేసి, ఉగ్రవాదాన్ని తమ విధిగా అంగీకరించారు. ఈ పరిస్థితి నుంచి జమ్మూ కశ్మీర్‌ను బయటకు తీసుకురావడం అవసరం, మేం దానిని సాధించాం. నేడు, జమ్మూ కశ్మీర్ యువత కొత్త కలలు కంటున్నారు.. అలాగే వాటిని సాకారం చేసుకుంటున్నారు. ఇప్పుడు స్థానికంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు సందడిగా ఉండటం చూసి కశ్మీర్ యువత సంతోషంగా ఉన్నారు. ఇక్కడి ప్రజలు జమ్మూ కశ్మీర్‌ను మళ్లీ సినిమా షూటింగ్‌లకు ప్రధాన కేంద్రంగా చూడాలనుకుంటున్నారు.. ఈ ప్రాంతం క్రీడా కేంద్రంగా మారాలని వారు కోరుకుంటున్నారు. మాతా ఖీర్ భవానీ ఉత్సవంలో కూడా మనం అదే భావాన్ని చూశాం. వేలాది మంది ప్రజలు మాతా ఆలయానికి చేరుకున్న విధానం.. కొత్త జమ్మూ కశ్మీర్ చిత్రాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు అమర్‌నాథ్ యాత్ర కూడా 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈద్ ఉత్సాహాన్ని కూడా మనం ప్రతిచోటా చూస్తున్నాం. జమ్మూ కశ్మీర్‌లో ఏర్పడిన అభివృద్ధి వాతావరణం పహల్గామ్ దాడితో ఏ మాత్రం వెనక్కి తగ్గదు. జమ్మూ కశ్మీర్‌లోని మీ అందరికీ, మీ అందరికీ నరేంద్ర మోదీ ఇస్తున్న హామీ ఏమిటంటే.. అభివృద్ధి ఇక్కడితో ఆగిపోనివ్వను. ఇక్కడి యువత తమ కలలను నెరవేర్చుకోవడానికి ఏదైనా అడ్డంకి వస్తే, ఆ అడ్డంకిని ఎదుర్కొనే మొదటి వ్యక్తి మోదీనే అవుతారు.

మిత్రులారా,

ఈరోజు జూన్ 6, ఒక నెల క్రితం.. సరిగ్గా ఒక నెల క్రితం, అంటే మే 6వ తేదీ రాత్రి, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంతరించిపోయారని గుర్తుంచుకోండి. ఇక ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా, పాకిస్తాన్‌కు తన ఘోర పరాభవమే గుర్తుకొస్తుంది. భారత్ ఇలా నేరుగా పాకిస్తాన్‌లోకి వందల కిలోమీటర్లు వెళ్లి ఉగ్రవాదులపై దాడి చేస్తుందని పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించలేదు. వారు సంవత్సరాల తరబడి కష్టపడి నిర్మించిన ఉగ్రవాదుల భవనాలు కొద్ది నిమిషాల్లోనే శిథిలాలుగా మారాయి. దీనిని చూసి నిరాశలో కూరుకుపోయిన పాకిస్తాన్ రెచ్చిపోయి.. జమ్మూ, పూంచ్, ఇతర జిల్లాల ప్రజలపై కూడా తన ఆక్రోశాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ ఇక్కడి ఇళ్లను నాశనం చేయడం, పిల్లలపై గుండ్లు విసరడం, పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలను కాల్చడం ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్ దాడులను మీరు ఎలా ప్రతిఘటించారో దేశంలోని ప్రతి పౌరుడు చూశాడు. అందుకే దేశంలోని ప్రతి పౌరుడు తమ కుటుంబాలతో సహా పూర్తి శక్తితో మీకు అండగా నిలుస్తున్నారు.

మిత్రులారా,

కొద్ది రోజుల క్రితం, సరిహద్దు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.  దాడుల వల్ల ప్రభావితమైన 2 వేలకు పైగా కుటుంబాల బాధ మా సొంత బాధ కూడా. షెల్లింగ్ తర్వాత ఈ కుటుంబాలకు వారి ఇళ్లను మరమ్మతు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని మరింత పెంచాలని నిర్ణయించింది. నేటి కార్యక్రమంలో, దీని గురించి కూడా మీకు సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను.

