రోటేరియ‌న్లు విజ‌యం, సేవ రెండింటి నిజ‌మైన క‌ల‌యిక‌
బుద్ధుడు, మ‌హాత్మా గాంధీల పుణ్య‌భూమి మ‌న‌ది,ఇత‌రుల కోసం జీవించ‌డ‌మంటే ఏమిటో వారు ఆచ‌ర‌ణ‌లో మ‌న‌కు చూపారు
ప్ర‌కృతితో స‌హ‌జీవ‌నం చేసే శ‌తాబ్దాల నాటి మ‌న విలువ‌ల ప్రేర‌ణ‌తో, 1.4 బిలియ‌న్ల మంది భార‌తీయులు మ‌న భూమి, ప‌రిశుభ్రంగా, హ‌రిత‌మ‌యంగా ఉండేలా చూసేందుకు వీలైన అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోటేరియన్ల పెద్ద కుటుంబానికి చెందిన ప్రియమైన మిత్రులకు నమస్కారం. 

రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది.  ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది.  ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది.  మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు.  మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది.  ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను. 

మిత్రులారా, 

ఈ శరీరానికి రెండు ముఖ్యమైన ధర్మ సూత్రాలు ఉన్నాయి.  మొదటిది – స్వప్రయోజనాలకు మించి సేవ.  రెండవది - ఉత్తమంగా సేవలందించే వారికి ఎక్కువ ప్రయోజనం.  ఇవి మొత్తం మానవాళి సంక్షేమానికి ముఖ్యమైన సూత్రాలు.  వేల సంవత్సరాల క్రితం మన సాధువులు మరియు ఋషులు మనకు శక్తివంతమైన ప్రార్థన నందించారు  - 

'సర్వే భవన్తు సుఖినః,

సర్వే సంతు నిరామయః'

దీని అర్థం –

ప్రతి జీవి సంతోషంగా ఉండాలి.

ప్రతి జీవి ఆరోగ్యంగా జీవించాలి. 

ఇదే విషయం – 

''పరోపకారాయ సతాం విభూతయః'' అని -  

మన సంస్కృతిలో కూడా చెప్పబడింది. 

దీని అర్థం - గొప్ప ఆత్మలు ఇతరుల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేస్తాయి మరియు జీవిస్తాయి. ఇతరుల కోసం జీవించడం అంటే ఏమిటో కార్యరూపంలో చేసి చూపించిన బుద్ధుడు, మహాత్మా గాంధీ నడయాడిన భూమి మనది.

మిత్రులారా, 

మనమందరం ఒకదానిపై ఒకటి ఆధారపడి, పరస్పర సంబంధాలతో, పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో ఉన్నాము.  స్వామి వివేకానంద చాలా బాగా వ్యక్తీకరించిన ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను:

"ఈ విశ్వంలోని ఏ పరమాణువు ప్రపంచం మొత్తాన్ని తనతో పాటు లాగకుండా ముందుకు కదలదు."  అందుకే వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు కలిసి మన భూగోళం మరింత సంపన్నంగా, స్థిరంగా ఉండేలా కృషి చేయడం చాలా ముఖ్యం.  భూమిపై సానుకూల ప్రభావం చూపే అనేక అంశాలపై రోటరీ ఇంటర్నేషనల్ కృషి చేయడం చూసి నేను సంతోషిస్తున్నాను.  ఉదాహరణకు పర్యావరణ పరిరక్షణను తీసుకోండి.  సుస్థిరమైన అభివృద్ధి అనేది తక్షణ అవసరం.  ప్రకృతితో సామరస్యంగా ఉండాలనే మన శతాబ్దాల నాటి తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని, 1.4 బిలియన్ల భారతీయులు మన భూమిని పరిశుభ్రంగా, పచ్చగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  పునరుత్పాదక శక్తి అనేది భారతదేశంలో బాగా అభివృద్ధి చెందుతున్న రంగం.  ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటులో భారతదేశం ముందుంది.  "ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్" - దిశగా భారతదేశం పని చేస్తోంది.   ఇటీవల గ్లాస్గోలో జరిగిన సి.ఓ.పి-26 సదస్సులో - "జీవితం - పర్యావరణం కోసం జీవనశైలి"  గురించి నేను మాట్లాడాను.  ఇది పర్యావరణ స్పృహ తో జీవితాన్ని గడుపుతున్న ప్రతి మనిషిని సూచిస్తుంది.  "2070 నాటికి నెట్ జీరో" సాధించాలనే భారత దేశ నిబద్ధతను కూడా ప్రపంచ సమాజం ప్రశంసించింది.

