ద్వైపాక్షిక ప్రత్యేక మరియు విశేష అధికారాల తో కూడినవ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం ఒక మార్గసూచీ ని అభివృద్ధి పరచేందుకువారు అంగీకరించారు
బ్రిక్స్ కు 2024 వ సంవత్సరం లో రశ్యా అధ్యక్షత సఫలం కావాలన్న ఆకాంక్ష ను వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

రశ్యన్ ఫెడరేశన్ యొక్క ప్రెసిడెంటు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.
రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల కు తరువాయి గా ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన అనేక అంశాల లో పురోగతి ని ఇద్దరు నేత లు సమీక్షించారు.
వారు ద్వైపాక్షిక సంబంధాల లో ఘటన క్రమాల ను సానుకూల దృక్పథం తో అంచనా వేయడం తో పాటు ఇండియా-రశ్యా స్పెశల్ & ప్రివిలిజ్‌డ్ స్ట్రటీజిక్ పార్ట్‌ నర్‌ శిప్ ను మరింత బలోపేతం చేయడం కోసం అనుసరించవలసిన కార్యక్రమాల తో ఒక మార్గసూచీ ని రూపొందించడాని కి సమ్మతించారు.

పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల ను మరియు ప్రపంచ అంశాల ను గురించి కూడా వారు వారి యొక్క అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు తెలియ జేసుకొన్నారు.

బ్రిక్స్ కు 2024 వ సంవత్సరం లో రశ్యా అధ్యక్షత వహించనున్న సందర్భం లో ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేసి, భారతదేశం యొక్క పూర్తి సమర్థన ను గురించిన హామీ ని ఇచ్చారు.

సంప్రదింపుల ను ఎప్పటికప్పుడు కొనసాగించడానికి నేత లు ఇద్దరూ అంగీకరించారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India poised to become world's 4th largest economy by 2026; GDP to grow 6.8% in FY25: PHDCCI

Media Coverage

India poised to become world's 4th largest economy by 2026; GDP to grow 6.8% in FY25: PHDCCI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 జనవరి 2025
January 15, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Country’s Development Coupled with Civilizational Connect