Awards 100 ‘5G Use Case Labs’ to educational institutions across the country
Industry leaders hail the vision of PM
“The future is here and now”
“Our young generation is leading the tech revolution”
“India is not only expanding the 5G network in the country but also laying emphasis on becoming a leader in 6G”
“We believe in the power of democratization in every sector”
“Access to capital, access to resources and access to technology is a priority for our government”
“India's semiconductor mission is progressing with the aim of fulfilling not just its domestic demands but also the global requirements”
“In the development of digital technology, India is behind no developed nation”
“Technology is the catalyst that expedites the transition from a developing nation to a developed one”
“The 21st century marks an era of India's thought leadership”

ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించారు. ‘గ్లోబల్ డిజిటల్ ఇనొవేశన్’ అంశం ఇతివృత్తం గా 2023 అక్టోరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ వరకు కొనసాగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) ఆసియా లో అతి పెద్ద టెలికం, మీడియా, మరియు టెక్నాలజీ ల వేదిక గా ఉందని చెప్పాలి. కీలకమైన అత్యాధునిక సాంకేతికతల ను అభివృద్ధి పరచే, తయారు చేసే మరియు ఎగుమతి చేసే దేశం గా భారతదేశం యొక్క స్థితి ని బలపరచడం ఐఎమ్ సి 2023 యొక్క లక్ష్యం గా ఉంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను దేశవ్యాప్తం గా వంద అనేక విద్య సంస్థల కు ప్రదానం చేశారు.

 

ప్రధాన మంత్రి హాల్ 5 లో ఏర్పాటైన ప్రదర్శన ను ప్రారంభించడం తో పాటు ఆ ప్రదర్శన ను చూశారు.

ఈ సందర్భం లో పరిశ్రమ రంగ ప్రముఖులు కూడా ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతల ను ఉపయోగించుకోవాలి అని, దాని ద్వారా భారతదేశం లో డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు దన్ను గా నిలవాలని యువతరాని కి ప్రధాన మంత్రి బోధిస్తూ వారి జీవనాన్ని మెరుగు పరచడానికి కంకణం కట్టుకోవడాన్ని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ యొక్క చైర్ మన్ శ్రీ ఆకాశ్ ఎం. అంబానీ ప్రశంసించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజల చెంతకు తీసుకు పోవడం లోను, నూతన ఆవిష్కరణల కు బాట ను పరచడం లోను మరియు దీర్ఘకాలం పాటు అమలు లో ఉండేటట్లుగా చేయడం లోను దేశం లోని లక్షల కొద్దీ యువతీ యువకుల కు ఒక ప్రేరణ గా ప్రధాన మంత్రి ఉన్నారు అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. జియో భారతదేశం లోని 22 సర్క్యూట్ లు అన్నిటి లో పది లక్షల 5జి సెల్స్ ను ఏర్పాటు చేసింది అని ఆయన తెలిపారు; అంతేకాకుండా, భారతదేశ ప్రతిభావంతులు రూపు రేఖల ను దిద్ది, అభివృద్ధి పరచి, తయారు చేసినటువంటి 5జి స్టాక్ ను నెలకొల్పిందని, అది సమగ్ర 5జి వితరణ లో 85 శాతం తోడ్పాటు కు పూచీ పడిందని కూడా శ్రీ ఆకాశ్ ఎం. అంబానీ వివరించారు. ‘‘125 మిలియన్ మంది వినియోగదారుల తో భారతదేశం 5జి తాహతు కలిగిన అగ్రగామి మూడు దేశాల లో చోటు ను సంపాదించింది’’ అని ఆయన చెప్పారు. ప్రధాన మంత్రి యావత్తు దేశాన్ని ఒక్కటి చేశారు అని ఆయన అంటూ, ఈ సందర్భం లో జిఎస్ టి ని, భారతదేశం యొక్క డిజిటల్ క్రాంతి ని మరియు ప్రపంచం లో కెల్లా అతి ఎత్తయినటువంటి ప్రతిమ నిర్మాణం వంటి ఉదాహరణ లను గురించి ప్రస్తావించారు. ‘‘మీ యొక్క ప్రయాస లు ఇండియా మొబైల్ కాన్ఫరెన్స్ లో పాలుపంచుకొన్న మా అందరికి స్ఫూర్తి గా నిలుస్తున్నాయి’’ అని ఆయన పునరుద్ఘాటించారు. భారతదేశం కంటున్న కల ను భారతదేశం యొక్క అమృత కాలం లోనే నెరవేరుస్తామంటూ డిజిటల్ ఆంట్రప్రన్యోర్ లు, నూతన ఆవిష్కర్త లు మరియు స్టార్ట్-అప్స్ పక్షాన శ్రీ అంబానీ హామీ ని ఇచ్చారు.