మిత్రులారా,

ఇప్పుడు, తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 1 లక్ష అదనపు సహాయంగా అందిస్తున్నాం. అంటే మొదటి దఫా సహాయం తర్వాత ఇప్పుడు వారికి ఈ అదనపు మొత్తం లభిస్తుంది.
 

|

మిత్రులారా,

మా ప్రభుత్వం సరిహద్దులో నివసించే ప్రజలను దేశానికి ప్రథమ కాపలాదారులుగా భావిస్తుంది. గత దశాబ్దంలో, సరిహద్దు జిల్లాల్లో అభివృద్ధి, భద్రత కోసం ప్రభుత్వం అపూర్వమైన కృషి చేసింది. ఈ కాలంలో సుమారు పది వేల కొత్త బంకర్లు నిర్మించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏర్పడిన పరిస్థితిలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఈ బంకర్లు చాలా సహాయకరంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ డివిజన్ కోసం రెండు సరిహద్దు బెటాలియన్లను కొత్తగా ఏర్పాటు చేశామని మీకు తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది. రెండు ప్రత్యేక మహిళా బెటాలియన్లను ఏర్పాటు చేసే పని కూడా పూర్తయింది.

మిత్రులారా,

మన అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నాం. కథువా-జమ్మూ హైవేను ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌వేగా మారుస్తున్నాం, అఖ్నూర్-పూంచ్ హైవేను కూడా మరింత విస్తరిస్తున్నాం. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద, సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీ లేని 400 గ్రామాలను.. 1800 కిలోమీటర్ల కొత్త రహదారులతో అనుసంధానిస్తున్నాం. దీని కోసం కూడా ప్రభుత్వం 4200 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.
 

|

మిత్రులారా,

ఈ రోజు నేను జమ్మూ కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా ఇక్కడి యువతకు, అలాగే జమ్మూ కశ్మీర్ గడ్డ నుంచి యావత్ దేశానికి కూడా ఒక ప్రత్యేక అభ్యర్థన చేస్తున్నాను. ఆపరేషన్ సిందూర్ స్వయం-సమృద్ధి గల భారత్ శక్తిని ఎలా ప్రదర్శించిందో మీరు చూశారు. నేడు ప్రపంచమంతా భారత రక్షణ రంగ వ్యవస్థ గురించి చర్చిస్తోంది. దీని వెనుక ఒకే ఒక కారణం ఉంది.. మన దళాలు 'మేక్ ఇన్ ఇండియా'పై విశ్వాసం ఉంచాయి. ఇప్పుడు ప్రతి భారతీయుడు కూడా మన దళాలు చేసిన పనిని పునరావృతం చేయాలి. ఈ సంవత్సరం బడ్జెట్‌లో, మేం మిషన్ మానుఫ్యాక్చర్ ప్రకటించాం. ఈ మిషన్ ద్వారా ప్రభుత్వం తయారీ రంగానికి కొత్త ప్రేరణనిచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ మిషన్‌లో భాగం కావాలని నేను జమ్మూ కశ్మీర్ యువతకు పిలుపునిస్తున్నాను. దేశానికి మీ ఆధునిక ఆలోచనలు అవసరం, దేశానికి మీ ఆవిష్కరణలు అవసరం. మీ ఆలోచనలు, మీ నైపుణ్యాలు దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థకు కొత్త మార్గాలను సూచిస్తాయి. గత పదేళ్లలో, భారత్ రక్షణరంగ పరికరాల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణరంగ పరికరాల ఎగుమతిదారుల సరసన భారత్‌ను చేర్చడమే మా లక్ష్యం. ఈ లక్ష్యం వైపు మనం ఎంత వేగంగా ముందు సాగుతూ ఉంటే.. దేశంలో అంతేవేగంగా లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

మిత్రులారా,

మనం మరొక ప్రతిజ్ఞ చేయాలి.. ముందుగా భారత్‌లో తయారైన ఉత్పత్తులను మాత్రమే మనం కొనుగోలు చేయాలి. అంటే మన దేశ ప్రజల శ్రమ శక్తితో రూపొందిన ఉత్పత్తులనే మనం కొనుగోలు చేయాలి. ఇదే దేశభక్తి.. ఇదే దేశ సేవ. సరిహద్దులో మన దళాల గౌరవాన్ని పెంచాలి.. మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా గర్వాన్నీ పెంచాలి.

