ఇది ప్రపంచంలో ‘హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ప్రాంతంగుండా నడిచే తొలి సెమీ- హైస్పీడ్ ప్రయాణికుల రైలు అవుతుంది;
ఈ మార్గంలో నడిచే శతాబ్ది ఎక్స్‌’ప్రెస్‌’తో పోలిస్తే వందే భారత్‌తో గంట సమయం ఆదా

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ తొలి వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌’ను 2023 ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రారంభోత్సవం రోజున మాత్రం జైపూర్‌ నుంచి బయల్దేరి ఢిల్లీ కంటోన్మెంట్‌ వరకూ నడుస్తుంది. అనంతరం 2023 ఏప్రిల్ 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే వందే భారత్‌ ఎక్స్‌’ప్రెస్ అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్‌ మధ్య నడుస్తుంది. మార్గమధ్యంలో అల్వార్, గుర్‌గ్రామ్‌ స్టేషన్లలో ఆగుతుంది.

   ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ అజ్మీర్‌ నుంచి 5 గంటల 15 నిమిషాల్లో ఢిల్లీ కంటోన్మెంట్‌ స్టేషన్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇదే మార్గంలో ప్రయాణించే వేగవంతమైన రైలు శతాబ్ది ఎక్స్‌’ప్రెస్‌’ ప్రయాణ సమయం 6 గంటల 15 నిమిషాలు. కాగా, దీనితో పోలిస్తే వందేభారత్‌  ప్రయాణికులకు గంట సమయం ఆదా అవుతుంది.

అజ్మీర్-ఢిల్లీ కంటోన్మెంట్‌ మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌’ప్రెస్‌ ప్రపంచంలోనే ‘హై-రైజ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ ప్రాంతం గుండా ప్రయాణించే తొలి సెమీ- హైస్పీడ్ రైలుగా రికార్డులకెక్కుతుంది. ఈ రైలుతో రాజస్థాన్‌లోని పుష్కర్, అజ్మీర్ షరీఫ్ దర్గా తదితర ప్రసిద్ధ ప్రదేశాలు సహా ప్రధాన పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం మెరుగవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 డిసెంబర్ 2025
December 20, 2025

Empowering Roots, Elevating Horizons: PM Modi's Leadership in Diplomacy, Economy, and Ecology