 

భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్ మన్ శ్రీ సునీల్ భారతీ మిత్తల్ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా రూపం లో ప్రధాన మంత్రి చాటిన దృష్టికోణం గురించి గుర్తు కు తీసుకు వచ్చారు. డిజిటల్ మౌలిక సదుపాయాల ను శరవేగం గా అభివృద్ధి పరచడాని కి డిజిటల్ ఇండియా కార్యక్రమం బాట ను పరచింది అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి సూచించిన జెఎఎమ్ (జన్ ధన్-ఆధార్- మొబైల్) త్రయం ఆవిష్కరించినటువంటి పరివర్తన ను గురించి శ్రీ మిత్తల్ చెప్తూ, ప్రపంచం ఏ విధం గా భారతదేశం యొక్క డిజిటల్ క్రాంతి పై దృష్టి ని సారిస్తున్నదీ వెల్లడించారు. భారతదేశం యొక్క డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) అనేక దేశాల లో ఈర్ష్య ను జనింపచేసినటువంటి అంశం గా ఉందని ఆయన అన్నారు. శ్రీ మిత్తల్ అభిప్రాయం లో ప్రధాన మంత్రి యొక్క దృష్టి కోణం లో రెండో కీలకమైన ఆధార స్తంభం గా ‘మేక్ ఇన్ ఇండియా’ గా ఉంది; మరి భారతదేశం గత ఒక సంవత్సరం కాలం లో తయారీ రంగం లో చాలా ప్రగతి ని సాధించిందని శ్రీ మిత్తల్ ఈ సందర్భం లో ప్రస్తావించారు. ‘‘ఏపల్ మొదలుకొని డిక్సన్ వరకు, సామ్ సంగ్ మొదలుకొని టాటా వంటి కంపెనీలతో కలుపుకొని ప్రతి ఒక్క చిన్న , పెద్ద కంపెనీ లేదా స్టార్ట్-అప్ సంస్థ తయారీ రంగం లో పాలుపంచుకొంటున్నాయి. ప్రత్యేకించి డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పరం గా భారీ స్థాయి లో ప్రగతి సాధన విషయం లో భారత్ ఒక తయారీ ప్రధానమైనటువంటి దేశం గా ప్రపంచం లో నాయకత్వాన్ని వహించే దేశం గా ఎదిగింది’’ అని ఆయన అన్నారు. ఎయర్ టెల్ 5జి సేవల ను 5,000 పట్టణాల లోను, 20,000 గ్రామాల లోను ఇప్పటికే ప్రారంభించడం అయింది, మరి 2024 వ సంవత్సరం మార్చి నెల కల్లా యావత్తు దేశం లో ఈ తరహా సేవ లు అందుబాటు లోకి వస్తాయి అని ఆయన తెలిపారు. ఈ విషయం లో ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు ను శ్రీ మిత్తల్ ప్రస్తావించారు. ఇది ప్రపంచం లో ఏ దేశం లో చూసుకొన్నప్పటికీ అత్యంత వేగవంతమైనటువంటి 5జి సేవ ల వ్యాప్తి జరిగిన నెట్ వర్క్ గా లెక్క కు వస్తుందని శ్రీ మిత్తల్ తెలిపారు.

 

