ఇవాళ అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా, చిరుత పులుల రక్షణకు అంకితమైన వన్యప్రాణి ప్రేమికులకు, సంరక్షకులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "చిరుతలను సంరక్షించటానికి, అవి వృద్ధి చెందగలిగే పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో మూడేళ్ల కిందట మా ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని, జీవవైవిధ్యాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నమిది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"అంతర్జాతీయ చిరుత దినోత్సవం సందర్భంగా, భూమిపైనున్న అద్భుతమైన జీవుల్లో ఒకటైన చిరుత పులిని రక్షించటానికి అంకితమైన వన్యప్రాణుల ప్రేమికులందరికీ, సంరక్షకులకు నా శుభాకాంక్షలు. చిరుతలను సంరక్షించటానికి, అవి వృద్ధి చెందగలిగే పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో మూడేళ్ల కిందట మా ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది. కోల్పోయిన పర్యావరణ వారసత్వాన్ని, జీవ వైవిధ్యాన్ని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ ప్రాజెక్టు"
On International Cheetah Day, my best wishes to all wildlife lovers and conservationists dedicated to protecting the cheetah, one of our planet’s most remarkable creatures. Three years ago, our Government launched Project Cheetah with the aim of safeguarding this magnificent… pic.twitter.com/FJgfJqoGeA
— Narendra Modi (@narendramodi) December 4, 2025