 

|

మిత్రులారా,

జమ్మూ కశ్మీర్ కోసం బంగారంలాంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఎదురుచూస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర మద్దతుతో అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నాయి. మనం ముందుకు సాగుతున్న శాంతి- శ్రేయస్సు మార్గాన్ని నిరంతరం బలోపేతం చేసుకోవాలి. మా వైష్ణో దేవి ఆశీర్వాదంతో, అభివృద్ధి చెందిన భారత్.. అభివృద్ధి చెందిన జమ్మూ కశ్మీర్ సంకల్పం త్వరలోనే నెరవేరాలి. ఈ ఆకాంక్షతోనే, పలు అభివృద్ధి పనులు, అద్భుతమైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్న శుభ సందర్భంలో నేను మరోసారి మీ అందరినీ అభినందిస్తున్నాను. మీ రెండు పిడికిళ్లను బిగించి.. మీ పూర్తి బలంతో నాతో పాటు చెప్పండి -

భారత్ మాతా కీ జై! ఈ నినాదం దేశంలోని ప్రతి మూలలోనూ ప్రతిధ్వనించాలి.

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

మీ అందరికీ చాలా ధన్యవాదాలు!

 

  • Gaurav munday June 19, 2025

    💚🌸🌸
  • Soumen Pal June 18, 2025

    Modi ji zindabad
  • Prafulla bhanudas bhalshankar June 18, 2025

    दहशतवाद्यांचे तुकडे करून टाकणारे प्रधानमंत्री नरेंद्र मोदी जी
  • ram Sagar pandey June 18, 2025

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय माता दी 🚩🙏🙏ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹जय श्रीराम 🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹जय माता दी 🚩🙏🙏
  • Polamola Anji June 18, 2025

    bjp🔥🔥
  • Polamola Anji June 18, 2025

    bjp🔥
  • Virudthan June 17, 2025

    🔴🔴🔴🔴Retail inflation dropped to 2.82% in May 2025, lowest in 75 months, driven by stable food prices & favorable base effects.
  • Virudthan June 17, 2025

    🔴🔴🔴🔴 India's retail inflation in May 2025 declined to 2.82%, the lowest since February 2019, driven by a significant drop in food inflation. #RetailInflation #IndianEconomy
  • khaniya lal sharma June 17, 2025

    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
  • SUNIL CHAUDHARY KHOKHAR BJP June 17, 2025

    17/06/2025
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Indian IPO market heads for busiest week with $1.7 billion in deals

Media Coverage

Indian IPO market heads for busiest week with $1.7 billion in deals
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Bihar will prosper and will also play a big role in the prosperity of the country: PM Modi in Siwan
June 20, 2025
QuoteBihar will prosper and will also play a big role in the prosperity of the country: PM
QuoteA record 25 crore Indians have defeated poverty in the last decade: PM
QuoteBihar will become a big center of Made in India,today, the first engine from the Marhowra Locomotive Factory is being exported to Africa: PM

भारत माता की जय!

भारत माता की जय!

भारत माता की जय!

रऊआ सब लोगन के प्रणाम कर तानी। बाबा महेंद्र नाथ, बाबा हंसनाथ, सोहगरा धाम, मां थावे भवानी, मां अंबिका भवानी, प्रथम राष्ट्रपति देशरत्न डॉ राजेंद्र प्रसाद अऊरी लोकनायक जयप्रकाश नारायण के पावन भूमि पर रऊआ सब के अभिनंदन कर तानी!

