తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రార్థించారు..
 

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనడం దివ్యానుభూతిని ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. సిక్కు గురువుల ఉత్తమ ప్రబోధాలు యావత్తు మానవాళికీ స్ఫూర్తినిస్తాయన్నారు.
ఈ గురుద్వారాకు శ్రీ గురు గోవింద్ సింహ్ జీ తో చాలా సన్నిహిత బంధం ఉందని శ్రీ మోదీ తెలిపారు. శ్రీ గురు గోవింద్ సింహ్ జీ సాహసం, న్యాయం పట్ల ఆయన నిబద్ధతా ఎంతో స్ఫూర్తిని అందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.
 

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌‌ లోపలి దృశ్యాలను కొన్నింటిని ప్రజలతో ఆయన పంచుకున్నారు.
 

‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘తఖత్  శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ఇవాళ సాయంత్రం ప్రార్థనలో పాల్గొన్నాను.. ఎంతో దివ్యమైన అనుభూతికి నోచుకున్నాను. సిక్కు గురువుల ఉత్తమ ప్రబోధాలు యావత్తు మానవాళికీ స్ఫూర్తినిచ్చేవే. ఈ గురుద్వారాకు శ్రీ గురు గోవింద్ సింహ్ జీ తో అత్యంత సన్నిహిత అనుబంధం ఉంది. శ్రీ గురు గోవింద్ సింహ్ జీ సాహసం, న్యాయం పట్ల ఆయన చాటిన నిబద్ధతా ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి.’’
 

‘‘తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌‌ దృశ్యాలు కొన్ని ఇవిగో చూడండి..’’
 

Here are some glimpses from Takhat Sri Harimandir Ji Patna Sahib. pic.twitter.com/YWlI23sbiH

— Narendra Modi (@narendramodi) November 2, 2025

“ਅੱਜ ਸ਼ਾਮ ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਵਿਖੇ ਅਰਦਾਸ ਕਰਨਾ ਬਹੁਤ ਹੀ ਬ੍ਰਹਮ ਅਨੁਭਵ ਸੀ। ਸਿੱਖ ਗੁਰੂਆਂ ਦੀਆਂ ਮਹਾਨ ਸਿੱਖਿਆਵਾਂ ਸਮੁੱਚੀ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਇਸ ਗੁਰਦੁਆਰੇ ਨਾਲ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਬਹੁਤ ਨੇੜਲਾ ਸਬੰਧ ਹੈ, ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਹਿੰਮਤ ਅਤੇ ਨਿਆਂ ਪ੍ਰਤੀ ਵਚਨਬੱਧਤਾ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹੈ।”

 

“ਪੇਸ਼ ਹਨ ਤਖਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਦੀਆਂ ਕੁਝ ਝਲਕੀਆਂ”

‘‘తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌‌కు వెళ్లి శ్రీ గురు గోవింద్ సింగ్ జీ, మాత సాహిబ్ కౌర్ జీల పవిత్ర జోడే సాహిబ్‌ను దర్శించుకున్నాను. దివ్య గురు చరణ్ యాత్ర‌ అనంతరం వాటిని పట్నాకు తీసుకువచ్చారు.. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారూ పాలుపంచుకున్నారు. పట్నాకు చేరుకొని, వాటిని దర్శించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.’’

 

““ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਵਿਖੇ, ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਮਾਤਾ ਸਾਹਿਬ ਕੌਰ ਜੀ ਦੇ ਪਵਿੱਤਰ ਜੋੜੇ ਸਾਹਿਬ ਦੇ ਦਰਸ਼ਨ ਕੀਤੇ। ਉਹ ਬ੍ਰਹਮ ਗੁਰੂ ਚਰਨ ਯਾਤਰਾ ਤੋਂ ਬਾਅਦ ਪਟਨਾ ਆਏ ਹਨ, ਜਿਸ ਵਿੱਚ ਹਰ ਵਰਗ ਦੇ ਲੋਕ ਸ਼ਾਮਲ ਹੋਏ ਸਨ। ਲੋਕਾਂ ਨੂੰ ਪਟਨਾ ਆਉਣ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੇ ਦਰਸ਼ਨ ਕਰਨ ਦੀ ਤਾਕੀਦ ਹੈ।” “

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class

Media Coverage

India develops first indigenous expendable turbo jet engine in 350 kg thrust class
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జూలై 2026
July 27, 2026

Viksit Bharat in Motion: Indigenous Warships, Deepwater Energy, Transparent Exams & Cultural Revival