Prime Minister urges citizens to change the profile picture having tricolour on social media
Also urges to share selfie with Tiranga on harghartiranga.com

సామాజిక మాధ్యమ వేదికలలో పౌరులు వారి ప్రొఫైల్ పిక్చరును త్రివర్ణ పతాక చిత్రంతో మార్పు చేసుకోవలసిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.  స్వాతంత్య్ర దినాన్ని పండుగలాగా జరుపుకోవడానికని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రొఫైల్ పిక్చరు ను మువ్వన్నెల జెండా చిత్రంతో మార్చుకొన్నారు.  ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమాన్ని ఒక గుర్తుపెట్టుకోదగ్గ ప్రజాఉద్యమంగా మలచడానికి ఇదే పనిని చేయాలంటూ ప్రతి ఒక్కరికి ఆయన విజ్ఞప్తి చేశారు.

 

 

తిరంగాతో దిగిన సెల్ఫీని harghartiranga.com  లో ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

 

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో:

 

 ‘‘ఈ సంవత్సరంలో స్వాతంత్య్ర దినం త్వరలోనే రానుంది; మరోసారి    #HarGharTiranga ని ఒక స్మరణీయ సామూహిక ఉద్యమంగా తీర్చిదిద్దుదాం, రండి.  నేను నా ప్రొఫైల్ పిక్చరును మార్చుకొంటున్నాను;  మరి నాతో పాటు మీరంతా ఇదే పనిని చేసి మన త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకొందామని విజ్ఞప్తి చేస్తున్నాను.  ఆఁ అన్నట్లు, మీ సెల్ఫీలను harghartiranga.com లో షేర్ చేయగలరు’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year

Media Coverage

IIT Madras incubates 112 startups, files 431 patents in FY26 milestone year
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 28 ఏప్రిల్ 2026
April 28, 2026

From Orchids to Expressways: PM Modi’s Blueprint for a Self-Reliant, Connected & Proud India