बिहार के राज्यपाल श्रीमान आरिफ मोहम्मद खान जी, यहां की जनता की सेवा में समर्पित मुख्यमंत्री श्रीमान नीतीश कुमार जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी जीतन राम मांझी जी, गिरिराज सिंह जी, ललन सिंह जी, चिराग पासवान जी, रामनाथ ठाकुर जी, नित्‍यानंद राय जी, सतीश चंद्र दुबे जी, राजभूषण चौधरी जी, बिहार के उपमुख्यमंत्री सम्राट चौधरी जी, विजय कुमार सिन्हा जी, संसद के मेरे साथी उपेंद्र कुशवाहा जी, बिहार बीजेपी के अध्यक्ष दिलीप जायसवाल जी, अन्य मंत्रीगण, सांसद और विधायक गण और मेरे प्यारे बिहार के भाइयों और बहनों!

सिवान की ये धरती हमारे स्वतंत्रता संग्राम की प्रेरक स्‍थली है। यह हमारे लोकतंत्र को, देश को, संविधान को ताकत देने वाली भूमि है। सिवान ने राजेंद्र बाबू जैसी महान संतान देश को दी। संविधान निर्माण से लेकर देश को दिशा दिखाने में राजेंद्र बाबू की बहुत बड़ी भूमिका रही। सिवान ने ब्रज किशोर प्रसाद जी जैसी महान समाज सुधारक भी देश को दिए। ब्रज बाबू ने महिला सशक्तिकरण को अपने जीवन का मकसद बनाया था।

|

साथियों,

मुझे खुशी है ऐसी ही महान आत्माओं के जीवन मिशन को एनडीए की यह डबल इंजन सरकार दृढ़ निश्‍चय के साथ आगे बढ़ा रही है। आज का यह कार्यक्रम इन्हीं प्रयासों का हिस्सा है। आज इस मंच से हजारों करोड़ रुपए की योजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। विकास की ये सारी परियोजनाएं बिहार को उज्ज्वल भविष्‍य की तरफ ले जाएगी, समृद्ध बिहार बनाएगी। सिवान, सासाराम, बक्सर, मोतिहारी, बेतिया और आरा जैसे बिहार के सारे इलाके फलें-फूलें, इस दिशा में ये प्रोजेक्ट बड़ी भूमिका निभाएंगे। इनसे गरीब, वंचित, दलित, महादलित, पिछड़े, अति पिछड़े, हर समाज का जीवन आसान होगा। मैं बिहार की जनता को, आप सभी को इन प्रोजेक्‍ट्स के लिए बहुत-बहुत बधाई देता हूं। मैं अभी जब आप लोगों के बीच से आ रहा था, अभी कल ही बारिश हुई। सुबह भी थोड़ा बारिश का लाभ आया, इसके बावजूद भी इतनी बड़ी मात्रा में आपका आना, हमें आशीर्वाद देना, मैं आपका हृदय से जितना धन्यवाद करूं, उतना कम है।

भाइयों और बहनों,

जैसा आप सब जानते हैं, मैं कल ही विदेश से लौटा हूं। इस दौरे में मेरी दुनिया के बड़े-बड़े समृद्ध देशों के नेताओं से बात हुई। सारे नेता भारत की तेज प्रगति से बहुत प्रभावित हैं। वो भारत को दुनिया की तीसरी बड़ी आर्थिक महाशक्ति बनते देख रहे हैं और निश्चित तौर पर इसमें बिहार की बहुत बड़ी भूमिका होने वाली है। बिहार समृद्ध होगा और देश की समृद्धि में भी बड़ी भूमिका निभाएगा।

साथियों,

मेरे इस विश्वास का कारण बिहार के आप सभी लोगों का सामर्थ्य है। आपने मिलकर बिहार में जंगलराज का सफाया किया है। यहां के हमारे नौजवानों ने तो 20 साल पहले के बिहार की बदहाली सिर्फ किस्सों और कथाओं में ही सुनी है। उन्हें बहुत अंदाजा नहीं है कि जंगलराज वालों ने बिहार की क्या हालत बना दी थी। जिस बिहार ने सदियों तक भारत की प्रगति को नेतृत्व दिया, उसको पंजे और लालटेन के शिकंजे ने पलायन का प्रतीक बना दिया था।