ఆదిత్య బిర్లా గ్రూపు చైర్ మన్ శ్రీ కుమార్ మంగళమ్ బిర్లా మాట్లాడుతూ, భారతదేశం యొక్క డిజిటల్ పరివర్తన ప్రక్రియ ను ముందుకు తీసుకుపోవడం లో ప్రధాన మంత్రి యొక్క దార్శనికత భరిత నాయకత్వాని కి గాను ధన్యవాదాల ను వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల కు డిజిటల్ సేవల ను అందించే విషయం లో ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత ను ఆయన ప్రశంసించారు. ఇది అంత్యోదయ సూత్రం లో ఇమిడి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రయోజనాలు సిద్ధించేటట్లు చూడటమే ‘అంత్యోదయ’. డిజిటల్ వికాసం లో భారతదేశం తాలూకు వృద్ధి కి ఖ్యాతి దక్కాల్సింది ప్రధాన మంత్రి విజన్ కే అని ఆయన అన్నారు. ఈ వైఖరి ప్రపంచ దేశాల లో గుర్తింపున కు నోచుకొందని తెలిపారు. ‘‘ప్రధాన మంత్రి యొక్క దృష్టి కోణం నుండి ప్రేరణ ను పొంది, భారతదేశం వికాస శీల (గ్లోబల్ సౌథ్) దేశాల లో ఒక విజేత గా నిలచింది’’ అని శ్రీ బిర్లా అన్నారు. ఈ సందర్భం లో గుర్తింపు, చెల్లింపులు మరియు డేటా నిర్వహణ ల వంటి సేవ ల అందజేత లో భారతదేశం అనుసరిస్తున్నటువంటి సరిక్రొత్త పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థల ను అవలంభించాలి అని ప్రపంచ దేశాలు అనేకం ఆసక్తి ని కనబరుస్తున్నాయి అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి యొక్క దార్శనికత కు అనుగుణం గా నడుచుకోవడం లో ఒక బాధ్యతాయుతమైనటువంటి భాగస్వామి కావాలి అనే అభిప్రాయం తో వోడఫోన్ ఐడియా ఉంది అని శ్రీ బిర్లా పునరుద్ఘాటించారు. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వం లో 6జి వంటి భవిష్యత్తు తరం సాంకేతికత లకు ప్రమాణా లను అభివృద్ధి పరచడం లో భారతదేశం క్రియాశీలం గా వ్యవహరిస్తోంది అని ఆయన చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న మహత్తరమైన సమర్థన కు గాను ఆయన తన ధన్యవాదాల ను కూడా వ్యక్తం చేశారు.

 

ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 21 వ శతాబ్దం లో మారుతున్న కాలాన్ని దృష్టి పెట్టుకొంటే కోట్ల కొద్దీ ప్రజల జీవితాల ను మార్చివేసే శక్తి ఈ కార్యక్రమాని కి ఉంది అని చెప్పవచ్చును అన్నారు. సాంకేతిక విజ్ఞానం శరవేగం గా పయనిస్తున్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘భవిష్యత్తు ఇక్కడే, ఇప్పుడే కానవస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. టెలికమ్యూనికేశన్స్ రంగం లో, సాంకేతిక విజ్ఞానం రంగం లో మరియు కనెక్టివిటీ రంగంలో రాబోయే కాలం లో తెర మీద కు వచ్చే దృశ్యాల ను ఆవిష్కరించడాని కి ఒక ప్రదర్శన ను ఏర్పాటు చేయడాన్ని ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. 6జి, ఎఐ, సైబర్ సిక్యూరిటి, సెమికండక్టర్ స్, డ్రోన్ లేదా అంతరిక్షం వంటి రంగాల ను గురించి ఆయన పేర్కొని, సముద్ర అంతర్భాగం, హరిత సాంకేతికత లేదా మరేదైనా రంగాల ను తీసుకోండి అని ఆయన ఈ సందర్భం లో అన్నారు. ‘‘భవిష్యత్తు పూర్తి స్థాయి లో మారబోతోంది, మరి మన యువతరం ఈ సాంకేతిక సంబంధి విప్లవాని కి నాయకత్వాన్ని వహిస్తుండడం అనేది సంతోషాన్ని కలిగించే విషయం గా ఉంది’’ అని ఆయన అన్నారు.

భారతదేశంలో గత ఏడాది జరిగిన 5జీ ఆవిష్కరణ మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని శ్రీ మోదీ తెలిపారు. 5జీ విజయవంతమైన తర్వాత భారతదేశం ఆగిపోలేదని, ప్రతి వ్యక్తికి దానిని తీసుకెళ్లే పనిని చేపట్టిందని ఆయన ఉద్ఘాటించారు. "భారతదేశం 5జీ  రోల్ అవుట్ దశ నుండి 5జీ రీచ్ అవుట్ దశకి మారింది" అని ఆయన అన్నారు. 5జీ  రోల్‌అవుట్ అయిన ఒక సంవత్సరంలోనే, 97 శాతం కంటే ఎక్కువ నగరాలు, 80 శాతం జనాభాను కవర్ చేసే 4 లక్షల 5జీ బేస్ స్టేషన్‌ల అభివృద్ధి గురించి ప్రధాన మంత్రి తెలియజేశారు. మధ్యస్థ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వేగం ఒక సంవత్సరంలోనే 3 రెట్లు పెరిగిందని ఆయన నొక్కి చెప్పారు. బ్రాడ్‌బ్యాండ్ వేగం విషయంలో భారత్ 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరుకుందని ఆయన అన్నారు. "దేశంలో 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా 6జీ లో అగ్రగామిగా ఎదగడానికి కూడా ప్రాధాన్యత ఇస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. 2జి సమయంలో జరిగిన కుంభకోణాన్ని ఎత్తిచూపిన ప్రధాన మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన 4జి అమలులో ఎలాంటి మచ్చలు లేవని అన్నారు. 6జీ టెక్నాలజీతో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 ఇంటర్నెట్ కనెక్టివిటీ, వేగంలో ర్యాంకింగ్   మెరుగుదలకు మించి జీవన సౌలభ్యం మెరుగుపడుతుందని ఆయన అన్నారు. విద్య, వైద్యం, పర్యాటకం మరియు వ్యవసాయంలో మెరుగైన కనెక్టివిటీ, వేగం  ప్రయోజనాలను ఆయన వివరించారు. 

