ఉద్యోగాల లో క్రొత్త గా నియమించిన వారికి దాదాపు గా 70,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం లో జూన్ 13 వ తేదీ నాడు ఉదయం పూట పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ నియామకం జరిగిన వ్యక్తుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగించనున్నారు.
రోజ్ గార్ మేళా ను దేశ వ్యాప్తం గా 43 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజ్ గార్ మేళా కార్యక్రమం లో భాగం గా నియామకాలు వివిధ కేంద్ర ప్రభుత్వాల విభాగాల తో పాటు ఈ కార్యక్రమాని కి సమర్ధన ను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల లో/కేంద్రపాలిత ప్రాంతాల లో చోటు చేసుకొంటున్నాయి. దేశ వ్యాప్తం గా ఎంపిక చేసి క్రొత్త గా ఉద్యోగం లో నియమించినటువంటి వారు ప్రభుత్వం లో ఆర్థిక సేవల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, అణు శక్తి విభాగం, రేల్ వేస్ విభాగం, ఆడిట్ ఎండ్ అకౌంట్స్ విభాగం, హోం అఫైర్స్ విభాగం తదితర వివిధ విభాగాల లో చేరనున్నారు.
ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చే విషయం లో ప్రధాన మంత్రి యొక్క వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక అడుగు గా ఈ ఉంది. ఉద్యోగాల కల్పన ను పెంపొందింప జేస్తుందన్న ఆశ ఉంది. దీనితో పాటు యువతీ యువకుల కు సాధికారిత కల్పన లో మరియు దేశాభివృద్ధి లో పాలుపంచుకొనే అవకాశాల ను వారికి అందించడం లో రోజ్ గార్ మేళా ఒక ఉత్ప్రేరకం వలె ఉండగలదన్న భావన సైతం ఉంది.
క్రొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశాన్ని దక్కించుకొంటున్నారు. ‘కర్మయోగి ప్రారంభ్’ అనేది ప్రభుత్వం లో వేరు వేరు విభాగాల లో క్రొత్త గా నియామకం జరిగిన వారి కి ఉద్దేశించిన ఆన్ లైన్ మాడ్యూల్. ఇది ఐజిఒటి కర్మయోగి (iGOT Karmayogi) పోర్టల్ లో లభ్యం అవుతుంది. దీనిలో భాగం గా 400 కు పైచిలుకు ఇ-లర్నింగ్ పాఠ్యక్రమాల ను ‘ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినా’ నేర్చుకొనే విధం గా అందుబాటు లో కి తీసుకు రావడమైంది.