|

साथियों,

बिहार के रहने वाले हर व्यक्ति के लिए सबसे बड़ी बात होती है, उसका स्‍वाभिमान। मेरे बिहारी भाई-बहन कठिन से कठिन परिस्थिति में काम करके दिखा देते हैं। वह कभी अपने स्वाभिमान से समझौता नहीं करते। लेकिन पंजे और लालटेन वालों ने मिलकर बिहार के स्वाभिमान को बहुत ठेस पहुंचाई। इन लोगों ने ऐसी लूट-खसोट मचाई की गरीबी बिहार का दुर्भाग्य बन गई। अनेक चुनौतियों को पार करते हुए नीतीश जी के नेतृत्व में NDA सरकार बिहार को विकास की पटरी पर वापस लाई है और मैं बिहारवासियों को विश्वास देने आया हूं, हमने भले ही बहुत कुछ किया हो, करते रहे हैं, करते रहेंगे, लेकिन इतने से शांत होकर के चुप रहने वाला मोदी नहीं है, अब बहुत हो गया, बहुत कर लिया जी नहीं, मुझे तो बिहार के लिए और भी बहुत कुछ करना है, आपके लिए करना है, यहां के गांव-गांव के लिए करना है, यहां के घर-घर के लिए करना है, यहां के हर नौजवान के लिए करना है। अगर मैं सिर्फ बीते 10-11 साल की बात करूं तो इन 10 वर्षों में बिहार में करीब 55 हजार किलोमीटर ग्रामीण सड़कें बनी हैं, डेढ़ करोड़ से ज्यादा घरों को बिजली के कनेक्शन से जोड़ा गया है, डेढ़ करोड़ लोगों को, वहां के घरों को पानी का कनेक्शन दिया गया है, 45 हजार से ज्यादा कॉमन सर्विस सेंटर्स बनाए गए हैं, आज बिहार के छोटे-छोटे शहरों में नए-नए स्टार्ट-अप्स खुल रहे हैं।

साथियों,

बिहार की प्रगति की ये गति लगातार बढ़ती है, इसको बढ़ाते रहना है और इसी समय बिहार में जंगलराज लाने वाले मौका देख रहे हैं कि किसी भी तरह फिर से अपने पुराने कारनामे करने का मौका ढूंढ रहे हैं। बिहार के आर्थिक संसाधनों पर कब्जा करें, इसके लिए वो तरह-तरह के हथकंडे अपना रहे हैं, इसलिए मेरे बिहार के प्यारे भाइयों-बहनों, आप के उज्ज्वल भविष्‍य के लिए, आपके बच्‍चों के उज्ज्वल भविष्‍य के लिए, आपको बहुत ही सतर्क रहना है। समृद्ध बिहार की यात्रा पर ब्रेक लगाने के लिए तैयार बैठे लोगों को कोसों दूर रखना है।

साथियों,

गरीबी हटाओ के नारे हमारे देश ने दशकों तक सुने हैं, आपकी दो-दो, तीन-तीन पीढ़ी ने गरीबी हटाओ! गरीबी हटाओ! हर चुनाव में, ये आकर के बोलते थे। लेकिन जब आपने हमें मौका दिया, एनडीए को मौका दिया, तो NDA सरकार ने दिखाया है कि गरीबी कम भी हो सकती है। बीते एक दशक में रिकॉर्ड 25 करोड़ भारतीयों ने गरीबी को पराजित किया है। वर्ल्ड बैंक जैसी दुनिया की जानी-मानी संस्थाएं, भारत की इस बड़ी उपलब्धि की प्रशंसा कर रही हैं। और भारत ने जो ये कमाल किया है, इसमें बिहार का यहां हमारे नीतीश जी की सरकार का बहुत बड़ा योगदान है। पहले बिहार की आधे से अधिक आबादी, बहुत अधिक गरीब की श्रेणी में आती थी। लेकिन बीते दशक में बिहार के करीब पौने चार करोड़ साथियों ने खुद को गरीबी से मुक्त किया है।