''బలమైన ప్రజాస్వామ్యం పై మనకు నమ్మకం ఉంది. అభివృద్ధి ప్రయోజనం ప్రతి వర్గానికి, ప్రాంతానికి చేరాలి, భారతదేశంలోని వనరుల నుండి ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలి, ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని కలిగి ఉండాలి. సాంకేతికత ప్రయోజనం ప్రతి ఒక్కరికి చేరుకోవాలి. మేము ఈ దిశలో వేగంగా పని చేస్తున్నాము” అని ప్రధాన మంత్రి అన్నారు. "నాకు, ఇది అతిపెద్ద సామాజిక న్యాయం" అన్నారాయన. “మూలధనానికి ప్రాప్యత, వనరులకు ప్రాప్యత, సాంకేతికతను పొందడం మా ప్రభుత్వానికి ప్రాధాన్యత. ముద్రా పథకం కింద పూచీకత్తు రహిత రుణాలు, మరుగుదొడ్లకు ప్రాప్యత, జేఏఎం త్రిముఖ వ్యూహం ద్వారా డీబీటీ ఒక ఉమ్మడి వ్యవస్థను కలిగి ఉన్నాయని, అవి సామాన్య పౌరులకు గతంలో పొందలేని హక్కులను భరోసా ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో టెలికాం టెక్నాలజీ పాత్రను ఎత్తిచూపిన ఆయన, భారత్ నెట్‌ని దాదాపు 2 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు సుమారు 75 లక్షల మంది పిల్లలను అత్యాధునిక సాంకేతికతను అందిస్తున్నాయి. నేడు ప్రారంభించిన 5జీ వినియోగ ల్యాబ్‌లు కూడా ఇదే ప్రభావాన్ని చూపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "ఈ ల్యాబ్‌లు యువతను పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తాయి, వాటిని సాధించడానికి వారికి విశ్వాసాన్ని ఇస్తాయి" అని ఆయన చెప్పారు. 

భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. "భారతదేశం యునికార్న్‌ల శతాబ్దాన్ని చాలా తక్కువ సమయంలో చేసింది. ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 3 స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా మారింది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. 2014కి ముందు, భారతదేశంలో కేవలం కొన్ని వందల స్టార్టప్‌లకు మాత్రమే ఉండేవని , అయితే నేడు ఆ సంఖ్య దాదాపు లక్షకు పెరిగిందని ప్రధాన మంత్రి చెప్పారు. దేశంలోని స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేసేందుకు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ చేపట్టిన ‘ఆస్పైర్’ కార్యక్రమాన్ని కూడా ప్రధాని మోదీ స్పృశించారు. ఈ చర్య భారతదేశంలోని యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రయాణాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. కాలం చెల్లిన సాంకేతికత వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తు చేస్తూ, గత ప్రభుత్వాలు కూడా ఇదే స్థితిలో ఉన్నాయని శ్రీ మోదీ గుర్తు చేశారు. కమాండ్‌లు పని చేయని స్తంభింపచేసిన మొబైల్ పరికరానికి సారూప్యతను చూపడం ద్వారా గత ప్రభుత్వాల కాలం చెల్లిన పద్ధతులను ప్రధాన మంత్రి ఎత్తి చూపారు. "2014 తర్వాత, బ్యాటరీలను మార్చడం లేదా సిస్టమ్‌ను రీస్టార్ట్ చేయడం వంటి వ్యర్థ ప్రయాసలు ను ప్రజలు వదిలివేశారని ప్రధాని అన్నారు. భారతదేశం మొబైల్ ఫోన్‌ల దిగుమతిదారుగా ఉండేదని, అయితే నేడు, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారుగా అవతరించిందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఎలక్ట్రానిక్  తయారీ విషయంలో దృష్టి సారించిన లోపాన్ని పేర్కొంటూ, నేడు దేశంలో తయారైన దాదాపు రూ. 2 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్‌ను ఎగుమతి చేస్తోందని శ్రీ మోదీ తెలియజేశారు. భారతదేశంలో పిక్సెల్ ఫోన్‌లను తయారు చేస్తామని గూగుల్ ఇటీవల చేసిన ప్రకటనని కూడా అయన ప్రస్తావించారు. 

