ఒక యువ రోగి కపాలం సంబంధి దోషం తో బాధపడుతుంటే ఆ లోపాన్ని సరిచేయడానికి గాను టైటేనియమ్ క్రేనియో ప్లాస్టీ రిపేరు కోసం ఉన్నత 3డి ముద్రణ టెక్నిక్ ను ఉపయోగించిన భారతదేశ సైన్యం లోని సెంట్రల్ కమాండ్ కు చెందిన వైద్యుల బృందాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
పైన ప్రస్తావించిన శస్త్రచికిత్స ను గురించి భారతదేశ సైన్యం లోని సెంట్రల్ కమాండ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ తాను ఒక ట్వీట్ లో -
‘‘ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు.
Commendable! https://t.co/Q5CnEQ55eB
— Narendra Modi (@narendramodi) February 23, 2023