|

साथियों,

आज़ादी के इतने दशकों तक भी इतने लोग गरीब थे, नारे गूंजते रहे, गरीबी बढ़ती रही और ये इसलिए नहीं हुआ कि बिहार के लोगों की मेहनत में कोई कमी थी, देशवासियों की मेहनत में कोई कमी थी। बल्कि इसलिए क्योंकि इनके सामने आगे बढ़ने का कोई रास्ता नहीं था। लंबे समय तक कांग्रेस के लाइसेंस राज ने देश को गरीब रखा और गरीब को अति गरीबी में धकेल दिया। जब हर चीज के लिए कोटा-परमिट फिक्स था। छोटे-छोटे काम करने के लिए परमिट चाहिए होता था। कांग्रेस-RJD के राज में गरीब को घर नहीं मिलता था, राशन, बिचौलिए खा जाते थे, इलाज गरीब की पहुंच से दूर था, पढ़ाई और कमाई के लिए संघर्ष था, बिजली-पानी का एक कनेक्शन लगाने के लिए ही सरकारी दफ्तरों के अनगिनत चक्कर लगाने पड़ते थे। गैस कनेक्शन के लिए सांसदों की सिफारिश लगानी पड़ती थी। नौकरी बिना घूस, बिना सिफारिश के मिलती ही नहीं थी। और इसके सबसे बड़े भुक्तभोगी कौन थे, इनमें से ज्यादातर साथी मेरे दलित समाज के, महादलित समाज के, पिछड़े समाज के, अति पिछड़े समाज के यही मेरे भाई-बहन इसके शिकार हुए थे। इन्हें गरीबी हटाने का सपना दिखाकर खुद कुछ परिवार करोड़पति-अरबपति हो गए।

साथियों,

बीते 11 वर्षों से हमारी सरकार, गरीब के रास्ते की हर मुश्किल को दूर करने में जुटी है और आगे भी करती रहेगी और इतनी मेहनत करते हैं, तब ऐसे अच्‍छे परिणाम आज देखने को मिल रहे हैं। अब जैसे गरीबों के लिए आवास हैं, अभी जिन परिवारों को मुझे आवास की चाबी देने का मुझे मौका मिला, वह इतने आशीर्वाद दे रहे थे, उनके चेहरे पर इतना संतोष था, भाव-विभोर थे।

साथियों,

बीते दशक में देशभर में चार करोड़ से अधिक गरीबों को पक्के घर मिल चुके हैं। मैं आपको पूछूं, जवाब देंगे आप लोग? मैं अगर पूछूं, तो आप जवाब देंगे? मैंने अभी कहा, चार करोड़ लोगों को यानी चार करोड़ परिवारों को पक्के घर, कितने लोगों को, जरा जोर से बोलिए कितने लोगों को? चार करोड़! आप कल्पना कीजिए, चार करोड़ लोगों को पक्के घर मिलना, सिर्फ वह चार दीवारें नहीं हैं, उन घरों में सपने सजते हैं, उन घरों में संकल्प पलते हैं। आने वाले समय में तीन करोड़ और पक्के घर तैयार होने जा रहे हैं। मैंने पहले कहा ना, सेवा के काम में मैं रुकने वाला नहीं हूं। जितना हुआ, पहले वालों से बहुत अच्छा हुआ, फिर भी मोदी चैन की नींद नहीं सोएगा, वह दिन-रात काम करता रहेगा, आपके लिए करता रहेगा क्योंकि आप मेरे परिवार के सदस्य हैं और मेरे परिवार का एक भी सदस्य पीछे न रहे, दुखिया न रहे, यह मैं सपना लेकर के चला हूं। इसका बहुत अधिक फायदा बिहार के मेरे गरीब भाई-बहन, दलित भाई-बहन, महादलित भाई-बहन, पिछड़े भाई-बहन, अति पिछड़े भाई-बहन, ये सारी जो योजनाएं चला रहा हूं, सबसे पहले फायदा इनको मिल रहा है। बिहार में पीएम आवास योजना से 57 लाख से ज्यादा पक्के घर बने हैं। यहां सिवान जिले में भी गरीबों के एक लाख दस हजार से ज्यादा पक्के घर बन चुके हैं, मैं एक जिले की बात बोल रहा हूं और ये काम निरंतर जारी है। आज भी बिहार के 50 हज़ार से अधिक परिवारों के लिए घर की किश्त जारी की गई है। और जानते हैं, मेरे लिए दोहरी खुशी किस बात की है? ये घर ज्यादातर माताओं-बहनों के नाम पर हैं, मेरी जिन बहनों-बेटियों के नाम पर कभी कोई भी संपत्ति नहीं होती थी, अब वो अपने घर की मालकिन बन रही हैं।

