క్రింద కు పడి తిరిగిలేచి నిల్చొన్న జమ్ము, కశ్మీర్మరియు లద్దాఖ్ ల లోని ప్రజల కు ప్రధాన మంత్రి హామీ ని కూడా ఇచ్చారు

మూడు వందల డెబ్భయ్యో అధికరణాన్ని రద్దు చేయడం పై సర్వోన్నత న్యాయస్థానం యొక్క నిర్ణయం చరిత్రాత్మకమైంది గా ఉంది, అంతేకాదు 2019 వ సంవత్సరం లో ఆగస్టు 5వ తేదీ నాడు భారతదేశం యొక్క పార్లమెంటు ద్వారా తీసుకొన్నటువంటి నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా పరిరక్షించింది కూడా ను అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

న్యాయస్థానం తనకు గల అపారమైనటువంటి జ్ఞానం తో ఏకత్వం యొక్క సారాన్ని బలపరచిందని, భారతదేశం లో పౌరులు గా ఉన్నటువంటి మనం ఏకత్వాన్ని మిగతా అన్ని అంశాల కన్నా ఎంతో ఉన్నతమైంది గా భావిస్తామని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

  • ఆర్టికల్ 370వ అధికరణాన్ని రద్దు చేయడం పై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు న వెలువరించిన ఉత్తరువు చరిత్రాత్మకం గా ఉండడం తో పాటు గా 2019 వ సంవత్సరం లో ఆగస్టు 5 వ తేదీ నాడు భారతదేశం యొక్క పార్లమెంటు ద్వారా తీసుకొన్న నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధం గా పరిరక్షించింది; ఇది జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ ల లోని మన సోదరీమణుల మరియు మన సోదరుల కు ఆశ, ప్రగతి, ఇంకా ఏకత్వాల తాలూకు తిరుగులేని అటువంటి ప్రకటన గా కూడా ను ఉంది. న్యాయస్థానం తన అపారమైనటువంటి జ్ఞానం తో, ఏకత్వం యొక్క మూల సారాన్ని బలపరచింది. భారతదేశం లో పౌరులు గా మనం ఏకత్వం యొక్క మూల సారాన్ని మిగిలిన అన్నింటి కంటే అన్నింటి కంటే ప్రియమైంది గాను మరియు ఉన్నతమైంది గాను భావిస్తాం.

 

అనేక విపత్కర పరిస్థితుల ను తట్టుకొని మనుగడ సాగిస్తున్న జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ లలో నివసిస్తున్న ప్రజల కు వారి యొక్క కలల ను నెరవేర్చడం పట్ల మన నిబద్ధత అచంచలమైంది అంటూ నేను హామీ ని ఇవ్వదలచుకొన్నాను. ప్రగతి తాలూకు ఫలాలు మీ చెంతకు చేరుకోవడం ఒక్కటే కాకుండా ఆ ప్రయోజనాల ను మన సమాజం లో 370 వ అధికరణం కారణం గా యాతన లు పడ్డ అందరి కంటే బలహీనమైన వర్గాల వారి కి మరియు నిరాదరణ కు గురి అయిన వర్గాల వారి కి సైతం అందేటట్టు జాగ్రత తీసుకోవడాని కి మనం కంకణం కట్టుకొన్నాం.

 

ఈ రోజు న వచ్చిన తీర్పు కేవలం ఒక న్యాయాత్మకమైనటువంటి తీర్పు కాదు; ఇది ఆశ యొక్క కిరణం గా ఉంది, ఉజ్జ్వల భవిష్యత్తుకు వాగ్దానం ఇది, ఇంకా ఒక బలమైనటువంటి, ఇప్పటి కంటే ఎక్కువ ఐకమత్యం తో కూడి ఉండేటటువంటి భారతదేశాన్ని నిర్మించాలన్న మన సామూహిక సంకల్పాని కి ఇది ఒక నిదర్శన గా కూడా ను. #NayaJammuKashmir’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India’s GDP growth for Q2 FY26 at 7.5%, boosted by GST cut–led festive sales, says SBI report

Media Coverage

India’s GDP growth for Q2 FY26 at 7.5%, boosted by GST cut–led festive sales, says SBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to former Prime Minister Smt. Indira Gandhi on her birth anniversary
November 19, 2025

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to former Prime Minister Smt. Indira Gandhi on her birth anniversary.

In a post on X, Shri Modi said;

“Tributes to former PM Smt. Indira Gandhi Ji on the occasion of her birth anniversary.”