స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళి అర్పించారు. అభివృద్ధి చెందిన భారత్ సాధించాలనే సంకల్పానికి అవసరమైన శక్తిని స్వామి వివేకానంద వ్యక్తిత్వం, రచనలు అందిస్తూనే ఉంటాయని శ్రీ మోదీ అన్నారు. ‘‘ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకు నూతన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని జాతీయ యువజన దినోత్సవం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
"భారతీయ యువతకు స్ఫూర్తి అయిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం, రచనలు వికసిత్ భారత్ సంకల్పానికి నిరంతరం కొత్త శక్తిని అందిస్తూనే ఉంటాయి. దేశ ప్రజలందరికీ ముఖ్యంగా యువతకు ఈ జాతీయ యువజన దినోత్సవం నూతన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందించాలని కోరుకుంటున్నాను."
भारतीय युवाशक्ति के सशक्त प्रेरणास्रोत स्वामी विवेकानंद को उनकी जयंती पर मेरी आदरपूर्ण श्रद्धांजलि। उनका व्यक्तित्व और कृतित्व विकसित भारत के संकल्प में निरंतर नई ऊर्जा का संचार करने वाला है। मेरी कामना है कि राष्ट्रीय युवा दिवस का यह दिव्य अवसर सभी देशवासियों, विशेषकर हमारे युवा… pic.twitter.com/uP10YeDGP6
— Narendra Modi (@narendramodi) January 12, 2026


