I hope that the discussions and debates would give far-reaching results in public interest: PM Modi at the start of the Monsoon Session of Parliament
I condemn the Manipur incident and it is a shameful act for any civilised society: PM Modi at the start of the Monsoon Session of Parliament
The perpetrators of the Manipur incident will not be spared: PM Modi at the start of the Monsoon Session of Parliament

నమస్కారం, మిత్రులారా!

 

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం పవిత్ర శ్రావణ మాసం నడుస్తోంది, ఈసారి శ్రావణ మాసం రెండు నెలల పాటు ఉండనుంది, దీని వ్యవధి కొంచెం ఎక్కువ. శ్రావణ మాసం పవిత్రమైన తీర్మానాలకు, పనులకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నేడు, ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మనం ప్రజాస్వామ్య దేవాలయంలో సమావేశమైనందున, ప్రజాస్వామ్య దేవాలయం అనేక పవిత్రమైన పనులను చేపట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రజల సంక్షేమం కోసం ఈ సమావేశాన్ని అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటారని నేను నమ్ముతున్నాను.

 

వివిధ చట్టాలను రూపొందించడంలో పార్లమెంటుతో పాటు ప్రతి పార్లమెంటు సభ్యుడి బాధ్యతల గురించి వివరంగా చర్చించడం అవసరం. చర్చలు ఎంత విస్తృతంగా, లోతు గా జరిగితే ప్రజాసంక్షేమం కోసం మరింత దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చు. సభకు వచ్చే గౌరవ ఎంపీలు క్షేత్రస్థాయిలో లోతుగా పాతుకుపోయిన  ప్రజల దుఃఖం, బాధలను అర్థం చేసుకుంటారు. కాబట్టి చర్చ జరిగినప్పుడు వారి నుండి వచ్చే ఆలోచనలే మూలాలతో ముడిపడి ఉంటాయి, అందుకే చర్చను సుసంపన్నం చేస్తారు, నిర్ణయాలు కూడా బలపడతాయి మరియు ప్రభావవంతంగా ఉంటాయి. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు, గౌరవనీయ ఎంపీలు ఈ సమావేశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రజా శ్రేయస్సు కోసం పనులను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.

 

ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు నేరుగా ప్రజా సంక్షేమానికి సంబంధించినవి కాబట్టి ఈ సెషన్ కు అనేక విధాలుగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. డిజిటల్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న మన యువతరానికి, డేటా ప్రొటెక్షన్ బిల్లు, ముఖ్యంగా, ఈ డిజిటల్ యుగంలో చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ప్రతి పౌరుడిలో కొత్త నమ్మకాన్ని పెంపొందించడానికి మరియు ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని పెంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కొత్త విద్యావిధానం నేపధ్యంలో ఒక ప్రధాన అడుగు, ఇది పరిశోధన, సృజనాత్మకతను సాధికారం చేస్తుంది మరియు కొత్త చొరవలు మరియు సామర్థ్యాల ద్వారా ప్రపంచాన్ని నడిపించడానికి మన యువతకు అవకాశాలను అందిస్తుంది.

జన్ విశ్వాస్ బిల్లు సాధారణ ప్రజలలో విశ్వాసాన్ని కలిగించడానికి మరియు వివిధ చట్టాలను నేరరహితం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు. అదేవిధంగా కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసి, వివాదాల పరిష్కారానికి చర్చలు, మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని బిల్లులో పేర్కొన్నారు, ఇది శతాబ్దాలుగా మన దేశంలో ఆనవాయితీగా ఉంది. మధ్యవర్తిత్వ బిల్లును ఈ సమావేశాల్లో తీసుకురావడం దీర్ఘకాలిక మధ్యవర్తిత్వ సంప్రదాయానికి బలమైన చట్టపరమైన పునాదిని అందిస్తుంది, ఇది సాధారణ వివాదాలను మాత్రమే కాకుండా సంక్లిష్టమైన మరియు అసాధారణ పరిస్థితులను కూడా పరస్పర చర్చల ద్వారా పరిష్కరించడంలో సహాయపడుతుంది. అదనంగా, డెంటల్ మిషన్ బిల్లు వైద్య విద్యార్థులకు సంబంధించిన దంత కళాశాలలకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు.

 

ఈ సమావేశాల్లో అనేక కీలక బిల్లులు పార్లమెంటుకు వస్తున్నాయి, అవి ప్రజా ప్రయోజనాల కోసం, యువత కోసం , భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం. ఈ సమావేశాల్లో ఈ బిల్లులపై సీరియస్ గా చర్చించడం ద్వారా దేశ సంక్షేమం దిశగా కీలక అడుగులు వేస్తామని నాకు నమ్మకం ఉంది.

 

మిత్రులారా,

 

ఈ రోజు, ప్రజాస్వామ్య దేవాలయంలో నేను మీ మధ్య నిలబడినప్పుడు, మణిపూర్ లో జరిగిన సంఘటనపై నా హృదయం విచారం మరియు కోపంతో నిండిపోయింది. ఈ సంఘటన ఏ నాగరిక సమాజానికైనా సిగ్గుచేటు. ఈ పాపానికి పాల్పడినవారు, తప్పు చేసినవారు, వారెవరైనా సరే యావత్ దేశం సిగ్గుపడుతోంది. 140 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రులందరూ తమ రాష్ట్రాల్లో శాంతిభద్రతలను బలోపేతం చేయాలని, ముఖ్యంగా మన తల్లులు, సోదరీమణుల భద్రత, రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజస్థాన్ లోనో, చత్తీస్ ఘడ్ లోనో, మణిపూర్ లోనో, భారతదేశంలోని ఏ మూలలోనైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వంలోనైనా రాజకీయ వివాదాలకు అతీతంగా, చట్టబద్ధ పాలన ప్రాముఖ్యతను, మహిళల పట్ల గౌరవాన్ని కాపాడటం చాలా ముఖ్యం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని నేను ఈ దేశ పౌరులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. మణిపూర్ ఆడబిడ్డలకు జరిగిన ఘటనను ఎప్పటికీ క్షమించలేం.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India can be a factor of stabilisation in global affairs: Chile backs New Delhi bid for UNSC permanent seat

Media Coverage

India can be a factor of stabilisation in global affairs: Chile backs New Delhi bid for UNSC permanent seat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 జనవరి 2026
January 10, 2026

Viksit Bharat Unleashed: From Farms to Hypersonics Under PM Modi's Vision