|

साथियों,

हमारी सरकार घर के साथ-साथ मुफ्त राशन, बिजली और पानी की सुविधा भी दे रही है। बीते सालों में देशभर में 12 करोड़ से अधिक नए परिवारों के घर नल पहुंचा है। इसमें सिवान के भी साढ़े चार लाख से अधिक परिवारों को पहली बार नल से जल मिला है। गांवों में हर घर में नल हो, शहरों में पीने के लिए पर्याप्त पानी हो, हम इस लक्ष्य को लेकर काम कर रहे हैं। बीते सालों में बिहार के अनेक शहरों के लिए पानी की पाइप लाइन और सीवेज ट्रीटमेंट प्रोजेक्ट बनाए गए। अब दर्जनों और शहरों के लिए पाइप लाइन और सीवेज ट्रीटमेंट प्लांट्स स्वीकृत किए गए हैं। ये सारे प्रोजेक्ट, गरीब और मध्यम वर्ग के परिवारों का जीवन और बेहतर बनाएंगे।

भाइयों और बहनों,

आरजेडी-कांग्रेस की करतूतें, इनके कारनामे, बिहार विरोधी हैं, निवेश विरोधी हैं। जब भी अपने मुंह से ये लोग विकास की बात करते हैं, तो लोगों को दुकान-कारोबार, उद्योग-धंधे, सब में ताले लटकते नजर आते हैं। इसलिए, ये बिहार के नौजवानों के दिल में कभी भी जगह नहीं बना पाए। ये लोग, बेहाल इंफ्रास्ट्रक्चर, माफिया राज, गुंडाराज और भ्रष्टाचार के पोषक रहे हैं।

|

साथियों,

बिहार का प्रतिभाशाली नौजवान आज जमीन पर होने वाले काम देख रहा है, उसे परख रहा है। NDA, कैसा बिहार बना रही है, इसका उदाहरण मढ़ौरा रेल फैक्ट्री है। आज मढ़ौरा की लोकोमोटिव फैक्ट्री से पहला इंजन, अफ्रीका को एक्सपोर्ट किया जा रहा है। यह आप ही का जाएगा, वहां की गाड़ी को खींचेगा। आप सोचिए, अफ्रीका में भी बिहार की जय-जयकार होने वाली है। ये फैक्ट्री उसी सारण जिले में बनी है, जिसको पंजे और आरजेडी वालों ने पिछड़ा कहकर अपने हाल पर छोड़ दिया था। आज ये जिला दुनिया के मैन्युफैक्चरिंग और एक्सपोर्ट मैप पर अपनी जगह बना चुका है। जंगलराज वालों ने तो बिहार का विकास इंजन ही ठप कर दिया था, अब बिहार में बना इंजन, अफ्रीका की रेल चलाएगा। ये बहुत बड़े गर्व की बात है, मुझे पक्का विश्वास है बिहार, मेड इन इंडिया का एक बड़ा सेंटर बनेगा। यहां का मखाना, यहां के फल-सब्जियां तो बाहर जाएंगी ही, बिहार के कारखानों में बनने वाला सामान भी दुनिया के बाज़ारों तक पहुंचेगा। बिहार के नौजवान जो सामान बनाएंगे, वो आत्मनिर्भर भारत को ताकत देगा।

