భారత స్వాతంత్ర్య పోరాట యోధులైన తిరుప్పూర్ కుమారన్, సుబ్రమణ్య శివల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వేరు వేరు పోస్టులలో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఇద్దరు భారతమాత పుత్రులు తిరుప్పూర్ కుమారన్, సుబ్రమణ్య శివలను మనం స్మరించుకుంటూ వందనం చేస్తున్నాం. గొప్ప రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన వీరిద్దరూ భారతదేశ స్వాతంత్ర్యం, జాతీయవాద స్ఫూర్తిని మేల్కొల్పటానికి జీవితాలను అంకితం చేశారు.
జాతీయ జెండాను చేతిలో పట్టుకొని అమరత్వం పొందిన తిరుప్పూర్ కుమారన్.. అచంచలమైన ధైర్యం, నిస్వార్థ త్యాగం అంటే ఏమిటన్నది చూపించారు. తలవంచని రచనలు, ఉత్తేజకరమైన ప్రసంగాల ద్వారా సుబ్రమణ్య శివ.. ఎంతో మంది యువతలో సాంస్కృతిక గౌరవాన్నీ, దేశభక్తినీ నింపారు.
వలస పాలకుల నుంచి మనకు స్వేచ్ఛను కల్పించిన అసంఖ్యాకమైన ప్రజల పోరాటాలు, బాధలను గుర్తు చేస్తున్న ఈ ఇద్దరు మహానుభావుల కృషి మన అందరి స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. వారి పోరాటం మనందరికీ జాతీయాభివృద్ధి, ఐక్యత కోసం కృషి చేసే విషయంలో స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను.”
On this day, we remember and bow to two great sons of Bharat Mata, Tiruppur Kumaran and Subramaniya Siva. Both hail from the great state of Tamil Nadu and dedicated their lives to India’s independence and awakening a spirit of nationalism.
— Narendra Modi (@narendramodi) October 4, 2025
Tiruppur Kumaran attained martyrdom…
இன்று நாம், பாரத மாதாவின் இரு தவப் புதல்வர்களான திருப்பூர் குமரன் மற்றும் சுப்பிரமணிய சிவா ஆகியோரை நினைவு கூர்ந்து வணங்குவோம். உன்னதமான தமிழ்நாட்டைச் சேர்ந்த இருவரும், இந்தியாவின் விடுதலைக்காகவும், தேசப்பற்று உணர்வை விதைப்பதற்காகவும் தங்கள் வாழ்வையே அர்ப்பணித்தவர்களாவர்.…
— Narendra Modi (@narendramodi) October 4, 2025


