రూ. 5,500 కోట్లతో 176 కి. మీ. జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన
రూ. 500 కోట్ల రైల్వే తయారీ విభాగానికి కాజీపేటలో శంకుస్థాపన
భద్రకాళి ఆలయ సందర్శన, పూజలు
“తెలుగు ప్రజల సామర్థ్యం దేశ సామర్థ్యాన్ని పెంచుతూనే ఉంది”
“శక్తిమంతమైన నేటి యువ భారతం వెలిగిపోతోంది”
“పాడుబడిన మౌలిక వసతులతో వేగవంతమైన అభివృద్ధి అసాధ్యం”
“చుట్టుపక్కల ఉన్న ఆర్థిక కార్యక్రమ కేంద్రాలను అనుసంధానం చేస్తూ తెలంగాణ ఒక్క ఆర్థిక కార్యకలాపాల హబ్ గా మారుతోంది”
“యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటంలో తయారీ రంగం అతి పెద్ద వనరు కాబోతోంది”

తెలంగాణలోని వరంగల్ లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు  రూ.6,100 కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు,  ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలలో రూ. 5,500 కోట్లకు పైగా విలువ చేసే 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది.  అదే విధంగా కాజీ పేటలో తలపెట్టిన రూ. 500 కోట్లకు పైగా విలువ చేసే రైల్వే తయారీ యూనిట్ ఉంది. ప్రధాని ఇక్కడి భద్రకాళి ఆలయాన్ని కూడా సందర్శించారు. దర్శనం చేసుకొని పూజలు జరిపారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, తెలంగాణ కొత్త రాష్ట్రమే అయినా, 9 ఏళ్ళు పూర్తి చేసుకుందని  గుర్తు చేస్తూ, భారతదేశ చరిత్రలో తెలంగాణ పాత్ర చాలా కీలకమన్నారు. తెలుగు ప్రజల సామర్థ్యం ఎప్పుడూ భారతదేశ సామర్థ్యాన్ని పెంచుతూనే ఉందన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావటంలో తెలంగాణ పాత్ర గణనీయంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు.  పెట్టుబడులకు, ఎదుగుదల అవకాశాలకు భారతదేశం పెట్టింది పేరుగా ఉన్నదని, వికసిత భారతదేశం కోసం అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు.  

 

 

“నేటి నవయవ్వన భారతదేశం శక్తిమంతంగా ఉందని, 21వ శతాబ్దపు మూడో దశకం స్వర్ణ సమయంగా మారిందని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  వేగంగా సాగుతున్న అభివృద్ధిలో దేశంలోని ఏ ప్రాంతాన్నీ వదిలే ప్రసక్తే లేదన్నారు. అదే సమయంలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ రోజు రూ. 6,000 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులను తెలంగాణకు అందిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.

 

 

కొత్త లక్ష్యాల సాధనకు కొత్త మార్గాలు కనుక్కోవాలని, అప్పుడే భారతదేశ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రధాని అన్నారు. పాత మౌలిక వసతులతో ఇది అసాధ్యం కాబట్టే కొత్త మౌలిక సదుపాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వవలసి ఉందని అన్నారు.  అనుసంధానత లోపం, ఖరీదైన రవాణా ఖర్చు వలన వ్యాపారాభివృద్ధికి సమస్యలు ఎదురావుతాయని అందుకే వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా  సౌకర్యాల మీద ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.  ఎక్స్ ప్రెస్ హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఆర్థిక కారిడార్లు ఏర్పాటు చేస్తూ రెండు లేన్ల, నాలుగు లేన్ల రహదారులు అభివృద్ధి చేయటం ద్వారా, కొన్నింటిని ఆరు లేన్ల రహదారులుగా మార్చటం ద్వారా రవాణా వ్యవస్థను పటిష్ఠపరుస్తున్నామన్నారు.

 

తెలంగాణలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2500 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్లకు పెరిగిందని గుర్తు చేశారు. మరో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం వివిధ దశలలో పురోగతిలో ఉందని కూడా ప్రధాని గుర్తు చేశారు.

భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా డజన్ల కొద్దీ కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయని, అందులో అనేకం తెలంగాణ గుండా వెళుతున్నాయన్నారుహైదరాబాద్- ఇండోర్ ఆర్థిక కారిడార్, చెన్నై-సూరత్  ఆర్థిక కారిడార్, హైదరాబాద్- పనాజీ ఆర్థిక కారిడార్, హైఫడరాబాద్- విశాఖపట్నం ఇంటర్ కారిడార్ ను ఈ  సందర్భంగా ప్రధాని ఉదాహరించారు.  ఒక విధంగా తెలంగాణ చుట్టుపక్కల ఉన్న అనేక ఆర్థిక ప్రాంతాలకు కేంద్రంగా ఉందన్నారు. ఆ విధంగా అనేక ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా తయారవుతోందని కితాబునిచ్చారు.  

 

ఈ రోజు శంకుస్థాపన చేసిన నాగ పూర్-విజయవాడ కారిడార్ లోని మంచిర్యాల-వరంగల్ సెక్షన్ గురించి మాట్లాడుతూ, ఇది తెలంగాణకు అటు మహారాష్ట్రతోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ తోనూ మరింత మెరుగైన అత్యాధునిక అనుసంధానత కలిగిస్తుందని చెప్పారు. మరో వైపు మంచిర్యాల, వరంగల్ మధ్య దూరం తగగయించి ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలుకుతుందన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది గిరిజనులున్నారని, చాలా కాలంగా వారు నిర్లక్ష్యానికి గురయ్యారని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బహుళ రవాణా అనుసంధానతకు ఈ కారిడార్ మార్గనిర్దేశనం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్-వరంగల్ సెక్షన్ ను నాలుగు లేన్ల రహదారిగా మార్చటం వలన హైదరాబాద్ – వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్ ఎస్ ఈ జెడ్ ఎక్కువగా లబ్ధిపొందుతాయన్నారు.

 

తెలంగాణలో పెరిగిన అనుసంధానత వలన రాష్ట్రంలో నేరుగా పరిశ్రమలు, పర్యాటకరంగం లబ్ధిపొందుతాయన్నారు. సాంస్కృతిక వారసత్వ సంపద ప్రదేశాలకు, తీర్థయాత్రా స్థలాలకూ చేరుకోవటం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారిందని అన్నారు. వ్యవసాయ పరిశ్రమలతో బాటు కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ కూడా లబ్ధిపొందుతాయన్నారు. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృత్తి నిపుణులు కావచ్చు అందరూ లబ్ధిపొందగలుగుతున్నారని ప్రధాని గుర్తు చేశారు. యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు.

 

మేకిన్  ఇండియా ప్రచారోద్యమం గురించి ప్రస్తావిస్తూ, తయారీ రంగం దేశంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని గుర్తు చేశారు.  పి ఎల్ ఐ పథకం వలన తయారీ రంగానికి ఎంతో ప్రోత్సాహం లభించిందని  అన్నారు. ఎక్కువగా తయారు చేస్తున్నవారు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందుకోగలుగుతున్నారని చెప్పారు. తెలంగాణలోనే ఈ పథకం కింద 50 కి పైగా పెద్ద సంస్థలు లబ్ధిపొందుతున్నాయన్నారు. . భారతదేశం ఈ సంవత్సరం రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో రికార్డు సృష్టించిందన్నారు. 9 సంవత్సరాల కిందట రూ. 1000 కోట్లు ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 16 వేల కోట్లు దాటాయన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా లబ్ధిపొందాటాన్ని  ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

తయారీ రంగంలో భారతీయ రైల్వేలు కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయని, అనేక మైలురాళ్ళు దాటుతున్నాయని అన్నారు. మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ రైళ్ళను ప్రధాని గుర్తు చేశారు. భారతీయ రైల్వేలు వేలాది ఆధునిక కోచ్ లు, లోకోమోటివ్ లు తయారు చేశాయని చెబుతూ, కాజీపేటలో ఈ రోజు శంకుస్థాపన చేసిన రైల్వే తయారీ యూనిట్ మేకిన్  ఇండియాకు సరికొత్త జీవం పోస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివలన కొత్తగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబమూ ఏదో ఒక విధంగా లబ్ధిపొందుతుందని చెప్పారు.

ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, ఇది ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ కు నిదర్శనంగా అభివర్ణించారు. అభివృద్ధి మంత్రంలో భాగస్వామి కావాలని తెలంగాణకు పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్య రాజన్, కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక శాఖామంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, ఎంపీ శ్రీ బండి సంజయ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 176 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారికి శంకుస్థాపన చేశారు. దీని అంచనా వ్యయం రూ. 5,500 కోట్లకు పైనే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నాగపూర్-విజయవాడ కారిడార్ లోని 108 కిలోమీటర్ల మంచిర్యాల-వరంగల్ సెక్షన్ ఉంది.  ఈ సెక్షన్ వలన మంచిర్యాల-వరంగల్ మధ్య దూరం 34 కిలోమీటర్లు తగ్గుతుంది. దీనివలన ప్రయాణ సమయం తగ్గటంతోబాటు 44, 45 జాతీయ రహదారుల మీద ట్రాఫిక్ తగ్గుతుంది. 563 వ జాతీయ రహదారిలోని కరీంనగర్-వరంగల్ సెక్షన్ లో 68 కిలోమీటర్ల మేర అప్ గ్రేడ్ చేసే కార్యక్రమానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. దీనివల్ల ఇప్పుడున్న రెండు లేన్ల రహదారి నాలుగు లేన్ల రహదారిగా అమారుతుంది. దీనివలన హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్ ఎస్ ఈ జెడ్ లబ్ధిపొందుతాయి.

 

కాజీపేట దగ్గర రైల్వే తయారీ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీన్ని రూ. 500 కోట్లకు పైగా వెచ్చించి అభివృద్ధి చేస్తారు. ఈ అధునాతన తయారీ కేంద్రంలో మెరుగైన  రోలింగ్ స్టాక్ తయారీ సామర్థ్యం నెలకొల్పుతారు. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తారు. వాగన్ల రోబోటిక్ పెయింటింగ్, అత్యాధునిక యంత్రాలు, సామగ్రి నిల్వకు అత్యాధునిక ప్లాంట్ లాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఈ కేంద్రంలో ఉంటాయి. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో, పరిసర ప్రాంతాలలో అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఇది దోహదపడుతుంది. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Exclusive: Just two friends in a car, says Putin on viral carpool with PM Modi

Media Coverage

Exclusive: Just two friends in a car, says Putin on viral carpool with PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
India–Russia friendship has remained steadfast like the Pole Star: PM Modi during the joint press meet with Russian President Putin
December 05, 2025

Your Excellency, My Friend, राष्ट्रपति पुतिन,
दोनों देशों के delegates,
मीडिया के साथियों,
नमस्कार!
"दोबरी देन"!

आज भारत और रूस के तेईसवें शिखर सम्मेलन में राष्ट्रपति पुतिन का स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। उनकी यात्रा ऐसे समय हो रही है जब हमारे द्विपक्षीय संबंध कई ऐतिहासिक milestones के दौर से गुजर रहे हैं। ठीक 25 वर्ष पहले राष्ट्रपति पुतिन ने हमारी Strategic Partnership की नींव रखी थी। 15 वर्ष पहले 2010 में हमारी साझेदारी को "Special and Privileged Strategic Partnership” का दर्जा मिला।

पिछले ढाई दशक से उन्होंने अपने नेतृत्व और दूरदृष्टि से इन संबंधों को निरंतर सींचा है। हर परिस्थिति में उनके नेतृत्व ने आपसी संबंधों को नई ऊंचाई दी है। भारत के प्रति इस गहरी मित्रता और अटूट प्रतिबद्धता के लिए मैं राष्ट्रपति पुतिन का, मेरे मित्र का, हृदय से आभार व्यक्त करता हूँ।

Friends,

पिछले आठ दशकों में विश्व में अनेक उतार चढ़ाव आए हैं। मानवता को अनेक चुनौतियों और संकटों से गुज़रना पड़ा है। और इन सबके बीच भी भारत–रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है।परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे हैं। आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की। आर्थिक सहयोग को नई ऊँचाइयों पर ले जाना हमारी साझा प्राथमिकता है। इसे साकार करने के लिए आज हमने 2030 तक के लिए एक Economic Cooperation प्रोग्राम पर सहमति बनाई है। इससे हमारा व्यापार और निवेश diversified, balanced, और sustainable बनेगा, और सहयोग के क्षेत्रों में नए आयाम भी जुड़ेंगे।

आज राष्ट्रपति पुतिन और मुझे India–Russia Business Forum में शामिल होने का अवसर मिलेगा। मुझे पूरा विश्वास है कि ये मंच हमारे business संबंधों को नई ताकत देगा। इससे export, co-production और co-innovation के नए दरवाजे भी खुलेंगे।

