ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
"అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం కలగటం బాధించింది. ప్రియమైన వారిని కోల్పోయిన వారితో నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 అందిస్తాం’’.
Distressed by the loss of lives due to a mishap in the Anjaw district of Arunachal Pradesh. My thoughts are with those who have lost their loved ones. I pray for the speedy recovery of those injured.
— PMO India (@PMOIndia) December 11, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each…


