రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ్ సంచాలిక శ్రీమతి ప్రమీలా తాయ్ మేఢే మృతికిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం తెలిపారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం, ముఖ్యంగా సమ్మిళిత సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత సాధనలో ఆమె కృషి రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వేర్వేరు పోస్టుల్లో ఆయన ఇలా పేర్కొన్నారు:
"రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలికగా పని చేసిన శ్రద్ధేయ ప్రమీలా తాయ్ మేఢే మృతిచెందిన వార్త ఎంతో దుఃఖాన్ని కలిగించింది. సమాజ సేవ, జాతిసేవకే ఆమె తన జీవితాన్ని అంకితమిచ్చారు. మహిళా సాధికారతకు తోడుగా, సమాజంలో ఆమె చేసిన అమూల్యమైన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఈ శోకసమయంలో భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి!"
"రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలికగా ఉన్న ప్రమీలా తాయ్ మేఢే గారి మృతి వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. సమాజ సేవ, జాతి సేవకే ఆమె తన సమస్త జీవితాన్ని అంకితం చేశారు. మహిళా సాధికారతతోపాటు ఆమె చేసిన సామాజిక సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఈ శోకసమయంలో భగవంతుడు ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధైర్యాన్ని ప్రసాదించు గాక. ఓం శాంతి!"
राष्ट्र सेविका समिति की प्रमुख संचालिका रहीं श्रद्धेय प्रमिला ताई मेढ़े जी के देहावसान से अत्यंत दुख हुआ है। उनका संपूर्ण जीवन समाज और राष्ट्र सेवा को समर्पित रहा। महिला सशक्तिकरण के साथ-साथ सामाजिक कार्यों में उनके अमूल्य योगदान को सदैव याद किया जाएगा। ईश्वर शोक की इस घड़ी में…
— Narendra Modi (@narendramodi) July 31, 2025
राष्ट्र सेविका समितीच्या प्रमुख संचालिका राहिलेल्या आदरणीय प्रमिलाताई मेढे यांच्या देहावसानामुळे अत्यंत दुःख झाले आहे. त्यांचे संपूर्ण जीवन समाज आणि राष्ट्रसेवेला समर्पित होते. महिला सक्षमीकरणासोबतच सामाजिक कार्यांमधील त्यांच्या अमूल्य योगदानाचे सदैव स्मरण केले जाईल. या शोकाकुल…
— Narendra Modi (@narendramodi) July 31, 2025