दोनों पक्ष यूरेशियन इकॉनॉमिक यूनियन के साथ FTA के शीघ्र समापन के लिए प्रयास कर रहे हैं। कृषि और Fertilisers के क्षेत्र में हमारा करीबी सहयोग,food सिक्युरिटी और किसान कल्याण के लिए महत्वपूर्ण है। मुझे खुशी है कि इसे आगे बढ़ाते हुए अब दोनों पक्ष साथ मिलकर यूरिया उत्पादन के प्रयास कर रहे हैं।

Friends,

दोनों देशों के बीच connectivity बढ़ाना हमारी मुख्य प्राथमिकता है। हम INSTC, Northern Sea Route, चेन्नई - व्लादिवोस्टोक Corridors पर नई ऊर्जा के साथ आगे बढ़ेंगे। मुजे खुशी है कि अब हम भारत के seafarersकी polar waters में ट्रेनिंग के लिए सहयोग करेंगे। यह आर्कटिक में हमारे सहयोग को नई ताकत तो देगा ही, साथ ही इससे भारत के युवाओं के लिए रोजगार के नए अवसर बनेंगे।

उसी प्रकार से Shipbuilding में हमारा गहरा सहयोग Make in India को सशक्त बनाने का सामर्थ्य रखता है। यह हमारेwin-win सहयोग का एक और उत्तम उदाहरण है, जिससे jobs, skills और regional connectivity – सभी को बल मिलेगा।

ऊर्जा सुरक्षा भारत–रूस साझेदारी का मजबूत और महत्वपूर्ण स्तंभ रहा है। Civil Nuclear Energy के क्षेत्र में हमारा दशकों पुराना सहयोग, Clean Energy की हमारी साझा प्राथमिकताओं को सार्थक बनाने में महत्वपूर्ण रहा है। हम इस win-win सहयोग को जारी रखेंगे।

Critical Minerals में हमारा सहयोग पूरे विश्व में secure और diversified supply chains सुनिश्चित करने के लिए महत्वपूर्ण है। इससे clean energy, high-tech manufacturing और new age industries में हमारी साझेदारी को ठोस समर्थन मिलेगा।

Friends,

भारत और रूस के संबंधों में हमारे सांस्कृतिक सहयोग और people-to-people ties का विशेष महत्व रहा है। दशकों से दोनों देशों के लोगों में एक-दूसरे के प्रति स्नेह, सम्मान, और आत्मीयताका भाव रहा है। इन संबंधों को और मजबूत करने के लिए हमने कई नए कदम उठाए हैं।

हाल ही में रूस में भारत के दो नए Consulates खोले गए हैं। इससे दोनों देशों के नागरिकों के बीच संपर्क और सुगम होगा, और आपसी नज़दीकियाँ बढ़ेंगी। इस वर्ष अक्टूबर में लाखों श्रद्धालुओं को "काल्मिकिया” में International Buddhist Forum मे भगवान बुद्ध के पवित्र अवशेषों का आशीर्वाद मिला।

मुझे खुशी है कि शीघ्र ही हम रूसी नागरिकों के लिए निशुल्क 30 day e-tourist visa और 30-day Group Tourist Visa की शुरुआत करने जा रहे हैं।

Manpower Mobility हमारे लोगों को जोड़ने के साथ-साथ दोनों देशों के लिए नई ताकत और नए अवसर create करेगी। मुझे खुशी है इसे बढ़ावा देने के लिए आज दो समझौतेकिए गए हैं। हम मिलकर vocational education, skilling और training पर भी काम करेंगे। हम दोनों देशों के students, scholars और खिलाड़ियों का आदान-प्रदान भी बढ़ाएंगे।

Friends,

आज हमने क्षेत्रीय और वैश्विक मुद्दों पर भी चर्चा की। यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा है। हम इस विषय के शांतिपूर्ण और स्थाई समाधान के लिए किए जा रहे सभी प्रयासों का स्वागत करते हैं। भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा।

आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है। पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस City Hall पर किया गया कायरतापूर्ण आघात — इन सभी घटनाओं की जड़ एक ही है। भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताक़त है।

भारत और रूस के बीच UN, G20, BRICS, SCO तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है। करीबी तालमेल के साथ आगे बढ़ते हुए, हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे।

Excellency,

मुझे पूरा विश्वास है कि आने वाले समय में हमारी मित्रता हमें global challenges का सामना करने की शक्ति देगी — और यही भरोसा हमारे साझा भविष्य को और समृद्ध करेगा।

मैं एक बार फिर आपको और आपके पूरे delegation को भारत यात्रा के लिए बहुत बहुत धन्यवाद देता हूँ।