శ్రీలంక లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం 'శ్రీలంక మిత్ర విభూషణ' ను అధ్యక్షుడు దిసనాయకే ఈరోజు ప్రదానం చేశారు. ఈ పురస్కారానికి కృజ్ఞతలు తెలియచేస్తూ, భారత్, శ్రీలంక ప్రజల మధ్య గాఢంగా వేళ్ళూనుకుపోయిన స్నేహాన్నీ, చారిత్రక సంబంధాలనూ ఇది ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ అన్నారు.

 

“అధ్యక్షుడు దిసనాయకే చేతుల మీదుగా ఈ రోజు 'శ్రీలంక మిత్ర విభూషణ' అవార్డును అందుకోవడం నాకు ఎంతో గర్వకారణం. ఈ గౌరవం నా ఒక్కడిది కాదు - ఇది భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు లభించిన గౌరవం. ఇది భారత్, శ్రీలంక ప్రజల మధ్య లోతైన స్నేహం, చారిత్రక సంబంధాలకు చిహ్నం. ఈ పురస్కారాన్ని అందించినందుకు శ్రీలంక అధ్యక్షుడికి, ప్రభుత్వానికి, ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో చేసిన వివిధ పోస్టుల్లో పేర్కొన్నారు. 

 

“ஜனாதிபதி திசாநாயக்க அவர்களால் இன்றைய தினம் 'இலங்கை மித்ர விபூஷண்' என்ற விருது எனக்கு வழங்கப்பட்டமை மகத்தான பெருமைக்குரிய விடயமாகும். இந்த உயரிய கௌரவம் எனக்கே மட்டும் உரித்தான ஒன்றல்ல, இந்தியாவின் 1.4 பில்லியன் மக்களுக்கும் கிடைக்கப்பெற்ற உயர் மரியாதையாகும். அத்துடன் இந்திய - இலங்கை மக்களிடையிலான வரலாற்று ரீதியான உறவுகள் மற்றும் ஆழ வேரூன்றிக் காணப்படும் நட்புறவை இது குறித்து நிற்கின்றது. இந்த கௌரவத்துக்காக இலங்கை ஜனாதிபதி, அரசாங்கம் மற்றும் மக்கள் அனைவருக்கும் எனது இதயபூர்வமான நன்றியை தெரிவித்துக்கொள்கின்றேன்.

@anuradisanayake”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
E-Samudra: India’s digital push to reshape maritime governance

Media Coverage

E-Samudra: India’s digital push to reshape maritime governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 ఆగష్టు 2026
August 11, 2026

Champions on the Podium, Capital Unlocked, Digital Seas Opened: New India’s Winning Streak Under PM Modi