మీరాబాయి చాను మరో సారి అద్భుత ప్రదర్శనతో తన ప్రతిభను చాటారంటూ ప్రధానమంత్రి ప్రశంసించారు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా స్వర్ణ పతకాన్ని గెలవడంతో పాటు, ఇంతవరకు మొత్తం నాలుగు కామన్వెల్త్ పతకాలను ఆమె సొంతం చేసుకొని భారత్లో అందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.
రాబోయే కాలంలో కూడా ఆమె అన్ని ప్రయత్నాల్లో రాణించాలని ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భారత్ వెయిట్లిఫ్టింగులో మరో వైభవోపేతమైన అధ్యాయం ఇది.
ప్రతిభావంతురాలైన మీరాబాయి చాను 48 కిలోల కేటగిరీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ మరో సారి కామన్వెల్త్ క్రీడలలో తన కౌశలాన్ని చాటారు. కామన్వెల్త్ క్రీడలలో వరుసగా స్వర్ణ పతకాలతో పాటు, మొత్తంమీద నాలుగో కామన్వెల్త్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని భారత్లో అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. ఆమెకు అభినందనలు. రాబోయే కాలంలో కూడా ఆమె రాణించాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
Another glorious chapter in Indian Weightlifting!
— Narendra Modi (@narendramodi) July 26, 2026
The talented Mirabai Chanu once again showcased her skills at the Commonwealth Games with a stunning performance in the 48 kg category and winning Gold. With back-to-back Commonwealth Games Golds and an overall fourth CWG medal… pic.twitter.com/37IOvMXBTI