 

మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఈ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. "టెక్ ఎకోసిస్టమ్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటి విజయం కోసం, భారతదేశంలో బలమైన సెమీ కండక్టర్ తయారీ రంగాన్ని నిర్మించడం చాలా ముఖ్యం", సెమీకండక్టర్ల అభివృద్ధికి 80 వేల కోట్ల రూపాయల పిఎల్‌ఐ పథకం కొనసాగుతోందని ఆయన తెలిపారు. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ కంపెనీలు భారతీయ కంపెనీల సహకారంతో సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ సౌకర్యాలపై పెట్టుబడి పెడుతున్నాయి. భారతదేశం సెమీకండక్టర్ మిషన్ దాని దేశీయ డిమాండ్‌ను మాత్రమే కాకుండా ప్రపంచ అవసరాలను కూడా తీర్చాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చేసే అంశాల‌లో సాంకేతిక‌త‌కు ఉన్న ప్రాధాన్య‌త‌ను ఎత్తిచూపిన ప్ర‌ధాన మంత్రి, డిజిట‌ల్ సాంకేతిక‌త అభివృద్ధిలో భార‌త‌దేశం దూసుకుపోతోందని అన్నారు. వివిధ రంగాలను సాంకేతికతతో అనుసంధానం చేసే కార్యక్రమాలను వివరిస్తూ , ప్రధాన మంత్రి లాజిస్టిక్స్‌లో పీఎం  గతిశక్తి, ఆరోగ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్, వ్యవసాయ రంగంలో అగ్రి స్టాక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ప్రస్తావించారు. సైంటిఫిక్ రీసెర్చ్, క్వాంటం మిషన్,  నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, స్వదేశీ డిజైన్లు, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో భారీ పెట్టుబడులను ఆయన ప్రస్తావించారు.

సైబర్‌ సెక్యూరిటీ, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశం గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. జీ 20 సమ్మిట్‌లో 'సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రపంచ ప్రమాదాలు' అనే అంశంపై జరిగిన చర్చను గుర్తు చేసుకున్నారు. సైబర్ భద్రత కోసం మొత్తం తయారీ విలువ గొలుసులో స్వీయ-విశ్వాసం చాలా ముఖ్యమైనదని పేర్కొన్న ప్రధాన మంత్రి, విలువ గొలుసులోని ప్రతిదీ జాతీయ డొమైన్‌కు చెందినప్పుడు, అది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లేదా కనెక్టివిటీ అయినప్పుడు భద్రతను నిర్వహించడం సులభతరం అవుతుందని నొక్కిచెప్పారు. ప్రపంచ ప్రజాస్వామ్య సమాజాలను సురక్షితంగా ఉంచడం గురించి ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో చర్చలు జరపాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ నొక్కి చెప్పారు గతంలో కొత్త టెక్నాలజీల స్వీకరణకు వచ్చినప్పుడు తప్పిపోయిన అవకాశాల గురించి ప్రధాన మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన టెక్నాలజీలలో భారతదేశం తన ప్రతిభను ప్రదర్శించిన భారతదేశ ఐటీ రంగాన్ని ఆయన ప్రస్తావించారు. “ఈ 21వ శతాబ్ద కాలం భారతదేశపు ఆలోచనా నాయకత్వానికి సంబంధించిన సమయం” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. ఇతరులు అనుసరించగలిగే కొత్త డొమైన్‌లను రూపొందించాలని ఆలోచనా పరులు, దిగ్గజాలను కోరారు. ఈ రోజు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మొత్తం ప్రపంచానికి అగ్రగామిగా ఉన్న యూపీఐ ని ఉదహరించారు. "భారతదేశంలో యువ జనాభా శక్తి, శక్తివంతమైన ప్రజాస్వామ్య శక్తి ఉంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సభ్యులు, ముఖ్యంగా యువ సభ్యులు ఈ దిశగా ముందుకు సాగాలని ఆయన కోరారు. "ఈ రోజు మనం అభివృద్ధి చెందిన భారతదేశం కావాలనే లక్ష్యాన్ని సాకారం చేస్తున్నప్పుడు, ఆలోచనాపరులుగా ముందుకు సాగడం ద్వారా మొత్తం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు" అని ప్రధాన మంత్రి ముగించారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఆకాష్ ఎం అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ శ్రీ సునీల్ భారతీ మిట్టల్,  ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లా ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