साथियों,

इसमें बिहार में बन रहा आधुनिक इंफ्रास्ट्रक्चर बहुत काम आएगा। आज बिहार में रोड, रेल, हवाई यात्रा और जलमार्ग, हर प्रकार के इंफ्रास्ट्रक्चर पर अभूतपूर्व निवेश हो रहा है। बिहार को लगातार नई ट्रेनें मिल रही हैं। यहां वंदे भारत जैसी आधुनिक ट्रेनें चल रही हैं। आज हम एक और बड़ी शुरुआत करने जा रहे हैं। सावन शुरु होने से पहले आज बाबा हरिहरनाथ की धरती, वंदे भारत ट्रेन से बाबा गोरखनाथ की धरती से जुड़ गई है। पटना से गोरखपुर की नई वंदे भारत ट्रेन, पूर्वांचल के शिव भक्तों को मिली नई सवारी है। ये ट्रेन भगवान बुद्ध की तपोभूमि को, उनकी महापरिनिर्वाण भूमि कुशीनगर से जोड़ने का भी माध्यम है।

|

साथियों,

ऐसे प्रयासों से बिहार में उद्योग-धंधों को तो बल मिलेगा ही, इससे पर्यटन को सबसे अधिक फायदा होगा। इससे दुनिया के टूरिज्म मैप में भी बिहार और अधिक निखर कर सामने आएगा। यानी बिहार के नौजवानों के लिए रोजगार के अनगिनत अवसर बनने वाले हैं।

साथियों,

देश में सबको आगे बढ़ने के अवसर मिले, किसी के साथ भी भेदभाव न हो, ये हमारे संविधान की भावना है। हम भी इसी भाव से कहते हैं- सबका साथ, सबका विकास। लेकिन ये लालटेन और पंजे वाले कहते हैं- परिवार का साथ, परिवार का विकास। हम कहते हैं- सबका साथ, सबका विकास। वह कहते हैं- परिवार का साथ, परिवार का विकास। इनकी राजनीति का कुल जमा निचोड़ यही है। अपने-अपने परिवारों के हित के लिए ये देश के, बिहार के करोड़ों परिवारों का अहित करने से भी नहीं चूकते हैं। खुद बाबा साहेब अंबेडकर भी इस प्रकार की राजनीति के बिल्कुल खिलाफ थे। इसलिए ये लोग कदम-कदम पर बाबा साहेब का अपमान करते हैं। अभी पूरे देश ने देखा है कि RJD वालों ने बाबा साहेब की तस्वीर के साथ क्या व्यवहार किया हैं। मैं देख रहा था, बिहार में पोस्टर लगे हैं कि बाबा साहेब के अपमान पर माफी मांगो, लेकिन मैं जानता हूं, ये लोग कभी माफी नहीं मांगेंगे, क्योंकि इन लोगों के मन में दलित, महादलित, पिछड़े, अति पिछड़े के प्रति कोई सम्मान नहीं है। आरजेडी और कांग्रेस बाबा साहेब अंबेडकर की तस्वीर को पैरों में रखती है, जबकि मोदी बाबा साहेब अंबेडकर को अपने दिल में रखता है। बाबा साहेब का अपमान करके ये लोग खुद को बाबा साहेब से भी बड़ा दिखाना चाहते हैं। बिहार के लोग बाबा साहेब का ये अपमान कभी नहीं भूलेंगे।

|

साथियों,

बिहार की तेज प्रगति के लिए जो लॉन्चिंग पैड चाहिए, वो नीतीश जी के प्रयासों से तैयार हो चुका है। अब एनडीए को मिलकर, बिहार को तरक्की की नई बुलंदी देनी है। मुझे बिहार के नौजवानों पर भरोसा है। हम सभी मिलकर बिहार का प्राचीन गौरव फिर लौटाएंगे, बिहार को विकसित भारत का मजबूत इंजन बनाएंगे, इसी विश्वास के साथ, आप सभी को विकास कार्यों की फिर से अनेक-अनेक शुभकामनाएं। मेरे साथ दोनों मुट्ठी बंद करके हाथ ऊपर करके बोलिए, भारत माता की जय! जिसके पास तिरंगा है, वह तिरंगा लहराएंगे।

भारत माता की जय!

भारत माता की जय!

भारत माता की जय!

बहुत-बहुत धन्यवाद!

|