మిత్రులారా, 

స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత ను అందించడంలో రోటరీ ఇంటర్నేషనల్ చురుకుగా పనిచేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.  భారతదేశంలో, మేము 2014 లో "స్వచ్ఛ-భారత్-మిషన్" లేదా "స్వచ్ఛ-భారత్" ఉద్యమాన్ని ప్రారంభించాము.  ఐదేళ్లలో మేము పూర్తి పారిశుద్ధ్య కవరేజీని సాధించాము.  ఇది భారతదేశంలోని పేదలకు, ముఖ్యంగా మహిళలకు ప్రయోజనం చేకూర్చింది.  ప్రస్తుతం, భారతదేశం వలస పాలన నుండి విముక్తి పొంది 75 సంవత్సరాలు పూర్తవుతోంది.  నీటి పొదుపు కోసం ఒక కొత్త సామూహిక ఉద్యమం రూపుదిద్దుకుంది.  ఈ ఉద్యమం ఆధునిక పరిష్కారాలతో కలిపి నీటి సంరక్షణకు సంబంధించిన మన పురాతన పద్ధతుల నుంచి ప్రేరణ పొందింది. 

మిత్రులారా, 

కోవిడ్ అనంతర ప్రపంచంలో స్థానిక ఆర్థిక వ్యవస్థలు పెరగడానికి మీ ఇతర ముఖ్యమైన కారణాలలో ఒకటి  చాలా సందర్భోచితమైనది.  భారతదేశంలో ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమం రూపుదిద్దుకుంటోంది.  భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడంతో పాటు ప్రపంచ శ్రేయస్సుకు దోహదం చేయడం దీని లక్ష్యం.  ప్రపంచంలోనే అతిపెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థలలో భారతదేశం ఒకటి అన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.  వీటిలో చాలా అంకుర సంస్థలు ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.

మిత్రులారా, 

భారత దేశ ప్రజలమైన మనం, ప్రపంచం ఆచరిస్తున్న మంచి విధానాలు నేర్చుకోవడానికి, మన విధానాలు ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.  ప్రపంచంలో ఏడో వంతు మానవాళికి భారతదేశం ఆశ్రయం కల్పిస్తోంది.  భారతదేశం సాధించిన ఏ విజయమైనా ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపే స్థాయిలో మనం ఉన్నాము.   ఈ సందర్భంగా కోవిడ్-19 టీకా ఉదాహరణను పంచుకుంటాను.  శతాబ్దంలో మొదటిసారిగా  కోవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు, భారతదేశం, దాని అధిక జనాభా కారణంగా, మహమ్మారి పై పోరాటం లో అంత విజయం సాధించలేదని, అందరూ భావించారు, ఆ అభిప్రాయం తప్పని భారత ప్రజలు నిరూపించారు.  భారతదేశం, తన పౌరులకు దాదాపు 2 బిలియన్ టీకా మోతాదులను అందించింది.  అదేవిధంగా,  2030 ప్రపంచ లక్ష్యానికి 5 సంవత్సరాల ముందు, అంటే, 2025 నాటికి టీ.బీ. నిర్మూలించేందుకు కూడా భారతదేశం కృషి చేస్తోంది.  నేను కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను.  క్షేత్ర స్థాయిలో ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి నేను రోటరీ కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాను.

మిత్రులారా, 

నా ప్రసంగం ముగించే ముందు నేను మొత్తం రోటరీ కుటుంబానికి ఒక విజ్ఞప్తి చేస్తాను.  మరో రెండు వారాల్లో, జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటిస్తున్నాయి.  మానసిక, శారీరక, మేధో, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి యోగ ఒక సమర్థవంతమైన మార్గం అన్న విషయం మీ అందరికీ తెలిసినదే.   రోటరీ కుటుంబ సభ్యులందరూ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని పెద్ద సంఖ్యలో పాటిస్తున్నారా?   తమ సభ్యులు క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలని రోటరీ కుటుంబం ప్రోత్సహిస్తోందా?  అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను మీరు చూస్తారు.

ఈ సమావేశంలో ప్రసంగించడానికి నన్ను ఆహ్వానించినందుకు మరోసారి ధన్యవాదాలు.   

మొత్తం రోటరీ ఇంటర్నేషనల్ కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.

ధన్యవాదములు  !   మీకు చాలా కృతజ్ఞతలు!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
10 Years of UPI: From 18 mln to 219 bln transactions, volumes jump 12,000x

Media Coverage

10 Years of UPI: From 18 mln to 219 bln transactions, volumes jump 12,000x
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 ఏప్రిల్ 2026
April 10, 2026

Safe Anchor, Green Engine, Digital Dynamo: PM Modi’s Blueprint for India’s Economic Renaissance