 

నేపథ్యం: 

'వంద  5జీ  ల్యాబ్స్ చొరవ', భారతదేశ  ప్రత్యేక అవసరాలు,  ప్రపంచ డిమాండ్‌లను తీర్చగల 5జీ అప్లికేషన్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా 5జీ  సాంకేతికతతో అనుబంధించబడిన అవకాశాలను గ్రహించే ప్రయత్నం. ప్రత్యేక చొరవ విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్, రవాణా మొదలైన వివిధ సామాజిక ఆర్థిక రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. 5జీ సాంకేతికత వినియోగంలో దేశాన్ని ముందంజలో ఉంచుతుంది. దేశంలో 6జీ -రెడీ అకడమిక్ మరియు స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడానికి ఈ చొరవ కీలకమైన దశ. మరీ ముఖ్యంగా, ఈ చొరవ దేశ భద్రతకు కీలకమైన స్వదేశీ టెలికాం టెక్నాలజీ అభివృద్ధికి ఒక అడుగు.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) అనేది ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా మరియు టెక్నాలజీ ఫోరమ్ మరియు 2023 అక్టోబరు 27 నుండి 29 వరకు నిర్వహించబడుతుంది. టెలికమ్యూనికేషన్స్ మరియు టెక్నాలజీలో భారతదేశం యొక్క అద్భుతమైన పురోగతులను హైలైట్ చేయడానికి ఈ ఈవెంట్ ఒక వేదికగా పనిచేస్తుంది. ప్రకటనలు మరియు స్టార్టప్‌లు తమ వినూత్న ఉత్పత్తులు మరియు పరిష్కారాలను ప్రదర్శించడానికి అవకాశాన్ని అందిస్తాయి.

'గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్' థీమ్‌తో, ఐఎంసి 2023 కీలకమైన అత్యాధునిక సాంకేతికతల డెవలపర్, తయారీదారు, ఎగుమతిదారుగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. మూడు రోజుల కాంగ్రెస్ 5జీ, 6జీ, మరియు కృత్రిమ మేధస్సు (ఏఐ) వంటి సాంకేతికతలను హైలైట్ చేస్తుంది. సెమీకండక్టర్ పరిశ్రమ, గ్రీన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ మొదలైన సమస్యలపై చర్చిస్తుంది.
ఈ సంవత్సరం, ఐఎంసి స్టార్టప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెడుతోంది - ‘ఆస్పైర్’. ఇది తాజా వ్యవస్థాపక కార్యక్రమాలు, సహకారాలను ఉత్ప్రేరకపరిచే లక్ష్యంతో స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, స్థాపించబడిన వ్యాపారాల మధ్య సంబంధాలను పెంపొందిస్తుంది.
ఐఎంసి 2023లో సుమారు 5000 మంది సీఈఓ స్థాయి ప్రతినిధులు, 230 మంది ఎగ్జిబిటర్లు, 400 స్టార్టప్‌లు మరియు ఇతర వాటాదారులతో సహా దాదాపు 22 దేశాల నుండి లక్ష మందికి పైగా పాల్గొననున్నారు.

 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas
December 06, 2025

The Prime Minister today paid tributes to Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas.

The Prime Minister said that Dr. Ambedkar’s unwavering commitment to justice, equality and constitutionalism continues to guide India’s national journey. He noted that generations have drawn inspiration from Dr. Ambedkar’s dedication to upholding human dignity and strengthening democratic values.

The Prime Minister expressed confidence that Dr. Ambedkar’s ideals will continue to illuminate the nation’s path as the country works towards building a Viksit Bharat.

The Prime Minister wrote on X;

“Remembering Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas. His visionary leadership and unwavering commitment to justice, equality and constitutionalism continue to guide our national journey. He inspired generations to uphold human dignity and strengthen democratic values. May his ideals keep lighting our path as we work towards building a Viksit Bharat.”