ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా IIతో మాట్లాడారు.

ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల పట్ల ప్రధానమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జోర్డాన్ ప్రజల శాంతి, భద్రత, సంక్షేమానికి తమ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ క్లిష్ట సమయంలో జోర్డాన్‌లోని భారతీయుల క్షేమం పట్ల జాగ్రత్త తీసుకుంటున్నందుకు జోర్డాన్ రాజుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

"జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో మాట్లాడాను. ఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల పట్ల మా తీవ్ర ఆందోళనన తెలియజేశాను. జోర్డాన్ ప్రజల శాంతి, భద్రత, సంక్షేమానికి మా మద్దతును పునరుద్ఘాటించడంతో పాటు ఈ క్లిష్ట సమయంలో అక్కడి భారతీయులను జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు. 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
How AI & next-gen tech driving India’s MedTech growth

Media Coverage

How AI & next-gen tech driving India’s MedTech growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 ఆగష్టు 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi